రాహుల్ మరో సెల్ఫ్ గోల్ !

Publish Date:Mar 11, 2025

Advertisement

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ  ఇటీవల గుజరాత్ లో పర్యటించారు.రాష్ట్రంలో కాంగ్రెస్  పార్టీ పునర్జీవనం లక్ష్యంగా నాయకులు, అహ్మదాబాద్ లో ఏర్పాటు చేసిన విస్తృత స్థాయి పార్టీ నేతల సమావేశంలో పాల్గొన్నారు. కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. 2027 ఎన్నికలలో గెలుపు కోసం ఇప్పటి నుంచే పనిచేయాలని దిశా నిర్దేశం చేశారు. అయితే  ఆ సందర్భంగా ఆయన పార్టీ కార్యకర్తలు, నాయకుల గురించి చేసిన ప్రకటన దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. ముఖ్యంగా తెలంగాణలో మరింతగా రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. అయితే  ఆ సంచలన ప్రకటన ఉద్దేశం  అది కాదు,వేరే వుందని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు. 

దేశ రాజకీయాల్లో గుజరాత్ రాష్ట్రానికి ఉన్న ప్రత్యేకత గురించి వేరే చెప్ప నక్కర లేదు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాల స్వరాష్ట్రం గుజరాత్. అంతే  కాదు, గుజరాత్ మోడల్ ను గొప్పగా చూపించే  2014లో  బీజేపీ కేంద్రంలో తొలిసారి సంపూర్ణ మెజారిటీతో అధికారంలోకి  వచ్చింది. అలాగే  30 ఏళ్లుగా గుజరాత్  అధికార పీఠం పై తిష్ట వేసుకు కూర్చుంది. మరో వంక  కాంగ్రెస్ పార్టీ పరిస్థితి దినదిన ప్రవర్థమానంగా దిగజరుతోంది.  2022 ఎన్నికల్లో కేవలం 17 అసెంబ్లీ స్థానాలను మాత్రమే గెలుచుకుంది. అందులో ఐదుగురు  చేయి వదిలి పువ్వు పార్టీలో చేరారు. 

అయితే కొడితే ఏనుగు కుంభ స్థలాన్నే కొట్టాలనే నిర్ణయానికి వచ్చారో ఏమో తెలియదు కానీ, రాహుల్ గాంధీ 2027 ఎన్నికల్లో ఎలాగైనా,అధికారాన్ని చేజిక్కించుకోవాలనే సంకల్పంతో  రెండేళ్ళు ముందుగానే రాష్ట్రంలో ఎన్నికల ప్రయాణం మొదలు పెట్టారు. అహ్మదాబాద్  లో  ఏర్పటు చేసిన కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొని  ప్రసంగించారు. అయితే  రాహుల్ వ్యూహం ఏమిటో, ఎందుకు అలా మాట్లాడారో ఏమో కానీ, కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలలో ఉత్సాహాన్ని నింపడం పక్కన పెట్టి, కార్యకర్తలు నాయకులపైనే విరుచుకు పడ్డారు. కార్యకర్తలు, నాయకుల విశ్వసనీయతను ప్రశ్నించారు. సమావేశానికి హాజరైన వారిలో సగం మంది బీజేపీ కోవర్టులే  అంటూ నింద మోపారు. బీజేపీ ‘బీ’ టీమ్’ గా ముద్ర వేశారు. అంతే కాదు, అలాంటి నమ్మక ద్రోహులను పార్టీ నుంచి ఏరి వేస్తామని హెచ్చరించారు.

అయితే, రాహుల్ గాంధీ  గుజరాత్  కాంగ్రెస్ క్యాడర్ ను ఉద్దేశించే’ ఈ సంచలన వ్యాఖ్యలు  చేశారో లేక మొత్తంగా దేశంలో ఇదే పరిస్థితి ఉందనేది ఆయన ఉద్దేశమో తెలియదు కానీ  ఆయన ప్రకటన దేశ వ్యాప్తంగా  ప్రకంపనలు సృష్టించింది. అంతే కాదు గుమ్మడి కాయల దొంగంటే బుజాలు తడుముకున్నట్లు కాంగ్రెస్ నాయకులు, ముఖ్యంగా  ముఖ్యమైన పదవుల్లో ఉన్న నాయకులు బుజాలు తడుముకుంటున్నారు. మరో వంక కాంగ్రెస్ సీనియర్ నాయకులు  కొందరు మాత్రం  రాహుల్ గాంధీ చేసిన హెచ్చరిక ఉద్దేశం ఏదైనా, పార్టీ పరిస్థితిని దేశ వ్యాప్తంగా మరింత దిగజార్చి వేస్తుందని అంటున్నారు. ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.  

