ఫార్ములా ఈ కార్ రేసు కేసులో కొత్త కొత్త విషయాలు బయటపడుతున్నాయి. ఫార్ములా ఈ కార్ రేస్ అవినీతిలో క్విడ్ ప్రొకో కోణం ఉందని తాజాగా వెలుగులోనికి వచ్చింది. ఫార్ములా ఈ కార్ రేసు కేసులో కీలకంగా ఉన్న గ్రీన్ కో కంపెనీ నుండి ఎలక్టోరల్ బ్యాండ్లు, చందాల రూపంలో బీఆర్ఎస్ కు రూ. 41 కోట్లు అందాయి. ఈ విషయాన్ని తెలంగాణ సర్కార్ బయటపెట్టింది. ఈ మొత్తాన్ని బీఆర్ఎస్ నగదు రూపంలో కాకుండా ఎలొక్టరోల్ బాండ్లు, పార్టీకి చందాల రూపంలో బీఆర్ఎస్ అందుకుందన్నది తెలంగాణ సర్కార్ ఆరోపణ.
అప్పటికి అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీకి క్రీన్ కో ఎన్నికల బాండ్ల రూపంలో రు. 41 కోట్లు చెల్లిం చిందని ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించింది. గ్రీన్ కో దాని అనుబంధ సంస్ధలు 41 సార్లు బీఆర్ఎస్ కు ఎన్నికల బాండ్ల రూపంలో చందాలు ఇచ్చినట్లు రేవంత్ సర్కార్ ప్రకటించింది. ఫార్ములా ఈ కార్ రేసుకు సంబంధించిన చర్చలు మొదలైనప్పటినుండి ఒక్కోటి కోటి రూపాయలు విలువచేసే ఎలక్టోరల్ బాండ్లు గ్రీన్ కో చెల్లించింది. 2022, ఏప్రిల్ 8వ తేదీనుండి అక్టోబర్ 10వ తేదీమధ్య గ్రీన్ కో కంపెనీ నుండి బీఆర్ఎస్ పార్టీకి బాండ్లు అందినట్లు ప్రభుత్వం వెల్లడించింది.
అయితే ప్రభుత్వం బయటపెట్టిన వివరాలన్నీ బూటకమే అంటూ బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ఖండించారు. ఎన్నికల బాండ్లు తీసుకోవటంలో తప్పేముందన్నారు. ఇదే గ్రీన్ కంపెనీ నుండి కాంగ్రెస్, బీజేపీలు కూడా బాండ్ల రూపంలో విరాళాలు తీసుకున్నాయన్నారు. కేంద్రఎన్నికల కమిషన్ అనుమతించిన ఎలక్టోరల్ బాండ్లను తీసుకోవటం తప్పు ఎలా అవుతుందని కేటీఆర్ ప్రశ్నించారు. మొన్నటివరకు ఫార్ములా ఈ కార్ రేసు వ్యవహారంలో అసలు అవినీతే లేదని చాలాసార్లు చెప్పారు. కేసంతా కుట్రపూరితమే అని కొట్టిపారేశారు. అలాంటిది ఇపుడు ఎలక్టోబరల్ బాండ్లు తీసుకుంటే తప్పేమిటని ప్రశ్నిస్తున్నారు. అసలు గ్రీన్ కో కంపెనీ నుండి బీఆర్ఎస్ కు ఎన్నికల బాండ్లు ఎందుకు వచ్చాయన్న విషయంపై మాత్రం కేటీఆర్ నోరు మెదపడం లేదు. ఏ కంపెనీ అయినా లాభం లేనిదే ఏ రాజకీయ పార్టీకీ విరాళాలు ఇవ్వదనడంలో సందేహం లేదు. ప్రతిపక్షంలో ఉన్న పార్టీలకు విరాళాలు ఇస్తే ఏదో రాజకీయపార్టీ కాబట్టి విరాళమిచ్చిందని అనుకోవాలి. అదే అధికారంలో ఉన్న పార్టీకి విరాళాలు ఇచ్చిందంటే కచ్చితంగా ఏదో ఆ కంపెనీకి ఏదో లబ్ధి చేకూరిందనే భావించాల్సి ఉంటుంది.
అందులోనూ దఫదఫాలుగా కోట్ల రూపాయలు విరాళం రూపంలో అధికార పార్టీకి ముట్ట చెప్పిందంటూ.. ఇందుకు తెరవేనుక నుంచి ఆ కంపెనీకి ఏదో రూపంలో ఇచ్చిన విరాళాల కంటే ఎక్కువగానే లబ్ధి చూకూరిందని అనుమానించాల్సి ఉంటుంది. అందులోను కోట్లాదిరూపాయల విరాళాలిచ్చిన కంపెనీకి అధికారంలో ఉన్న పార్టీ ఏదైనా కాంట్రాక్టులిచ్చి ఒప్పందం చేసుకున్నదీ అంటే ఆ విరాళాలు కచ్చితంగా క్రిడ్ ప్రోకోలో భాగమేనని చెప్పక తప్పదు.
