రాహుల్ గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ పయనమెటు?

Publish Date:Jun 30, 2014

Advertisement

 

ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఓటమికి పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీయే కారకుడని కొంత మంది కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. కాంగ్రెస్ అధిష్టాన దేవుడిగా కొలవబడుతున్న రాహుల్ గాంధీని విమర్శించినందుకు వారికి వెంటనే పార్టీ నుండి ఉద్వాసన చెప్పడం ద్వారా ఆ సమస్యను అధిగమించినట్లు కాంగ్రెస్ భావించింది, కానీ నాయకత్వ లోపం గురించి సదరు నేతలు లేవనెత్తిన అంశాన్ని మాత్రం పరిష్కరించే ప్రయత్నం చేయలేదు. చేసి ఉంటే అది కాంగ్రెస్ పార్టీ అనిపించుకోదు కదా! సమస్య ఇంకా అలాగే ఉంది గనుక అప్పుడప్పుడు ఎవరో ఒకరు ఈ విషయమై సన్నాయి నొక్కులు నొక్కడం సహజమే. అయితే ఈసారి రాహుల్ గాంధీ నాయకత్వ లక్షణాల గురించి వేరెవరో కాదు, గత పదేళ్లుగా ఆయనపై ఈగ వాలకుండా చూసుకొన్న దిగ్విజయ్ సింగ్, రాహుల్ గాంధీకి అధికారం బాధ్యతలు చెప్పట్టగల లక్షణాలు లేవని విమర్శించారు. ఎన్నికలు ముగిసే వరకు కూడా రాహుల్ గాంధీ వంటి నాయకుడు నభూతో నభవిష్యతి అని డప్పుకొట్టిన దిగ్విజయ్ సింగ్, ఇప్పుడు ఎన్నికలలో పార్టీ ఓటమి తరువాత అతనికి పరిపాలనా సామార్ధ్యం లేదని చెప్పడం చూస్తే, అతను అసమర్ధుడని పార్టీలో నేతలందరికీ తెలిసి ఉన్నప్పటికీ, సోనియా గాంధీకి భయపడి అందరూ ఆయన భజనలో తరించిపోయినట్లు స్పష్టమవుతోంది. కానీ ప్రజలు అతను ప్రధానిగా దేశాన్ని పాలించేందుకు అనర్హుడని సరిగ్గానే అంచనా వేశారు. కాంగ్రెస్ పార్టీ ఓటమికి అవినీతి, అసమర్ధత, అక్రమాలతో బాటు నాయకత్వ లక్షణాలు లేని రాహుల్ గాంధీని ప్రధానిగా చేయాలనుకోవడం కూడా ఒక కారణమని చెప్పవచ్చును.

 

 

ఇక దిగ్విజయ్ సింగ్ ఆరోపణల విషయానికి వస్తే “రాహుల్ గాంధీకి దేశాన్ని పాలించేందుకు అవసరమయిన సామర్ధ్యం లేకపోయినప్పటికీ, ఆయన న్యాయం కోసం పోరాడటంలో దిట్ట. కానీ లోక్ సభలో పార్టీకి నాయకత్వ వహించకపోవడం మంచి నిర్ణయం కాదు,” అని దిగ్విజయ్ సింగ్ చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీలో సహజంగానే కలకలం సృష్టించాయి. దానికి దిగ్విజయ్ మళ్ళీ సంజాయిషీ ఇచ్చుకోవడం వంటివి షరా మామూలే. కానీ సాక్షాత్ దిగ్విజయ్ సింగ్ అంతటివాడు ఇటువంటి విమర్శలు చేయడం గమనిస్తే, రాహుల్ గాంధీ నాయకత్వం వహిస్తున్నంత కాలం పార్టీకి భవిష్యత్తు లేదని వారు కూడా నమ్ముతున్నట్లు అర్ధమవుతోంది. వచ్చే ఐదేళ్ళలో ప్రధాని నరేంద్ర మోడీ సమర్ధమయిన పరిపాలన అందించగలిగినట్లయితే, ఇక రాహుల్ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీకి శనిమహర్ధశ మొదలయినట్లేనని భావించవచ్చును. అయితే ఈ విషయాన్ని అందరికంటే ముందుగా దిగ్విజయ్ సింగ్ పసిగట్టడమే చాలా నవ్వు తెప్పిస్తుంది.

