రాజారెడ్డి ఎంగేజ్మెంట్.. జగన్ షర్మిల విభేదాలపై మరో సారి రచ్చరచ్చ!

Publish Date:Jan 19, 2024

Advertisement

వైఎస్ రాజశేఖరరెడ్డి కుమార్తె, ఏపీ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల కుమారుడు రాజారెడ్డి, అట్లూరి ప్రియ నిశ్చితార్ధ వేడుక హైదరాబాద్‌ శివారు గండిపేటలోని గోల్కొండ రిసార్ట్స్‌ లో గురువారం అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ వేడుకకు షర్మిల సోదరుడు, ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సహా ఎందరో అతిధులు విచ్చేసి నూతన వధూవరులను ఆశీర్వదించారు. అయితే, ఎంతమంది వచ్చినా.. ఒక్క సీఎం జగన్ మోహన్ రెడ్డి ఈ నిశ్చతార్ద వేడుకకు హాజరవడం మాత్రం హాట్ టాపిక్ అయింది. అందరిలాగానే జగన్ కూడా సతీమణి వైఎస్‌ భారతితో కలిసి ఈ వేడుకకు హాజరయ్యారు. తల్లి విజయమ్మ, సోదరి షర్మిలను ఆలింగనం చేసుకొని జగన్ చిరునవ్వులు చిందించారు. అలాగే ఈ సందర్భంగా కాబోయే జంటకు పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు. అంతా బాగానే ఉంది కాదా మరి రెండు రోజులుగా ఈ వేడుకకు జగన్ వెళ్లడం ఎందుకు ఇంతలా రచ్చ అవుతుందన్నది కూడా అందరికీ తెలిసిందే. సోదరి షర్మిలతో జగన్ విబేధాలు, అగాధాలు అన్నీ తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ తెలిసిందే కాగా.. ఈ నిశ్చతార్ధ వేడుకలో జగన్ ప్రతి కదలిక ఆసక్తికరంగానే సాగింది.

జగన్ ఒక్కగానొక్క సొంత మేనల్లుడి నిశ్చతార్ద వేడుకలో పట్టుమని మూడు నిముషాలు కూడా ఉండలేకపోయారు. జగన్ కారు దిగి వేదికపైకి వెళ్లడం.. తల్లి, సోదరిని ఆలింగనం చేసుకోవడం, కాబోయే వధూవరులను పలకరించి పుష్ప గుచ్చం ఇచ్చి శుభాకాంక్షలు చెప్పడం, ఒక ఫోటోకి ఫోజివ్వడం.. కారు ఎక్కేసి అక్కడ నుండి వెళ్లిపోవడం ఇదే జరిగింది. దీంతో జగన్ పై సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్స్ వస్తున్నాయి. తన పార్టీకి వ్యూహకర్తగా పనిచేసిన ప్రశాంత్ కిషోర్ తమ్ముడి పెళ్లికి ఐదు గంటలు కేటాయించిన జగన్.. సొంత మేనల్లుడు పెళ్లికి ఐదు నిముషాలు కేటాయించలేకపోవడం ఏంటని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. అలాగే జగన్ ను మొక్కుబడిగా పలకరించిన షర్మిల, కనీసం ఆ ఆలింగనం ఫోటోలకు కూడా దొరకని విధంగా కవర్ చేసుకున్నారు. ఆ తర్వాత కూడా జగన్ తనకు గుర్తుగా కాబోయే వధూవరులతో కుటుంబం అందరూ కలిసి ఫొటో దిగేందుకు ప్రయత్నించగా షర్మిల అందుకు ఇష్టపడలేదు. జగన్ ఫోటో విషయం చెప్పినా షర్మిల పట్టించుకోనట్లు ఉన్నారు. అయితే, చివరిగా తల్లి విజయమ్మ ప్రయత్నంతో షర్మిల ఫోటోకి ముందుకొచ్చినా.. అయిష్టంగానే జగన్ కు దూరంగా ఎక్కడో నిలుచున్నారు.

