రామమందిరం మళ్లీ రాజుకుంటోంది!

Publish Date:Apr 15, 2016

Advertisement

 

వందల సంవత్సరాలుగా రగులుగున్న రామమందిర వివాదం కొద్ది రోజులుగా స్తబ్దుగా ఉండిపోయింది. బీజేపీ అధికారంలోకి వచ్చేయడం, దేశంలో ఇతరత్రా సమస్యలు చెలరేగడంతో రామమందిరం గురించి అందరూ నిశ్శబ్దంగా ఉండిపోయారు. కానీ గడచిన కొద్దిరోజులుగా వినిపిస్తున్న వార్తలను గమనిస్తే ఈ వివాదం మళ్లీ రాజుకుంటున్నట్లుగా తోస్తోంది.

 

అయోధ్యలో రామమందిర నిర్మాణానికి ఒక ఉద్యమ రూపుని ఇచ్చేందుకు విశ్వహిందూ పరిషత్‌ మళ్లీ ప్రణాళికలను రచిస్తోంది. అందుకు అనుగుణంగా, ఉత్తర్‌ప్రదేశ్‌లోని దాదాపు లక్ష గ్రామాలలో రామమందిరాలను నిర్మించాలంటూ ఆ సంస్థ శ్రీరామనవమిని ముహూర్తంగా నిర్ణయించింది. మరో పక్క అయోధ్యలో రామమందిర  నిర్మాణానికి తాము కట్టుబడి ఉన్నామంటూ భాజపా నేతలు ప్రకటనలు చేస్తున్నారు. దీంతో రామమందిర అంశం మరోసారి దేశాన్ని ఆక్రమించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

 

అయోధ్యలో శ్రీరాముడు జన్మించాడని మనం తరతరాలుగా చదువుకుంటూ వస్తున్నాము. అయితే ఇప్పుడు ఉత్తర్‌ప్రదేశ్‌లో ఉన్న అయోధ్యే, మనం చదువుకుంటున్న అయోధ్య అని కొందరి నమ్మకం. అక్కడ రామజన్మస్థానంలో కట్టిన గుడిని కూలగొట్టి 15వ శతాబ్దంలో మొగలు చక్రవర్తి బాబరు మసీదుని కట్టించాడన్నది అసలు వివాదం. బాబరు అక్కడే ఉన్న గుడిని కూలగొట్టాడా లేదా అన్నది చెప్పడం కష్టం. కానీ అక్కడ ఒక గుడి ఉండేదన్న మాట మాత్రం వాస్తవమేనని తేల్చారు పురావస్తుశాఖవారు. బహుశా అక్కడ బాబరు మసీదుని నిర్మించే సమయానికే శిథిలమైపోయి ఉండవచ్చు. అందుకనే 15వ శతాబ్దంలో అయోధ్యలో నివసించిన తులసీదాసు వంటి చారిత్రక వ్యక్తులు సైతం ఆలయాన్ని కూల్చివేసినట్లు ఎక్కడా చెప్పలేదు.

18వ శతాబ్దం వరకూ కూడా అటు ముస్లింలు, ఇటు హిందువులూ ఈ మసీదుని పుణ్యక్షేత్రంగానే భావించేవారు. ముస్లింలు ఈ ప్రాంతాన్ని మసీద్‌-ఇ-జన్మస్థాన్‌గా పేర్కొంటూ హిందువులను మసీదు ప్రాంగణంలోకి అనుమతించేవారు. అయితే నిదానంగా మసీదుని కూల్చి రామాలయాన్ని నిర్మించాలన్న వాదనలు మొదలయ్యాయి. 1885లోనే ఇందుకు సంబంధించిన కోర్టు కేసులు కూడా మొదలయ్యాయి. ఆ సందర్భంగా ‘మసీదు ఉన్న ప్రదేశం హైందవులకు పుణ్యక్షేత్రమేననీ, అయితే వందల ఏళ్లు గడిచిపోవడం వల్ల ఇప్పుడు చేయగలిగింది ఏమీ లేదని’ ఆనాటి బ్రిటిష్‌ కోర్టు అభిప్రాయపడింది. రోజులు గడిచేకొద్దీ బాబ్రీమసీదు వివాదం ఓ ఉద్యమంగా మారసాగింది. 1949నాటికి కొందరు మసీదులోకి చొరబడి అక్కడ సీతారాముల విగ్రహాలను ప్రతిష్టించారు. ఆ విగ్రహాలను అక్కడి నుంచి తీసేయమని కేంద్ర ఆదేశించినా, మతఘర్షణలు చెలరేగుతాయన్న భయంతో వాటిని అక్కడే ఉంచేశారు. ఆ తరువాత చాలాకాలం వరకూ బాబ్రీమసీదు వివాదం నిద్రాణంగా ఉండిపోయింది.

