Publish Date:May 27, 2025
బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బీఆర్ఎస్ అధినేత, సొంత తండ్రి అయిన కేసీఆర్ కు రాసిన లేఖ సృష్టించిన, సృష్టిస్తున్న రాజకీయ ప్రకంపణలు ఇప్పటిలో ఆగేలా లేవు. కవిత లేఖపై బీఆర్ఎస్ నుంచి ఎటువంటి స్పందనా లేదు. చివరాఖరికి కేసీఆర్ కూడా కవిత లేఖపై స్పందించడం అటుంచి, కన్న బిడ్డను ఆ లేఖ ఎందుకు రాశావు? ఏమైనా ఉంటే నేరుగా నాకే చెప్పొచ్చుగా అని మందలించిన పాపాన కూడా పోలేదు. లేఖ వెలుగులోకి వచ్చిన తరువాత ఇప్పటి వరకూ కుమార్తెతో ఆయన భేటీ అయినదే లేదు. అన్నిటికీ ఒకే మందు అన్నట్లుగా మౌనాన్నే ఆశ్రయించారు.
అటు కవిత కూడా తగ్గేదే లే అన్నట్లుగా తండ్రితో భేటీకి అసలు ప్రయత్నమే చేయలేదని తెలుస్తోంది. పైపెచ్చు ఆమె తన సొంత ఏర్పాట్లు చేసుకుంటున్నట్లుగా ఆమె చర్యల ద్వారా తెలుస్తోంది. తాజాగా ఆమె మంగళవారం (మే 27) జాగృతి సంస్థ ప్రతినిధులతో సమావేశమై సామాజిక తెలంగాణ సహా పలు అంశాలపై చర్చించారు. జాగృతి సంస్థ ద్వారా భవిష్యత్ లో చేపట్టాల్సిన కార్యక్రమాలపైనా చర్చ జరిగినట్లు తెలుస్తోంది.
ఇక కవిత లేఖ వెలుగు చూసి రోజులు గడిచిపోతున్నా కాంగ్రెస్, బీజేపీలు అదే లేఖ ఆధారంగా బీఆర్ఎ స్ పై విమర్శలు సంధిస్తున్నారు. తాజాగా బీజేపీ సీనియర్ నాయకుడు, ఎంపీ రఘునందనరావు ఏకంగా కవిత కొత్త పార్టీ ప్రారంభించబోతున్నారని చెబుతూ, ఆ పార్టీ ఆవిర్భావ తేదీ కూడా వెల్లడించేశారు. కవిత నేతృత్వంలో తెలంగాణలో జూన్ 2న మరో కొత్త రాజకీయ పార్టీ ఆవిర్భవించబోతోందంటూ జోస్యం చెప్పేశారు. సొంత పార్టీ పెట్టడమే కాకుండా కవిత రాష్ట్రంలో పాదయాత్ర కూడా చేయనున్నారని రఘునందనరావు అన్నారు.
రఘునందనరావు వ్యాఖ్యలతో మరో సారి కవిత భవిష్యత్ కార్యాచరణ ఏమిటన్న చర్చ మరో సారి జోరుగా సాగుతోంది. రఘఉనందనరావు చెప్పినట్లు కవిత కన్న తండ్రికి వ్యతిరేకంగా సొంత కుంపటి పెట్టుకుని రాజకీయ క్షేత్రంలో ఆయనతో తలపడటానికి రెడీ అయిపోయారా? కొత్త పార్టీ పేరు ఏమిటి? అన్న చర్చ జోరుగా సాగుతోంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/raghunandanarao-oredict-kavitha-launch-new-political-party-25-198797.html
సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్న ఆమంచి కృష్ణమోహన్.. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో చీరాల నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగి విజయం సాధించారు. ఈ తరువాత ఆయన తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చారు. అయితే.. 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీని వీడి, వైసీపీ పంచన చేరారు.
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రజా జీవితంలో అరుదైన మైలురాయిని చేరుకున్నారు.
ఈసీ ఆదేశాల మేరకు
కవిత తన టీఆర్ఎస్ పార్టీ పేరుకు ప్రత్యామ్నాయంగా మూడు పేర్లను ఈసీకి పక్షం రోజుల్లోగా సమర్పించాల్సి ఉంటుంది. నిర్దేశిత గడువులోగా మూడు ప్రత్యామ్నాయ పేర్లను సూచించకుంటే దరఖాస్తున్న మూసేస్తామని హెచ్చరించింది. అంతే కాకుండా టీఆర్ఎస్ పేరును కొనసాగించేందుకు అనుమతి ఉండదని విస్పష్టంగా పేర్కొంది.