ఇతర రాష్ట్రాల విషయం ఎలా ఉన్నా  రాహుల్ ప్రకటనతో తెలంగాణలో మాత్రం ఏకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విస్వసనీయతపైనే అనుమానాలు వ్యక్త మవుతున్నాయి. నిజానికి  రేవంత్ రెడ్డికి పూర్వశ్రయంలో ఆర్ఎస్ఎస్, ఏబీవీపీలతో అనుబంధం ఉన్న మాట నిజం. అందులో దాపరికం లేదు. నిజానికి  ఆ నిజాన్ని ఆయనే స్వయంగా అనేక సందర్భాలో చెప్పుకున్నారు. అయినా అదంతా గతం, ఆ తర్వాత ఆయన చాలా దూరం ప్రయాణించారు. చాల చాల మజిలీలు మారారు. ఆర్ఎస్ఎస్ గణవేష మొదలు గాంధీ టోపీ వరకు చాలా వేషాలు వేశారు. పార్టీలు మారారు. చివరకు కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయినా, ఆయన మూలాలు తెలిసే, రాహుల గాంధీ ఆయన్ను పీసీసీ అధ్యక్షుడిని చేశారు. పార్టీలో పుట్టి పెరిగిన వారిని కాదని ఆయన్ని ముఖ్యమంత్రిని చేశారు. 

అయినా  ఇప్పడు రాహుల్ ప్రకటనతో ఆయన పైనే అనుమానాలు వ్యక్త మవుతున్నాయి. శీల పరీక్షకు నిలవ వలసి వస్తోంది. ఇటీవల కాలంలో ఆయన ఒకటి రెండు సందర్భాలలో బీజేపీ నాయకులతో వేదిక పంచుకున్నారు. తప్పుకాదు. కానీ, ఆ సమయంలో, పాత బంధాలను  గుర్తు చేసుకుని మురిసి పోయారని ప్రత్యర్ధులు ఎత్తి చూపుతున్నారు. అలాగే  కొంచెం ఎక్కువగా రాసుకు పూసుకు తిరిగినట్లు ఆరోపిస్తున్నారు. మరో వంక  అటు కేంద్ర ప్రభుత్వంతో సన్నిహితంగా  ఉంటున్నారనే  నిందను రేవంత్ మోస్తున్నారు. ముఖ్యంగా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో, కాంగ్రెస్ అభ్యర్ది ఓడి పోతున్నారనే సంకేతాలు ఇచ్చారనే ఆరోపణ ఢిల్లీ చేరింది. ఈ నేపధ్యంలోనే  ఉరుము ఉరిమి మంగలం మీద పడినట్లు, రాహుల్ గాంధీ గుజరాత్ లో చేసిన గర్జన ప్రభావం రేవంత్ రెడ్డి మీద పడుతుందా అంటే  మీనాక్షి నటరాజన్  నియామకం తదనంతర పరిణామాలతో  కలిపి చూస్తే, ప్రస్తుతానికి  ఫిఫ్టీ .. ఫిప్టీ అంటున్నారు.  

అదలా ఉంటే  అసలు రాహుల్ గాంధీ అలాంటి  ప్రకటన చేయడం వెనక, తనను తాను రక్షించుకునే వ్యూహం ఉందని రాజకీయ పండితులు అంటున్నారు. ఢిల్లీ డబుల్ జీరో హట్రిక్  తర్వాత కాంగ్రెస్ సీనియర్ ఎంపీ శశి థరూర్ పార్టీ నాయకత్వం పై అసంతృప్తిని వ్యక్త పరిచారు. మరో వంక కర్ణాటక ఉప ముఖ్యమత్రి  డీకే శివకుమార్  పార్టీ లైన్కు విరుద్ధంగా కుంభమేళ, సద్గురు శివరాత్రి వేడుకల్లో పాల్గొన్నారు. అంతే కాకుండా సంఘ్ పరివార్/ బీజేపీకి దగ్గరవుతున్న సంకేతాలు ఇచ్చారు.  దీంతో పొంచి ఉన్న ముప్పును గ్రహించి రాహుల్ గాంధీ   ఎదురుదాడికి సిద్డమయ్యారనీ, అందులో భాగంగానే, ఆయన  ... బీజేపీ కోవర్టులు, బీజేపీ ‘బీ’ టీమ్ అంటూ సొంత సైన్యం పైనే కత్తులు దూశారని  , ఒక విధంగా ఇది రాహుల్ గాంధీ స్కోర్ చేసిన మరో సెల్ఫ్ గోల్   అవుతుందని రాజకీయ పండితులు  విశ్లేషిస్తున్నారు.

