విభజన...‘విడిది’

Publish Date:Dec 30, 2013

Advertisement

 

 

 

గతంలో శీతాకాల విడిదికి గాను హైదరాబాద్‌కు వచ్చిన ఏ రాష్ట్రపతికీ ఈ తరహా అనుభవం ఎదురై ఉండదు. దీనికి కారణం రాష్ట్రంలో నెలకొన్న విభజన పరిస్థితులే. గందరగోళంగా రాష్ట్ర పరిస్థితి రాష్ట్రపతి నిలయాన్ని కేంద్రంగా మార్చుకోవాలని చూస్తుండడంతో... విశ్రాంతి నిమిత్తం ఆంధ్రప్రదేశ్‌కు వచ్చిన ప్రణబ్‌ముఖర్జీ... ఫుల్‌ బిజీగా మారిపోయారు. పార్టీల వారీగా వచ్చేవారు కొందరు, వ్యక్తిగతంగా వచ్చేవారు మరికొందరు... గుట్టల కొద్దీ వినతిపత్రాలు, అర్జీల మీద అర్జీలు వచ్చి పడుతుంటే పాపం...ఏం చేయాలో తెలియక ఓపికగా అందర్నీ ఆహ్వానిస్తున్నారు. దీంతో నగరంలోని రాష్ట్రపతినిలయం ఎప్పుడూ లేనంత సందడిగా మారింది.

 

 

మామూలుగా అయితే ఢిల్లీ వెళ్లి, రాష్ట్రపతిని కలవడం అంటే అంత తేలికైన విషయం కాదు. పైగా అసలు ఆయన అపాయింట్‌మెంట్‌ దొరకడమే గగనం. ఎంతో వ్యయప్రయసలకు ఓర్చుకుని అక్కడి దాకా వెళ్లినా అక్కడ ఉండే బిజీ కారణంగా రాష్ట్రపతి ఇచ్చే సమయం ఏదో కొన్ని నిమిషాలకు మించి ఉండదు. వీటన్నింటిని బేరీజు వేసుకున్న పార్టీలు, వ్యక్తులు... విడిదిలో బస పూర్తయిపోయేలోగా... తమ పని చక్కబెట్టేసుకోవాలని ఆరాటపడుతున్నారు. నిజానికి విభజనకు సంబంధించినంత వరకూ ఇరు ప్రాంతాల నేతలు చేస్తున్న వాదనలు, వినిపిస్తున్న అంశాలు కొత్తవీ కావు... ఇప్పటిదాకా ప్రణబ్‌కు తెలియనివీ కావు. మరెందుకీ ఆరాటం అంటారా? అదేనండీ మైలేజీ.




నిజానికి తామే సమైక్యవాద ఛాంపియన్‌లం అని నిరూపించుకోవాలని తహతహలాడుతున్నవారు అందుకు దొరికిన ఏ అవకాశాన్ని వదులుకోదలచుకోవడం లేదు. వారే ఈ మార్గం కనిపెట్టారు. అది మరెందరికో దారి చూపింది. ముక్కలు చెక్కలుగా విడిపోయిన సమైక్యవాదులు... ఒకరొకరుగా రాష్ట్రపతిని కలిసి వచ్చి, ఆ విషయాన్ని మీడియాకు వెళ్లడిస్తూ బోలెడంత మైలేజీ తెచ్చేసుకుంటుంటే... కంగారుపడిపోయిన ప్రత్యేకవాదులు కూడా అదే బాట పట్టారు. అందుకోసం అప్పటికప్పుడు ఉమ్మడిరాజధానిని రెండేళ్లు కుదించాలనే సరికొత్త డిమాండ్‌ను తెరపైకి తెచ్చి మరీ రాష్ట్రపతిని కలిసొచ్చారు. గతంలో పదేళ్ల ఉమ్మడికి ఒప్పుకున్న నాయకులు ఇప్పటికిప్పుడు రెండేళ్ల డిమాండ్‌ తేవడం విచిత్రమని విశ్లేషకులు అంటున్నారు. ఈ ‘వాదుల’ హోరు చూస్తున్న మరికొందరు వ్యక్తులు పలు రకాల సంస్థలు, సంఘాలు అప్పటికప్పుడు తమ డిమాండ్లను గుర్తు తెచ్చుకుని ఛలో రాష్ట్రపతి నిలయం అంటున్నారు. ఏదేమైనా... నేతల ప్రచార కండూతి కాస్త తగ్గితే ఆ మేరకు ఈ శీతాకాలవిడిది రాష్ట్రపతికి విశ్రాంతిని ఇస్తుంది.

