ఈ ఫలితాలు కూడా ఆ లెగ్గు మహత్యమేనట!

Publish Date:Dec 8, 2013

Advertisement

 

దేశంలో ఎప్పుడు ఎక్కడ ఎన్నికలు జరిగినా కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే, అందుకు పార్టీని తప్పుపట్టకుండా,అది అభం శుభం తెలియని రాహుల్ గాంధీ ‘ఐరన్ లెగ్’ మహత్యమేనని జనాలు అవాకులు చవాకులు వాగుతుంటారు. ఏమంటే ఆయన బీహార్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలలో పార్టీకి మంగళ హారతి ఇచ్చేయలేదా? గుజరాత్ లో పార్టీని పక్కనున్న అరేబియా సముద్రంలో ముంచేయలేదా? అంటూ ఏవో చెత్త చెత్త రికార్డులన్నీ తిరగేసి చూపుతుంటారు. కానీ, ఏ ఒక్కరూ కూడా ఆయన కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీని ఒంటి చేత్తో ఏవిధంగా గెలిపించారో మాత్రం ప్రస్తావించరు.

 

ఒకవేళ ఈ పామర జనాలకి అది గుర్తు చేసి ఆయన గొప్పదనం గురించి చెప్పబోయినా, “ఆ..అక్కడ గనుల గాలి జనార్ధన్ రెడ్డి, ఎడ్యురప్పల దెబ్బకి బీజేపీ ఓడిపోయిందని కానీ అదేమి ఆయన గొప్పదనం కాదని వితండ వాదనలు చేస్తారు. మరి ‘ఐరెన్ లెగ్గు.. ఐరెన్ లెగ్గు’ అని వెక్కిరించేవారు మరి కర్ణాటకలో ఆ లెగ్గు మహత్యం ఎందుకు కనబడలేదో చెప్పమంటే మాత్రం జవాబు చెప్పరు. కానీ “ఇదిగో ఇప్పుడు చూసారు కదా... నాలుగు రాష్ట్రాలలో లెగ్గు మహత్యం. ఆయన అడుగుపెట్టిన రాష్ట్రాలలో ఒక్కటంటే ఒక్క రాష్ట్రంలోనయినా కాంగ్రెస్ గెలిచిందా?” అని ఎదురు ప్రశ్నిస్తారు.

 

“సరే! ఆయన లెగ్గుకే నిజంగా అంత మహత్యం ఉంటే మరి నిత్యం ఆయన పాదదూళితో పునీతమయిపోతున్నడిల్లీలో కాంగ్రెస్ పార్టీ గత 15సం.లుగా గెలుస్తూనే ఉంది కదా?” అని ప్రశ్నిస్తే, ఒక వెర్రి నవ్వు నవ్వి “చరిత్రలొద్దు..చెప్పింది విను” అంటూ 125సం.ల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీని నిన్నగాక మొన్న పుట్టిన ఒక అమ్ ఆద్మీ చీపురు పట్టుకొని బయటకి ఊడ్చిపడేసినా ఇంకా లెగ్గు మహత్యం అర్ధం కాకపోతే నీకీ రాజకీయాలేందుకు ఈ చర్చలు ఎందుకు?” అంటూ నిలదీస్తారు. అంతే తప్ప పాపం అభం శుభం తెలియని ఆ రాహుల్ బాబు లెగ్గుకి నిజంగా అంత పవర్ లేదంటే ఎవరూ వినిపించుకోరు, కనీసం నమ్మను కూడా నమ్మరు.

 

పైగా “ఇప్పుడే ఏమి చూసారు? 2014ఎన్నికలలో బాబు లెగ్గు మహత్యం మీరే చూద్దురు గాని” అంటూ వెర్రి వెర్రి కూతలు కూస్తుంటారు. “ప్రస్తుతం తెలుగు గడ్డకి ఆయన లెగ్గు సోకే భాగ్యం లేకపోయినా, కాంగ్రెస్ నేతలు తమ శిరస్సున పూసుకోస్తున్న ఆయన పాదధూళి తగిలినంత మాత్రాన్నేఎన్నికలకు ఇంకా ఆరు నెలల ముందే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ఎలా ఊడ్చుకుపోతోందో చూసారా?” అని వెక్కిరింపు ఒకటీ.

 

ఇక ఆయన ఎన్నికల ప్రచారం కోసం రాష్ట్రంలో అడుగుపెట్టకబోతారా? మేము గెలవక పోతామా? అని రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీలు ఆయన మీదే గంపెడు ఆశలు పెట్టుకొని ఆయన పాదధూళి కోసం అహల్యా దేవిలా ఎదురుచూస్తున్నాయి. అయినా వచ్చేఎన్నికల తరువాత ఆయన ప్రధాని కుర్చీలో లెగ్గు మీద లెగ్గేసుకొని కూర్చొని దేశాన్నిపాలించేస్తుంటే చూడాలని సాక్షాత్ సోనియమ్మ, మన్మొహనులవారే ముచ్చట పడుతుంటే కాదనేనుందుకు ఈ వెర్రి జనాలెవరు?

