సమైక్యవాదమంటే ప్రేమోన్మాది చేసే యాసిడ్ దాడి వంటిదే

Publish Date:Aug 29, 2013

Advertisement

 

టీ.జేయేసీ చైర్మన్ ప్రొఫెస్సర్ కోదండరామ్ తెలంగాణావాదులను ఉద్దేశించి మాట్లాడుతూ నేడు సీమంధ్రలో జరుగుతున్న సమైక్యఉద్యమం ప్రేమోన్మాది చేతిలో యాసిడ్ వంటిదని అన్నారు. సమైక్యవాదులు ఇతరుల హక్కులను, స్వేచ్చను గౌరవించడం నేర్చుకోవాలని ఆయన హితవు పలికారు. తెలంగాణకు అడ్డుపడితే ఊరుకొబోమని, తెలంగాణా సత్తా ఏమిటో చాటి చెపుతామని ఆయన అన్నారు. సెప్టెంబర్ 7న సిటీ కాలేజ్ నుంచి ఇందిరాపార్కు వరకు జరిగే తెలంగాణ సాధన ర్యాలీలో తెలంగాణా ప్రజలందరూ పాల్గొనాలని ఆయన విజ్ఞప్తి చేసారు. తెలంగాణపై జరుగుతున్న కుట్రలను అడ్డుకొనేందుకు మళ్ళీ ప్రజలందరూ ఉద్యమ బాట పట్టవలసిన అవసరం ఉందని అన్నారు. అందుకే సెప్టెంబర్ 1నుండి 6వరకు వరుసగా గ్రేటర్ హైదరాబాద్, ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, కరీంనగర్‌, వరంగల్‌, మహబూబ్‌నగర్ లలో పెద్ద ఎత్తున శాంతి ర్యాలీలు నిర్విహించబోతున్నామని వాటిలో ప్రజలందరూ కూడా పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు.

 

విద్యార్ధుల జీవితాలు తీర్చిదిద్దవలసిన ప్రొఫెసర్ కోదండరామ్ ఆపని చేయక చాల కాలమే అయ్యింది. మంచి వక్తగా పేరున్నఆయన ప్రతిభను కేసీఆర్ గుర్తించి తెలంగాణా ఉద్యమంలోకి ఆహ్వానించడంతో ఆయన దశ తిరిగింది. ఆయన తన జీవితమంతా ఆచార్యుడిగా పనిచేసినా రాని పేరు ప్రతిష్టలు, గుర్తింపు, రాజకీయంగా ఎదిగే అవకాశం అన్నీకూడా కేసీఆర్ మరియు తెలంగాణా ఉద్యమాల పుణ్యామని సంపాదించుకొన్నారు. టీ.జేయేసీ చైర్మన్ గా ఆయన కేసీఆర్ తో సమాన హోదా, పేరు ప్రతిష్టలు, సంపాదించుకొన్నతరువాత, ఆయన ఇప్పుడు కేసీఆర్ కే సవాలుగా మారారు. కేసీఆర్ చేపడుతున్న ఉద్యమాలకి సమాంతరంగా తాను ఉద్యమాలు నడుపుతూ ప్రజలలో గందరగోళం సృష్టిస్తున్నారు.

 

వచ్చేనెల 7వ తేదీన ఆంధ్ర యన్.జీ.ఓ.లు హైదరాబాదులో లక్షమంది ఉద్యోగులతో తలపెట్టిన బహిరంగసభను అడ్డుకొనేందుకు కేసీఆర్ 6వ తేదీన రెండు లక్షల మందితో హైదరాబాదులో శాంతి ర్యాలీలు నిర్వహించాలని పిలుపునిస్తే, ప్రొఫెసర్ కోదండరామ్ సెప్టెంబర్ 7న శాంతి ర్యాలీ జరపాలని పిలుపునీయడం, కేవలం తన ఉనికిని చాటుకోవడానికి చేస్తున్న ప్రయత్నమే తప్ప మరొకటి కాదు.

 

తెలంగాణా కోసం పోరాడుతున్న కేసీఆర్ తో, తెరాసతో ఆయన కలిసి పనిచేయలేన్నపుడు, తెలంగాణావాదులందరూ కలిసి ఉద్యమించాలని పిలుపునీయడం హాస్యాస్పదం. లక్షలాది ప్రజలను రోడ్లపైకి రప్పించి సాటి తెలుగు ప్రజలతోనే యుద్దానికి పురిగొల్పడం వలన ఎటువంటి దారుణ పరిణామాలు ఎదురవుతాయో తెలిసి కూడా ఈవిధంగా రెచ్చగొట్టడం ఆయన వంటి ఉన్నత విద్యావంతుడు చేయవలసిన పని కాదు.

 

రాష్ట్ర విభజనను వ్యతిరేఖిస్తున్న ఆంధ్ర యన్.జీ.ఓ.లు కూడా ఇటువంటి ప్రమాదకరమయిన ఆలోచనలు మానుకోవాలి. ఉన్నత విద్యావంతులయిన ఇరుపక్షాల నేతలు కూడా ఇప్పుడు తమ ఆశయసాధనకు విజ్ఞతకు బదులు మంద బలం ఉపయోగించాలనుకోవడం చాలా అవివేకం. తమ ఆశయ సాధన కోసం ప్రజల జీవితాలతో చెలగాటం ఆడటం చాల హేయమయిన ఆలోచన. ఇటువంటి ఆలోచనలను ఎవరు చేసినా ఖండించాల్సిందే.

By
en-us Political News

  
ఆ ఆత్మీయ విందులో పాల్గొన్న వారెవరి మెబైల్ ఫోనూ ఒక్కసారి కూడా రింగ్ అవ్వలేదు. అంతెందుకు ఆ సమయంలో ఎవరూ ఫోన్ జోలికే పోలేదు. వాట్సాప్ చాటింగ్ ల ఊసే లేదు. కుటుంబాల ముచ్చట్లు, పెళ్లిళ్లు, పిల్లల చదువులు, కుటుంబాలా క్షేమ సమాచారాలు పంచుకోవడంతో అంతా ఆనందంగా ఆహ్లాదంగా గడిపారు.
తాజా జాబితాలో 5.67 కోట్ల మంది ఓటర్లు నమోదు కాగా, వీరిలో 2.77 కోట్ల మంది పురుషులు, 2.89 కోట్ల మంది మహిళలు 7,617 మంది ట్రాన్స్ జెండర్లు ఉన్నారు. క్లెయిమ్‌లు, అబ్జెక్షన్ పీరియడ్‌లో దాఖలు చేసిన దరఖాస్తులను సమీక్షించి మార్పులు చేసినట్టు ఎన్నికల కమిషన్ తెలిపింది.
రాష్ట్రంలో కాపు సామాజికవర్గం బానిస వర్గం కాదన్నారు. అరెస్టులకు భయపడేది లేదని ముద్రగడ ఈ సందర్భంగా చెప్పారు. గతంలో చంద్రబాబు తనను, తన కుటుంబాన్నీ వేధించిన తీరు అందరికీ తెలుసునని చెప్పిన ఆయన మాజీ మంత్రి ఇంటిపై ఏడు గంటల పాటు దాడులు చేయడం, అరెస్టులతో భయపెట్టాలని చూడటం ప్రజాస్వామ్యంలో సరికాదన్నారు.
కల్తీ పాల వల్లే వారు అనారోగ్యం పాలయ్యారని ప్రాథమికంగా నిర్థారణ అయిందన్నారు. అంతకుముందు కలెక్టర్ కీర్తి చేకూరి, ఎస్పీ, వైద్యారోగ్య శాఖ, ఫుడ్ సేఫ్టీ అధికారులతో వర్చువల్ గా చంద్రబాబు సమావేశమైన చంద్రబాబు కల్తీ పాలు తాగి అస్వస్థతకు గురైన వారికి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. పాల శాంపిల్స్ ఫలితాలు వచ్చిన తర్వాత పాలు అమ్మినవారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.
ఇటీవ‌ల కిరాక్ ఆర్పీ.. వైసీపీ ఎమ్మెల్సీ, మండ‌లి ప్ర‌తిప‌క్ష నేత‌ బొత్స స‌త్య‌నారాయ‌ణ‌ను అవ‌హేళ‌న చేస్తూ మాట్లాడారు. ఆ వెంట‌నే కాపుల్లో ఆగ్ర‌హం క‌ట్ట‌లు తెంచుకుంది. దీంతో దిగి వ‌చ్చిన ఆర్పీ క్ష‌మాప‌ణ చెప్పారు కూడా. అలాగ‌ని కాపులంతా వైసీపీకి స‌పోర్ట్ చేయ‌డం అని అర్ధం కాదు క‌దా ? అంటున్నారు వంగవీటి రాధా అభిమానులు.
రాజకీయ ప్రవేశంపై తనకు ఆసక్తి ఉన్న మాట వాస్తవమేననీ, అయితే అందుకు ఇంకా సమయం ఉందన్నారు. ఇప్పటికే ఆమె సోదరుడు వంగవీటి రాధా రాజకీయాల్లో చురుగ్గా ఉన్న సంగతి విదితమే.
తెలంగాణ‌లో కమలం పార్టీ ఎప్ప‌టి నుంచి పుంజుకుంది? రాష్ట్రంలో అధికారం చేప‌ట్టే అవ‌కాశ‌మెంత‌ అన్న‌దొక చ‌ర్చ‌.
తెలుగు రాష్ట్రాల డీసీసీ అధ్యక్షుల శిక్షణా తరగతులను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు.
రాజమహేంద్రవరం రోడ్ కమ్ రైలు బ్రిడ్జిపై నుంచి అధిక సంఖ్యలో కవాహనాలతో వెళ్ల కూడదని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. కానీ అంబడి రాంబాబు, జక్కంపూడి రాజా ఆ నోటీసులను ధిక్కరించి భారీ ర్యాలీ నిర్వహించడమే కాకుండా రైల్ కం రోడ్డ బ్రిడ్జిపై పెద్ద సంఖ్యలో వాహనాలతో వెళ్లడంతో రాజమహేంద్రవరం పోలీసులు కేసు నమోదు చేశారు.
తమిళనాడు రాజకీయాల్లో సంచలన పరిణామం చోటుచేసుకుంది.
గుంటూరులోని తన నివాసంపై తెలుగుదేశం శ్రేణుల దాడి, తనపై హత్యయాత్నం చేయడం తదితర విషయాలను జగన్ కు తెలియజేశారు. ఈ సందర్భంగా జగన్ అంబటికి కేసులకు భయపడవద్దని ధైర్యం చేప్పారు. కేసులను చట్టపరంగా ఎదుర్కొందామని భరోసా ఇచ్చారు.
అప్పట్లో అధికారపార్టీలో ఉన్న అనంతబాబుతో అధికారంలో ఉన్న వై ఉన్న అనంతబాబుతో పోలీసులు కుమ్మక్కయ్యారని వ్యాఖ్యానించింది. డీఫాల్ట్ బెయిల్ వచ్చేలా ఛార్జ్‌షీట్ దాఖలు చేశారని న్యాయస్థానం అసంతృప్తి వ్యక్తం చేసింది.
వైసీపీ సభ్యులు వేంకటేశ్వర స్వామి ఫొటోలు, ప్లకార్డులతో పోడియంను చుట్టుముట్టి నినాదాలు చేశారు. సభలో వైసీపీ సభ్యుల తీరుపై మంత్రి పయ్యావుల కేశవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.