రోజాకు టీటీడీ ప్రొటోకాల్ దర్శనం? అసలేం జరుగుతోంది?

Publish Date:Jan 12, 2025

Advertisement

జగన్ ఐదేళ్ల అరాచకపాలనను జనం అసహ్యించుకున్నారు. ఆయన కేబినెట్ లోని కొందరు మంత్రుల తీరును, వారి అసహ్యకరమైన భాషను భరించలేకపోయారు. అందుకే ఎన్నికలలో ఆ పార్టీకి కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఘోరాతి ఘోరంగా ఓడించి బుద్ధి చెప్పారు. తెలుగుదేశం కూటమికి చారిత్రాత్మక విజయం కట్టబెట్టారు. బూతులతో రెచ్చిపోయిన మంత్రులలో ఒక్కరంటే ఒక్కరు కూడా విజయం సాధించలేదంటే.. జనం వారిని ఎంతగా ఏవగించుకున్నారో ఇట్టే అవగతమౌతుంది. ప్రజా తిరస్కారానికి గురైన వైసీపీ నేతల అక్రమాలు, దౌర్జన్యాలపై తెలుగుదేశం కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అంతా భావించారు. భావించడం కాదు.. ఐదేళ్ల పాటు తమను అష్టకష్టాలూ పెట్టిన వైసీపీయుల అరాచకత్వం, దౌర్జన్యం, దుర్మార్గం, అవినీతి, అక్రమాలపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలనే జనం కూటమికి బ్రహ్మరథం పడుతూ తీర్పు ఇచ్చారు.  

వైసీపీ నేతలు కూడా తమ తప్పులకు కూటమి ప్రభుత్వంలో శిక్ష తప్పదని అనుకున్నారు.   దీంతో భయంతో వణికి పోతూ ఈ ఆరు నెలలూ దాదాపు అజ్ణాత వాసం గడిపారు. అధికారం అండతో ప్రత్యర్థులపై బూతులతో రెచ్చిపోయిన వారిలో  రోజా కూడా ఒకరు. ఆమెకు నగరి ప్రజలు ఓటుతో బుద్ధి చెప్పారు. వరుసగా రెండు సార్లు విజయం సాధించిన నగరి నియోజకవర్గం నుంచి ఆమెను ఓడించారు. ఆ ఓటమి ఎంత ఘోరంగా ఉందంటే.. పోలింగ్ రోజునే రోజా తన ఓటమిని అంగీకరించేసి కౌంటింగ్ సెంటర్ నుంచి వెళ్లిపోయారు. బూతల రోతతో పాటు.. పర్యాటక మంత్రిగా ఆమె కోట్లాది రూపాయల అవినీతికి పాల్పడ్డారన్న ఆరోపణలూ ఉన్నాయి. వీటన్నిటిపైనా ఆమెపై విచారణ జరిపి చట్ట ప్రకారం చర్యలుంటాయని అంతా భావించారు. రోజా కూడా అదే భయంతో ఓటమి తరువాత చాలా కాలం ఎవరికీ ముఖం చూపకుండా చెన్నై చెక్కేశారు.

అయితే ఈ ఆరు నెలల కాలంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం కూటమి ప్రభుత్వమే రోజా వంటి వారికి ధైర్యం నూరి పోసినట్లుగా వ్యవహరించింది. అక్రమాలు, దౌర్జన్యాలకు పాల్పడిన వారిపై చర్యలు లేవు. కేసులు లేవు. జగన్ హయాంలోఅధికారం అండతో ఇష్టారీతిగా వ్యవహరించిన వారిపై ఎటువంటి ప్రతీకార చర్యలు ఉండవని స్వయంగా సిఎం చంద్రబాబు నాయుడు, డెప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్‌ ప్రకటించారు. మాటవరసకైతే ప్రతీకార చర్యలు ఉండవని అన్నారు కానీ, చేతలలో మాత్రం అసలు అటువంటి వారిపై చర్యలు తీసుకునే ఉద్దేశమే తమకు లేదని చాటారు. దీంతో తెలుగుదేశం కూటమి ప్రభుత్వంలో తమకు వచ్చిన ఇబ్బందేమీ ఉండదని అర్ధం చేసుకున్న వైసీపీ నేతలు ఇప్పుడు మళ్లీ బయటకు వచ్చి తామే అధికారంలో ఉన్నామన్నట్లుగా ఇష్టారీతిగా వ్యవహరించడం మొదలు పెట్టారు. తెలుగుదేశం కూటమి మెతకతనాన్ని అలుసుగా తీసుకుని  మళ్లీ గతంలోలాగే నోటికి పని చెబుతున్నారు.  వైసీపీ సోషల్ మీడియా కూడా గతంలోలాగే అసభ్య, అశ్లీల పోస్టులతో రెచ్చిపోతోంది. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, ఇతర నాయకులపై అనుచిత ఫొటోలు, వీడియోలతో రెచ్చిపోతోంది. తిరుపతి ఘటనలో వైసీపీ నేతలు వ్యవహరించిన తీరు చూస్తే వారందరికీ  తెలుగుదేశం కూటమి ప్రభుత్వం వారికి ఎంత అలుసు ఇచ్చిందో స్పష్టంగా అర్థమౌతోంది.  

