రసవత్తరంగా రాజ్యసభ ఎన్నికలు

Publish Date:Jan 28, 2014

Advertisement

 

ఆరు రాజ్యసభ సీట్లకు మొత్తం 8మంది అభ్యర్ధులు రంగంలో మిగలడంతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధులలో గుబులు మొదలయింది. కాంగ్రెస్ పార్టీ తరపున-సుబ్బిరామి రెడ్డి, యం.ఏ.ఖాన్, కేవీపీ రామచంద్ర రావు బరిలో ఉండగా, సీమాంధ్ర కాంగ్రెస్ సభ్యుల మద్దతుతో యం.యల్సీ. చైతన్య రాజు, ఆదాల ప్రభాకర్ రెడ్డి కూడా నామినేషన్స్ దాఖలు చేసారు. గమ్మతయిన విషయం ఏమిటంటే, రాష్ట్ర విభజన అంశంపై అధిష్టానాన్నిగట్టిగా ధిక్కరిస్తున్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ఆయనను తీవ్రంగా వ్యతిరేఖిస్తున్నఉపముఖ్యమంత్రి దామోదర రాజనరసింహ, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ముగ్గురూ కలిసి పార్టీ అభ్యర్ధుల నామినేషన్ దాఖలు చేయించారు. ఇక, ముప్పై మంది సీమాంధ్ర శాసనసభ్యుల మద్దతు ఉందని చెప్పుకొన్నస్వతంత్ర అభ్యర్ధి చైతన్యరాజు నామినేషన్ ఫారంపై కేవలం 10 మంది మాత్రమే సంతకాలు చేసినట్లు తాజా సమాచారం.

 

బొత్ససత్యనారాయణ వారిని వెంటనే తమ మద్దతు ఉపసంహరించుకోమని, లేకుంటే కటిన చర్యలు తప్పవని హెచ్చరించి, వారినందరినీ ఈరోజు సాయంత్రంలోగా తనను కలిసి సంజాయిషీలు ఇవ్వవలసినదిగా ఆదేశించారు. ఇక టీజీ వెంకటేష్ మీడియాతో మాట్లాడుతూ తాము పార్టీ అభ్యర్ధికే మద్దతు ఇస్తున్నామని, ఎవరయినా తాము స్వతంత్ర అభ్యర్ధికి మద్దతు ఇస్తున్నట్లు తప్పుడు ప్రచారం చేసినట్లయితే వారిపై క్రిమినల్ కేసులు కూడా పెడతామని హెచ్చరించారు. తద్వారా అయన కూడా పార్టీకి లొంగిపోయినట్లే!

 

సీమాంధ్ర సభ్యుల వ్యతిరేఖతను దృష్టిలో ఉంచుకొని, కాంగ్రెస్ అధిష్టానం తన మిగిలిన శాసనసభ్యులను తెరాస అభ్యర్ధి కేశవ్ రావుకి మద్దతు ఇద్దామనే ఆలోచనతో ముగ్గురినే రంగంలోకి దించింది. కానీ ఇప్పుడు పరిస్థితి మళ్ళీ అదుపులోకి రావడంతో టీ-కాంగ్రెస్ నేతల అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకొని ఇప్పుడు నాలుగో అభ్యర్ధిని కూడా రంగంలోకి దించేందుకు కాంగ్రెస్ సిద్దం అవుతోంది. నామినేషన్స్ దాఖలు చేయడానికి కేవలం మరొక అరగంట సమయం మాత్రమే మిగిలి ఉన్నందున, బొత్స, కిరణ్, దామోదరలు ముగ్గురు నాలుగో అభ్యర్ధిని నిలబెట్టడం గురించి తీవ్రంగా చర్చిస్తున్నారు.

 

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి స్వయంగా పార్టీ అభ్యర్దులచేత నామినేషన్స్ దాఖలు చేయించారు గనుక, ఇక తిరుగుబాటు అభ్యర్దులిరువురూ వెనక్కి తగ్గకపోయినా, వారికి సీమాంధ్ర కాంగ్రెస్ శాసన సభ్యులెవరూ కూడా మద్దతు ఈయకపోవచ్చును.

 

అదేవిధంగా కాంగ్రెస్ తన నాలుగో అభ్యర్ధిని కూడా రంగంలోకి దించినట్లయితే, తెరాస అభ్యర్ధి కేశవ్ రావు ఇక కాంగ్రెస్ మద్దతుపై ఆశలు వదులుకోక తప్పదు. ప్రస్తుతం ఆయనకి తెరాస-17, తెదేపా నుండి తెరాసలోకి వచ్చినవారు-5, సీపీఐ-4మంది సభ్యుల మద్దతు ఉంది. ఇంకా కనీసం మరో 10మంది మద్దతు అవసరం ఉంది. బీజేపీ-3, మజ్లిస్-7మంది సభ్యుల మద్దతు ఇచ్చినట్లయితే అయన గెలవగలరు.

