నెహ్రు భారత్ ని... నవ భారత్ గా మార్చిన... భారత రత్నం!

Publish Date:Oct 14, 2016

Advertisement

 

మనకో పద్యం వుంది... చాలా పాతది! దాంట్లో కంచు మోగినట్టు కనకంబు మోగునా అంటాడు కవి! నిజమే కంచులా కనకం మోగదు. కాని, నిశ్శబ్ధంగా వుండే కనకానికే విలువ ఎక్కువ. కంచుతో కంటికి పెద్దగా కనిపించే పాత్రలు బోలెడు చేసుకోవచ్చు. కాని, కనకంతో ఓ చిన్న నెక్లెస్సో, ఉంగరమో చేసుకుంటాం. కనకం విలువ అలాంటిది! మన మాజీ ప్రధాని పీవీకి ఈ కనకం పోలిక అద్భుతంగా సరిపోతుంది...

 

దేశాన్ని ఏలిన కాంగ్రెస్ ప్రధానుల్లో గాంధీ కుటుంబానికి చెందని అత్యంత వివాదాస్పదుడు పీవీ. ఆయన హయాంలోనే బాబ్రీ కూలటంతో కాంగ్రెస్ సైలెంట్ గా తనని పక్కన పెట్టింది. అంతే కాదు, గాంధీలకు పీవీ అంటే పడకపోవటం కూడా పబ్లిక్ సీక్రెట్టే! ఆయన చనిపోతే ఢిల్లీలో సమాధి కూడా లేకుండా చేసిన ఘనత సోనియా నేతృత్వంలోని యూపీఏది. కాని, కాంగ్రెస్ పార్టీలో పీవీ ఎంతగా అవమానాలు ఎదుర్కొన్నారో... అంతే గొప్ప పేరు పార్టీకి బయట తెచ్చుకున్నారు. ఆయన చనిపోయి ఒక్కో సంవత్సరం గడుస్తున్న కొద్దీ ఆ దార్శనికుడి గొప్పతనం అంతకంతకూ ఇనుమడిస్తోంది!

 

ఈ మధ్యే... 1991 - హౌ పీవీ నరసింహారావు మేడ్ హిస్టరీ అనే పుస్తకం విడుదలైంది. దాన్ని రాసింది మన తెలుగు వాడు సంజయ్ బారు. పీవీకి సలహాదారుగా పని చేసిన ఆయనకు మాజీ ప్రధాని గురించి చాలా విషయాలు తెలుసు. అందుకే, ఆయన రాసిన పుస్తకం గురించి దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. మాజీ ఆర్బీఐ గవర్నర్ రంగరాజన్ కూడా బారు పుస్తకంపై స్పందించారు. ఇవాళ్ల మనం ప్రత్యక్షంగా చూస్తోన్న ఈ అభివృద్ధి, ఆర్దిక ప్రగతి అంతా పీవీదేనని తేల్చి చెప్పారు!

 

రంగరాజన్ లాంటి ఆర్దికవేత్తలే కాదు పీవీ గురించి ఇప్పుడు చాలా మంది పాజిటివ్ గా మాట్లాడుతున్నారు. అందుక్కారణం నిజంగా ఆయన 1991లో దేశాన్ని ఆర్దిక పాతాళం లోంచి పైకెత్తటమే. అప్పట్లో భారత్ తన వద్ద వున్న బంగారు నిల్వలు కూడా తాకట్టు పెట్టుకుని దిగుమతులు చేసుకునే దివాలా స్థితికి దిగజారిపోయింది. నెహ్రు కాలం నుంచీ చేస్తూ వచ్చిన సొషలిస్టు ప్రయోగాలన్నీ బెడిసి కొట్టి ప్రమాదం అంచున నిలుచున్నాం. సరిగ్గా అప్పుడు కాంగ్రస్ స్థంభం పగులకొట్టుకుని బయటకొచ్చిన నరసింహారావు మనల్ని పీడిస్తున్న హిరణ్యకశ్యపుడి లాంటి ఆర్దిక విధానాల్ని చీల్చి చెండాడారు. అదీ అరకొర మద్దతున్న తన మైనార్జీ ప్రభుత్వంతోనే! విదేశీ పెట్టుబడులకు దార్లు తెరుస్తూనే గ్రామీణాభివృద్ధి మీద కూడా ఆయన ఎంతో దృష్టి పెట్టారు. 1991లో పీవీ తీసుకున్న పలు కీలక నిర్ణయాలే ఇవాళ్టికీ మన పాలకుకలకి ఆదర్శంగా నిలుస్తున్నాయి.

 

ఆర్దికంగా దేశాన్ని పైకెత్తిన పీవీ నరసింహారావు ఫారిన్ పాలసీ కూడా సమూలంగా మార్చేశారు. ఇండియా నెహ్రు కాలం నుంచీ దూరంగా వుంటూ వస్తోన్న చాలా దేశాలకి ఆయన కాలంలో దగ్గరైంది. అంతర్జాతీయంగా మనకు కొత్త శకం మొదలైంది. ఇన్ని చేసినా గత రెండు దశాబద్దాల్లో పీవీకి ఏ మాత్రం తగినంత ప్రాముఖ్యత దక్కలేదు. పేరు రాలేదు. కాంగ్రెస్ పార్టీనే ఆయనపై కక్ష్య కట్టి స్కాముల్లో పేరు వినిపించేలా చేసింది. గాంధీలు ఆగ్రహంతో ఆయనకు భారత రత్న ఇవ్వకుండా ఊరుకున్నారు. బాబ్రీ కూలటానికి కేవలం పీవీ ఒక్కడిదే బాధ్యత అన్నట్టు ముస్లిమ్ ల ముందుర ఆయన్ని విలన్ని చేశారు. ఇన్ని చేసినా నిజం నిలకడగా బయటకొస్తూనే వుంది. సంజయ్ బారూ పుస్తకం ఆ కోవలోనే వచ్చిన తాజా వాంగ్మూలం...

 

ప్రతీ ప్రధాని కాలంలో ఏదో ఒక అపఖ్యాతి కలిగించే సంఘటన జరుగుతుంది. కాని, అది మరిచిపోయి అతడి కాలంలో జరిగిన మంచిని గుర్తు చేసుకోవటమే సంస్కారం. నెహ్రు కాలంలో మన నేల చైనాకు పోయింది! ఇందిర కాలంలో ఎమర్జెన్సీ వచ్చింది! వాజ్ పేయి కాలంలో కాందహార్ హైజాక్ ఉదంతం దెబ్బతీసింది! అలాగే పీవీ టైంలో బాబ్రీ కూల్చివేత జరిగింది. కాని, అంతకు మించి చాలా మంచి జరిగింది. ఇవాళ్ల దేశ వ్యాప్తంగా కోట్లాది ఉద్యోగాలు చేసుకుంటున్న యువత ఎవరి వల్ల సమరోత్సాహంతో వుంది? సమాధానం ... పీవీ నరసింహారావు!
 

By
en-us Political News

  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు.
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్ రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది. 80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది. ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది.
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు...
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది...
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో  తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది. 
​సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది...
జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు.
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు...
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి...
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  
నాలుగు రాష్టాలు అస్సాం, పశ్చిమ బెంగాల్ తమిళనాడు,కేరళ, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి శాసన సభలకు  మరో రెండు నెలల్లో ఎన్నికలు జరుగుతాయి. ఇది అందరికీ తెలిసిన విషయం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.