By
en-us Political News

  
దానం నాగేందర్ అధికారికంగా బీఆర్‌ఎస్‌ పార్టీకి రాజీనామా చేయకుండానే కాంగ్రెస్‌ గూటికి చేరారని, అంతేకాకుండా కాంగ్రెస్‌ పార్టీ తరఫున సికింద్రాబాద్‌ లోక్‌సభ స్థానానికి అభ్యర్థిగా  పోటీ చేశారని హైకోర్టు దృష్టికి తెచ్చారు. పార్టీ ఫిరాయింపులకు ఇవి  బలమైన సాక్ష్యాధారాలని వారు పేర్కొన్నారు.
మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తూ ప్రవేశపెట్టిన పథకాలు దేశంలో విప్లవాత్మక మార్పులు తెచ్చాయన్న చంద్రబాబు , భారతదేశాన్ని గ్లోబల్ లీడర్‌గా నిలపడంలో ప్రధాని మోదీ దార్శనికత  కీలకమని చంద్రబాబు అన్నారు.
తాజాగా తృణమూల్ లోని మమతా వర్గం, రితబ్రత వర్గాలకు చెందిన కీలక నాయకులు  ఢిల్లీలో  భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) ఫుల్ బెంచ్ ఎదుట హాజరై తమ వాదనలను బలంగా వినిపించారు. ఇరువర్గాలు కూడా ఈసీఐ విచారణ ముగిసిన తర్వాత తమ వాదనలకే అనుకూలంగా తుది తీర్పు వస్తుందని ధీమా వ్యక్తం చేయడం రాజకీయ వర్గాల్లో ఈ వ్యవహారంపై మరింత  ఆసక్తిని రేకెత్తించింది. 
ఒకనాడు ప్రత్యర్థుల విమర్శల దాడులను చిటికెలో   చిత్తు చేసే నేర్పు ఉన్న నేతగా నిలిచిన హరీష్ రావు.. ఇప్పుడు ఆత్మరక్షణలో పడినట్లు కనిపిస్తున్నదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
ఉపాధ్యాయ పోస్టుల భర్తీ ప్రక్రియలో అవకతవకలు జరిగాయంటూ వైసీపీ ఆరోపణలు గుప్పిస్తోంది. అధికారంలో ఉన్న తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న పద్ధతులను ప్రశ్నిస్తూ, సోషల్ మీడియా,  మీడియా సమావేశాల ద్వారా విమర్శలు గుప్పిస్తోంది. డీఎస్సీ నియామకాల్లో పారదర్శకత లోపించిందని, అభ్యర్థుల మార్కులు  పరిశీలనా ప్రక్రియలో గందరగోళం నెలకొందని ఆరోపిస్తున్నది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల అసెంబ్లీ వేదికగా మాజీ సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యుల భూ ఆక్రమణలంటూ చేసిన సంచలన వ్యాఖ్యలు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్‌పై గులాబీ పార్టీ  మండిపడింది. ప్రభుత్వ వైఫ్యాలను కప్పిపుచ్చుకునేందుకే కాంగ్రెస్ పెద్దలు ఇలాంటి నిరాధార ఆరోపణలు చేస్తున్నారని  ఎదురుదాడికి దిగింది.
పట్టభద్రుల ఎన్నికలకు ఓటర్ల జాబితా ప్రక్రియ షెడ్యూల్ విడుదల.. !
చాలా మంది 1973 నాటి భూమి పరిమితి చట్టం రద్దయిందని అనుకుంటున్నారు. కానీ అది అమలులోనే వుంది. ఉమ్మడి కుటుంబానికి మెట్ట భూమి 52 ఎకరాలు, కొన్ని ప్రత్యేక సందర్భాల్లో 54 ఎకరాలు ఉండవచ్చు. తరి భూమి (ఏడాదికి రెండు పంటలు పండేది) 27 ఎకరాలు వుండవచ్చు. అంతకంటే ఎక్కువగా ఉంటే దాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాల్సి వుంటుంది.
వారణాసి వేదికగా నెల రోజుల పాటు జరగనున్న  సేవా సంకల్ప అభియాన్ లో  తొలి రోజు గురువారం ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు పాల్గొన్నారు. అలాగే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సహా  పాటు పలువురు అగ్రనేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.  
మోడీకి  జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన వారిలో లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, తెలుగుదేశం అధినేత, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేష్ తదితరులు  ఉన్నారు.  ప్రధాని నరేంద్ర మోదీజీకి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయన మంచి ఆరోగ్యంతో, దీర్ఘాయుష్షుతో ఉండాలని కోరుకుంటున్నానంటూ రాహుల్ గాంధీ తన సందేశంలో పేర్కొన్నారు.
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు వన్‌సైడ్ విక్టరీ వచ్చేలా పార్టీ శ్రేణులు పనిచేయాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు.
కేసీఆర్ కుటుంబ సభ్యులు, సన్నిహిత బంధువులపేర్ల మీద అధికారికంగా నమోదై ఉన్న భూముల వివరాలను అసెంబ్లీ వేదికగానే  రేవంత్ రెడ్డి బయటపెట్టారు.  
వైసీపీ నుంచి బయటకు వచ్చి, ఆ పార్టీ ద్వారా వచ్చిన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి రాజకీయ సన్యాసం ప్రకటించిన విజయసాయి, ఇటీవల సొంత పార్టీ అంటూ మళ్లీ క్రియాశీల రాజకీయాలలోకి ప్రవేశించారు. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.