Publish Date:Aug 15, 2025
అవి ఎమర్జెన్సీ తర్వాతి కాలం రోజులు.. అప్పుడు వైఎస్ఆర్ ఏమంత గొప్ప ఇందిరాగాంధీ కుటుంబ భక్తుడు కాడు. పైపెచ్చు కుటుంబ పాలనకు సంబంధించి తీవ్రంగా దుయ్యబడుతూ ఉండేవారాయన. ఆ సమయంలో.. ఒరిజినల్ కాంగ్రెస్ నుంచి ఇందిరను, ఆమె చిన్న కుమారుడు సంజయ్ గాంధీని బహిష్కరించగా.. అప్పటికే సిద్ధం చేసి పెట్టుకున్న ఇండియా అంటే ఇందిర- ఇందిర అంటే ఇండియా అనే ఒకానొక స్లోగన్ కొద్ది.. ఆమె ఎక్కడుంటే అదే కాంగ్రెస్ అనే కోణంలో కాంగ్రెస్ ఐ స్థాపన.. ఆపై వైయస్ ఆర్ ఒరిజినల్ కాంగ్రెస్ నుంచి గెలుపు.
సరిగ్గా అదే సమయంలో వైయస్ ఒకే ఒక్కడుగా ఉమ్మడి ఆంధ్రలో గెలిచిన.. ఆ ఒక్క సీటు గల ఒరిజినల్ కాంగ్రెస్ కాస్తా కాంగ్రెస్ ఐలో చేరడంతో.. ఆయన కూడా కాంగ్రెస్ ఐ కి షిఫ్ట్ అయ్యారు. ఆనాటి నుంచి పులివెందులలో వైయస్ లేదా ఆయన కుటుంబ ప్రాతినిథ్య పార్టీ వైయస్ఆర్సీపీ విజయం సాధిస్తూ వచ్చాయి. అక్కడ పూచిక పుల్లను నిలబెట్టినా.. కూడా వైయస్ కుటుంబం పేరు మీద నిలిచి గెలిచేదనే పేరుంది.
అలాంటి చరిత్రకు చెదలు పట్టిందా? అన్నట్టు నేడు పులివెందులలో టీడీపీ జెండా రెపరెపలాడింది. అలాగని అదిప్పటి నుంచే కాదు గత రెండు ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ ఈ ప్రాంతంలో వైయస్ కుటుంబం పవరు తగ్గిందా? అన్నట్టు పరిస్థితి మారుతూ వచ్చింది. గత 2024 ఎన్నికల్లో కడపలోనూ వైసీపీ భారీ పరాభవం మూటగట్టుకుంది.
దీనంతటికీ కారణం వైయస్ కుటుంబ లెగసీని వైయస్ జగన్ దిగజార్చుతూ వచ్చారనడానికన్నా.. మించి భారతీరెడ్డి ఈ క్రతువును ముందుండి నడిపిస్తున్నారా? అనిపిస్తోంది. కారణం.. భారతీ రెడ్డి జగన్ ని అడ్డు పెట్టుకుని వైయస్ఆర్ బ్రాండ్ ని తమ కుటుంబం అంటే తాను, అవినాష్ రెడ్డి ప్రాతినిథ్యం వహించే సెకండ్ గ్రేడ్ వైఎస్ ఫ్యామిలీకి అడాప్ట్ చేసుకోవాలన్న తలంపు కారణంగా ఆమె.. తీసుకుంటూ వస్తున్న నిర్ణయాలు వరుస వెంబడి బెడిసి కొడుతూ వస్తున్నాయి.
కుప్పం మున్సిపాల్టీలతో విజయం సాధించిన ఆ ఊపు ఉత్సాహం కాస్తా పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల గెలుపుతో మట్టికొట్టుకుపోవడం మాత్రమే కాదు.. వైయస్ ఫ్యామిలీకున్న ప్రభ నానాటికీ తగ్గుతూ వస్తోందనడానికి ఒక నిదర్శనంగా నిలుస్తోందని అంటారు విశ్లేషకులు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/pulivendula-39-204275.html
Publish Date:Mar 11, 2026
పార్టీ ఫిరాయింపుల కేసులో ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరికి ఊరట
రాష్ట్రంలో బీఆర్ఎస్ రెండుసార్లు, కాంగ్రెస్ ఒకసారి అధికారంలోకి వచ్చాయనీ, ఆ రెండు ప్రభుత్వాల వైఫల్యాలనూ గమనించిన తెలంగాణ ప్రజలు వచ్చే ఎన్నికల్లో బీజేపీకి అధికారం కట్టబెట్టాలని ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చేశారన్నారు.
జాతీయ పార్టీలకే ప్రయోజనం చేకూరుతుందనీ, రాష్ట్రాల సమస్యలపై పట్టింపే లేని పరిస్థితి ఉత్పన్నమౌతుందని ఆందోళన వ్యక్తం చేశారు. కేవలం ఖర్చు తగ్గుతుందన్న నెపంతో కేంద్రం జమిలి ఎన్నికల నిర్వహణకు మొగ్గు చూపడమంటే.. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమే ఔతుందని పేర్కొన్నారు.
