గోషామహల్‌కు ఉప ఎన్నిక రాదంటున్న రాజాసింగ్

Publish Date:Jul 29, 2025

Advertisement

గోషామహల్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికపై స్థానిక ఎమ్మెల్యే రాజా సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అలాగే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు ప్రచారం చేయాలని బీజేపీ అభ్యర్థి కోరితే తాను ప్రచారం చేస్తానని స్పష్టం చేశారు. గోషా మహల్ అసెంబ్లీ స్థానానికి ఎట్టి పరిస్థితుల్లో ఉప ఎన్నిక రాదని స్థానిక ఎమ్మెల్యే రాజా సింగ్ స్పష్టం చేశారు. ఈ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జరగనుందంటూ కొంత మంది సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేస్తూ లేని పోని గందరగోళం సృష్టిస్తున్నారని మండిపడ్డారు.  ఒకటి రెండు రోజుల్లో ఢిల్లీ పెద్దలు తనను పిలుస్తారని ఆయన ధీమా వ్యక్తం చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.

తన బాధలు వారికి చెప్పిన తర్వాత తాను బీజేపీలో తిరిగి చేరే అంశంపై క్లారిటీ ఇస్తానన్నారు. ఇక జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై బీజేపీ అభ్యర్థి వ్యక్తిగతంగా పిలిస్తే.. వెళ్లి ప్రచారం చేస్తానని స్పష్టం చేశారు. 
బీజేపీ రాష్ట్ర నాయకత్వం తనను గుర్తించకపోయినా.. తనను గుర్తించే వాళ్లు చాలా మంది ఉన్నారని రాజాసింగ్ పేర్కొన్నారు. బీజేపీలో చాలా మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని చెప్పుకొచ్చారు. వారంతా బయటకు వచ్చి మాట్లాడటానికి భయపడుతున్నారన్నారు. తాను వెళ్లి ఇతర రాష్ట్రాల్లో ప్రచారం చేస్తే అక్కడ బీజేపీ ఓటు బ్యాంక్ చాలా బాగా పెరిగిందని వివరించారు. తనపై ఎవరు ఎన్ని కుట్రలు చేసారో అన్ని తనకు తెలుసునని చెప్పారు.

కేంద్ర మంత్రులు తనతో టచ్‌లోనే ఉన్నారన్న రాజాసింగ్.. తాను శివసేన, టీడీపీ, జనసేనలో చేరుతున్నట్లు వస్తున్న వార్తలను నిర్ద్వంద్వంగా ఖండించారు. ఈ వార్తల్లో వాస్తవం లేదన్నారు. ఇవన్నీ బీజేపీ మిత్రపక్ష పార్టీలేనని గుర్తు చేశారు. తెలంగాణలో బీజేపీ కొత్త అధ్యక్షడు రామచందర్ రావు బాగానే పని చేస్తున్నారంటూ   ప్రశంసల వర్షం కురిపించారు. ఆయన నేతృత్వంలో తెలంగాణలో పార్టీ అధికారంలోకి రావాలని ఆకాంక్షిస్తున్నట్లు చెప్పారు.

హైదరాబాద్‌లోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్ష పదవికి ఇటీవల ఎన్నిక జరిగింది. ఈ పదవికి మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు నామినేషన్ దాఖలు చేశారు. ఆయనకు ఢిల్లీలోని పార్టీ అగ్రనాయకత్వం ఆశీస్సులున్నాయి. అయితే అదే సమయంలో గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సైతం ఈ పదవికి నామినేషన్ దాఖలు చేసేందుకు అనుచరగణంతో కలిసి పార్టీ కార్యాలయానికి తరలి వెళ్లారు. అయితే ఆయన్ని పార్టీ కార్యాలయం లోపలికి వెళ్లకుండా సిబ్బంది అడ్డుకున్నారు. దీంతో ఆయన తీవ్ర మనస్తాపానికి గురై  అక్కడికక్కడే బీజేపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. పార్టీకి, నాయకులకు ఒక దణ్ణం అంటూ తీవ్ర వ్యాఖ్యలు కూడా చేశారు.  రాజీనామా లేఖను పార్టీ అగ్రనాయకులకు పంపారు. వారు వెంటనే దానిని ఆమోదించారు. దీంతో గోషామహల్ ఎమ్మెల్యే మరో పార్టీలో చేరతారంటూ ప్రచారం జోరందుకుంది. అది సోషల్ మీడియాలో  ఓ రేంజ్ లో వైరల్ అయింది.  మరోవైపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత మాగంటి గోపినాథ్ అనారోగ్యంతో మృతి చెందారు. దీంతో జూబ్లీహిల్స్‌తోపాటు గోషా మహల్ అసెంబ్లీ స్థానాలకు ఒకే సారి ఉప ఎన్నిక వస్తుందంటూ కూడా ప్రచారం జరుగుతోంది. మరో వైపు బీజేపీని విడిచి పెట్టవద్దంటూ ఢిల్లీలోని కొంత మంది ఆ పార్టీ నేతలు.. రాజాసింగ్‌కు సూచించినట్లు తెలుస్తోంది. అందులో భాగంగా వారు పార్టీ అగ్రనాయకత్వంతో మధ్యవర్తిత్వం నెరుపుతున్నట్లు సమాచారం. 

