ఫ్లాష్ న్యూస్... డిప్రెషన్లో జగన్.. సైకో థెరఫీ!

Publish Date:May 9, 2024

Advertisement

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల రణరంగంలో ఎన్టీయే కూటమి పార్టీలు ముమ్మరంగా ప్రచారం చేస్తున్నాయి. మూడు రోజుల్లో ప్రచార గడువు ముంచుకొస్తున్న నేపథ్యంలో కూటమి పార్టీలన్నీ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ ప్రచారం చేస్తున్నాయి. మరోవైపు కాంగ్రెస్ పార్టీ తరఫున షర్మిలమ్మ ప్రచారంలో దుమ్ము దులిపేస్తూ, జగనన్న మీద దుమ్మెత్తి పోస్తున్నారు. 

ప్రతిపక్షాలు ఇంత భారీ స్థాయిలో ప్రచారం చేస్తుంటే, అధికార పార్టీ నాయకుడు, అంగబలం, అర్థబలం వున్న నాయకుడు జగన్ మాత్రం తాడేపల్లి కోటను దాటికి బయటకి రావడం లేదు. చాలామంది అనుకుంటున్నది ఏమిటంటే, ఓటమి చెందబోతున్నానని అర్థం చేసుకున్న జగన్ ఇక ప్రచారం చేయడం ఎందుకులే అని చేతులెత్తేశాడని, ఎన్నికలు ముగిసిన తర్వాత లండన్ వెళ్ళిపోవడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారని... అయితే తాడేపల్లి కోటకు సంబంధించిన వర్గాలు చెబుతున్నది వేరేలాగా వుంది.

జగన్ ఇప్పుడు పూర్తిస్థాయి డిప్రెషన్లో కూరుకుపోయి వున్నారట. ఓటమి తప్పదని తెలిసిన తర్వాత ఆ డిప్రెషన్ మరింతగా పెరిగిపోయిందట. మొన్న మచిలీపట్నం సభలో గొంతు వణికేలా ప్రసంగించిన జగన్, కేవలం ఫిజికల్‌గా ఏడవలేదంతే, దాదాపు ఏడ్చినంత పనిచేశారు. ఆ మీటింగ్ తర్వాత జగన్ మానసిక పరిస్థితి మరింత దారుణంగా తయారైందట. తాను ఇన్ని బటన్లు నొక్కినా, జనం ఎన్నికలలో తన ఫ్యాన్ గుర్తు బటన్ నొక్కడానికి ఇష్టపడటం లేదని అర్థం చేసుకున్న ఆయన భారీ స్థాయిలో హర్టయ్యారట. ఐదేళ్ళ నుంచి తాను వేసిన ప్లాన్ ఇలా అట్లర్ ఫ్లాప్ కావడం, ఓటమి తర్వాత తాను జైలుకు వెళ్ళడం తప్ప మరొక మార్గం లేకపోవడంతో జగన్ భారీ స్థాయిలో డిప్రెషన్లో కూరుకుపోయాడని తెలుస్తోంది.

గత ఎన్నికలలో ఒకవైపు జగన్, మరోవైపు షర్మిల, ఇంకోవైపు విజయమ్మ, మరోవైపు అంతర్లీనంగా బ్రదర్ అనిల్ కుమార్... ఇలా చాలామంది జగన్‌కి మద్దతుగా ప్రచారం చేశారు. ఇప్పుడు తాను పూర్తిగా ఒంటరి అయిపోవడం, పరిస్థితులన్నీ తనకు వ్యతిరేకంగా మారడం, జనం మూడ్ పూర్తిగా అవతగం కావడంతో జగన్ డిప్రెషన్ లోయలోకి పడిపోయారని తెలుస్తోంది. ఆయన్ని డిప్రెషన్ నుంచి బయటకి తీసుకురావడానికి ప్రస్తుతం ఆయనకు సైకాలజిస్టుల చేత సైకో థెరఫీ జరుగుతోందని చెబుతున్నారు. డిప్రెషన్ తగ్గడానికి పవర్ ఫుల్ మందులు కూడా వాడుతున్నారని సమాచారం. ఆ ‘సైకో’ థెరపీ, డిప్రెషన్ మందుల సహకారంతో ప్రస్తుతం జగన్ బండి నడుస్తున్నట్టు తెలుస్తోంది.

