Publish Date:Jul 19, 2022
ఇంగ్లీషువారు అందరికీ అంటగట్టింది క్రికెట్ పిచ్చి. దీనికి కులమతాలు, భాషా, దేశ, ప్రాంతీయ విభేదాలేమీ లేవు. క్రికెట్ అంటే చెవి కోసుకునేవారు, చదువును పక్కన పెట్టే వీరాభిమానులు అనేకమంది. అసలు దేశాల మధ్య విభేదాలను, ద్వేషభావాన్ని తొలగించే శక్తి క్రికెట్కే వుందని ఆమధ్య ఎవరో ఒక రాజకీయవేత్తే అన్నారు. ఇది నిజం. గతంలో పాక్తో భారత్ తలపడిన ప్రపంచకప్ పోటీలో భారత్ గెలిచినపుడు కెప్టెన్ ధోనీని నీ హెయిర్ స్టయిల్ బావుందయ్యా అన్నారు పాక్ ప్రధాని! అంతా ఆశ్చర్యంతో, ఆనందంతో నవ్వుకున్నారు. అలాంటిది ఇంగ్లండ్ లో ఈమధ్య జాతివివక్ష కామెంట్లు వినిపించి ఆ జాఢ్యం ఇంకా పూర్తిగా పోలేదన్నది నిరూపించింది.
ఆ మధ్య ఇంగ్లండ్ ఎడ్గ్బాస్టన్లో భారత్, ఇంగ్లండ్ టెస్టు మ్యాచ్ జరిగింది. మనవాళ్లు ఎక్కడున్నా ఒకేలా గోల చేస్తారుగదా. అలా భారత్ జట్టు వీరాభిమానుల సంఘం సభ్యులు అక్కడ స్టేడియంలో జాతీయ పతాకం వూపుతూ గోల గోల చేశారు. కారణం భారత్ బ్రహ్మాండంగా ఆడుతున్న సమయమది. భారత్ అనేకాదు, ఎవరి జట్టుకు వారి వీరాభిమానులు అలానే గోల చేస్తుం టారు. ఇది చాలా సహజ దృశ్యం. కానీ తెల్లవారికి మాత్రం ఇలాంటివి బొత్తిగా నచ్చవు. ఇప్పటికీ వారి మనసులు మలినమే. ఇంకా వారిలో జాతివివక్షత ఉంది. ఇలాంటి సమయంలో అది బయటపడుతుంది.
ఎడ్గ్బాస్టన్లో జరిగిన టెస్ట్ నాలుగో రోజు భారత అభిమానులమీద ఆంగ్లేయులు తిట్ల వర్షం కురిపించారు. స్టేడియంలోని హాలీస్ స్టాండ్ వేపు వున్న ఒక భారతీయ ప్రేక్షకుడిని జాతిపేర గట్టిగానే చాలా అసహ్యంగా దూషించాడు ఓ తెల్లవాడు. ఆ దూషణలు విన్న అతని కుటుంబం అక్కడి నుంచి బయటికి రావాల్సి వచ్చింది. అయితే ఇది గమనించిన మరి కొందరు ఇంగ్లీషు ప్రేక్షకులు మాత్రం ఆ కుటుంబం జాగ్రత్తగా స్టేడియం బయటికి వెళ్లేందుకు సహాయపడ్డారు.
కాగా ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు, వార్విక్షైర్ కౌంటీ క్రికెట్ క్లబ్ అధికారులు ఈ సంఘటన గురించి వాకబు చేసి ఆ వ్యక్తులపై తగిన చర్యలు తీసుకుంటామన్నారు. ఇది ఊహించనిదని దీన్ని మరీ పెద్దది చేయవద్దని అన్నారు. వారి దేశంలో జరిగింది గనుక వారికి ప్రతిష్టాభంగం కలగకుండా సంఘటనను తొక్కేశారు. ఇంతకంటే దారుణం మరొకటి వుండదు. ఈ రోజుల్లో కూడా ఇంకా ఇలాంటి సంఘటనలు జరగడం అనాగరికం. ప్రపంచ దేశాలు అభివృద్ధి పధంలో ముందడుగు వేస్తున్న కాలంలో ఇంగ్లండ్ లో ఇంకా ఇలాంటి ఆలోచనలు వుండడం మానవసమాజం హర్షించదు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/racial-discriminationyet-39-140050.html
టీవీకే అధినేత విజయ్కు కాంగ్రెస్ మద్దతు తెలపడంపై ఆగ్రహంగా ఉన్న డీఎంకే.. కాంగ్రెస్కు కటీఫ్ చెప్పేసింది. మారిన రాజకీయ పరిస్థితుల దృష్ట్యా, లోక్సభలో తమ పార్టీ సభ్యులకు కాంగ్రెస్ ఎంపీలతో కాకుండా విడిగా సీటింగ్ కేటాయించాలని డీఎంకే ఎంపీ కనిమొళి స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు.
తాజా సమాచారం ప్రకారం.. విజయ్ తన పార్టీకి ఉన్న బలానికి తోడుగా మరో మూడు పార్టీల మద్దతును కూడగట్టుకున్నారు. ఆ పార్టీల మద్దతుతో అధికారం చేపట్టడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 118ని ఆయన సాధించారు.