ఆ పార్టీ ప్రధాన ఆరోపణ ఏంటంటే.. క్షేత్రస్థాయిలో తెలుగుదేశం పార్టీ అనుకూల సిబ్బందితో అర్హులైన వైసీపీ మద్దతుదారుల ఓట్లను ఉద్దేశపూర్వకంగా తొలగించేందుకు కుట్ర జరుగుతోందని. గతంలో అంటే.. 2014 నుండి 2019 మధ్య కాలంలో కూడా ఇలాగే పెద్ద ఎత్తున దొంగ ఓట్లను చేర్చారని, ఇప్పుడు తమ పార్టీకి అండగా నిలిచే ఓటర్లను లక్ష్యంగా చేసుకుని జాబితా నుండి తొలగిస్తున్నారని వైసీపీ ఆరోపిస్తున్నది.
పైకి వైసీపీతోనూ, జగన్ కోటరీతోనూ విసిగిపోయానని, అందుకే బయటకు వచ్చేశాననీ విజయసాయి చెబుతున్నా.. ఆయన మాటలూ చేతలూ అన్ని జగన్ కు ప్రయోజనం చేకూర్చడానికే అన్నట్లుగా ఉంటాయి. ఉంటున్నాయి.
విశాఖపట్నం పరిపాలన రాజధాని అన్న జగన్ విధానాన్ని ధర్మాన బలంగా ప్రజలలోకి తీసుకువెళ్లడానికి శతధా ప్రయత్నించారు. ఉత్తరాంధ్ర సెంటిమెంట్ను రగిలిస్తూ, గ్రామగ్రామాన సభలు, సమావేశాలు ఏర్పాటు చేసి ప్రచారం చేశారు. అదేమీ ఫలించలేదని 2024 ఎన్నికల ఫలితాలు తేల్చేశాయి.
వైసీపీ కోసం ఎంతగానో పరితపించిన ముద్రగడ.. కాపు రిజర్వేషన్ కోసం, కాపుల కోసం పోరాటం చేసి సంపాదించుకున్న ప్రాముఖ్యతనూ, ప్రతిష్టనూ..జగన్ కోసం ఔను కేవలం జగన్ కోసం వదులుకున్నారు. అటువంటి ముద్రగడ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ వెంటిలేటర్ పై చికిత్స పొందుతుంటే…జగన్ ఆయనను కనీసం పరామర్శించను కూడా పరామర్శించలేదు.
ఎన్నికల్లో ఘోర పరాజయంతో కేవలం 11 సీట్లకు పరిమితమైన తర్వాత, సరికొత్తగా మావిగన్ రాగం అందుకున్నారని విమర్శించారు.
పైపెచ్చు.. జిల్లాకు చెందిన పలువురు ముఖ్య నాయకులు జగన్ పాల్గొన్న కార్యక్రమాలకు ముఖం చాటేశారు. కొందరైతే తూతూమంతరంగా అలా వచ్చి, ఇలా వెళ్లిపోయారు.
ఆలా కిందపడిపోయిన పోలీసులు ఆ తరువాత కల్వకుంట్ల కవితతో దురుసుగా వ్యవహరించిన తీరు పట్ల సర్వత్రా నిరసన వ్యక్తం అవుతోంది. కవితను పోలీసులు పోలీస్ వాహనంలోకి దురుసుగా నెట్టేయడం సరికాదన్న భావన సర్వత్రా వ్యక్తం అవుతున్నది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయం ఎల్లప్పుడూ అత్యంత ఆసక్తికరమైన సంక్లిష్టమైన మలుపులకు వేదికగా నిలుస్తుంది.
ఉప్పల్లో ఈ రోజు తెలంగాణ ఉద్యమకారులు, మహిళల రక్తం చిందిందని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలు, ఉద్యమకారులపై పోలీసులు విచక్షణారహితంగా లాఠీఛార్జ్ చేశారని ఆరోపించారు.
ఈ అరెస్టు పై బీఆర్ఎస్ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. హరీష్ రావు అరెస్టు సందర్భంగా పోలీసులకు, బీఆర్ఎస్ శ్రేణులకు మధ్య తోపులాట జరిగింది. గురుకులాల్లో అవినీతి, రాష్ట్ర అప్పులపై గన్ పార్క్ వద్ద బహిరంగ చర్చకు సిద్ధమని మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్, అజారుద్దీన్.. బీఆర్ఎస్ నేతలు హరీశ్రావు, కేటీఆర్లకు సవాల్ విసిరారు.