ఓటు చోర్ ఆందోళన... అసలు లక్ష్యం అదేనా?

Publish Date:Aug 18, 2025

Advertisement

 

కాంగ్రెస్ పార్టీ అధినాయకుడు, లోక్ సభలో, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అన్నంత  పనిచేశారు. ఆటం బాంబు పేలుస్తా అన్నారు. పేల్చారు. భారత ఎన్నికల సంఘం, ప్రధాని మోదీ, బీజేపీలతో కుమ్ముక్కై,’ఓట్ల చోరీ’ కి పాల్పడిందని ఆరోపించారు. ఆరోపించడమే కాదు,  దేశ రాజధాని ఢిల్లీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఇవిగో ఆధారాలు అంటూ, పవర్ పాయింట్ ప్రెజెంటేషన’, ద్వారా అవునా, నిజమా, నిజంగానే ఓటు చోరీ జరిగిందా, అనిపించేలా ప్రెజెంటేషన్ ఇచ్చారు. సంచలన వ్యాఖ్యలు, విమర్శలు చేశారు. అలాగే, కర్ణాటక  రాజధాని బెంగుళూరులో మరో స్టేజి షో నిర్వహించారు. 

ఈ సందర్భంగా రాహుల్ గాంధీ, ఓటర్ల జాబితాలో చోటు చేసుకున్న అవకతవకలు, అక్రమాల గురించి కొన్ని నిర్దిష్ట ఆరోపణలు చేశారు.అయితే ఆయన చేసిన ‘నిర్దిష్ట’ ఆరోపణల్లో,  ‘నిర్దిష్ట’ నిజాలు ఉన్నాయా లేవా, అనేది నిగ్గు తేలాలంటే, రాహుల్ గాంధీ, తాను చేసిన   ఆరోపణలను నిరూపించే సాక్ష్యాదారాలతో ప్రమాణ పత్రాన్ని దాఖలు చేయాలని, ఎన్నికల సంఘం, కోరింది. రిజిస్ట్రేషన్ ఆఫ్ ఎలక్టోరల్ రూల్స్ 1960 లోని, రూల్ 20 (3)(b) కింద, ప్రమాణం చేసి,అఫిడవిట్’ దాఖలు చేయమని కోరుతూ,కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ), కర్ణాటక చీఫ్ ఎలక్షన్ఆఫీసర్ ద్వారా,రాహుల్ గాంధీకి, వర్తమానం పంపింది. ఎదుకో ఏమో కానీ, రాహుల్ గాంధీ ప్రమాణ పత్రాన్ని ఇచ్చేందుకు ససేమిరా అంటున్నారు. 


అయితే. రాహుల్ గాంధీ చేసిన చేస్తున్న నిర్దిష్ట ఆరోపణల్లో నిజం ఉన్న లేకున్నా, ఆయన ప్రస్తావించిన ఎన్నికల అవకతవకలు జరగడమే లేదని అనుకుంటే అది అత్మవచనే అవుతుంది. నిజానికి, 1952లో జరిగిన తొలి సార్వత్రిక ఎన్నికల మొదలు, 2024 సార్వత్రిక ఎన్నికల వరకు, పంచాయతీ మొదలు పార్లమెంట్ వరకు రాహుల్ గాంధీ ప్రస్తావించిన ఎన్నికల అక్రమాలు అవకతవకలు జరగని ఎన్నిక ఇంత వరకు జరగలేదు. ఎక్కడిదాకానో ఎందుకు, 2023లో కాంగ్రెస్ పార్టీ గెలిచిన, తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో 22 లక్షల ఓట్లు రద్దయినట్లు, కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ అనేక సందర్భాలలో  ఆరోపించారు.

ఆయన పోటీ చేసి, ఓడిపోయినా తుంగతుర్తి అసెంబ్లీ నియోజక వర్గంలలోనూ పెద్ద ఎత్తున వేల సంఖ్యలో ఓట్లు గల్లంతు అయ్యాయని దయాకర్’ కోర్టుకు వెళ్లారు. ఆ కేసు ఇంకా ఇప్పటికీ నడుస్తోంది. అలాగే, మాజీ ఎమ్మెల్సీ రాజకీయ  విశ్లేషకులు, ప్రొఫెసర్ నాగేశ్వర్’ బల్క్ ఓట్లకు సంబంధించి  ఒకే గదిలో పదుల సంఖ్యలో గ్రాడ్యుయేట్ ఓటర్లు ఉన్న స్వీయ అనుభవాన్ని, ఒక ఇంటర్వ్యూ లో వివరించారు.
 సో .. రాహుల్ గాంధీ ప్రస్తావించిన దొంగ ఓట్లు, బల్క్ ఓట్లు, డ్యూయల్ ఓట్లు, చనిపోయినవారికి ఓటు హక్కు కొనసాగడం, బతికున్న వారికీ ఓటు లేక పోవడం వంటి సవాలక్ష  అవకతవకలు, అక్రమాలు, ఎన్నికల సంఘం పురుడు పోసుకోక ముందు నుంచి ఉన్నవే. ఆనవాయితీగా వస్తున్నావే. కాంగ్రెస్, బీజేపీ, లేదా మరో పార్టీ ఏపార్టీ అధికారంలో ఎవరున్నా, ప్రధాన ఎన్నికల అధికారిగా,అలనాటి శేషన్’ ఉన్నా ఈనాటి జ్ఞానేశ్ కుమార్’  ఉన్నా, అవకతవకలు అక్రమాలు జరగని ఎన్నికలు ఇంతవరకు జరగలేదు. 