By
en-us Political News

  
దేశంలో ఎన్నికల ప్రక్రియ అనగానే కేవలం ఓటింగ్, ఫలితాలే గుర్తొస్తాయి.
పార్టీ కార్యకర్తలపై నమోదైన కేసుల విషయంలో ఆయన నేరుగా రంగంలోకి దిగి వారికి భరోసా కల్పించారు. కార్యకర్తల సంక్షేమం కోసం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయడం ద్వారా, పార్టీ అంటే కేవలం ఎన్నికల యంత్రాంగం మాత్రమే కాదు, ఒక కుటుంబం అనే భావనను ఆయన పాదుకొల్పారు. ఈ నేపథ్యంలోనే ఆయనకు వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు ఇవ్వడం సరైన నిర్ణయమని పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
అమెరికా-ఇరాన్ మధ్య ఒక చారిత్రాత్మక ఒప్పందం కుదిరేందుకు కేవలం అంగుళాల దూరం మాత్రమే మిగిలి ఉన్న పరిస్థితుల్లో, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు రంగంలోకి దిగడంతో పరిస్థితులు తలకిందులయ్యాయి. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌తో నెతన్యాహు జరిపిన టెలిఫోన్ సంభాషణ తర్వాత చర్చల గమనం పూర్తిగా మారిపోయింది.
బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన కవిత.. సొంత రాజకీయ పార్టీ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్న వేళ, ఆమె ప్రారంభించబోయే పార్టీ పేరుపై గత కొంత కాలంగా రాజకీయవర్గాలలో పెద్ద ఎత్తున చర్చ సాగింది. కల్వకుంట్ల కవితకు తెలంగాణ సమాజంలో ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చిన తెలంగాణ జాగృతి పేరునే ఆమె తన కొత్త పార్టీకి పెట్టబోతున్నట్లు మొదట్లో వార్తలు వినవచ్చినా.. కవిత తాజా వ్యాఖ్యలతో ఆమె టీఆర్ఎస్ పేరుతోనే కొత్త పార్టీ ఏర్పాటు చేయనున్నారన్న వాదనకు బలం చేకూరింది.
ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో పలు రాష్ట్రాల అధ్యక్షులతో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ భేటీకి ఏపీ బీజేపీ అధ్యక్షుడు మాధవ్, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావుతో పాటు ఇరు రాష్ట్రాల ఇన్‌చార్జ్ కార్యదర్శులు హాజరయ్యారు. పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టడాని ముందు ఉన్న గడువులో అన్ని రాష్ట్రాలలో మహిళా మోర్చా ఆధ్వర్యంలో కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు.
ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో భారీ ఎత్తున అక్రమాలు జరిగినట్లు ప్రాథమిక విచారణలో స్పష్టమైంది. సుమారు 125 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన ఆడుదాం ఆంధ్రలో 40 నుండి 60 కోట్ల రూపాయల మేర అక్రమాలు జరిగాయని అంటున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న సీ షోర్ హైవే ప్రాజెక్టుతో పాటు, రాజధాని అమరావతిని అనుసంధానిస్తూ కేంద్ర ప్రభుత్వం చేపట్టిన హై-స్పీడ్ రైల్ కారిడార్లు రాష్ట్ర ప్రగతికి కొత్త వేగాన్ని తీసుకువచ్చాయి. తీర ప్రాంత అభివృద్ధిని, రాజధాని రవాణా సౌకర్యాలను ఏకకాలంలో మెరుగుపరచడమే లక్ష్యంగా ఈ భారీ ప్రాజెక్టులు రూపుదిద్దుకుంటున్నాయి.