తమిళనాడులో ఇటీవల జరిగిన ఎన్నికల తర్వాత, విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవ్వగా.. మెజారిటీ నిరూపణ విషయంలో రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ కచ్చితమైన నిబంధనలు పాటించాలని పట్టుబడుతున్నారు. విజయ్ కు తన పార్టీ ఎమ్మెల్యేలు 107 మందికి అదనంగా కాంగ్రెస్ నుంచి గెలిచిన ఐదుగురు ఎమ్మెల్యేల మద్దతు కూడా ఉంది.
పదవి నుంచి తొలగించిన అనంతరం ఎస్వీఎస్ఎన్ వర్మ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. పార్టీ తీసుకున్న ఈ నిర్ణయం తనకు ముందే తెలుసని, నాయకత్వం నుంచి సమాచారం అందిందని చెప్పారు. అయితే పార్టీ కోసం ఎన్నో ఏళ్లుగా కష్టపడి.. క్షేత్రస్థాయిలో కేడర్ను కాపాడుకుంటూ వచ్చిన తనకు ఈ పరిణామం మనస్తాపానికి గురిచేసిందన్న ఆవేదన కూడా వ్యక్తం చేశారు.
బాబు కూటమిని ఎందుకంత విలువైనదిగా భావిస్తున్నారంటే.. కారణం వైసీపీ. ఆ పార్టీ కూటమి ఎప్పుడెప్పుడు చీలిపోతుందాని కాచుకుని కూర్చుని ఉంది. ఏ అవకాశం వచ్చినా వారు వదిలిపెట్టినట్టే కనిపించదు. మొన్న కోట వినుత ఘటన, నిన్న అరవ శ్రీధర్ వ్యవహారం, ఇవాళ వర్మ ఇష్యూ.. ఇలా సమయం దొరికినపుడల్లా ఆయా అంశాలను బాగా హైలెట్ చేసి.. కూటమిలో ఏదో ఒక చిచ్చు రాజేయాలని చూస్తోంది వైసీపీ అధినాయకత్వం.
అతి కొద్ది మంది నేతలు జగన్ ప్రకటనను సమర్దిస్తూ.. అనుకూల ప్రకటనలు చేస్తుండగా.. మెజారిటీ లీడర్, క్యాడర్ మాత్రం జగన్ నిర్ణయంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
తెలుగువన్ వాస్తవ వేదికలో ప్రస్తుత జాతీయ, ప్రాంతీయ రాజకీయ పరిస్థితులపై విస్తృత చర్చ జరిగింది.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆ రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనాన్ని సృష్టించాయి.
టీవీకే అధినేత విజయ్తో భేటీ అనంతరం రాజ్ భవన్ ఒక అధికారిక ప్రెస్ నోట్ విడుదల చేసింది. అసెంబ్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే ఉండాల్సిన సంఖ్యాబలంపై గవర్నర్.. విజయ్కు మార్గనిర్దేశం చేశారు. కేవలం అతిపెద్ద పార్టీగా ఉండటమే కాకుండా, సభలో తగినంత మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్నట్లు ఆధారాలు చూపాలని సూచించారు.
పిఠాపురంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో చంద్రబాబు ఫొటోలేదని ఆరోపిస్తూ.. మాజీ ఎమ్మెల్యే వర్మ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో జనసేన నేత, మాజీ ఎమ్మెల్యే దొరబాబు జోక్యం చేసుకోవడంతో వాగ్వాదం చోటు చేసుకుంది. వర్మ దురుసు వ్యాఖ్యలపై పార్టీలో అంతర్గతంగా చర్చించిన అధిష్టానం.. వర్మ వ్యవహారాన్ని తప్పుబట్టింది. ఇంతలోనే వర్మను ఇంచార్జ్ పదవి నుంచి తొలగించడం చర్చనీయాంశంగా మారింది.
రాష్ట్రంలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు డీఎంకే ఏ విధంగానూ అడ్డుపడబోదన్నారు. రాష్ట్రంలో మరోసారి ఎన్నికలు రావాలని గానీ, రాజ్యాంగ సంక్షోభం తలెత్తాలనీ కానీ తాము కోరుకోవడం లేదన్నఆయన.. ప్రజాతీర్పునకు అనుగుణంగానే డీఎంకే నడుచుకుంటున్నదన్నారు.
గతంలో విజయ్కు ఉన్న ప్రాణహాని హెచ్చరికలు.. ఆయన పాపులారిటీని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం సాయుధ పోలీసులతో కూడిన భద్రతను ఏర్పాటు చేసింది. అయితే.. తాజాగా నిర్వహించిన భద్రతా సమీక్షలో భాగంగా ఆయనకు ఇకపై అదనపు సెక్యూరిటీ అవసరం లేదని అధికారులు భావించినట్లు తెలుస్తోంది.
తాజా ఎన్నికల ఫలితాల్లో నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) 108 స్థానాలతో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించిన సంగతి తెలిసిందే. అయితే.. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 118 మంది ఎమ్మెల్యేల మద్దతు ఆ పార్టీకి ఇంకా లభించలేదు. కాంగ్రెస్తో కలిపి విజయ్ బలం ప్రస్తుతం 112కు చేరినప్పటికీ.. మేజిక్ ఫిగర్కు ఇంకా ఆరు అడుగుల దూరంలో ఉంది.