అప్పుడు ఇప్పడు జరిగే తప్పులు జరుగుతూనే ఉన్నాయి.అప్పుడే జరిగాయి, ఇప్పడు లేవు అనుకున్నా, అప్పుడు లేవు ఇప్పుడు ఉన్నాయి అనుకున్నా,అది ఆత్మవంచన, పరనింద అవుతుందే కానీ, నిజం మాత్రం కాదు. నిజానికి,ఈవిషయంలో ఎదుటి వారిపై ఒక వేలు చూపిస్తే, నాలుగు వేళ్ళు మన వైపు చూపిస్తాయి. ఇప్పడు జరుగుతున్నది కూడా, కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ బీజేపీ వైపు, మోదీ వైపు వేలు చూపితే, బీజేపీ కాంగ్రెస్ వైపు వేలు చూపుతుంది. ఒక విధంగా గొంగళిలో తింటూ వెంట్రుకలు ఏరుకోవడం ఎలా ఉంటుందో, ఇలా పరస్పరం ఆరోపణలు చేసుకోవడం కూడా అంతే.. అయితే ఈ రాజకీయ క్రీడలో రాజకీయ పార్టీల ప్రతిష్ట మాత్రమే కాదు, అతి పెద్ద ప్రజాసామ్య దేశంగా ప్రపంచ దేశాల్లో మన దేశానికి, ఎన్నికల నిర్వహణలో, ‘ది బెస్ట్’  అన్న కితాబు పొందిన మన ఎన్నికల వ్యవస్థ ప్రతిష్టను కూడా దిగజార్చి వేస్తోంది. అదే అసలు విషాదం.


అయినా, కాంగ్రెస్ నాయకుడు,లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ,ఇతర విపక్ష పార్టీల నాయకులు, బీహార్ ఎస్ఐఆర్’, కర్ణాటకలోఓట్ల గోల్ మాల్’ వ్యవహారాన్నికలగాపులగం చేసి, ప్రజల్లో అపోహలను సృష్టించే ప్రయత్నం, గందరగోల చేసే ప్రయత్నం చేస్తున్నారు. మరోవంక, బీహార్’ లో ‘ఓటర్ అధికార యాత్ర’ పేరిట... రాహుల్ గాంధీ యాత్ర సాగిస్తున్నారు.సవాళ్ళు విసురుతున్నారు. ఎన్నికల సంఘం స్పష్టమైన సంధానాలు ఇచ్చినా, మళ్ళీ మళ్ళీ అవే ఆరోపణలు చేస్తున్నారు. 

ఈ నేపధ్యంలో కేంద్ర ఎన్నికల నఘం, రాహుల్ గాంధీ, ఇతర విపక్ష పార్టీలు చేస్తున్న ఆరోపణలపై ఘాటుగా స్పందించింది.అంతే కాదు, విపక్షాలు చేస్తున్న ఆరోపణలను నిరూపించే సాక్ష్యాదారాలతో ప్రమాణ పత్రాన్ని దాఖలు చేయాలని, లేదంటే, దేశానికి క్షపణ చెప్పాలని ఎన్నికల ప్రదానాధికారి, జ్ఞానేశ్ కుమార్’ ఆదివారం డిమాండ్ చేశారు.అందుకు ప్రతిగా విపక్షాలు,’ ప్రధాన ఎన్నికల కమిషనర్‌పై పార్లమెంటులో అభిశంసన ప్రక్రియ ప్రారంభించేందుకు ప్రయత్నిస్తున్నట్టు వార్తలు వెలువడుతున్నాయి. ఈ రాజకీయ క్రీడలో అంతిమంగా ఏమి జరుగుతుంది