ముఖ్యంగా  మాజీ మంత్రి రోజా తిరుపతి తొక్కిసలాట ఘటన జరిగిన తరువాత నుంచీ రోజుకు రెండు మూడు సార్లు మీడియా ముందుకు వస్తూ ఈ ఘటనకు చంద్రబాబు బాధ్యత వహించి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అంతే కాదు ఆయనది ఐరన్ లెగ్ అంటూ రెచ్చిపోయారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ప్రతి సారీ రాస్ట్రంలో ఇటువంటి విషాద ఘటనలు జరుగుతాయంటూ నోటికొచ్చినట్లు మాట్లాడారు. అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పైనా నోటికొచ్చినట్లు విమర్వలు చేశారు. అటువంటి  రోజా, శనివారం ఉదయం తిరుమల స్వామివారి దర్శనానికి వెళితే, ఆలయ అధికారులు, టీటీడీ సిబ్బంది ఆమెకు ప్రోటోకాల్ మర్యాదలతో బ్రేక్ దర్శనం చేయించి సాగనంపారు. దర్శనం చేసుకు వచ్చిన తర్వాత కూడా ఆమె మళ్ళీ మరోసారి టీటీడీ, సిఎం చంద్రబాబు నాయుడులపై నిప్పులు చెరిగారు. అసలు కనీసం ఎమ్మెల్యే కూడా కాని రోజాకు ప్రొటోకాల్ దర్శనం ఎలా సాధ్యమైందన్నదానికి టీటీడీ సమాధానం చెప్పాలి. అసలు ఆమె పేరును ఎవరు సిఫారసు చేశారు? దానిని ఎవరు ఆమోదించారు అన్న విషయం తేలాల్సి ఉంది.  మంత్రిగా ఉన్న సమయంలో రోజా ప్రొటోకాల్ దర్శనం పేరిట వందల మందిని తనతో తీసుకువెడుతూ దర్శనం టికెట్లను సొమ్ము చేసుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. కనీసం ఎమ్మెల్యే కూడా కాని రోజాకు తిరుమలలో ప్రొటోకాల్ దర్శనం ఎలా సాధ్యమైంది?  పరిస్థితి చూస్తుంటే ప్రభుత్వ మెతకతనాన్ని అధికారులు కూడా అలుసుగా తీసుకుని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారా అన్న అనుమానాలు వెల్లువెత్తుతున్నాయని పరిశీలకులు అంటున్నారు. అసలు ప్రభుత్వానికి యంత్రాం గంపై పట్టులేనట్టు కనిపిస్తోందనీ, ఇప్పటికీ క్షేత్రస్థాయిలో వైసీపీయుల హవాయే నడు స్తోందని అనిపిస్తోందని అంటున్నారు. 