ఇపుడు ప్రభుత్వం బయటపెట్టిన ఎన్నికల బాండ్ల విరాళాల వివరాలతో బీఆర్ఎస్-గ్రీన్ కో కంపెనీ మధ్య క్విడ్ ప్రోకో జరిగిందని రూఢీ అయినట్లేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఎన్నికల బాండ్లు తప్పేమిటి? ఎన్నికల సంఘమే అనుమ తించిందిగా అని కేటీఆర్ ఎంతగా సమర్ధించుకోవడానికి ప్రయత్నించినా పెద్దగా ఫలితం ఉండదని అంటున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/quidproco-between-brs-and-greenco-39-190906.html
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి.
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు. తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ అధిష్టానం సీఎఉం మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గళం ఎత్తే సీనియర్ నేతలకూ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో కాంగ్రెస్ సీఎం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ సీఎంలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనని చెప్పాలి.
ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు. గతంలో ఏపీలో బీజేపీ మద్దతు వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ వాస్తవాన్ని సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు.
రాయలసీమను హార్టికల్చర్ హబ్గా తీర్చిదిద్దేందుకు, రాష్ట్రంలో ఇరిగేషన్ సదుపాయాలను మెరుగుపరిచేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా పూర్తవుతుండటంతో, ఇరిగేషన్ రంగంపై మాట్లాడటానికి ప్రతిపక్షానికి ఎలాంటి అవకాశాలు లేకుండా పోయాయని ఆయన కుండబద్దలు కొట్టారు.
జలయజ్ణం పేరుతో వైఎస్ చేసింది ధనయజ్ణమని విక్రమ్ పూల అన్నారు. ప్రాజెక్టుల అంచనా వ్యయం పెరగడం, ప్రాంతీయ సమతుల్యత లోపించడం, హెడ్ వర్క్స్ కంటే ముందుగా కాలువల తవ్వకం వంటి వాటికే వైఎస్ జలయజ్ణం పరిమితమైందని విక్రమ్ పూల వివరించారు.
కాంగ్రెస్ హైకమాండ్ మీనాక్షీ నటరాజన్ పై వేటు వేయాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. రాహుల్ గాంధీ నేతృత్వంలోని జాతీయ నాయకత్వం రాష్ట్రంలో కాంగ్రెస్ వ్వవహారాలను చక్కదిద్దేందుకు భూపేష్ బగెల్ సమర్ధంగా పని చేయగలరని భావించి ఆ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.
తాను పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాననీ, వచ్చే ఎన్నికలలో పోటీ చేయననీ ఆయన చేసిన ప్రకటన పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. తెలుగుదేశం ఆవిర్భావం నుంచీ కూడా ప్రజా ప్రతినిథిగా, పొలిటికల్ లీడర్ గా సేవలందించిన అయ్యన్న పాత్రుడు హఠాత్తుగా రాజకీయాలకు రిటైర్మెంట్ అంటూ చేసిన ప్రకటన రాజకీయవర్గాలలో సంచలనం సృష్టించింది.
2019 ఎన్నికలలో వైసీపీ విజయంలో అప్పటి జగన్ పాదయాత్ర కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. అయితే అప్పట్లో.. జగన్ వాగ్దానాలపై ప్రజలలో నమ్మకం ఉండేది. ప్రజలతో ఆయన మమేకమయ్యేవారు.
రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అధికార రేసులో లేకపోయినప్పటికీ.. రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేస్తూనే ఉంది. అందుకే రాష్ట్రంలో రాజకీయ వేడ రగిలిన ప్రతి సందర్భంలోనూ తెలుగుదేశం ప్రస్థావన వస్తూనే ఉంటుంది.
తెలంగాణ రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా తీవ్ర దుమారం రేపుతున్న పరిణామాలు ఇప్పుడు అత్యంత ఆసక్తికర మలుపు తిరిగాయి.
తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు ఆమె చూపు బీఆర్ఎస్ వైపు మళ్లిందా అన్న అనుమానాలకు తావిచ్చింది. కేబినెట్ నుంచి తనకు ఉద్వాసన పలికిన తరువాత మీడియాకు వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్న కొండా సురేఖ.. తాజాగా బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుపై ప్రశంసల వర్షం కురిపించారు.
పిడిక్కీ బియ్యానికీ ఒకే మంత్రం అన్నట్లుగా ఆమె తన బర్త్ రఫ్ కూ తెలుగుదేశం పార్టీకీ ముడి పెట్టారు. సీఎం రేవంత్ రెడ్డిది తెలుగుదేశం రక్తం కనుకనే తనకు కేబినెట్ నుంచి బర్త్ రఫ్ చేశారంటూ మీడియా సమావేశంలో కొండా సురేఖ చేసి కామెంట్స్ రాజకీయవర్గాలలో సంచలనంగా మారాయి.