By
en-us Political News

  
పార్టీ అధినేత కేసీఆర్ త‌ర్వాత అంత‌టి వాడిగా.. ఆయన పొలిటిక్ వారసుడిగా కేటీఆర్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు. అయితే ఆయన పార్టీ కార్యనిర్వాహక అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తరువాత జరిగిన ఏ ఎన్నికలోనూ పార్టీ విజయాన్ని నమోదు చేసింది లేదు.
తెలుగుదేశం కూటమి ప్రభుత్వంలో నంబర్ 1, 2, 3 అంటూ హైరాక్కీని బట్టి చూస్తే లోకేష్ మూడో స్థానంలో ఉన్నారు. జనసేనాని, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు తరువాత రెండో స్థానంలో ఉన్నారని చెప్పాల్సి ఉంటుంది. అయితే ఈ హైరాక్కీని దాటి త్వ‌ర‌లో లోకేష్ కి ముఖ్య‌మంత్రి ప‌ద‌విని అప్ప‌గించేందుకు గ్రౌండ్ వర్క్ జరుగుతోందా అన్న అనుమానాలు పొలిటికల్ సర్కిల్స్ లో వ్యక్తం అవుతున్నాయి.
లోక్ సభలో కాంగ్రెస్ సంఖ్యా బలం 400కు మించి ఉన్న సందర్భాలు ఉన్నాయి. కానీ అప్పుడెవ‌రూ కాంగెస్ ని ఓట్ చోరీ అంటూ ఎగ‌తాళి చేయ‌లేదు. ఎవ‌రి క‌ష్టం వారు ప‌డుతూ.. ప్ర‌జ‌ల్ని మెప్పించే ప‌ని మాత్ర‌మే చేస్తూ వ‌చ్చేవార‌మ‌ని తాజాగా మాజీ ప్ర‌ధాని దేవెగౌడ‌ వ్యాఖ్యానించారు.
అసలింతకీ ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యాన్ని ఒక్క చంద్రబాబు కాదు, కేంద్ర ప్రభుత్వం సహా అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలూ అనుసరిస్తున్నాయి. ఈ పీపీపీ విధానం వల్ల ఎటువంటి నష్టం లేదని కేంద్ర విత్తమంత్రి నిర్మలా సీతారామన్ ఢంకా బజాయించి మరీ చెబుతున్నారు. ఎవరెంతగా చెప్పినా జగన్ మాత్రం తాను పట్టిన కుందేటికి మూడే కాళ్లన్నట్లు వ్యవహరిస్తున్నారు.
పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా, ప్రజాస్వామ్యబద్ధంగా నిర్వహించిన అధికారులను అభినందించిన ఆయన ఈ ఎన్నికలలో పార్టీ విజయం కోసం కష్టపడిన కార్యకర్తలకు, అలాగే పార్టీని ఆశీర్వదించిన ప్రజలకు కృతజ్ణతలు తెలిపారు.
ఈ పథకంలో ఉన్న లోపాలన సవరించి రాష్ట్రాల బాధ్యతను మరింత పెంచి పారదర్శకతను పెంచడమే లక్ష్యంగా చెబుతోంది. అయితే కాంగ్రెస్ మాత్రం మోడీ సర్కార్ ఉద్దేశాలను తప్పుపడుతోంది.
బీజేపీ ఉనికి రాష్ట్రంలో నామమాత్రంగానే మిగిలిందని ఈ ఎన్నికల ఫలితాలు తేల్చాయి. అవన్నీ పక్కన పెడితే ఈ పంచాయతీ ఎన్నికల మూడో విడతలో ఓ ఆసక్తికర విషయంపై తెలుగు రాష్ట్రాలలో చర్చ మొదలైంది.
ల్లమల సాగర్‌ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా తెలంగాణా జలవనరులశాఖ అధికారులు సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో చంద్రబాబు హస్తిన పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది.
ఉపాధి హామీ పథకం పేరు మార్పు అన్నది గ్రామీణ పేదల జీవనాధారంపై జరుగుతున్న దాడిగా ఎంపీలు అభివర్ణించారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ గత కొన్నేళ్లుగా ఉపాధి హామీ పథకానికి నిధులను నిలిపివేస్తూ, పనులను నిరాకరిస్తూ, గ్రామీణ ప్రజలు ఆకలితో అలమటించేలా చేస్తోందని ఆరోపించారు.
తెలంగాణలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ కార్యాలయాల ముట్టడికి టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ పిలుపు నిచ్చారు. ఈ నేపథ్యంలోనే అన్ని జిల్లా కేంద్రాల్లో బీజేపీ ఆఫీసుల వద్ద డీసీసీల నేతృత్వంలో కాంగ్రెస్ ధర్నాలకు దిగింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లో గాంధీ భవన్, బీజేపీ కార్యాలయాల వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు పెద్ద సంఖ్యలో మోహరించి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలూ జరగకుండా భద్రత ఏర్పాట్లు చేశారు.
జగనన్న వదిలిన బాణాన్ని అంటూ తన అన్న కోసం సుదీర్ఘ పాదయాత్ర చేసి, 2019 ఎన్నికలలో జగన్ విజయానికి తన వంతు దోహదం చేసిన చెల్లిని అధికారం చేపట్టిన తరువాత జగన్ దూరం పెట్టారు. ఆస్తుల పంచాయతీతో పాటుగా రాజకీయంగా తనకు పోటీ అవుతుందన్న భయంతోనే జగన్ షర్మిలను దూరంపెట్టారన్న ప్రచారం అప్పట్లో జోరుగా సాగింది.
మూడో దశలో బుధవారం (డిసెంబర్ 17) మొత్తం 4,159 స్థానాలకుఎన్నికలు జరిగితే ఏకగ్రీవాలతో కలిపి కాంగ్రెస్ మద్దతుదారలు 2,286 స్థానాలు గెలుచుకున్నారు. బీఆర్ఎస్ 1,142, బీజేపీ 242, ఇతరుఅు 479 సానాల్లో విజయం సాధించారు.
తెలంగాణ మూడో విడత పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ మద్దతుదారులు ప్రభంజనం సృష్టిస్తోంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.