By
en-us Political News

  
జీవన్ రెడ్డి, కేటీఆర్ లు సంయుక్తంగా మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ సూచన మేరకే సహచరులతో కలిసి జీవన్ రెడ్డిని సాదరంగా ఆహ్వానిం చేందుకు ఆయన నివాసానికి వచ్చినట్లు చెప్పారు. 2014 ఎన్నికలకు ముందే కేసీఆర్ జీవన్ రెడ్డిని బీఆర్‌ఎస్‌లో చేరాలని ఆహ్వానించారన్నారు.
ల్లిమర్ల ఎమ్మెల్యే లోకం మాధవిపై ఎన్నికల అక్రమాల ఆరోపణలు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. మిరాకిల్ సాఫ్ట్ వేర్ సంస్థ ద్వారా ఉద్యోగుల ఖాతాల్లో భారీగా నగదు జమ చేసి.. ఆ నగదును ఎన్నికల ఖర్చులకు మళ్లించారనే ఫిర్యాదు ఈసీకి చేరింది. దీనిపై సమగ్ర విచారణకు ఈసీ ఆదేశాలు జారీ చేసింది. ఇక వేళ ఆ ఆరోపణలు నిజమని రుజువైతే.. ఆమె పదవికి ముప్పు ఉండొచ్చని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
కడప జిల్లా నేతలలైన పుట్టా సుధాకర్, వరదరాజులు రెడ్డి, మాధవి రెడ్డిపై లోకేష్ ఫైరయ్యారు. ఈ నెల మొదటి వారంలో జరిగిన సమీక్షలో, నారా లోకేష్ కడప జిల్లా నేతలపై బహిరంగంగానే అసహనం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా ఫిర్యాదుల విన్నపం కార్యక్రమాలకు ఈ నేతలు హాజరుకాకపోవడంపై నిలదీసినట్లు చెబుతున్నారు.
రాజకీయాల్లో నిరంతరం ఉండే సవాళ్లు, మానసిక ఒత్తిడి కారణంగానే తాను దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడ్డానన్న రోజా.. తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన తరువాత తనకు బ్లడ్ ప్రషర్ సమస్య వచ్చిందనీ, ఇక రెండో సారి ఎమ్మెల్యేగా ఎన్నికై, మంత్రిని అయిన తరువాత డయాబెటిస్ అటాక్ అయ్యిందనీ వివరించారు.
కష్టపడిన వారిని గుర్తించాలనేది పార్టీ సిద్ధాంతం అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు.
మావిగన్ ప్రతిపాదనతో జగన్ నెటిజనులకు ఒక ట్రోల్ మెటీరియల్ గా మారిపోయిన సంగతి తెలిసిందే. ఆ ప్రతిపాదనపై లెక్కలేనన్న మీమ్స్, సెటైర్లు నెట్టింట వెల్లువెత్తాయి. అయినా కూడా జగన్ తాను పట్టిన కుందేటికి మూడేకాళ్లన్న చందంగా మావిగన్ ను మించిన రాజధాని ఉండనే ఉండదన్నట్లు మాట్లాడుతున్నారు. అయితే ఇదే మావిగన్ ను ఆయన అధికారంలో ఉన్న ఐదేళ్ల కాలంలో ఎందుకు ముందుకు తీసుకురాలేదన్న ప్రశ్నకు మాత్రం జగన్ సమాధానం ఇవ్వడం లేదు.
కేరళలోని మొత్తం 140 అసెంబ్లీ స్థానాలకు, పుదుచ్చేరిలోని 30 స్థానాలకు రేపు ఒకేసారి ఓటింగ్ నిర్వహించనున్నారు. అలాగే అస్సాంలో 126 స్థానాలకూ కూడా ఒకే విడతలో పోలింగ్ జరగనుంది. గతంలో బహుళ విడతల్లో ఎన్నికలు జరిగినప్పటికీ, ఈసారి మాత్రం ఒకే విడతలో పోలింగ్ నిర్వహిస్తున్నారు.
సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ఏర్పాటు నేపథ్యంలో విజయవాడలోని లోకో పైలట్ల గాలా(సికింద్రాబాద్) డిపోను తరలించకుండా విజయవాడలోనే కొనసాగించేలా తగిన చర్యలు తీసుకోవాలని ఆ డిపో సిబ్బంది మంత్రి నారా లోకేష్ ను కలిసి విజ్ఞప్తి చేశారు. విజయవాడ బోర్డును కొండపల్లి నుంచి మోటమర్రికి పెంచడం వల్ల గత 17 ఏళ్లుగా విజయవాడలో ఉన్న సికింద్రాబాద్(గాలా) డిపో ఉనికి సందిగ్ధంలో పడిందని, డిపోను మోటమర్రికి లేదా డోర్నకల్ కు తరలిస్తారనే ప్రచారంతో సుమారు 500 కుటుంబాలు ఆందోళన చెందుతున్నాయనే విషయాన్ని మంత్రి దృష్టికి తీసుకువచ్చారు.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల సమరం తుది ఘట్టానికి చేరుకుంది.
సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన కిద్వాయ్, గాంధీ కుటుంబానికి అత్యంత సన్నిహితురాలిగా గుర్తింపు పొందారు. మోహ్సినా కిద్వాయ్ అంత్యక్రియలు ఢిల్లీలోని నిజాముద్దీన్ స్మశాన వాటికలో బుధవారం (ఏప్రిల్ 8) సాయంత్రం నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
జగన్ చుట్టపుచూపుగా రాష్ట్రానికి వస్తున్నారు. అడపాదడపా పరామర్శలంటూ రోడ్ షోలు నిర్వహిస్తున్నారు. ఆ సమయంలో వినా మిగిలిన సమయంలో రాష్ట్రంలో వైసీపీ పరిస్థితి ఉనికి మాత్రంగానే మారింది. గత ఎన్నికలలో వైసీపీ కేవలం 11 స్థానాలలో మాత్రమే గెలిచిన సంగతి తెలిసిందే. ఆ గెలిచిన స్థానాలలో కూడా వెసీపీ స్తబ్దుగానే ఉంది. అయితే మచిలీపట్నంలో మాత్రం వైసీపీ హడావుడి ఒకింత ఎక్కువగా ఉంది.
ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన జనసేన నేతలు ద్వారంపూడిపై చర్యల తీసుకోవాల్సిందే అని ఒత్తిడి తీసుకువస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అవినీతి బండారాన్ని బట్టబయలు ప్రభుత్వం పకడ్బందీగా అడుగులు వేస్తున్నదని అంటున్నారు. రాష్ట్ర రైస్ మిల్లర్స్ అసోసియేషన్‌లో ద్వారంపూడికి ఉన్న పట్టును సడలించడం ద్వారా ఆయన ప్రాభవాన్ని తగ్గించాలని ప్రయత్నిస్తున్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై అంబటి రాంబాబు అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై అంబటి రాంబాబును కొద్ది రోజుల కిందట గుంటూరు జిల్లా నల్లపాడు పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపారు. అయితే.. ఆ సమయంలో పోలీసు స్టేషన్‌లో తనను చిత్రహింసలకు గురిచేశారని ఆరోపిస్తూ అంబటి రాంబాబు తాజాగా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.