Publish Date:Nov 11, 2024
పెరుగుట విరుగుట కొరకే... అన్న సామెత అతికినట్లుగా పిల్ల సజ్జల అదేనండీ సజ్జల భార్గవరెడ్డికి అతికినట్లుగా సరిపోతుంది. వైసీపీ అధికారంలో ఉన్నంత కాలం అప్పటి ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఆడింది ఆట.. పాడింది పాట అన్నట్లుగా నడిచిపోయింది. జగన్ అధికారంలో ఉన్నంత కాలం సజ్జల రామకృష్ణారెడ్డి ఆయన ముఖంలా, గొంతులా వ్యవహరించారు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే జగన్ సీఎంగా ఉన్న సమయంలో సజ్జల డిఫాక్టో సీఎంగా పెత్తనం చెలాయించారు. ఆ పెత్తనాన్ని, ఆధిపత్యాన్ని ఉపయోగించుకునే సజ్జల వైసీపీ సోషల్ మీడియా వింగ్ ను తన పుత్రరత్నం, పిల్ల సజ్జల అదేనండి సజ్జల భార్గవరెడ్డికి అప్పగించారు. దీంతో సజ్జల భార్గవరెడ్డి పేనుకు పెత్తనం ఇస్తే.. అన్న సామెత చందంగా సోషల్ మీడియా చేతిలో పెట్టుకుని ఇష్టారీతిగా చెలరేగిపోయారు.
తెలుగుదేశం పార్టీ, ఆ పార్టీ నాయకులు, ఆ పార్టీలోని మహిళా నేతలు, ఆ పార్టీ అధినేత చంద్రబాబు కుటుంబ సభ్యులపై అత్యంత దారుణమైన, అసభ్యకరమైన పోస్లులతో రెచ్చిపోయారు. సజ్జల భార్గవ రెడ్డి హయాంలో వైసీపీ సోషల్ మీడియా వెర్రిపుంతలు తొక్కింది. అడ్డూ అదుపూ లేకుండా రెచ్చిపోయింది. ఎన్నికలలో జగన్ పార్టీ ఓటమిలో ఆ పార్టీ సోషల్ మీడియా పాత్ర కూడా ఉందనడంలో సందేహం లేదు. సరే అది పక్కన పెడితే.. ఎన్నికలు పూర్తై ఫలితాలు వచ్చిన తరువాత.. వైసీపీ చరిత్ర ఎరుగనంతటి ఘోర పరాజయాన్ని మూటగట్టుకుని పరాభవం పాలైన తరువాత పిల్ల సజ్జల అజ్ణాతంలోకి వెళ్లిపోయారు. అప్పటి వరకూ వైసీపీ సోషల్ మీడియా వింగ్ అధిపతిగా అసభ్య, అశ్లీల పోస్టులతో చెలరేగిపోయిన సజ్జల భార్గవరెడ్డి కిలికానిక్కూడా కనిపించకుండా మాయమయ్యారు. తండ్రి సజ్జల తన పుత్రరత్నాన్ని కేసుల నుంచి, సొంత పార్టీ నేతల దూషణల నుంచీ కాపాడుకోవడానికి చాలా తెలివిగా రాష్ట్రం నుంచి తరలించేశారు. చడీ చప్పుడు లేకుండా వైసీపీ సోషల్ మీడియా వింగ్ పోస్టు నుంచీ తొలగించేశారు.
ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నా చేసిన పాపం మెడకు చుట్టుకోకుండా ఉండదు కదా? ఇప్పుడు సజ్జల భార్గవరెడ్డిపై కడప జిల్లా పులివెందులలో కేసు నమోదైంది. ఇక ఇప్పుడు పిల్ల సజ్జల ఏ కలుగులో దాక్కున్నా పోలీసులు లాక్కు వచ్చి చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటారు. పాపం సజ్జల తన కుమారుడిని కాపాడుకోవడానికి చేసిన ప్రయత్నాలు ఫలించ లేదు. ఇప్పటి వరకూ సజ్జల రామకృష్ణారెడ్డి తన కుమారుడిపై కేసు నమోదు కావడంపై స్పందించ లేదు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/pulivendula-police-refester-case-on-sajjaja-bhargav-reddy-39-188201.html
కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ అస్వస్థకు గురి అయ్యారు. ప్రస్తుతం హిమాచల్ ప్రదేశ్ సిమ్లాలో ని ఇందిరాగాంధీ మెడికల్ కాలేజీలో ఆమెకు చికిత్స అందిస్తున్నారు.