By
en-us Political News

  
తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గంలో మాజీ మంత్రి తోట త్రిమూర్తులు నేతృత్వంలో జరిగిన వైసీపీ కాపు సామాజిక వర్గాల నాయకుల సమావేశం రాష్ట్ర రాజకీయాల్లో ఒక్కసారిగా వేడి పుట్టించింది. ఈ సమావేశంలో మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు పెద్ద సంఖ్యలో పాల్గొని భవిష్యత్తు కార్యాచరణపై చర్చించారు.
పవన్ కళ్యాణ్ చేసిన ఈ వ్యాఖ్యల వెనుక ఒక బలమైన రాజకీయ వ్యూహం కనిపిస్తోందన్నారు. ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ఇటీవల జరిగిన సుదీర్ఘ భేటీ తర్వాత పవన్ టోన్ పూర్తిగా మారినట్లు స్పష్టమవుతోంది. తాను కేవలం 21 సీట్లు గెలిచిన ఒక ప్రాంతీయ పార్టీ నేతగా మాత్రమే కాకుండా.. కేంద్రంలోని పెద్దల అండదండలు ఉన్న సుపీరియర్ పొజిషన్‌లో ఉన్నాననే సంకేతాన్ని పవన్ పంపించారన్నారు.
కూటమి ప్రభుత్వంలో పరిపాలనా లోపాలు, రాజకీయ సమన్వయ లేమి స్పష్టంగా కనిపిస్తున్నాయన్నారు. గతంలో ఆర్టీజీఎస్ వంటి డిజిటల్ వ్యవస్థల ద్వారా లభించిన 80 శాతం ప్రజా సంతృప్తి కేవలం కాగితాలకే పరిమితమైందనీ.. డిజిటల్ కనెక్టివిటీ పెరిగి భౌతిక సంబంధాలు దెబ్బతినడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని తమ సర్వేలో తేలిందని చెప్పారు.
ఎన్నికల బరిలో కేసీఆర్, బీఆర్ఎస్ కూటమిని ఢీకొట్టడం ఎవరికైనా పెద్ద సవాలే. గతంలో కేసీఆర్ వాడే ఘాటైన రాజకీయ విమర్శలు, వ్యంగ్యాస్త్రాలపై ఆయనకు మాత్రమే పేటెంట్ హక్కు ఉందనే భావన ఉండేది. కానీ రేవంత్ రెడ్డి రాకతో.. ఆ ముద్రను పూర్తిగా చెరిపివేశారు. కేసీఆర్, కేటీఆర్ ల కంటే మరింత దూకుడుగా, ఘాటుగా రేవంత్ ప్రజల్లోకి వెళ్లారు.
కేంద్ర ప్రభుత్వం పాలసీలు లేదా ప్రాజెక్టులను ఏ ఒక్కరి కోసమో కాకుండా దేశ ప్రజలందరి కోసమే ప్రవేశపెడుతుందని బదులిచ్చారు. అయితే.. ఆ ప్రాజెక్టులను అందుకోవడంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం ఎంత వేగంగా, సానుకూలంగా స్పందిస్తుందనే దానిపైనే వాటి రాక ఆధారపడి ఉంటుందని చెప్పారు.
చంద్రబాబు నాయుడు కుమారుడిగా, ఐటీ బ్యాక్‌గ్రౌండ్ ఉన్న నేతగా మాత్రమే గుర్తింపు ఉన్న యువకుడు నారా లోకేష్. అదే నారా లోకేష్ ఇప్పుడు ప్రజా క్షేత్రంలో తిరుగులేని నాయకుడిగా ట్రాన్స్ ఫార్మ్ అయ్యారు.
ఈ చర్చోపచర్చలు, ఊహాగాన సభలపై ఏపీ మంత్రి నారా లోకేష్ ఎక్స్ ప్రెస్ అడ్డా వేదికగా క్లారిటీ ఇచ్చారు. దేశానికి నరేంద్ర మోదీ రూపంలో ఒక బలమైన ప్రధానమంత్రి ఉన్నారన్న లోకేష్.. చంద్రబాబు ప్రధాని అన్న చర్చకు, వదంతులకు ఫుల్ స్టాప్ పెట్టేశారు.
