మెజార్టీతో గెలిపించండి: రాష్ట్రపతి

Publish Date:Jan 27, 2014

Advertisement

 

గణతంత్ర దినోత్సవం సందర్భంగా జాతినుద్దేశ్యించి ప్రసంగించిన రాష్ట్రపతి “వచ్చేఎన్నికలలో ప్రజలు ఏదో ఒక పార్టీకి స్పష్టమయిన మెజారిటీతో గెలిపించవలసిన అవసరం ఉందని, అప్పుడే దేశంలో స్థిరమయిన రాజకీయ వ్యవస్థ ఏర్పడి, దేశం అన్ని రంగాలలో నిలకడగా అభివృద్ధి సాధించగలదని” అన్నారు. రాహుల్-మోడీల రాజకీయ భవిష్యత్తుని నిర్దేశించబోయే వచ్చేఎన్నికలు కాంగ్రెస్, బీజేపీలకు జీవన్మరణ పోరాటం వంటివి గనుక, ఆ రెండు పార్టీల మధ్య జరిగే తీవ్రమయిన పోటీలో దేశప్రజలు రాహుల్-మోడీల మధ్య రెండుగా చీలిపోతే ఎవరికీ పూర్తి మెజార్టీ రాకపోవచ్చని ఆయన అభిప్రాయం కావచ్చును.

 

గత పది సం.లలో దేశంలో ప్రాంతీయ పార్టీలు బాగా బలపడటంతో, అవి కేంద్రప్రభుత్వ మనుగడను కూడా శాసించే స్థాయికి ఎదిగాయి. ఇప్పుడు కాంగ్రెస్, బీజేపీలు పేరుకి జాతీయపార్టీలే అయినా, వాటంతట అవి పూర్తి మెజార్టీ సాధించే పరిస్థితులు లేవు. కేంద్రంలో ఏ కూటమి అధికారంలోకి రావాలన్నాతప్పనిసరిగా ప్రాంతీయ పార్టీలపై ఆధారపడక తప్పని పరిస్థితి ఏర్పడింది. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇది సర్వసాధారణమే అయినప్పటికీ, రాజకీయాలలో, పార్టీలలో, ప్రజాప్రతినిధులలో నైతిక విలువలు దిగజారిన ఈ పరిస్థితుల్లో, కేంద్రానికి మద్దతు ఇస్తున్నకారణంగా ప్రాంతీయ పార్టీలు, అదేవిధంగా పెద్దన పాత్ర పోషిస్తున్నకారణంగా కేంద్రం ప్రాంతీయ పార్టీలను తమ స్వార్ధ రాజకీయ ప్రయోజనాలు నెరవేర్చుకోవడం కోసం ఒకరినొకరు తరచు చెయ్యి మెలిపెట్టుకొంటూ పరిపాలన సాగిస్తుంటే కేంద్రంలో, రాష్ట్రాలలో కూడా బలహీనమయిన ప్రభుత్వాలు ఏర్పడటం వలన దేశ అభివృద్ధి కుంటుపదుతుంది. గనుకనే, ప్రజలందరూ సరయిన పార్టీకి పూర్తి మెజార్టీ కట్టబెట్టాలని రాష్ట్రపతి కోరారు.

 

కాంగ్రెస్, బీజేపీలు ఆయన సూచనను ఆహ్వానించినప్పటికీ, రెంటికీ గెలుపు అత్యావశ్యకం గనుక పోటాపోటీగా ప్రచారం చేసి ప్రజలను తమవైపు త్రిప్పుకొనే ప్రయత్నం చేస్థాయి. వీటికి తోడు ఎన్నికలలో ప్రాంతీయ పార్టీలతో వాటి పొత్తులు, ప్రాంతీయ సమస్యల తీవ్ర ప్రభావంతో ప్రజలు కూడా ఆ రెండు పార్టీల మధ్య చీలిపోవడం ఖాయం. కానీ ఇంతవరకు వెలువడుతున్న సర్వేలనీ దేశ వ్యాప్తంగా ప్రజలు నరేంద్ర మోడీకి అనుకూలంగా ఉన్నట్లు స్పష్టం చేస్తున్నాయి. కానీ, ఈ సారి కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీని ప్రధానమంత్రి కుర్చీలో కూర్చోబెట్టలేకపోయినట్లయితే, ఆయనకి మళ్ళీ ఎప్పుడూ ఆ అవకాశం వస్తుందో, అసలు వస్తుందో రాదో కూడా తెలియదు గనుక, వచ్చేఎన్నికలలో గెలిచేందుకు కాంగ్రెస్ తన సర్వశక్తులు ఒడ్డి పోరాడుతుంది. ఆ పరిస్థితుల్లో ప్రజలు ఎవరికి పట్టం కడతారనేది మిలియన్ డాలర్ ప్రశ్న. కానీ ఎవరికి పట్టం కట్టదలచుకొన్నా పూర్తి మెజార్టీతో పట్టం కట్టమని రాష్ట్రపతి సలహా.