ఏపీలోని కర్నూలు జిల్లా ఓర్వకల్లు గ్రీన్ కో ఎనర్జీ ప్రాజెక్టును తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సందర్శించారు. ఈ సందర్బంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ గ్రీన్ కో ప్రాజెక్టు దేశానికి, ప్రపంచానికి మార్గదర్శిలా నిలిచిందని అన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టు వివాదంలో తనను కావాలని లాగుతున్నరని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. కాళేశ్వరం కమీషన్ ఎదుట బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ అన్ని అబద్దాలు చెప్పారని తుమ్మల తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిపైనా, మహిళలపైనా అనుచిత వ్యాఖ్యలు చేసిన జర్నలిస్టు కృష్ణం రాజు, ఒక టీవీ చానల్ యాంకర్ కొమ్మినేని శ్రీనివాసరావుపైనా ఏపీ డిప్యూటీ స్వీకర్ రఘురామకృష్ణం రాజు డీజీపీకి ఫిర్యాదు చేశారు.
వైసీపీ అధినేత జగన్పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రి నారా లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు.మహిళలను అవమానిస్తే కాలగర్భంలో కలిసిపోతారని లోకేష్ ఎక్స్ వేదికగా పేర్కొన్నారు.
హైదరాబాద్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఎండ ఉక్కపోతతో అల్లడుతున్న ప్రజలకు వర్షంతో ఉపశమనం కలిగింది. ఉన్నపళంగా వాతావరణం మొత్తం చల్లబడింది.
తీవ్ర అనారోగ్యంతో గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ను బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరామర్శించారు.
అమరావతి దేవతల రాజధాని కాదు వేశ్యల రాజధాని అంటూ ఒక చానెల్ లో అనుచిత వ్యాఖ్యలు చేసిన జర్నలిస్టు మ్యాగజైన్ ఎడిటర్ కృష్ణం రాజు, ఆయనను ఇంటర్వ్యూ చేసిన సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావులపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలను అదుపుచేశారు.
తెలంగాణ మంత్రివర్గ విస్తరణకు కాంగ్రెస్ హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రేపు క్యాబినెట్ విస్తరణకు ఉండే అవకాశముంది.
తెలుగుదేశం పార్టీలో చేరికలపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు కీలక ప్రకటన చేశారు. టీడీపీలోకి ఇతర పార్టీలోకి వస్తామనే వారిపై పార్టీ హైకమాండ్ విచారణ చేస్తుందని తెలిపారు.
ఇప్పటి వరకూ మస్క్ పొలిటికల్ ఎంట్రీ ద్వారా జరిగిన పరిణామ క్రమం వేరు. 2024 ఎన్నికల్లో సుమారు 30 కోట్ల డాలర్లు.. (ఇండియన్ కరెన్సీలో 2500 కోట్లు) విరాళం ఇచ్చి మరీ రాజకీయాల్లోకి దిగిన మస్క్ కి జరిగిన శాస్తి ఏంటంటే.. ఆయన టెస్లా అమ్మకాలు భారీగా పడిపోవడం, షేర్ ధరలు యాభై శాతం డౌన్ కావడం, వంద బిలియన్ డాలర్ల మేర తన సంపద ఆవిరి కావడం.
నాగర్ కర్నూలు ఎంపీ మల్లు రవి టీ పీసీసీ క్రమశిక్షణా కమిటీ చైర్మన్గా నియమితులైన తరువాత గద్వాల జిల్లా కేంద్రంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు హజరయ్యారు . అదే కార్యక్రమానికి అలంపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే విజయుడు , గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి లు అటెండ్ అయ్యారు.