ఆయనకు పార్టీ నేతల నుంచి ఆశించిన స్థాయిలో మద్దతు లభించడం లేదన్న చర్చ గత కొంత కాలంగా జనసేనలో అంతర్గతంగా సాగుతోంది. ముఖ్యంగా ప్రతిపక్షాలు సోషల్ మీడియా వేదికగా, మీడియా ముఖంగా చేస్తున్న విమర్శలను, తప్పుడు ప్రచారాలను తిప్పికొట్టడంలో జనసేన ద్వితీయ శ్రేణి నాయకత్వం వెనుకబడిందన్న భావన సర్వత్రా వ్యక్తమౌతోంది.
నగర ప్రజల చిరకాల స్వప్నమైన హైదరాబాద్ మెట్రో విస్తరణ, నిధుల విడుదలే లక్ష్యంగా వీరిద్దరూ కలిసి కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌తో భేటీ అయ్యారు. దాదాపు రెండు గంటల పాటు సాగిన ఈ భేటీ చాలా సానుకూల వాతావరణంలో జరిగిందనీ, మెట్రో ప్రాజెక్టుకు ఎదురవుతున్న ఆర్థిక అవరోధాలను అధిగమించడానికి ఇదొక కీలక ముందడుగని సీఎం రేవంత్ రెడ్డి భేటీ అనంతరం పేర్కొన్నారు.
స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానాన్ని సమర్ధంగా, ఎఫెక్టివ్ గా అమలు చేయగలుగుతున్నామని చెప్పారు. ఇప్పుడు సీఎం నారా చంద్రబాబు నాయుడు దీనిని మరొక మెట్టు పైకి తీసుకువెళ్లి ముందుకు తీసుకెళ్లి ఈజ్ ఆఫ్ లివింగ్ అనే భావనను తీసుకొచ్చారనీ, ప్రజలు, ప్రభుత్వానికి మధ్య సంబంధాలలో ఎప్పటినుంచో అనేక అంతరాలు, ఘర్షణలు ఉన్నాయనీ, సాంకేతికత ద్వారా ఆ అవరోధాలను తొలగించాలనేదే మా ఆలోచన అన్నారు.
ఎక్స్‌ప్రెస్ అడ్డా వేదికపైకి విప్లవాత్మక మార్పులకు, పాలనా విధానాలకు కేంద్ర బిందువులుగా నిలిచే అత్యున్నత ప్రముఖులను మాత్రమే ఆహ్వానిస్తారు. గతంలో ఈ వేదికపై కేంద్ర మంత్రులు ఎస్. జైశంకర్, నితిన్ గడ్కరీ, నోబెల్ బహుమతి గ్రహీత అమర్త్య సేన్ వంటి దిగ్గజాలు పాల్గొని ప్రసంగించారు. ఇప్పుడు ఆ లీగ్‌లో నారా లోకేష్ నిలవడం ఆయన స్థాయిని రుజువు చేస్తోంది.
తెలుగువన్ ఎండీ కంఠంనేని రవిశంకర్ తో కలిసి తెలుగువన్ వాస్తవవేదికలో మాట్లాడిన ఆయన మోదీ, అమిత్ షా రాజకీయ చాణక్యాన్ని తట్టుకోవడంలో ప్రాంతీయ పార్టీలు పూర్తిగా విఫలమవుతున్నాయని, వ్యూహాత్మక ఒంటరితనం లేదా అంతర్గత బలహీనతలు ఆయా పార్టీలను దెబ్బతీస్తున్నాయని విశ్లేషించారు.
గత ప్రభుత్వ హయాంలో దాదాపు 1.25 లక్షల సచివాలయ పోస్టుల భర్తీ కోసం నిర్వహించిన పరీక్షకు 19 లక్షల మందికి పైగా నిరుద్యోగులు హాజరయ్యారు. నిబంధనల ప్రకారం జనరల్ కేటగిరీకి 60 మార్కులు, బీసీలకు 52.5 మార్కులు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు 45 మార్కులను కనీస అర్హతగా నిర్ణయించారు. అయితే.. అధికారిక వెబ్‌సైట్‌లో ఎక్కడా అభ్యర్థుల పేర్లు, వయసు, సాధించిన మార్కులతో కూడిన పూర్తి స్థాయి మెరిట్ జాబితాను బహిర్గతం చేయకుండా కేవలం మొబైల్ ఫోన్లకు సమాచారం పంపి నాటకీయంగా ప్రక్రియ ముగించారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.