ఈ నేపథ్యంలో మరి కొద్ది రోజుల్లో ఎమ్మెల్యే రాజా సింగ్‌కు ఢిల్లీలోని బీజేపీ పెద్దల నుంచి పిలుపు వస్తుందని.. వారితో భేటీ తర్వాత మళ్లీ బీజేపీలో చేరే అంశంపై క్లారిటీ ఇస్తారనే ఓ చర్చ అయితే గోషామహల్‌లో సాగుతోంది. అదీకాక.. గత కొంత కాలంగా బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డికి, ఎమ్మెల్యే రాజాసింగ్ మధ్య కోల్డ్ వార్ నడుస్తున్నట్లు ఒక ప్రచారం కూడా సాగుతోంది. ఈ నేపథ్యంలో రాజాసింగ్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకుంది. 

By
en-us Political News

  
ఉమ్మడి అనంతపురం జిల్లాలో గుంతకల్ నియోజకవర్గం మిగతా నియోజకవర్గానికి పూర్తి భిన్నంగా ఉంటుంది.
అయితే ఆ ప్రశ్నకు ఇంత దూరం వచ్చి ఆ సన్నాసి గురించి ఎందుకు అంటూ లోకేష్ సమాధానం ఇచ్చారు.
వేశంతో కంటే ఎంతో ఆలోచనతో రాజకీయ సన్యాసం ప్రకటించి, వ్యవసాయమే తన వ్యాపకం అని ప్రకటించేశారు. అలా ప్రకటించిన సందర్భంలోనే పరిశీలకులు ఇది వ్యూహాత్మక పోలిటికల్ రిటైర్మెంట్ అంటూ విశ్లేషణలు చేశారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చి రెండేళ్లయిన ఎన్నికలు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఆరోపించారు.
బీజేపి రాజ్యాంగంలో లౌకిక పదం తొలగిస్తామనడం దారుణమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు
మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత కాకాని గోవర్ధన్ రెడ్డికి మరో ఎదురుదెబ్బ తగిలింది.
ఏది ఏమైతేనేం తెలంగాణలో మద్యం అమ్మకాలు కొత్త రికార్డు సృష్టించాయి. విశేషమేంటంటే.. ఇంతటి చలిలోనూ కూడా బీర్ల అమ్మాకాలు కూడా జోరుగా సాగాయి.
తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టిన తరువాత దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల జాబితాలో ఏపీ అగ్రపీఠిన నిలుస్తోంది. 2025-26 ఆర్థిక సంవత్సరం తొలి మేమూడు నెలల్లోనే రాష్ట్ర వృద్ధి10.5 శాతంగా ఉంది.
రీసెంట్ గా తెలంగాణ‌లో తీన్మార్ మ‌ల్ల‌న్న తెలంగాణ రాజ్యాధికార పార్టీని ఏర్పాటు చేశారు. అలాగే ఏపీ కేంద్రంగా మరో కొత్త పార్టీ ఆవిర్భవించనున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.
బీఆర్‌ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
భార‌త్ పర్యటనకు వ‌చ్చినపుడు రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇంట‌ర్వ్యూలో కొన్ని ఆస‌క్తిక‌ర‌మైన విషయాలు తెలిపారు
ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ తెరమీదకు తీసుకువచ్చారు. ఇదే విషయాన్ని చంద్రబాబు దృష్టికీ తీసుకువెళ్లారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని చంద్రబాబు నాయకత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా అమరావతి రాజధాని అన్న చట్టబద్ధత అవసరమని భావించింది. దీంతో ఇదే విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకువెళ్లింది.
ప్రజా సమస్యలపై ఆ పార్టీ ఎలా స్పందిస్తోంది. వాటి పరిష్కారం దిశగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చేందుకు ఆ పార్టీ చేపడుతున్న కార్యక్రమాలు ఏమిటి? ప్రజల పక్షాన నిలబడేందుకు ఆ పార్టీ నేతలు ముందుకు వస్తున్నారా? వంటివన్నీ జనం గమనిస్తారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.