కాబోయే భార్యే లోయలోకి నెట్టేసింది..పుణే ట్రెక్కర్ మర్డర్ పక్కా ప్లాన్!

Publish Date:Jun 23, 2026

Advertisement

 

మహారాష్ట్రలోని చారిత్రాత్మక లోహగఢ్‌ కోట పర్యాటక ప్రాంతంలో ఇటీవల జరిగిన ఒక యువ వ్యాపారవేత్త మరణం కేసులో ఊహించని మలుపు తిరిగింది. ప్రమాదవశాత్తు లోయలో పడి చనిపోయాడనుకున్న ఘటన.. పక్కా ప్రణాళికతో జరిగిన ఘోర హత్యగా పోలీసులు తేల్చారు. కాబోయే భర్తను ఆ యువతే తన స్నేహితుడితో కలిసి లోయలోకి నెట్టేసిందని ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది.

పుణే సమీపంలోని గహుంజే ప్రాంతానికి చెందిన 26 ఏళ్ల కేతన్‌ విశాల్‌ అగర్వాల్‌ తమ కుటుంబానికి చెందిన రియల్ ఎస్టేట్ సంస్థకు డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం తన కాబోయే భార్య పుట్టినరోజు వేడుకలను జరుపుకోవడానికి ఆమెతో పాటు మరో ఇద్దరు స్నేహితులతో కలిసి లోహగఢ్‌ కోట వద్దకు ట్రెకింగ్‌కు వెళ్లారు. అక్కడ ప్రమాదవశాత్తు 400 అడుగుల లోతైన లోయలో పడి కేతన్‌ మరణించినట్లు తొలుత వార్తలు వచ్చాయి.

ఘటనా స్థలంలో బలమైన గాలులు వీస్తుండటం వల్ల, కాబోయే భార్యను ఫోటోలు తీసే క్రమంలో కేతన్ అదుపు తప్పి కిందకు పడిపోయాడని అప్పట్లో కేసు నమోదు చేశారు. లోనావాలా రూరల్ పోలీసులు, స్థానిక శివదుర్గ్ మిత్ర రెస్క్యూ టీమ్ తీవ్రంగా శ్రమించి లోయ నుంచి అతని మృతదేహాన్ని వెలికితీశారు. కానీ, ఈ క్రమంలో పోలీసులు జరిపిన లోతైన విచారణలో అసలు నిజాలు బయటపడ్డాయి.

కేతన్ మొబైల్ ఫోన్ రికార్డులు, ఘటనా స్థలంలో ఉన్న ఇతరుల సాక్ష్యాలను పరిశీలించిన పోలీసులకు బలమైన ఆధారాలు లభించాయి. నిందితురాలైన యువతికి ఈ వివాహం ఇష్టం లేదని, అందుకే తన పుట్టినరోజు వేడుకల నెపంతో కేతన్‌ను కొండపైకి తీసుకువెళ్లిందని సమాచారం. అనంతరం ఫోటోలు తీసుకుంటున్న సమయంలో ఏమార్చి, తన మగ స్నేహితుడితో కలిసి అతడిని లోయలోకి నెట్టేసినట్లు పోలీసులు గుర్తించారు.

ఈ దారుణ ఉదంతం ఇరు కుటుంబాలలో తీవ్ర విషాదాన్ని నింపింది. కేతన్, సదరు యువతికి ఈ ఏడాది నవంబర్‌లో వివాహం జరగాల్సి ఉంది. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో ఒక ప్యాలెస్‌ను కూడా పెళ్లి వేడుకల కోసం కుటుంబ సభ్యులు బుక్ చేశారు. అంతలోనే పెళ్లి పీటలు ఎక్కాల్సిన యువకుడు ఇలా కాబోయే భార్య చేతిలోనే దారుణ హత్యకు గురికావడం స్థానికంగా కలకలం రేపింది.

ప్రస్తుతం పోలీసులు నిందితురాలైన యువతిని, ఆమెకు సహకరించిన మగ స్నేహితుడిని అదుపులోకి తీసుకుని హత్య కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ దారుణానికి గల పూర్తి కారణాలు, వారి మధ్య ఉన్న ఇతర సంబంధాలపై పోలీసులు మరింత లోతుగా విచారణ జరుపుతున్నారు. నిందితులకు కఠిన శిక్ష పడేలా చూస్తామని ఉన్నతాధికారులు పేర్కొన్నారు.
 

By
en-us Political News

  
నందమూరి బాలకృష్ణ 112 సినిమా ప్రారంభోత్సవ వేడుకకు విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నిర్వహించిన పూజా కార్యక్రమంలో పాల్గొని, క్లాప్ కొట్టి షూటింగ్ ను ప్రారంభించారు. బాలకృష్ణ కుమార్తె తేజస్విని కెమెరా స్విచ్ ఆన్ చేశారు.
వెనిజులా రాజధాని కారకాస్‌లో 7.2 మరియు 7.5 తీవ్రతతో సంభవించిన వరుస భూకంపాలు సృష్టించిన విధ్వంసం, మృతుల వివరాలు మరియు తాజా పరిస్థితుల గురించిన పూర్తి సమాచారం.
గతంలో చట్ట సభల్లో ప్రజా సంక్షేమం, విధానాల రూపకల్పనపై ఆదర్శవంతమైన చర్చలకు నిలయంగా ఉండేవన్న నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి.. ఇప్పుడు అవి వ్యక్తిగత దూషణలకు నిలయాలుగా మారాయన్నారు. సిద్ధాంతాల ప్రాతిపదికన సాగాల్సిన విమర్శలు, వ్యక్తిగత పగలు, ద్వేషాలను వెళ్లగక్కేలా మారిపోయాయన్నారు. ప్రజా సమస్యలపై పోరాడటం కంటే ప్రత్యర్థుల వ్యక్తిత్వ హననానికి పాల్పడటమే నేటి నాయకులకు ప్రధాన అజెండాగా మారిందని విమర్శించారు.
ప్రముఖ టెక్ దిగ్గజం ఒరాకిల్ Oracle ప్రపంచవ్యాప్తంగా 21,000 మంది ఉద్యోగులను తొలగిస్తూ షాకింగ్ నిర్ణయం తీసుకుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ AI మరియు ఆటోమేషన్ కారణంగా భారతీయ ఐటీ రంగం, ఫ్రెషర్స్ మరియు మిడ్లె వల్ మేనేజర్లపై పడనున్న ప్రభావం, మరియు మీ కెరీర్ కాపాడుకోవడానికి అవసరమైన టాప్ AI స్కిల్స్ పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
ఒక క్రైమ్ సినిమాను తలపించేలా సాగిన ఈ ఘోర హత్యోదంతంలో రోజుకో సంచలన వాస్తవం వెలుగులోకి వస్తున్నది.
2026 జూన్ 25 లేదా 26 తేదీలలో మొహర్రం బ్యాంక్ సెలవు ఎప్పుడు? హైదరాబాద్, విజయవాడతో పాటు ప్రధాన నగరాల్లో వరుసగా 3 రోజులు బ్యాంకులు ఎందుకు మూతపడనున్నాయో ఆర్‌బీఐ (RBI) అధికారిక సెలవుల జాబితా ద్వారా ఇప్పుడే తెలుసుకోండి.
ఆర్‌బీఐ కొత్త ఎన్‌బీఎఫ్‌సీ నిబంధనల వల్ల టాటా సన్స్ పబ్లిక్ లిస్టింగ్ అయ్యే అవకాశాలు పెరిగాయి. దీనితో టాటా కెమికల్స్ షేర్లు 4 శాతం పెరిగి రూ. 770 కి చేరాయి. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
తిరుమల శ్రీవారి సామాన్య భక్తులకు టీటీడీ ముఖ్య గమనింపు. తిరుపతిలో ఇచ్చే ఉచిత టైమ్ స్లాట్ సర్వ దర్శనం (SSD) టోకెన్ల పంపిణీ సమయాలను మారుస్తూ TTD కీలక నిర్ణయం తీసుకుంది. ఆ కొత్త సమయాలు మరియు మూడు ప్రధాన కౌంటర్ల పూర్తి వివరాలు మీకోసం.
భారత క్రికెట్ క్రేజ్ ఇప్పుడు బిజినెస్ పవర్‌గా మారింది. బర్గండీ ప్రైవేట్ హురున్ ఇండియా 500 నివేదికలో తొలిసారిగా కేకేఆర్, సీఎస్‌కే, ఆర్‌సీబీ సహా ఐదు ఐపీఎల్ ఫ్రాంచైజీలు దేశంలోని అత్యంత విలువైన ప్రైవేట్ కంపెనీల సరసన స్థానం సంపాదించాయి. ఈ జట్ల మొత్తం విలువ, వాటి ర్యాంకులు మరియు ఆదాయ వనరుల పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
ఇంగ్లాండ్ వన్డే సిరీస్‌కు రోహిత్ శర్మ ఎంపిక, యశస్వి జైస్వాల్ తొలగింపుపై మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ బీసీసీఐ సెలెక్టర్లపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. 2027 వరల్డ్ కప్ విజన్ ఏంటని ప్రశ్నించిన పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
దేశీయ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు కుప్పకూలాయి. 24 క్యారెట్లు, 22 క్యారెట్ల పసిడిపై భారీగా తగ్గిన హైదరాబాద్, విజయవాడ మరియు ఢిల్లీ నగరాల తాజా రేట్లను ఇక్కడ చూడండి.
వాటర్‌వేస్ లీజర్ (కార్డెలియా క్రూయిజెస్) ఐపీఓ సబ్‌స్క్రిప్షన్ నేటితో (జూన్ 25) ముగియనుంది. ప్రైస్ బ్యాండ్, అలాట్‌మెంట్ తేదీ మరియు ఇన్వెస్టర్లు చేయకూడని తప్పుల పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
కరేబియన్ తీరంలోని మొరాన్ నగరానికి సమీపంలో, భూగర్భంలో 10 నుండి 22 కిలోమీటర్ల లోతులో ఈ భూకంప కేంద్రాలు ఉన్నాయి. వందేళ్లలో వెనిజులాలో సంభవించిన భారీ భూకంపాలు ఇవేనని అధికారులు తెలిపారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.