మొత్తం ప్రపంచం ఉత్కంఠగా ఎదురుచూస్తున్న అమెరికా ఎన్నికల పోలింగ్ మంగళవారం (నవంబర్4) పోలింగ్ జరగనుంది. అగ్రరాజ్యంలో దాదాపు 24.4కోట్ల మంది ఓటర్లలో ముందస్తు ఓటింగ్ ద్వారా 7.5 కోట్ల మంది తమ ఓటు హక్కు ఇప్పటికే వినియోగించేసుకున్నారు. ఇక చివరి వరకు ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు అధ్యక్ష ఎన్నికల బరిలో ఉన్న డొనాల్డ్ ట్రంప్, కమలా హారిస్ ల ప్రచారానికి సోమవారం(నవంబర్ 3)తో ముగుస్తుంది.
ఇప్పటి వరకూ అమెరికా అధ్యక్ష ఎన్నికలపై నిర్వహించిన పలు సర్వేలు.. గెలుపు ఎవరిదన్నది ఇతమిథ్ధంగా తేల్చలేకపోయాయి కానీ పోరు హోరాహోరీగా ఉంటుందన్న స్పష్టత ఇచ్చాయి. ఇవాళ రాత్రితో వారి ప్రచారం ముగియనుంది. ఇప్పటివరకు నిర్వహించిన సర్వేలను బట్టి ఇరువురి మధ్య హోరాహోరీ పోరు తప్పదని తేలింది. మరీ ముఖ్యంగా ఎన్నికలలో స్వింగ్ స్టేట్స్లో కమలాహారిస్, ట్రంప్ లు నువ్వా నేనా అన్నట్లుగా పోటీ పడుతున్నాయని దాదాపు అన్ని సర్వేలూ తేల్చేశాయి. ఈ రాష్ట్రాల్లో అక్టోబర్ 24 నుంచి నవంబర్ 2 వరకు ది న్యూయార్క్ టైమ్స్- సర్వే నిర్వహిం చింది. ఇందులో విస్కాన్సిన్, నార్త్ కరోలినా, నెవెడాలో కమలకు మద్దతు ఉంటే.. అరిజోనాలో ట్రంప్ వైపు ఓట్లరు మొగ్గచూపుతున్నట్లు తేలింది. అలాగే పెన్సిల్వేయా, జార్జియా, మిషిగన్లో ఇరువురు అభ్యర్థుల మధ్య తీవ్ర పోటీ ఉన్నట్లు దిన్యూయార్క్ టైమ్స్ ఒపీనియన్ పోల్ వెల్లడించింది.
ఇలా ఉండగా అమెరికా ఎన్నికలలో డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలాహారిస్ విజయాన్ని కాంక్షిస్తూ ఇండియాలో పూజలు జరుగుతున్నాయి. ఇందులో వింతేమీ లేదు. కమలా హారిస్ భారత సంతతికి చెందిన వ్యక్తి కావడంతో భారత్ లో ఆమె విజయాన్ని కోరుకునే వారి సంఖ్య అధికంగా ఉంది. మరీ ముఖ్యంగా తమిళనాడులోని తులసేంద్రపురం అనే గ్రామంలో కమలా హారిస్ విజయం కోసం పూజలు నిర్వహించడమే కాదు. అమెరికా అధ్యక్ష ఎన్నికలో ఇక్కడి ప్రజలు కూడా ఓట్లు వేస్తున్నారా అన్నట్లుగా పెద్ద ఎత్తున ప్రచార సంరంభం కనిపిస్తోంది. గ్రామం అంతటా కమలా హారిస్ కు మద్దతుగా పోస్టర్లు, ఫ్లెక్సీలు, కటౌట్లు వెలిశాయి.
అందుకు కారణం లేకపోలేదు. కమలా హారిస్ తల్లి డాక్టర్ శ్యామల స్వగ్రామం తులసేంద్ర పురం. ఆ ఊరి జనం కమలాహారిస్ ను తమ ఇంటి ఆడబడుచుగా భావిస్తున్నారు. ఎందుకంటే ఆమెరికాలో పుట్టిపెరిగినా కమలా హారిస్ తన అమ్మమ్మ గారి ఊరైన తులసేంద్రపురం గ్రామానికి పలుమార్లు వచ్చి వెళ్లారు. అలా ఆ గ్రామస్తులకు కమలాహారిస్ పట్ల అభిమానం ఏర్పడింది. దీంతో కమలా హారిస్ విజయాన్ని కాంక్షిస్తూ వారు పూజలు చేస్తున్నారు. గ్రామం అంతటా ఆమె పోస్టర్లు, ఫ్లెక్సీలు, కటౌట్లు పెట్టి హంగామా చేస్తున్నారు. ఎన్నికలలో ఆమె విజయం సాధిస్తే పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకోవడానికి సమాయత్తం అవుతున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/prayers-in-india-for-kamalaharis-victory-39-187825.html
టీవీకే అధినేత విజయ్తో భేటీ అనంతరం రాజ్ భవన్ ఒక అధికారిక ప్రెస్ నోట్ విడుదల చేసింది. అసెంబ్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే ఉండాల్సిన సంఖ్యాబలంపై గవర్నర్.. విజయ్కు మార్గనిర్దేశం చేశారు. కేవలం అతిపెద్ద పార్టీగా ఉండటమే కాకుండా, సభలో తగినంత మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్నట్లు ఆధారాలు చూపాలని సూచించారు.
పిఠాపురంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో చంద్రబాబు ఫొటోలేదని ఆరోపిస్తూ.. మాజీ ఎమ్మెల్యే వర్మ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో జనసేన నేత, మాజీ ఎమ్మెల్యే దొరబాబు జోక్యం చేసుకోవడంతో వాగ్వాదం చోటు చేసుకుంది. వర్మ దురుసు వ్యాఖ్యలపై పార్టీలో అంతర్గతంగా చర్చించిన అధిష్టానం.. వర్మ వ్యవహారాన్ని తప్పుబట్టింది. ఇంతలోనే వర్మను ఇంచార్జ్ పదవి నుంచి తొలగించడం చర్చనీయాంశంగా మారింది.
రాష్ట్రంలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు డీఎంకే ఏ విధంగానూ అడ్డుపడబోదన్నారు. రాష్ట్రంలో మరోసారి ఎన్నికలు రావాలని గానీ, రాజ్యాంగ సంక్షోభం తలెత్తాలనీ కానీ తాము కోరుకోవడం లేదన్నఆయన.. ప్రజాతీర్పునకు అనుగుణంగానే డీఎంకే నడుచుకుంటున్నదన్నారు.
గతంలో విజయ్కు ఉన్న ప్రాణహాని హెచ్చరికలు.. ఆయన పాపులారిటీని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం సాయుధ పోలీసులతో కూడిన భద్రతను ఏర్పాటు చేసింది. అయితే.. తాజాగా నిర్వహించిన భద్రతా సమీక్షలో భాగంగా ఆయనకు ఇకపై అదనపు సెక్యూరిటీ అవసరం లేదని అధికారులు భావించినట్లు తెలుస్తోంది.
తాజా ఎన్నికల ఫలితాల్లో నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) 108 స్థానాలతో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించిన సంగతి తెలిసిందే. అయితే.. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 118 మంది ఎమ్మెల్యేల మద్దతు ఆ పార్టీకి ఇంకా లభించలేదు. కాంగ్రెస్తో కలిపి విజయ్ బలం ప్రస్తుతం 112కు చేరినప్పటికీ.. మేజిక్ ఫిగర్కు ఇంకా ఆరు అడుగుల దూరంలో ఉంది.
తమిళనాడు రాజకీయాల్లో పెను మార్పులు చోటుచేసుకుంటున్న వేళ
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించడంలో సువేందు కీ రోల్ పోషించారు. ఆ పార్టీ 206 స్థానాల్లో గెలిచి బెంగాల్లో తొలిసారిగా అధికారం చేపట్టబోతోంది. బీజేపీ తరఫున రెండు స్ధానాల నుంచి బరిలోకి దిగిన సువేందు అధికారి.. మరోసారి మమతా బెనర్జీని ఓడించారు. భవానిపూర్లో దీదీపై గెలిచిన ఆయన.. తన సొంత నియోజకవర్గమైన నందిగ్రామ్లోనూ గెలిచి పట్టు నిలుపుకున్నారు.
ముఖ్యంగా అస్సాం, పశ్చిమబెంగాల్ లో బీజేపీ ఎన్నికల సంఘం సహకారంతో ఫలితాలను చోరీ చేసిందన్నారు.
పశ్చిమబెంగాల్లో మూడున్నర దశాబ్దాల ఏళ్ల సీపీఎం పాలనకు బ్రేక్ వేసి 2011లో అధికార పగ్గాలు చేపట్టిన తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్టీ.. 2026 వరకు వరుస విజయాలతో ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఆమె 15 ఏళ్ల ఆధిపత్యానికి ఎన్డీఏ తెర దించింది. మమతా సైతం కాంగ్రెస్లో కేంద్రమంత్రిగా, పలు కీలక పదవులు నిర్వహించి, తర్వాత సొంత కుంపటి పెట్టుకున్న నాయకురాలే కావడం గమనార్హం.
ప్రజా సమస్యలపై స్పష్టమైన అజెండాతో ఎన్నికల బరిలోకి దిగిన విజయ్ను తమిళ ప్రజలు ఆదరించడం శుభపరిణామమన్నారు.
తన పార్టీ స్థాపించిన నాటి నుండి నేటి వరకు ఆయన సాగించిన ప్రయాణం ఒక అద్భుతమైన రాజకీయ థ్రిల్లర్ను తలపిస్తుంది. ఎన్నికల ప్రచార సమయంలో విజయ్ అనేక ఆటంకాలను ఎదుర్కొన్నారు. ప్రత్యర్థి పార్టీల నుండి వచ్చిన తీవ్ర విమర్శలు, అధికార యంత్రాంగం విధించిన ఆంక్షలు ఆయనను ఉక్కిరిబిక్కిరి చేశాయి. వ్యక్తిగత జీవితంపై జరిగిన దుష్ప్రచారం విజయ్ ఇమేజ్ను దెబ్బతీస్తుందని అందరూ భావించారు.
తమిళనాడులో టీవీకే పార్టీ విజయాన్నిస్వాగతిస్తూ.. వైసీపీ సోషల్ మీడియా వేదికగా సంబరాలు మొదలు పెట్టింది. విజయ్ సాధించిన ఈ అద్భుత విజయం వెనుక వైసీపీ అధినేత జగన్ సహకారం ఉందంటూ వైసీపీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా గతంలో ఒక వివాహ వేడుకలో వైఎస్ జగన్, విజయ్ ఇద్దరూ కలిసి దిగిన ఒక ఫోటోను ఇప్పుడు వైసీపీ నెట్టింట వైరల్ చేస్తోంది.
ఈ ఎన్నికల ఫలితాల్లో విజయ్ టవీకే పార్టీ స్పష్టమైన ఆధిక్యత కనబరిచింది. ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు, కూటమి పక్షాల మధ్య సరైన సమన్వయం లేకపోవడం కూడా ఈ ఓటమికి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి.