కొత్త జిల్లాలు వస్తే.. కొత్త వెలుగులొస్తాయా?

Publish Date:Jan 28, 2022

Advertisement

ఇప్పుడు ఏపీలో ఏ ఇద్దరు రాజకీయ నాయకులు కలిసిన ఒకటే, చర్చ. జిల్లాల పునర్విభజన. కాదంటే ఉద్యోగుల సమ్మె. నిజానికి, ఈ రెండు వేర్వేరు విషయాలు కాదు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వ్యూహాత్మకంగా వేస్తున్న తప్పుడు అడుగులకు పుణ్యమే, ఈ రెండు సమస్యలు. పీఆర్సీ మంటలను చల్లార్చేందుకు, వ్యూహాత్మకంగా జగన్ రెడ్డి ప్రభుత్వం జిల్లాల విభజన అంశాన్ని తెరమీదకు తెచ్చింది. అయితే, ‘కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడొచ్చింది’ అన్నట్లు, ఉద్యోగుల పీఆర్సీ సమస్యకు వేసిన జిల్లాల విభజన మందు వికటించింది. పీఆర్సీ సమస్య చల్లారలేదు. కానీ కొత్త జిల్లాల సమస్య నెత్తినెక్కి కూర్చుంది. సర్కార్ చిక్కులో చిక్కుంకుంది. ఒక విధంగ జనంలో నవ్వుల పాలవుతోంది.    
 

అదలా ఉంచి, విషయంలోకి వస్తే, జిల్లాల సంఖ్యను పెంచడం వలన చేత, ఏమిటి ప్రయోజనం, ఎవరికి ప్రయోజనం? అని ఆలోచిస్తే, సామన్య ప్రజలకు పెద్దగా ప్రయోజనం ఉండక పోవచ్చును కానీ, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు, కొంచెం చాలా ప్రయోజనం ఉంటుందని అంటున్నారు. అలాగే రాజకీయ బేహారులకు కూడా కొంచెం ఎక్కువ ప్రయోజనం ఉండవచ్చును. పొరుగున ఉన్న తెలుగు రాష్ట్రం తెలంగాణ విషయమే తీసుకుంటే, ఏపీలో ఉన్న 13 జిల్లాలను 26 చేస్తే, తెలంగాణలో పాత 10 జిల్లాను,ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసేఆర్, ‘బంగారు’ తెలంగాణ స్కీములో  భాగంగా  ఏకంగా 33 జిల్లాలను చేశారు.
 

ఇలా ముఖ్యమంత్రి కేసీఆర్, ‘ముందు’  చూపుతో పది జిల్లాలను 33 జిల్లాలు చేశారు  కాబట్టే, 33 మందికి జిల్లా అధ్యక్ష పదవులు దక్కాయి. అలాగే, రాజకీయ బేహారులకు, అటు రాజకీయ పదవులు , అటు నామినేటెడ్ పదవులు మరిన్ని దక్కుతాయి. భవన నిర్మాణాలు చేపట్టడం వలన, మేఘా వంటి మేడి పండు కంపెనీలకు ఏమైనా మేలు జరిగిదేమో కానీ, జనాలకు అయితే ఇంతవరకు ఎలాంటి ప్రయోజనం జరగలేదని అంటున్నారు. మహా అయితే, ప్రయాణ ఖర్చులు పది రూపాయలు ఏమైనా మిగిలితే మిగిలాయి ఏమో కానీ, అంతకు మించి ప్రయోజనం ఏమీలేదని సామాన్యులు అంటున్నారు.
 

తెలంగాణలో జిల్లాల విభజన తర్వాత కొత్త కలెక్టరేట్’లు, కొత్త ఎస్పీ ఆఫీసులు సహా ఇతర కార్యాలయాలన్నీ ఆయా కేంద్రాల్లో ఏర్పాటయ్యాయి. ఆ స్థాయిలో కొత్త ఉద్యోగాల కల్పన జరగలేదు. జిల్లాలతో పాటుగా నిరుద్యోగ సమస్య కూడా పెరుగుతోంది. నిరుద్యోగుల ఆత్మహత్యలు పెరుగుతున్నాయి.కానీ, తెలంగాణ ప్రభుత్వం కొత్త జిల్లాలను పరిగణనలోకి తీసుకుని చేపట్టిన ఉద్యోగులు, ఉపాధ్యాయుల బదిలీలు, పెను దుమరాన్నే సృష్టించాయి. కుటుంబాలు చిన్నభిన్నమయ్యాయి. ఆత్మహత్యలకు కారణమయ్యాయి. ఇలా ఎలా చూసినా, తెలంగాణలో జిల్లాలు పెరిగినా అభివృద్ధి జరగలేదు. ఆత్మహత్యలు ఆగలేదు.


ఇక ఏపీలో పాలనా సౌలభ్యం కోసం జిల్లాలు విభజిస్తున్నామని సర్కార్ సారులు చెబుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం కూడా అదే చెపుతోంది. కానీ, జరిగేది మాత్రం వేరుగానే ఉంటుందని వేరే చెప్పనక్కర లేదు. తెలంగాణలో ఏమి జరుగిందో, ఏపీలోనూ అదే జరుగుతుంది. ఇప్పటికే ఒక అనాలోచిత నిర్ణయంతో గ్రామ సచివాలయాలు, వాలంటీర్ వ్యవస్థతో జీతాల భారం పెరిగి, చివరకు జీతాలు ఇవ్వలేని స్థితికి పరిస్థితి దిగజారింది.  ఇలాంటి పరిస్థితుల్లో పాలనా సౌలభ్యం కోసం అంటూ కొత్త భారాన్ని నెత్తికి ఎత్తుకోవడం అవసరమా? పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్లు తెలంగాణను చూసి ఏపీ వాతలు పెట్టుకోవడం అవసరమా? అసలు, ఈరోజు కార్యాలయాలకు వెళ్లి పనులు చేసుకోవలసిన అవసరమే తగ్గిపోతున్నప్పుడు, పరిపాలనా సౌలభ్యం కోసం భారం పెంచుకోవడం, వివేకం అనిపించుకుంటుందా?ఆ పెట్టే ఖర్చేదో, సాంకేతిక సదుపాయలను మెరుగు పరచుకునేందుకు ఉపయోగించుకుంటే, పరిపాలనా సౌలభ్యం ఏర్పడుతుంది, అవినీతి కూడా అంతో ఇంతో తక్కుతుందని, ప్రభుత్వం ఆ కోణంలో ఆలోచిస్తే ఉభయతారకంగా ఉంటుందని అంటున్నారు.

 

By
en-us Political News

  
భారతీయ రాజకీయాల్లో సాధారణంగా కనిపించే శత్రుత్వాలు,
ఈ ప్రాజెక్టు ద్వారా రాయలసీమ ప్రాంతంలో సుమారు 15 వేల‌ నుంచి 20 వేల‌ మంది వ‌ర‌కూ ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని ఒక‌ అంచనా. అయితే ఈ ప‌రిశ్ర‌మ ఇక్క‌డ స్థాపించ‌డంపై మాజీ మంత్రి పేర్ని నాని చేసిన కామెంట్లు ఇప్పుడు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి.
కాంగ్రెస్ హైకమాండ్ కు, మరీ ముఖ్యంగా గాంధీ కుటుంబానికి అత్యంత సన్నిహితుడిగా గుర్తింపు పొందిన వీహెచ్ రాజ్యసభకు మూడు పర్యాయాలు ఎంపికయ్యారు. అయితే 2016 తర్వాత ఇంత వరకూ ఆయనకు పార్టీ పరంగా ఎటువంటి పదవీ దక్కలేదు.
కేరళం ప్ర‌జ‌ల‌కు దశాబ్దాలుగా సేవ చేస్తూ, విలువలతో కూడిన‌ రాజకీయాలు చేసే సతీశన్‌కు ఈ పదవి రావడం సముచిత గుర్తింపని రేవంత్ పేర్కొన్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజల ప్రజాస్వామ్యం, సామాజిక న్యాయం, సమగ్రాభివృద్ధికి మద్దతుగా నిలిచిన కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్‌కు అధికార బాధ్యతలు అప్పగించారని అన్నారు.
ఎల్‌డీఎఫ్ హయాంలో వి.డి.సతీశన్ ప్రతిపక్ష నేతగా ఉన్నారు. క్లిష్ట సమయలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడం కోసం ఆయన తీవ్రంగా శ్రమించారు. అంతే కాకుండా కాంగ్రెస్ పార్టీని ప్రతిపక్షం నుంచి అధికార పక్షంలోకి తీసుకు రావడంలో సతీశన్ కీలక పాత్ర పోషించారు. కేరళం కాంగ్రెస్ కేడర్‌లో కూడా ఇదే అభిప్రాయం బలంగా ఉంది. ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకున్న అధిష్ఠానం సీఎంగా సతీశన్ ను ఎంపిక చేసింది.
సాధారణంగా ముఖ్యమంత్రులు, మంత్రుల పర్యటనల సమయంలో భద్రతా కారణాల రీత్యా పెద్ద సంఖ్యలో వాహనాలు కాన్వాయ్‌లో ఉంటాయి. అయితే.. దీనివల్ల భారీగా ఇంధన వ్యయం అవ్వడమే కాకుండా.. ట్రాఫిక్ ఇబ్బందులు కూడా తలెత్తుతున్నాయని భావించిన సీఎం, డిప్యూటీ సీఎం.. ఖజానాపై అనవసర భారం పడకూడదనే ఉద్దేశంతో, భద్రతకు విఘాతం కలగకుండానే వాహనాల సంఖ్యను తగ్గించాలని నిర్ణయించారు.
తీవ్రమైన పోక్సో కేసు విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి బండి సంజయ్ మధ్య రహస్య ఒప్పందం కుదిరిందని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. ఆ కారణంగానే బండి కుమారుడిపై పోక్సో కేసు నీరుగారిపోయిందని ధ్వజమెత్తారు.
హైదరాబాద్‌ను ఏ విధంగా ఐటీ, హెల్త్ హబ్‌గా మార్చానో గుర్తు చేస్తూ.. అమరావతిని అంతకంటే అద్భుతమైన నగరంగా నిర్మిస్తానని చంద్రబాబు చెప్పారు. హైదరాబాద్ గతమైతే, అమరావతి భవిష్యత్తు అని ఆయన వ్యాఖ్యానించారు.
ఇటీవల శస్త్ర చికిత్స చేయించుకుని దాదాపు మూడు వారాల పాటు విధులకు దూరంగా హైదరాబాద్ లో విశ్రాంతి తీసుకున్న ఆయన బుధవారం ఉదయం అమరావతిలోని తన క్యాంపు కార్యాలయానికి చేరుకుని విధుల్లో నిమగ్నమయ్యారు.
ఈ బలపరీక్షలో విజయ్ ప్రభుత్వానికి అనుకూలంగా 144 మంది శాసనసభ్యులు మద్దతు పలకగా.. 22 మంది వ్యతిరేకంగా ఓటు వేశారు. మరో ఐదుగురు ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు.
అయితే 2024 ఎన్నికలలో తెలుగుదేశం కూటమి అధికార పగ్గాలు చేపట్టిన నాటి నుంచి అమరావతి నిర్మాణ వేగం పెరిగింది. అయినా వైసీపీ అధినేత మావిగన్ ప్రతిపాదన, అమరావతి పురోగతిని అడుగడుగునా అడ్డుకోవడమే లక్ష్యంగా ఆయన చేస్తున్న వ్యాఖ్యలు, వ్యవహరిస్తున్న తీరు మాత్రం అమరావతి అనిశ్చితి మేఘాలు పూర్తిగా తొలగిపోకుండా ఉండేందుకు కారణమయ్యాయి.
బండి బగీరథ ఈ కేసు నుంచి పులుకడిగిన ముత్యంలా బయటపడితేనే.. తిరిగి బండి సంజయ్ కు పార్టీలో ప్రాధాన్యత, గుర్తింపు ఉంటాయని అన్యాపదేశంగానే అయినా విస్పష్ట సందేశం ఇచ్చింది. ఇక కాంగ్రెస్ ప్రభుత్వమైతే.. చట్టం ముందు అంతా సమానమేనని స్పష్టం చేసింది.
ఇటీవలి శాసనసభ ఎన్నికల్లో విజయ్ తన కారు డ్రైవర్‌ రాజేంద్రన్ కుమారుడు శబరినాథన్‌కు విజయ్ టీవీకే తరఫున టికెట్ ఇచ్చారు. చెన్నైలోని విరుగంబాక్కం నియోజకవర్గం నుంచి పోటీ చేసిన శబరినాథన్ విజయం సాధించారు. తాజాగా ఆయన్ను ప్రభుత్వ చీఫ్ విప్‌గా నియమిస్తున్నట్లు ప్రకటించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.