పొంగులేటి ప్ర‌స్తుతం మంత్రిగా నిర్వహిస్తున్న మైనింగ్ శాఖ‌, గ‌తంలో కేటీఆర్ నిర్వ‌హించ‌గా.. ఆ స‌మ‌యంలో ఎన్ని అక్ర‌మాలు జ‌రిగాయో.. ఎన్నేసి అరాచ‌కాలు న‌డిచాయో.. గ‌త అసెంబ్లీ స‌మావేశాల్లో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి చ‌దివి వినిపించిన సంగ‌తి తెలిసిందే. వీటిపై సీబీసీఐడీ ఎంక్వ‌యిరీ కూడా వేస్తామ‌ని సీఎం ప్ర‌క‌టించిన సంగ‌తీ విదిత‌మే. ఈ అక్ర‌మాల్లో త‌న సోద‌రుడి ప్ర‌మేయం కూడా ఉండ‌టంతో.. ఉలిక్కి ప‌డ్డ హ‌రీష్ రావు, ఈ శాఖామాత్యుడైన‌ పొంగులేటిని త‌న టార్గెట్ గా ఫిక్స్ చేసిన‌ట్టు స‌మాచారం.
ది ఉద్యోగాల కోసం వంద‌లాది మంది ఫీజులు క‌ట్టి మ‌రీ రాస్తుంటే ఆ వ‌చ్చే ప‌ది ఉద్యోగాలు పొందిన వారినుంచి ఫీజు వ‌సూళ్ల‌ వ‌ర‌కూ ఓకే.. మిగిలిన అంద‌రి ఫీజులు వాప‌స్ ఎందుకివ్వ‌ర‌ని ప్రశ్నించారు. అంతే కాదు సామాన్యుడి త‌రఫున కూడా విలక్షణ శైలిలో తన గళమెత్తుతున్నారు. టికెట్ కొని కూడా రైల్లో ఒక సాధార‌ణ ప్ర‌యాణికుడు నిల‌బ‌డి ప్ర‌యాణించాల్సి పరిస్థితి ఏంటి? వంటి ప్ర‌శ్న‌లతో రాఘవ్ చద్దా సోషల్ మీడియాలో తెగ ట్రెండింగ్ అయ్యారు.
గుజరాత్ రాజధాని కోసం లక్షల కోట్లు ఖర్చు చేసిన కేంద్రం, ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో 12 ఏళ్లు ఎందుకు తాత్సారం చేసిందంటూ కేంద్రాన్ని నిలదీశారు. అమరావతి బిల్లు ఆమోదం పొందడం అనేది.. ప్రభుత్వ విజయం కాదు, ఐదేళ్ల పాటు రోడ్లపై పోరాడిన అమరావతి రైతులు, మహిళలు సాధించిన విజయంగా అభివర్ణించారు రేణుకా చౌదరి. సభలో అడ్డంకులు కలిగించిన ఇతర ఎంపీలపై తనదైన శైలిలో పంచ్ డైలాగులు విసురుతూ, తెలుగు వారి ఆత్మగౌరవాన్ని ఢిల్లీ వీధుల్లో తాకట్టు పెట్టకండి అని గర్జించారు.
జగన్ రెడ్డి హేతురహిత రాజధాని ప్రతిపాదనపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అమరావతికి పార్లమెంట్ చట్టబద్ధత కల్పిస్తూ నిర్ణయాలు తీసుకుంటున్న వేళ.. జగన్ రాష్ట్ర అసెంబ్లీలో ఆ చట్టాన్ని సవరించవచ్చంటూ కొత్త రాగం అందుకోవడాన్ని ఆయన అవగాహనా రాహిత్యానికి నిలువెత్తు నిదర్శనంగా పరిశీలకులు అభివర్ణిస్తున్నారు.
అమరావతి విషయంలో సిఎం చంద్రబాబు నాయుడు చాలా తప్పులు చేశారనీ, అవినీతికి పాల్పడుతున్నాననీ గత రెండు రోజులుగా వైసీపీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలకు జగన్ ఈ ప్రెస్ మీట్ లో వంత పాడారు. ఓ పక్క అమరావతికి వ్యతిరేకం కాదంటూనే వైసీపీ నేతలతో శ్రీకాకుళంలో సభ ఏర్పాటు చేయించారు.
2026 బడ్జెట్ ప్రతిపాదనల ప్రకారం, కొత్త పన్ను విధానంలో రూ.7 లక్షల వరకు ఆదాయం ఉన్నవారికి ఎలాంటి పన్ను ఉండదు. సెక్షన్ 87A కింద రిబేట్ కలిపి.. వీరికి వెస‌లుబాటు ఉంటుంది. స్టాండ‌ర్డ్ డిడ‌క్ష‌న్ విష‌యానికి వ‌స్తే.. జీత‌భ‌త్యాలు పొందేవారికి ఇచ్చే స్టాండ‌ర్డ్ డిడ‌క్ష‌న్ ప్ర‌యోజ‌నాలు ఈ కొత్త విధానంలో కూడా కొన‌సాగుతాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.