By
en-us Political News

  
రాష్ట్రంలో హాట్ నియోజకవర్గాలలో ఒకటైన పిఠాపురంలో అత్యధికంగా 86.86శాతం పోలంగ్ నమోదైన సంగతి విదితమే. ఇక్కడ నుంచి జనసేనాని పవన్ కల్యణ్ పోటీ చేయగా ఆయనకు ప్రత్యర్థిగా వైసీపీ నుంచి కాకినాడ సిట్టింగ్ ఎమ్మెల్యే వంగా గీత బరిలోకి దిగారు.
దేశంలో ఈసారి సార్వత్రిక ఎన్నికలు మొత్తం 7 దశల్లో నిర్వహిస్తుండగా, ఇప్పటివరకు నాలుగు దశల పోలింగ్ పూర్తయింది. ఇటీవలే మే 13న నాలుగో దశ పోలింగ్ జరిగింది. ఇక, ఇవాళ దేశంలో ఐదో దశ పోలింగ్ ప్రారంభమైంది.  ఐదో విడతలో భాగంగా 6  రాష్ట్రాలు, 2 కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 49 లోక్ సభ స్థానాలకు పోలింగ్ నిర్వహించనున్నారు. ఉత్తరప్రదేశ్ లో 14, మహారాష్ట్రలో 13, పశ్చిమ బెంగాల్ లో 7, బీహార్ లో 5, ఒడిశాలో 5, ఝార్ఖండ్ లో 3, జమ్మూకశ్మీర్ లో 1, లడఖ్ లో 1 లోక్ సభ స్థానాలకు పోలింగ్ నిర్వహించనున్నారు
ఆదివారం నాడు హెలికాప్టర్ ప్రమాదానికి గురైన ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ దుర్మరణం పాలైనట్టు ఇరాన్ అధికారికంగా ప్రకటించింది
ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల అనంతరం గెలుపు ఓటములపై బెట్టింగులు జోరుగా సాగుతున్నాయి. అయితే ఈ సారి గెలుపు విషయంలో తెలుగుదేశం కూటమివైపే బెట్టింగు రాయుళ్లు మొగ్గు చూపుతున్న పరిస్థితి.
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతున్నది. సోమవారం (మే 20) ఉదయం శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో కంపార్ట్ మెంట్లన్నీ నిడిపోయి క్యూలైన్ కృష్ణ తేజ గెస్ట్ హౌస్ వరకూ సాగింది.
ఎన్నో అంచనాలతో విడుదలైన వైసీపీ సినిమా అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. నిర్మాత, దర్శకుడు, హీరో అయిన జగన్ ఈ సినిమాని హింసాత్మకంగా, దారుణంగా రూపొందించడంతో ఆంధ్రా ప్రజలు రిజెక్ట్ చేశారు. ఫస్ట్ రిలీజ్‌లోనే ఈ సినిమాని జనం భరించలేకపోయారు.. ఇక సెకండ్ రిలీజ్ కూడానా?!
ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ప్రమాదానికి గురైంది. ఆయన అజర్ బైజాన్ వెళ్తూ వుండగా వాతావరణం అనుకూలించక హెలికాప్టర్ కూలిపోయిందని తెలుస్తోంది.
భూటాన్ రాజధాని ధింపూలో అసోసియేషన్ ఆఫ్ బుద్ధిష్ట్ టూర్ ఆపరేటర్స్ కార్యాలయాన్ని ఆ సంస్థ ఉపాధ్యక్షుడు మల్లేపల్లి లక్ష్మయ్య ప్రారంభించినట్టు ఏబీటీవో ప్రధాన కార్యదర్శి డాక్టర్ కౌలేష్ కుమార్ తెలిపారు.
గ‌తం కంటే ఎక్కువ స్థానాల్లో విజ‌యం సాధించ‌బోతున్నామంటూ ఏపీ సీఎం, వైసీపీ అధినేత జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఇటీవ‌ల ఐప్యాక్ బృందంతో స‌మావేశ‌మైన స‌మ‌యంలో ధీమా వ్య‌క్తం చేశారు. వైసీపీ ముఖ్య నేత‌లు సైతం 150 నుంచి 160 స్థానాల్లో విజ‌యం సాధించ‌బోతున్నామ‌ని చెప్పుకుంటూ వ‌స్తున్నారు.
రాజ‌కీయాల్లో ఓడ‌లు బండ్లు.. బండ్లు ఓడలు కావ‌డానికి పెద్ద ఎక్కువ కాలం ప‌ట్ట‌దు. అధికారంలో ఉన్నంత సేపు ఈగ‌ల గుంపులా పార్టీ ముఖ్యుల చుట్టూ ప్రదక్షిణలు చేసే నేత‌లు.. అధికారంలో కోల్పోయిన త‌రువాత వారి వైపు కూడా చూడ‌రు.
రిజల్ట్స్ కౌంట్‌డౌన్ కొటేషన్-17
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.