ప్రధాని మోదీని కలిసినప్పుడు విద్యార్థులు తల వంచాలనడం విచాకరం : ఒవైసీ

Publish Date:Aug 9, 2026

Advertisement

 

ప్రధాని ఐఐటీ ఢిల్లీ పర్యటన ఘటనపై  అసదుద్దీన్ విమర్శలు..!

“ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఐఐటీ ఢిల్లీ పర్య టన సందర్భంగా చోటు చేసుకున్నట్లు వచ్చిన నివేదికలపై ఎంఐఎం అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ  అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. ప్రధాన మంత్రి చేతుల మీదుగా పతకాలు స్వీకరించే సమయంలో విద్యార్థులను తలవంచమని, వేద మంత్రాల పఠనం సమయంలో నిలబడమని సూచించినట్లు వచ్చిన వార్తలను ఆయన ప్రస్తావించారు. ఈ అంశంపై మీడియాతో  ఒవైసీ మాట్లాడుతూ.. విద్యార్థులు, విద్యా సంస్థలు పాటించాల్సిన రాజ్యాంగ విలువలపై ప్రశ్నలు లేవనెత్తారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 51A(H) ప్రతి పౌరుడిలో శాస్త్రీయ దృక్పథం, మానవ తావాదం, విచారణా స్ఫూర్తిని పెంపొందించా ల్సిన బాధ్యతను పేర్కొం టుందని గుర్తుచేశారు.

“శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించాల్సిన ఆర్టికల్ 51A(H)ను చెత్తబుట్టలో పడేశారు” అని ఒవైసీ వ్యాఖ్యానిం చారు.అదేవిధంగా రాజ్యాంగంలోని ఆర్టికల్ 28ను ప్రస్తావిస్తూ.. ప్రభుత్వ నిధులతో పూర్తిగా నిర్వహించే విద్యాసంస్థల్లో మత బోధనకు సంబంధించి రాజ్యాంగం స్పష్టమైన నిబంధనలు కలిగి ఉందని పేర్కొన్నారు. విద్యాసంస్థలు రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా పనిచేయా ల్సిన అవసరం ఉందన్నారు.“ప్రభుత్వాన్ని ప్రశ్నించడమే జాతీయ ప్రయోజనం” అని విద్యార్థులు గుర్తుంచు కోవాలని ఒవైసీ సూచించారు. 

ప్రజాస్వామ్యంలో విద్యార్థులకు ప్రశ్నించే హక్కు, శాస్త్రీయ దృక్పథం, పరిశోధనా స్వేచ్ఛ, రాజ్యాంగ విలువలు అత్యంత కీలకమని ఆయన పేర్కొన్నారు. ఒక విద్యాసంస్థలో విద్యార్థు లను నిర్దిష్ట సూచనలు పాటించమని కోరడం ఈ విలువలకు అనుగుణంగా ఉందా? అని ఆయన ప్రశ్నించారు. విద్యాసంస్థలు రాజకీయ, మతపరమైన ప్రభావాలకు అతీతంగా శాస్త్రీయ ఆలోచనలను ప్రోత్సహించే వాతావ రణాన్ని కల్పించాల్సిన అవసరం ఉందని ఒవైసీ అభిప్రాయపడ్డారు.

Prime Minister Modi, MP Asaduddin Owaisi, PM visit to IIT Delhi, MIM,   IIT Students

By
en-us Political News

  
విద్యార్థులకు కళాత్మక తయారీ మరియు ప్రదర్శనలో శిక్షణ నిచ్చే తీరుపై మ్యూజియం నిర్వహుకులతో చర్చించారు.
భాగ్యనగరంలో ఆధ్యాత్మిక ఉత్సవ శోభ ఉప్పొంగుతోంది. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు నిలువుటద్దంగా నిలిచే ఆషాఢ మాస బోనాల జాతర హైదరాబాద్ వ్యాప్తంగా అత్యంత వైభవంగా ప్రారంభమైంది.
పాతబస్తీలో ఘనంగా బోనాల పండుగ శోభ..!
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ (NEET) పరీక్షల వివాదం, తదనంతర పరిణామాల నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి పదవికి రాజీనామా చేసిన ధర్మేంద్ర ప్రధాన్ తొలిసారిగా ఈ అంశంపై స్పందించారు.
కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారి దివ్యక్షేత్రమైన తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది.
శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ చింతాడ రవికుమార్‌ను ఆంధ్రప్రదేశ్ పోలీసులు శనివారం నాటకీయ పరిణామాల మధ్య అరెస్ట్ చేశారు.
సామాజిక మాధ్యమాలు, డేటింగ్ యాప్‌ల వేదికగా అమాయకులకు వలవేసి కోట్లాది రూపాయలు కొల్లగొడుతున్న సంచలన హనీట్రాప్ ముఠా గుట్టు
మియాపూర్ జీఎస్ఎమ్ మాల్ వద్ద ఘోర ప్రమాదం..!
ప్రపంచ ఫుట్‌బాల్ రంగాన్ని శాసించిన మహా దిగ్గజం, అర్జెంటీనా స్టార్ ఫుట్‌బాలర్ లియోనెల్ మెస్సీ జీవితంలో తీరని శోకం అలముకుంది.
క్యాబ్ డ్రైవర్ నుంచి కార్పొరేట్ లీడర్‌గా స్ఫూర్తిదాయక ప్రయాణం..!
ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ప్రభుత్వం ఒక సంచలనాత్మక నిర్ణయం దిశగా ఆలోచన చేస్తోంది.
తన తండ్రి వివేకానంద రెడ్డి హత్య జరిగి ఏడున్నర సంవత్సరాలు అయిందని, ఇప్పటికీ తాను న్యాయం కోసం పోరాడుతూనే ఉన్నానని ఆయన కుమార్తె సునీత ఆవేదన వ్యక్తం చేశారు.
బోనాల ఉత్సవాల సందర్భంగా హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ మళ్లింపులు చేపట్టను న్నట్లు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.