 

By
en-us Political News

  
పాతబస్తీ అంటే ఓల్డ్ సిటీ కాదని... ఒరిజినల్ సిటీ అని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.
ఢిల్లీ రాష్ట్రపతి భవన్‌లోని కల్చరర్ సెంటర్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం నుంచి తృణమూల్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వాకౌట్ చేశారు.
గత ఎనిమిది నెలలుగా కేసీఆర్ ప్రభుత్వం లేకపోవడంతో తెలంగాణలో ఎక్కడ చూసినా నేరాలే నేరాలు.. నేరాల మీద నేరాలు.. ఈ సోది అంతా ఏంటి అనుకుంటున్నారా?
ధూల్ పేట ఒకప్పుడు గుడుంబా తయారీకి అడ్డా... నేడు గంజాయి వంటి మాదక ద్రవ్యాలకు అడ్డా గా మారింది. 
చిత్తూరు జిల్లాలో వైసీపీ ఖాళీ అయిపోతోంది. ఇప్పటికే ఆ పార్టీ సగం ఖాళీ అయిపోతే.. జరుగుతున్న పరిణామాలను గమనిస్తే ఆ పార్టీ పూర్తిగా ఖాళీ అయిపోవడానికి ఎక్కువ రోజులు పట్టదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
మొన్నటి వరకు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తికి పాబ్లో ఎస్కోబార్ పేరు తెలియకపోతే  మాత్రం క్షమించరాని తప్పు.
సార్వత్రిక ఎన్నికలకు ముందు, తర్వాతా కూడా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) మోడీ విధానాల పట్ల తీవ్ర అసంతృప్తితో ఉందన్న వార్తలు గట్టిగా వినిపించాయి. ఎన్నికల ముందు అయితే బీజేపీకి సంపూర్ణ మెజారిటీ వచ్చే అవకాశాలు ఇసుమంతైనా కనిపించడం లేదని ఆర్ఎస్ఎస్ పెద్దలే అన్నారు. ప్రధానిగా మోడీకి ప్రత్యామ్నాయాన్ని బీజేపీ చూసుకోవాలన్న బలమైన సంకేతాలు కూడా ఆర్ఎస్ఎస్ బీజేపీకి పంపింది.
కరోనా వైరస్ ప్రపంచ దేశాలను వణికించి. కరోనా మహమ్మారి వల్ల లక్షలాదిమంది మృత్యువాత పడ్డారు. అందరూ ఊపిరి పీల్చుకుంటున్న వేళ తెలంగాణ రాజధాని వాసులపై బాంబు పడ్డంత పనైంది. 
జగన్ అధికారాన్ని చెలాయించిన రోజుల్లో చూపించిన నిర్లక్ష్య ధోరణి ఇప్పుడు ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకుంది.
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుమార్తె, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జైలు కష్టాలు ఇప్పట్లో తీరేలా కనిపించడం లేదు. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టైన కవిత బెయిలు కోసం చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు.
ఏపీలో ఈసారి జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో సోదరుడు, సీఎం వైఎస్ జగన్ పై తీవ్ర మాటల దాడి చేసిన పీసీసీ అధ్యక్షురాలు, ఆయన సోదరి వైఎస్ షర్మిల పోలింగ్ తర్వాత శాంతించారు. జగన్ కుటుంబంతో సహా లండన్ వెళ్లిపోవడంతో తాను కూడా కుమారుడు రాజారెడ్డి దగ్గరికి వెళ్లిన షర్మిల... రాజకీయాలపై విమర్శల జోరు కూడా తగ్గించారు. కానీ ఇవాళ ఉన్నట్లుండి తిరిగి జగన్ పై మాటల దాడి ప్రారంభించారు.
బిహార్ లేడీ ఎమ్మెల్యే శ్రేయసి సింగ్ ఒలింపిక్స్‌ కోసం ప్యారిస్‌కి వెళ్ళారు. ఒక ఎమ్మెల్యే ఒలింపిక్స్‌కి వెళ్తే పెద్దగా చెప్పుకోవాల్సింది ఏమిటనే సందేహం రావచ్చు..
బడ్జెట్ మీద మీడియా ముందు ఏడ్చిన కేసీఆర్, ఇప్పుడు బడ్జెట్ మీద చర్చ జరుగుతున్న సమయంలో కూడా అసెంబ్లీకి వచ్చి, మీడియా ముందు ఏడ్చిన ఏడుపేదో అసెంబ్లీలో కూడా ఏడ్వచ్చు కదా?
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.