ఈ నిశ్చతార్ద వేడుక ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది. అన్నా చెల్లెళ్ళ మధ్య ఇప్పుడు వార్ పీక్స్ లో ఉంది. ఇందులో ఎవరికీ ఎలాంటి అనుమానాలు లేవు. అందుకే షర్మిల కాంగ్రెస్ లో చేరి, ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించగా.. రానున్న ఎన్నికలలో జగన్ ఓటమికి పనిచేయడం ఒక్కటే ఇక మిగిలి ఉంది. మరి అన్నా చెల్లెమ్మల మధ్య ఇంత వైరం ఉన్నప్పుడు అసలు వైఎస్ షర్మిల జగన్ ను ఆహ్వానించడం ఎందుకు?.. పోనీ షర్మిల ఆహ్వానించినా చుట్టపు చూపుగా జగన్ రావడం ఎందుకు అన్నదే ఇప్పుడు అందరి ప్రశ్న. ఈ వేడుకకు వచ్చేందుకు జగన్ తన షర్ట్ ధరించిన సమయం కూడా ఈ వేడుకలో లేరు. మరి అలాంటపుడు అంత మొహమాటంగా రావడం ఎందుకు జగన్ అంటూ నెటిజన్లు సూటిగా ప్రశ్నిస్తున్నారు. పోనీ వచ్చినందుకు కనీసం అర్ధగంట సమయం కేటాయించి బంధువులు, మిత్రులను పలకరించి కాస్త సందడి చేసి ఉంటే అది ఎంతో గౌరవంగా ఉండేది.

సోదరుడిపై షర్మిల ఎంతో ఆగ్రహంతో ఉన్నారు. జగన్ తనను నమ్మించి మోసగించాడని షర్మిల బలంగా నమ్ముతున్నారు. అందుకే అన్నపై సూటిగా బాణం ఎక్కుపెట్టారు. మరి అలాంటపుడు ఇంటికి వెళ్లి మరీ సోదరుడిని నిశ్చతార్ధ వేడుకకు ఆహ్వానించడం ఎందుకు? పోనీ ఆహ్వానించారు.. సోదరుడు కూడా వేడుకకు వచ్చారు. కానీ, తీరా వేదికపై ఎడమొహం పెడమొహం. మరి ఈ తప్పు ఎవరిది? నేచురాలిటీకి దగ్గరగా ఉండే తమిళ సినిమాలో కూడా ఈ వేడుక వేదిక మీద మనుషుల నటన చూసి ఉండరు. ఒకవేళ సినిమాలలోనే కాదు ఇలాంటి వేడుకలలో మనుషుల నటనకి కూడా అవార్డులు వస్తాయంటే.. రాజారెడ్డి-ప్రియాల నిశ్చతార్ద వేడుకలలో వైఎస్ ఫ్యామిలీ సభ్యుల నటనకి ఆస్కారుల పంట పండడం ఖాయం. ఆ స్థాయిలో నటించారు ఒక్కొక్కరు. మొత్తంగా ఈ నిశ్చతార్ద వేడుక వైఎస్ ఫ్యామిలీని మరోసారి సోషల్ మీడియాలో మోత పుట్టించేస్తుంది.