By
en-us Political News

  
ఐటీ సలహాదారుగా పనిచేసిన రాజ్ కేసిరెడ్డిని, అలాగే ఏపీబీసీఎల్ మాజీ చైర్మన్ వాసుదేవరెడ్డిని ఈడీ అధికారులు మనీ లాండరింగ్ ఆరోపణలపై అరెస్ట్ చేయడం హాట్ టాపిక్‌గా మారింది. ఈ ఇద్దరి అరెస్టుతో ఈ కుంభకోణం తాలూకు మూలాలు ఎక్కడికి దారితీస్తున్నాయి, అంతిమంగా దీని ప్రభావం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై పడబోతోందా అనే విషయంపై మాజీ న్యాయమూర్తి రామకృష్ణ తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో విశ్లేషించారు.
ఈ మొత్తం స్థలం విలువ బహిరంగ మార్కెట్లో వెయ్యి కోట్ల రూపాయలకు పైగానే ఉంటుందని అంటున్నారు. ఇందులో సింహభాగం అంతా ప్రభుత్వానికి చెందిన భూమి కావడం గమనార్హం. కాగా ఈ వ్యవహారంపై తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ప్రముఖ అనలిస్ట్ భరద్వాజ మాట్లాడారు.
సహజంగా దేశ చరిత్రలో జవహర్‌లాల్ నెహ్రూ 17 సంవత్సరాల పాటు, ఇందిరా గాంధీ 16 సంవత్సరాల పాటు ప్రధానమంత్రులుగా సేవలందించారు. అయినప్పటికీ ప్రధాని నరేంద్ర మోడీ 12 ఏళ్ల పాలన రికార్డు ఎలా ? అన్న విషయాన్నితెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో సీనియర్ జర్నలిస్టు, ప్రముఖ ఎనలిస్టు వివరించారు.
గత సార్వత్రిక ఎన్నికల ముందే వీరిద్దరి మధ్య విభేదాలు తీవ్రమై కేశినేని నాని తెలుగుదేశం పార్టీని వీడి వైసీపీలో చేరారు. ఆ ఎన్నికల్లో తెలుగుదేశం అభ్యర్థిగా పోటీ చేసిన సోదరుడు కేశినేని చిన్ని చేతిలో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన కేశినేని నాని ఓటమి పాలయ్యారు. ఎన్నికల ముగిసిన తర్వాత నాని వైసీపీకి దూరంగా జరుగుతూ మళ్లీ టీడీపీ వైపు మొగ్గు చూపుతున్నట్లు ప్రచారం జరుగుతున్నప్పటికీ.. తమ్ముడు కేశినేని చిన్నితో వైరం మాత్రం పెరుగుతూనే ఉంది.
ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా, వైసిపి శ్రేణులు రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చాయి. ఈ నిరసనల్లో భాగంగా ఒక ధర్నాలో పాల్గొన్న అంబటి రాంబాబు అనుచిత వ్యాఖ్యలు చేశారు. వైసీపీ నిరసనల సందర్భంగా శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా చూసేందుకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు.
రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయన సమాజిక మాధ్యవ వేదిక ఎక్స్ లో పెట్టిన పోస్టులో.. ప్రజల ఆకాంక్షలు నెరవేరుస్తూ… రాష్ట్ర భవిష్యత్తుకు బాటలు వేస్తున్నామన్నారు.
ఆమె నామినేషన్ తిరస్కరణను బీజేపీ పక్కా ప్రణాళికతో చేసిన రాజకీయ కుట్రగా అభివర్ణించారు. జాతీయ మీడియాతో మాట్లాడిన జగ్గారెడ్డి.. మధ్యప్రదేశ్ లోని బీజేపీ ప్రభుత్వం ఎన్నికల కమిషన్‌ను పావుగా వాడుకుని, ఉద్దేశపూర్వకంగానే మీనాక్షి నటరాజన్ నామినేషన్‌ను అడ్డుకుందని ఆరోపించారు.
ఈ ఆందోళన చట్టబద్ధంగా, రాజ్యాంగబద్ధమైన పద్ధతుల్లో, ఎలాంటి హింసకు తావులేకుండా ప్రశాంత వాతావరణంలో జరుగుతుందని నిర్వాహకులు స్పష్టం చేశారు. డిజిటల్ స్క్రీన్‌ల నుండి నేరుగా రోడ్లపైకి వస్తున్న ఈ జెన్-జీ ఉద్యమం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వం మారినప్పటికీ, క్షేత్రస్థాయిలో పాలనా పరమైన విధానాలు మరియు లబ్ధిదారుల శైలి మారలేదనే తీవ్ర అసంతృప్తి రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది.
దేశ రాజకీయాల్లో తెరవెనుక జరుగుతున్న పరిణామాలు ఇప్పుడు సర్వత్రా ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్‌లో రాజ్యసభ ఎన్నికలు ఏకగ్రీవంగా పూర్తయ్యాయి.
దిల్లీలో నీట్ పరీక్షల లీకేజీకి సంబంధించి పక్కా ఆధారాలు బయటపడటంతో అక్కడ కేంద్ర ప్రభుత్వంపై యువత తిరగబడింది. కానీ ఏపీలో మెగా డీఎస్సీ పారదర్శకంగా ముగిసి, నియామక పత్రాలు కూడా అభ్యర్థులకు అందజేశారు. ఏపీ విద్యాశాఖ కూడా విపక్షాలు చేసిన ప్రతి ఆరోపణకూ రికార్డులతో సహా పక్కాగా వివరణ ఇచ్చింది.
కవిత పార్టీ పేరుపై బీఆర్ఎస్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. 14 ఏళ్ల తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో టీఆర్ఎస్ అనే పేరు తెలంగాణ ప్రజల భావోద్వేగాలతో ముడిపడి ఉందనీ, ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు బీఆర్ఎస్‌ను టీఆర్ఎస్‌గానే గుర్తిస్తున్నారని పేర్కొంటూ ఆ పేరును ఇతరులకు కేటాయించవద్దని ఈసీఐకి అధికారిక ఫిర్యాదు చేసింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.