Publish Date:May 12, 2025
ఢిల్లీలోని తెలంగాణ భవన్లో మాజీ ప్రధాని పీవీ నరసింహారావు విగ్రహం ఏర్పాటు కానుంది. ఈ మేరకు ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ప్రతిపాదనకు.. అర్బన్ ఆర్ట్ కమిషన్ ఆమోదం తెలిపింది. దీంతో మాజీ ప్రధాని, తెలుగుతేజం పీవీ నరసింహరావు కాంస్య విగ్రహం త్వరలో హస్తినలో ఏర్పాటు కానుంది. జీవిత కాలం కాంగ్రస్ తోనే పయనించి, ఈ పార్టీ అధ్యక్షుడిగా, ప్రధానిగా ఎదిగి.. దేశానికి ఎనలేని సేవలందించిన పీవీ నరసింహరావుకు ఎట్టకేలకు దేశ రాజధాని హస్తినలో ఒకింత చోటు, గుర్తింపు లభించనుంది.
దేశాన్ని ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కించిన ఈ మహా మేధావి.. కాంగ్రెస్ పార్టీకే ప్రత్యేకమైన రాజకీయాలు, అంతర్గత విభేదాల కారణంగా ఆ పార్టీలో కనీస గౌరవానికి కూడా నోచుకోలేదు. చివరాఖరికి ఆయన మరణించినప్పుడు, ఆయన పార్ధివ దేహాన్ని కనీసం ఏఐసీసీ కార్యాలయంలోకి కూడా అనుమతించలేదు. చివరికి హస్తినలో అంత్యక్రియలు కూడా జగరలేదు. అక్కడ నుంచి హైదరాబాద్ కు ఆయన పార్ధివదేహాన్ని తరలించి.. అక్కడ అంత్యక్రియలు జరిపించారు. ఇందుకు ఆయన విధానాలతో కాంగ్రెస్ అగ్రనేత సోనియా విభేదించడమే కారణం. అంతెందుకు ప్రధానిగా దేశ గౌరవాన్ని ఇనుమడింప చేసిన ఆయనకు ఆ తరువాత కాలంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికలలో పోటీ చేయడానికి కూడా అవకాశం ఇవ్వలేదు. సరే అవన్నీ పక్కన పెడితే ఇప్పుడు ఇన్నేళ్లకు హస్తినలోని బీజేపీ ప్రభుత్వం ఆయన కాంస్య విగ్రహ ఏర్పాటుకు అనుమతి ఇచ్చింది.
పీవీ నరసింహారావు కాంస్య విగ్రహాన్ని ఢిల్లీలోని తెలంగాణ భవన్లో ఏర్పాటు చేయాలని ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసకుంది. పీవీ విగ్రహ ఏర్పాటుకు ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ప్రతిపాదనలు సిద్ధం చేయగా.. ఢిల్లీ అర్బన్ ఆర్ట్ కమిషన్ ఆమోదం తెలిపింది. దీంతో అతి త్వరలోనే విగ్రహ నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయి. ఇంకొంచం వెనక్కు వెడితే.. గత ఏడాది ఏప్రిల్ లో పీ.వీ. నరసింహారావు మెమోరియల్ ఫౌండేషన్ పీవీ విగ్రహాన్ని హస్తినలోని ఆంధ్రా భవన్ లేదా తెలంగాణ భవన్ ప్రాంగణంలో ఏర్పాటు చేయాలని కోరుతూ న్యూఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్ కు లేఖ రాసింది. ఈ లేఖపై ఢిల్లీ మునిసిపల్ కౌన్సిల్ ఈ ఏడాది మార్చి 27న జరిగిన సమావేశంలో చర్చించి ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలను ఢిల్లీ అర్బన్ ఆర్ట్ కమిషన్ కు పంపింది. ఆ ప్రతిపాదనలకు ఆమోదం లభించడంతో త్వరలో పీవీ కాంస్య విగ్రహం హస్తినలోని తెలంగాణ భవన్ ప్రాంగణంలో ఏర్పాటు కానున్నది. .
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/pvnarasimharao-statue-in-delhi-25-197928.html
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం పేరును అనధికారికంగా వాడుకుంటూ, భౌగోళిక సూచిక హక్కులను ఉల్లంఘిస్తున్న పుష్ మై కార్ట్ సంస్థ కు తిరుమల తిరుపతి దేవస్థానం నోటీసులు జారీ చేసింది. ఒక్క పుష్ మై కర్డ్ సంస్థకే కాకుండా ఇలా లడ్డూ ప్రసాదం పేరును, పవిత్రతను అనధికారికంగా ఉపయోగించుకుంటున్న పలు ఇతర సంస్థలపై కూడా చట్టపరమైన చర్యలకు తిరుమల తిరుపతి దేవస్థానం సిద్ధమై లీగల్ నోటీసులు జారీ చేసింది.