By
en-us Political News

  
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నెల్లూరు జిల్లా జువ్వలదిన్నె పర్యటనకు హాజరుకాకూడదని స్థానిక మత్స్యకారులు ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఈ నిబంధనను అతిక్రమించి ఎవరైనా జగన్ పర్యటనకు వెడితే.. వారికి ఏకంగా ఒక లక్ష రూపాయల భారీ జరిమానా విధిస్తామని మత్స్యకార సంఘాల ప్రతినిధులు హెచ్చరించారు.
పార్టీ సిద్ధాంతాలను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్ళాలని, పార్టీ సిద్ధాంతాలే నాయకత్వానికి బలం అని విద్య, ఐటి శాఖ మంత్రివర్యులు నారా లోకేష్ పిలుపునిచ్చారు.
పశ్చిమ బెంగాల్ రాజకీయాలు మరోసారి వేడెక్కాయి
జగన్ ప్రతిపాదిత మావిగన్ ప్రాంతం నుంచే అంటే మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ప్రాంతాల ప్రజలలో అయితే మావిగన్ పట్ల తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. అమరావతికి చట్టబద్ధత వచ్చిందని అంతా పండుగ వాతావరణం నెలకొన్న ఈ పరిస్థితుల్లో మావిగన్ ఏమిటి అంటూ ఓ రేంజ్ లో జగన్ ప్రతిపాదనపై విమర్శలు గుప్పిస్తున్నారు.
ఇటీవల రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన నితీశ్‌కుమార్ బీహార్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు లేఖ రాశారు. అలాగే ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలకు వేర్వేరుగా లేఖలు రాశారు. ఆ లేఖల్లో ఆయన వారి మద్దతు కోరారు. ఆశ్చర్యపోవద్దు చంద్రబాబు వారి మద్దతు కోరతూ లేఖ రాశారు. అయితే ఆ మద్దతు ఏ విషయంలో అంటే మహిళల రాజకీయ సాధికారతకు కీలక మైలురాయిగా నిలిచే మహిళా రిజర్వేషన్ బిల్లుకు. ఆ బిల్లుకు మద్దతు పలకాల్సిందిగా కోరుతూ చంద్రబాబు ఈ లేఖలు రాశారు.
మాజీ మంత్రి, సీనియర్ పొలిటీషియన్ జీవన్ రెడ్డి అధికారికంగా బీఆర్ఎస్ తీర్ధం పుచ్చుకునే వేదికగా ఆ సభ జరగబోతున్నది. ఈ భారీ బహిరంగ సభలో కేసీఆర్ అఫీషియల్ గా జీవన్ రెడ్డిని బీఆర్ఎస్ లో చేర్చుకుంటారు. ఈ సభను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న బీఆర్ఎస్ భారీగా ఏర్పాట్లు చేస్తోంది.
బెంగాల్ అభివృద్ధి కేవలం రాజధాని కోల్‌కతా, దాని చుట్టుపక్కల ప్రాంతాలకే పరిమితమైందన్నారు. ముఖ్యంగా ముస్లిం జనాభా అధికంగా ఉన్న జిల్లాలను ప్రభుత్వం పూర్తిగా విస్మరిస్తోందని దుయ్యబట్టారు.
ఈ పర్యటనలో భాగంగా రేవంత్ రెడ్డి దక్షిణాది రాష్ట్రాల ప్రయోజనాలకు డీలిమిటేషన్ ఏ విధంగా అవరోధంగా మారుతుందన్నది ఇండియా కూటమి పార్టీలకు వివరించే అవకాశం ఉందని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే రేవంత్ హస్తిన పర్యటన అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.
రాజకీయంగా ఎదుర్కొనలేకే.. దర్యాప్తు సంస్థల ద్వారా తమ విజయాన్ని అడ్డుకోవాలని కేంద్రంలోని మోడీ సర్కార్ ప్రయత్నిస్తున్నదని తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ ఆగ్రహం వ్యక్తం చేశారు.
జనాభా నియంత్రణ శిక్షా? బహుమతా? అని నిల‌దీస్తున్నారు సీఎం రేవంత్. కేంద్ర ప్రభుత్వం జనాభా ప్రాతిపదికన ఎంపీ సీట్లను పెంచాలని చూస్తోంది. ఆనాడు కేంద్రం పిలుపునిచ్చిందని దక్షిణాది రాష్ట్రాలైన తెలంగాణ, ఏపీ, తమిళనాడు, కేరళ, కర్ణాటక కుటుంబ నియంత్రణను పక్కాగా అమలు చేశాయి. ఫలితంగా ఇక్కడ జనాభా పెరగలేదు.
ఈ కేసులన్నీ ప్రజలకు టికెట్ లేని సినిమా చూపిస్తున్నాయన్నారు. ఈ కేసుల్లో ఎవరికి శిక్షలు పడవంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.