జగన్ హయాంలో లిక్కర్ మాఫియా రాజ్యమేలిందన్న షర్మిల, నాసిరకం మద్యంతో ప్రజల ఆరోగ్యాన్ని గుల్ల చేయడంతో పాటు రాష్ట్ర ఆదాయాన్ని కూడా కొల్లగొట్టారన్నారు. జగన్ హయాంలో కంటైనర్ల కొద్దీ మాదకద్రవ్యాలు రాష్ట్రంలోకి వచ్చాయని ఆరోపించారు.
రాజంపేటలో కూటమి నాయకుల రాజకీయం రాజుకుంది.
వ్యవస్థను కాపాడాల్సిన వారే విద్రోహానికి పాల్పడుతున్నారా? అనే అంశాలపై ప్రముఖ విశ్లేషకుడు అప్పసాని రాజేష్ తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో కూలంకషంగా వివరించారు.
గ్లోబల్ ప్రపంచంలో ఒక చోట రేగే చిచ్చు, ఖండాలు దాటి మన వంటింటి గ్యాస్ ధరను, మన పిల్లల సాఫ్ట్వేర్ ఉద్యోగాలను కూడా ప్రభావితం చేస్తుంది.
టీవల బొత్సకు బ్రెయిన్ స్ట్రోక్ తగిలి తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. కోలుకుని ఆయన మండలికి వచ్చారు. అప్పుడు ఆయనకు లోకేష్ సాదరంగా ఆహ్వానించిన తీరు పట్ల లోకేష్ పై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. అదే గతంలో చంద్రబాబు పై జగన్ చేసిన వ్యాఖ్యలపై పార్టీలకు అతీతంగా అందరూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఓడలు బండ్లు అవుతాయి. బండ్లే ఓడలవుతాయి అన్న సామెతకు నేటి జగన్ పరిస్థితి అచ్చుగుద్దినట్లు సరిపోతుందంటున్నారు పరిశీలకులు. ఒక్కోసారి అవసరం తీరిపోయిన తర్వాత విసిరేసిన తెడ్డే.. చివరికి పడవ బోల్తా పడ్డప్పుడు దిక్కవుతుంది. అన్నదానికి జగన్ అపరిపక్వంతో కూడుకున్న రాజకీయ విధానాలే ఉదాహరణంటున్నారు.
కూటమి ఐక్యత ప్రాధాన్యతను జనసేనాని, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అసెంబ్లీ వేదికగా వివరించడం కిరణ్ రాయల్ వంటి నేతలకు చెంపపెట్టుగానే పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. కూటమి ఐక్యత వల్ల ఎంత మేలు జరుగుతుందో పవన్ కల్యాణ్ విడమరచి చెప్పారు.
రెండు స్థానాలు ఖాళీ అయి.. కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫకేషన్ జారీ చేయగానే.. బీఆర్ ఎస్ మైనారిటీ నాయకుడు, మాజీ హోం మంత్రి మహమూద్ అలీని రంగంలోకి దింపుతామన్న సంకేతాలు ఇచ్చింది. అలాగే రేవంత్ రెడ్డి వేంనరేందర్ రెడ్డి అభ్యర్థిత్వం కోసం పట్టుబడుతుండటంతో.. బీఆర్ఎస్ బీసీ నాయకుడిని రంగంలోకి దింపడం ద్వారా, రేవంత్ బీసీలకు ప్రాధాన్యం ఇస్తున్నామని చెప్పుకోవడాన్ని నిలదీసి ఇరుకున పెట్టాలని కూడా భావించినట్లు చెబుతున్నారు.
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆదేశాల మేరకు ఆయన గురువారం విచారణకు హాజరయ్యారు. ఈ నెల 9 వరకూ ప్రతిరోజూ విచారణకు హాజరవ్వాల్సిందే. ఈ నేపథ్యంలోనే సీనియర్ జర్నలిస్టు డీవీ శ్రీనివాసరావు తెలుగువన్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ కేసు పూర్వాపరాలు, పర్యవశానాలపై విశ్లేషించారు.
రేవంత్ ని అంచెలంచెలుగా ఎదిగేలా చేసి ఎంపీగా, ఆ తర్వాత సీఎంగా అవ్వడానికి దారి తీసింది. ఎవరిని ఎమ్మెల్సీ చేయాలని ఆనాడు రేవంత్ భావించారో, అదే వేం నరేందర్ రెడ్డి.. నేడు ఆయన రాజకీయ సలహాదారుగా క్యాబినేట్ ర్యాంకులో ఉంటూనే.. ఇప్పుడు పెద్దల సభలోకి సగర్వంగా అడుగు పెడుతున్నారు.