ఎప్ స్టీన్ మామూలోడు కాడు. ఇటు బిల్ క్లింటన్ లాంటి ప్రెసిడెన్షియల్ పర్సనాల్టీస్.. అటు హాలీవుడ్ హీరోస్ తో కస్టమైజ్డ్ ప్రైవేట్ జెట్స్ లో ఆఫ్రికా పర్యటన చేసికొచ్చిన రకం. దీన్నిబట్టే అర్ధం చేసుకోవచ్చు.. ఎప్ స్టీన్ ఎలాంటివాడో.
ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏ1 ప్రభాకర్రావుకు సోమవారం (జూన్ 9) సిట్ విచారణకు హాజరయ్యే అవకాశాలున్నాయి. వాస్తవానికి ఆయన గురువారం (జూన్ 5) విచారణకు హాజరు కావాల్సి ఉండగా, ఆయనకు ఎమర్జెన్సీ ట్రాన్సిట్ వారెంట్ జారీ జారీ కావడంలో జరిగిన జాప్యంతో ఇండియాకు రాలేకపోయారని చెబుతున్నారు.
చేసిన పాపం ఎప్పటికైనా బయటపడక తప్పదు. అందులోనూ తిరుమల దేవుడి విషయంలో చేసిన అపచారానికి ఎంతటి వాడికైనా శిక్ష తప్పదు. కర్మఫలం అనుభవించకతప్పదు. ఇప్పుడు జగన్ హయాంలో తిరుమలలో జరిగిన అపచారాలు, అరాచకాలు ఒక్కటొక్కటిగా వెలుగులోనికి వస్తున్నాయి.
నిజమే.. హస్తం పార్టీలో కుస్తీ పట్లు కొత్తకాదు. అందులోనూ.. అధికారంలో ఉన్న సమయంలో నాయకులు, కార్యకర్తలు నాకేంటి.. మాకేంటని పార్టీని నిలదీయడం మరీ కామన్. ఇతర పార్టీలలో అలాంటి, గోల ఉండదా అంటే.. అదేమీ లేదు, అన్ని పార్టీలలో ఉన్నదే. ఉండేదే. అందులో అనుమానం లేదు. ప్రస్తుతం తెలంగాణలో మాజీ అధికార పార్టీ బీఆర్ఎస్ లో, కల్వకుంట్ల కుటుంబంలో జరుగతున్న రచ్చంతా.. నాకేంటి? అన్న దగ్గరే మొదలైంది, దాని చుట్టూనే తిరుగుతోంది.
తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తులు పోటెత్తుతున్నారు. వారాంతం కావడం, వేసవి సెలవులు ముగింపు దశకు రావడంతో తిరమల భక్త జన సందోహంతో కిటకిటలాడుతోంది.
ఢిల్లీ సీఎం రేఖా గుప్తాను చంపేస్తామంటూ గుర్తు తెలియని దుండగుడు బెదిరింపులకు పాల్పడ్డాడు. దాంతో, అధికారులు అప్రమత్తమయ్యారు. ఆమె భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు.
తిరుపతి జిల్లా చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిపై ప్రస్తుత ఎమ్మెల్యే పులివర్తి నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం తిరుపతి ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
ఛత్తీస్గఢ్లో మరోసారి ఎన్కౌంటర్లో చోటుచేసుకుంది. బీజాపూర్ జిల్లాలోని నేషనల్ పార్క్ అటవీ ప్రాంతంలో శుక్రవారం భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో మరో కీలక నేత మైలారపు ఆడెల్లు అలియాస్ భాస్కర్ మృతి చెందారు.
బీఆర్ఎస్ పార్టీలో దెయ్యాలు ఉన్నాయని ఆ పార్టీ నేతలే విమర్శస్తుంటే మాజీ సీఎం కేసీఆర్ నోరు విప్పలేని స్ధితిలో ఉన్నారని సీఎం రేవంత్రెడ్డి ఎద్దేవా చేశారు.
వచ్చే ఏడేళ్లలో విశాఖను మరో ముంబైలా తీర్చిదిద్దాలని అధికారులకు ఏపీ సీఎం చంద్రబాబు దిశానిర్ధేశం చేశారు. ఇవాళ అమరావతిలో జరిగిన నీతి ఆయోగ్ భేటీలో సీఎం చంద్రబాబు ఈ మేరకు కీలక నిర్ణయాలు ప్రకటించారు.
గచ్చిబౌలి ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ను మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు పరామర్శించారు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం రూ. 25 వేల కోట్ల అవినీతికి పాల్పడిందని గతంలో కేటీఆర్ ఆరోపణలు చేశారు