Publish Date:May 19, 2025
ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం గుట్టు రట్టౌతోంది. ఈ కుంభకోణంలో నిప్పులాంటి నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. దర్యాప్తులో భాగంగా వాస్తవాలను నిర్భయంగా బయటపెడుతున్నారు బాధితులు.
Publish Date:May 19, 2025
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతున్నది. వేసవి సెలవులు ముగింపు దశకు వస్తుండటంతో తిరుమలేశుని దర్శనానికి భక్తులు పోటెత్తుతున్నారు.
Publish Date:May 19, 2025
భారత్ నుంచి అమెరికాకు వెళ్లిన 15 మామిడి పండ్ల షిప్ మెంట్ లను దేశంలోని వివిధ ఎయిర్ పోర్టుల్లో అధికారులు నిలిపివేశారు. సరైన పత్రాలు లేవనే కారణం చూపుతూ వాటిని దేశంలోకి అనుమతించకుండా అడ్డుకున్నారు. వీటి విలువ 5 లక్షల అమెరికా డాలర్లు.
Publish Date:May 19, 2025
ఇప్పటికే ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక టోర్నీలు జరగట్లేదు. ఇకపై ఇతర అంతర్జాతీయ టోర్నీల్లో కూడా పాక్తో తలపడొద్దని బీసీసీఐ నిర్ణయించినట్టు తెలుస్తోంది. పాక్ను ఏకాకిని చేసే వ్యూహంతో ఈ నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం.
Publish Date:May 19, 2025
బీఆర్ఎస్ లో తలెత్తిన సంక్షోభం సర్దు మణిగిందా? అంటే గులాబీ పార్టీ నేతలు అవుననే అంటున్నారు. పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు మధ్య తలెత్తిన వారసత్వ లేదా నాయకత్వ వివాదం ప్రస్తుతానికి సర్డుమణిగినట్లే అంటున్నారు బీఆర్ఎస్ పార్టీకి చెందిన ముందుతరం నేతలు.
Publish Date:May 19, 2025
పార్టీ బతికి బట్టకట్టాలంటే మోడీయే దిక్కు అంటున్న వైసీపీ సీనియర్లు
వైసీపీ బతికి బట్టకట్టాలంటే మోడీని శరణు జొచ్చడం వినా మరో మార్గం లేదని వైసీపీ సీనియర్లు భావిస్తున్నారా?
Publish Date:May 18, 2025
పాతిక వసంతాలు దిగ్విజయంగా పూర్తి చేసుకున్న తెలుగువన్ రజతోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, ఏపీ డ్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ రాజు, తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రాజ్యసభ మాజీ సభ్యుడు కంభంపాటి రామ్మోహన్ రజతోత్సవ సభకు నిండుదనం తెచ్చారు
Publish Date:May 18, 2025
తెలుగువన్ డిజిటల్ మీడియా ప్రయాణం 2000 సంవత్సరంలో ప్రారంభమై నేడు 400 ఛానల్స్తో ప్రతి దేశంలో ఉందంటే అందదుకు రవిశంకర్ కృషి, పట్టుదలే కారణమన్న చంద్రబాబు.. తాను విజన్ రూపొందిస్తే దానికి సమానంగా ఆయన కూడా ఛానల్ అభివృద్ధిలో విజన్ రూపొందించుకుని ముందుకెళ్తున్నారన్నారు.
Publish Date:May 18, 2025
హైదరాబాద్లో మరో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. మైలార్దేవ్పల్లిలో ఒక మూడంతస్తుల భవనంలో అగ్ని ప్రమాదం సంభవించింది. సకాలంలో ఘటనా స్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది బాధితులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు.
Publish Date:May 18, 2025
తెలుగుదేశం పార్టీ నాయకుడిపై వైసీపీ నేత, మాజీ ఎంపీ నందిగం సురేష్ దాడికి పాల్పడ్డాడు. రాజధాని పరిధిలోని ఉద్దండరాయుని పాలెంలో టీడీపీ నేత రాజుపై నిన్న రాత్రి నందిగం సురేష్, అతని అన్న ప్రభుదాసు దాడికి పాల్పడ్డారు
Publish Date:May 18, 2025
హైదరాబాద్ గుల్జార్ హౌస్లో జరిగిన అగ్ని ప్రమాదంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. ప్రమాద వివరాలు తెలిసి అత్యంత షాక్కు, బాధకు గురయ్యానని ఆయన తెలిపారు.
Publish Date:May 18, 2025
హైదరాబాద్ గుల్జార్హౌస్ అగ్నిప్రమాదంపై ఏపీ సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అమాయక ప్రజలు చనిపోవడం బాధాకరమని ముఖ్యమంత్రి ఎక్స్ ద్వారా తెలిపారు. బాధిత కుటుంబాలకు సంతాపం తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
Publish Date:May 18, 2025
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు దర్శించుకున్నారు. ఈ తెల్లవారుజామున సుప్రభాత సేవ ముగిసిన తర్వాత వీఐపీ వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో మాజీ ప్రధాని హెచ్.డి.దేవెగౌడ, కర్ణాటక మాజీ మంత్రి హెచ్.డి రేవణ్ణ, కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి, ఇండియన్ క్రికెట్ టీమ్ హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, నటి ఐశ్వర్య రాజేష్, నటుడు వైభవ్, ఆది పినిశెట్టి ఆయన సతీమణి నిక్కీ గల్రాని శ్రీవారి సేవలో పాల్గొన్నారు.