 

1990లో భాజపా నేత నేత అద్వానీ రథయాత్రను ప్రారంభించడంతో బాబ్రీమసీదు వివాదానికి మళ్లీ రెక్కలొచ్చాయి. రోజులు గడిచేకొద్దీ, అద్వానీ రథయాత్ర సాగుతున్న కొద్దీ, దేశవ్యాప్తంగా హైందవులంతా ఉడుకెత్తిపోసాగారు. చాలాచోట్ల స్థానిక ప్రభుత్వాలు అద్వానీని నిలువరించాల్సి వచ్చింది. 1992, డిసెంబరు నాటికి అయోధ్య విషయంలో తాడోపేడో తేల్చుకునేందుకు లక్షమందికి పైగా జనం బాబ్రీమసీదుని చేరుకున్నారు. ఆ నెల 6వ తేదీన అయోధ్యలో... అద్వానీ, మురళీమనోహర్‌ జోషీ వంటివారి ప్రసంగాలు సాగుతుండగా ఉద్రేకపడిపోయిన జనం ఒక్కసారిగా మసీదుని ముంచెత్తి దానిని కూలగొట్టారు. నిజానికి బాబ్రీ మసీదుని కూల్చాలన్న ప్రణాళిక దాదాపు 10 నెలల ముందుగానే ఏర్పరుచుకున్నారనీ... ఇటు రాష్ట్ర ప్రభుత్వమూ, అటు కేంద్రమూ ఈ విషయంలో చూసీ చూడనట్లు ఉండిపోయాయని ఓ ఆరోపణ. ఆ సమయంలో ప్రధానమంత్రిగా ఉన్న పి.వి.నరసింహరావు సరిగా వ్యవహరించలేదంటూ, కాంగ్రెస్‌ పార్టీ ఓ అపవాదుని ఆయన మీదకు నెట్టివేసి చేతులు దులిపేసుకుంది. బాబ్రీ మసీదు కూల్చివేత దేశాన్ని ఒక్క పెట్టున కుదిపేసింది. మసీదు కూల్చివేత తరువాత జరిగిన ఘర్షణల్లో దేశవ్యాప్తంగా దాదాపు రెండువేల మంది చనిపోయినట్లు అంచనా! ముంబై మొత్తం మతఘర్షణలతో అతలాకుతలం అయిపోయింది.

 

అద్వానీ రథయాత్ర తరువాత బీజేపీ బలపడుతూ వచ్చింది. 2009లో ఏకంగా తన పార్టీ మేనిఫెస్టోలోనే ఆ పార్టీ రామమందిరాన్ని నిర్మిస్తామంటూ ఎన్నికల వాగ్దానం చేసింది. మరోపక్క న్యాయస్థానాలలో కూడా బాబ్రీమసీదు వివాదం పరిష్కారం దిశగా ముందుకు సాగింది. 2010, సెప్టెంబరులో అలహాబాదు హైకోర్టు ఈ వివాదానికి సంబంధించి ఓ చారిత్రాత్మక తీర్పునిచ్చింది. వివాదాస్పద మసీదు ప్రాంతాన్ని మూడు భాగాలుగా చేయాలనీ, వాటిలో ఓ భాగాన్ని వక్ఫ్‌ బోర్డుకీ, మరో రెండు భాగాలు హిందూ సంస్థలకు అందించాలనీ తీర్పునిచ్చింది. అయితే ప్రస్తుతానికి ఈ తీర్పు మీద సంబంధిత పార్టీలు తిరిగి సుప్రీంకోర్టుని ఆశ్రయించడంతో కథ మళ్లీ మొదటికి వచ్చింది.

 

ఇప్పటికీ బాబ్రీ మసీదు మీద రకరకాల భావోద్వేగాలు చెలరేగుతూనే ఉన్నాయి. భిన్నమైన వాదనలు వినిపిస్తూనే వస్తున్నాయి. ఇతర మతస్తులకి, వారి ప్రవక్తల జన్మస్థానాలు ఎంత పవిత్రమో... హిందువులకి రామజన్మభూమి అంతే పవిత్రం అనేవారు ఉన్నారు. అసలు రాముడు పుట్టిన అయోధ్య ఇది కాదని, ఇప్పటి అయోధ్యకు ఆ పేరు 11వ శతాబ్దం నుంచే వచ్చిందనే వారూ ఉన్నారు. ఎవరేమన్నా బాబ్రీమసీదు సమస్య మాత్రం ఇటు ప్రభుత్వాలకీ, అటు న్యాయస్థానాలకీ ఓ కొరకరాని కొయ్యగానే మిగిలిపోయింది. ఇరు మతాల పెద్దలూ కూర్చుని పరిష్కరించుకుంటే కానీ ఈ సమస్యకు ఓ పరిష్కారం లభించడం అసాధ్యం. కానీ ఇరు మతాలకు చెందిన సంస్థలు ఆ భూమి మీద సర్వాధికారాలూ తమకే కావాలని పట్టుపట్టడంతో వివాదం ఎప్పటికీ సద్దుమణిగేట్లు కనిపించడం లేదు!

By
en-us Political News

  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు.
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్ రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది. 80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది. ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది.
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు...
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది...
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో  తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది. 
​సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది...
జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు.
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు...
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి...
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  
నాలుగు రాష్టాలు అస్సాం, పశ్చిమ బెంగాల్ తమిళనాడు,కేరళ, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి శాసన సభలకు  మరో రెండు నెలల్లో ఎన్నికలు జరుగుతాయి. ఇది అందరికీ తెలిసిన విషయం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.