 

కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు కాకపోయినా ఆంధ్రప్రదేశ్ నుండి డిల్లీ వరకు ఈ వీహెచ్, సర్వే,బొత్స,డీయస్, జానా వంటి అనేక మంది కాంగ్రెస్ నేతలున్నారు. వారందరూ ఎప్పుడూ రాహుల్, సోనియా అంటూ నిత్య పారాయణం, భజనలు చేయడమే తప్ప, వారిలో ఒక్కరు కూడా పాపం రాహుల్ బాబు లెగ్గు దోషం (మహత్యం) పోవడానికి చొరవ తీసుకొని ఏ రాహుకేతు పూజలో, నవగ్రహ పూజలో ఎప్పుడయినా చేసారా? అని పామర జనాలు నిలదీస్తున్నారు. అందుకే వారు ఏ మహాత్యమూ లేని పామరులయ్యారని జాలిపడటం తప్ప ఎవరు మాత్రం ఏమి చేయగలరు? అయినా ఏ మాటకామాటే చెప్పుకోవాలి. ఈ వెర్రి జనాలు ఆయన గురించి ఎన్ని అవాకులు చవాకులు వాగినా ఆయన లెగ్గు చాలా పవర్ ఫుల్ లెగ్ అని చచ్చినట్లు ఒప్పుకొంటున్నారు.

By
en-us Political News

  
కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చి రెండేళ్లయిన ఎన్నికలు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఆరోపించారు.
బీజేపి రాజ్యాంగంలో లౌకిక పదం తొలగిస్తామనడం దారుణమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు
మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత కాకాని గోవర్ధన్ రెడ్డికి మరో ఎదురుదెబ్బ తగిలింది.
ఏది ఏమైతేనేం తెలంగాణలో మద్యం అమ్మకాలు కొత్త రికార్డు సృష్టించాయి. విశేషమేంటంటే.. ఇంతటి చలిలోనూ కూడా బీర్ల అమ్మాకాలు కూడా జోరుగా సాగాయి.
తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టిన తరువాత దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల జాబితాలో ఏపీ అగ్రపీఠిన నిలుస్తోంది. 2025-26 ఆర్థిక సంవత్సరం తొలి మేమూడు నెలల్లోనే రాష్ట్ర వృద్ధి10.5 శాతంగా ఉంది.
రీసెంట్ గా తెలంగాణ‌లో తీన్మార్ మ‌ల్ల‌న్న తెలంగాణ రాజ్యాధికార పార్టీని ఏర్పాటు చేశారు. అలాగే ఏపీ కేంద్రంగా మరో కొత్త పార్టీ ఆవిర్భవించనున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.
బీఆర్‌ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
భార‌త్ పర్యటనకు వ‌చ్చినపుడు రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇంట‌ర్వ్యూలో కొన్ని ఆస‌క్తిక‌ర‌మైన విషయాలు తెలిపారు
ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ తెరమీదకు తీసుకువచ్చారు. ఇదే విషయాన్ని చంద్రబాబు దృష్టికీ తీసుకువెళ్లారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని చంద్రబాబు నాయకత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా అమరావతి రాజధాని అన్న చట్టబద్ధత అవసరమని భావించింది. దీంతో ఇదే విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకువెళ్లింది.
ప్రజా సమస్యలపై ఆ పార్టీ ఎలా స్పందిస్తోంది. వాటి పరిష్కారం దిశగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చేందుకు ఆ పార్టీ చేపడుతున్న కార్యక్రమాలు ఏమిటి? ప్రజల పక్షాన నిలబడేందుకు ఆ పార్టీ నేతలు ముందుకు వస్తున్నారా? వంటివన్నీ జనం గమనిస్తారు.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వర స్వామి వారికి భక్తులు ఇచ్చిన కానుకలను దొంగిలించడమంటే మహాఘోరం, క్షమించరాని నేరం. తాము శ్రీవారికి భక్తుతో సమర్పించిన కానుకలు చోరీ అవుతున్నాయంటే భక్తుల మనోభావాలు దెబ్బతింటాయి కూడా.
అన్నదమ్ములు, తల్లీ కుతుళ్లు, తోడికోడళ్లు ఒకరిపై ఒకరు పోటీ చేయడానికి సై సంటే సై అంటున్న ఉదంతాలూ ఉన్నాయి. నల్గొండ జిల్లా చిట్యాల మండలం ఏపూరులో ఒకే వార్డు నుంచి తల్లి, కూతురు నామినేషన్లు వేశారు.
తెలుగు వన్. దక్షిణాదిలో మాత్రమే కాదు యావత్ భారత దేశంలోనే యూట్యూబ్ ప్లాట్ ఫామ్ లో తొలి వీడియో అప్ లోడ్ చేసిన వన్ అండ్ ఓన్లీ డిజిటల్ ప్లాట్ ఫామ్. డిజిటిల్ మీడియా రంగంలో తెలుగు వన్ తన పాతికేళ్ల ప్రస్థానంలో చేయని ప్రయోగముందా? అన్న పేరుంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.