ప్రశ్న రావణ్.. నిజంగా రావణుడే.!?

Publish Date:Jul 8, 2026

Advertisement

ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టిస్తున్న యూట్యూబర్ బచ్చలకూరి జోసెఫ్ అలియాస్ ప్రశ్న రావణ్  వివాదాస్పద వ్యాఖ్యల కేసులో రోజుకో దిమ్మదిరిగే వాస్తవం బయటకు వస్తోంది.  రాజకీయ ప్రముఖులతో పాటు హిందూ దేవుళ్లను కించపరుస్తూ సోషల్ మీడియా వేదికగా ఆయన చేసిన కామెంట్స్ రాష్ట్రవ్యాప్తంగా  ప్రకంపనలు రేపాయి. ఈ ఉదంతాన్ని సీరియస్ గా తీసుకున్న ఏపీ పోలీసులు  దర్యాప్తు  ముమ్మరం చేశారు. ముఖ్యంగా ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరియు సనాతన ధర్మంపై అత్యంత అసభ్యకర రీతిలో మాట్లాడి శాంతిభద్రతలకు విఘాతం కలిగించారనే ఆరోపణల నేపథ్యంలో జోసెఫ్ రావణ్ చుట్టూ  ఉచ్చు మరింత బిగుస్తోంది.

ఈ వ్యవహారంలో పోలీసులు తాజాగా కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్టులో  సంచలన విషయాలను ప్రస్తావించారు. సమాజంలో మతాలు, కులాల మధ్య   విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా జోసెఫ్ రావణ్ ప్రసంగాలు సాగాయని పోలీసులు నివేదికలో వెల్లడించారు. అంతేకాకుండా..  రాజ్యాంగబద్ధమైన ఉన్నత పదవుల్లో ఉన్న వ్యక్తులపై  అవమానకరమైన రీతిలో పోస్టులు పెట్టడం ద్వారా ప్రజల్లో ప్రభుత్వ వ్యవస్థలపై ద్వేషం, వైషమ్యం పెంచేందుకు ప్రశ్న రావణ్ ప్రయత్నించినట్లు అధికారికంగా గుర్తించారు. 

పోలీసులు సమర్పించిన రిమాండ్ రిపోర్టులోని మరికొన్ని అంతర్గత విషయాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. విద్యార్థులు, స్థానిక యువతను నిషేధిత మావోయిస్టు శ్రేణుల వైపు ఆకర్షితులయ్యేలా జోసెఫ్ రావణ్ సోషల్ మీడియా వేదికగా సందేశాలు పంపినట్లు పోలీసులు ఆధారాలు సేకరించారు. ఇటీవల ఏలూరు జిల్లాలో నిర్వహించిన ఒక దళిత క్రైస్తవ సదస్సులో  ప్రశ్న రావణ్ రెచ్చగొట్టే ఉపన్యాసాలు ఇచ్చినట్లు దర్యాప్తులో తేలింది. సమాజంలో శాంతియుత వాతావరణాన్ని దెబ్బతీసేలా ప్రసంగించడంతో పాటు,  మావోయిస్టు అగ్రనేత హిడ్మాను కీర్తిస్తూ వ్యాఖ్యలు చేయడం పోలీసులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.

ఈ తీవ్రమైన నేరపూరిత మరియు సంఘవిద్రోహ చర్యల నేపథ్యంలో పోలీసులు జోసెఫ్ రావణ్‌పై సాధారణ చట్టాలతో పాటు  దేశద్రోహ వ్యతిరేక చట్టాన్ని ప్రయోగించారు. ఆయనపై చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం  ఉపా కింద కేసులు నమోదు చేయడంతో పాటు రాజద్రోహం సెక్షన్లను కూడా చేర్చారు. ఇప్పటికే ఈ యూట్యూబర్‌పై రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల్లో దాదాపు తొమ్మిది కేసులు నమోదైనట్లు పోలీసులు ధృవీకరించారు. వరుసగా పలు జిల్లాల పోలీసులు ఆయనను ఒక కేసులో బెయిల్ వచ్చిన వెంటనే మరో కేసులో అదుపులోకి తీసుకుంటూ విచారిస్తున్నారు.

గత కొద్ది రోజులుగా ఈ కేసులో వరుస అరెస్టుల పరంపర సాగుతోంది. పిఠాపురం, కాకినాడ సర్పవరం, కృష్ణా జిల్లా మచిలీపట్నం, ఇనగుదురు వంటి పలు పోలీస్ స్టేషన్లలో నమోదైన ఫిర్యాదుల ఆధారంగా రావణ్‌ను పోలీసులు ముప్పుతిప్పలు పెడుతున్నారు. ఒక కోర్టులో బెయిల్ మంజూరైన వెంటనే, మరో జిల్లాకు చెందిన పోలీసులు సిద్ధంగా ఉండి ఆయన్ను అదుపులోకి తీసుకుంటున్న పరిస్థితి నెలకొంది. కూటమి ప్రభుత్వ విధానాలను, పవన్ కళ్యాణ్‌ను వ్యక్తిగతంగా లక్ష్యం చేసుకుని దూషించారంటూ జనసేన, తెలుగుదేశం పార్టీల శ్రేణులు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదులు అందజేస్తున్నారు.

రాజకీయంగా, సామాజికంగా ఈ ఉదంతం రాష్ట్రంలో తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. జోసెఫ్ రావణ్ భార్య,  ఆయన తరఫు లీగల్ టీమ్ ఈ వరుస అరెస్టులపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే ఒకే తరహా అంశాలపై వరుస కేసులు పెడుతూ వేధిస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే తమపై నమోదైన అన్ని కేసులను ఒకే కేసుగా పరిగణించి విచారణ జరపాలని, దర్యాప్తునుసీబీఐకి అప్పగించాలని కోరుతూ జోసెఫ్ రావణ్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌లో ఏపీ ప్రభుత్వం,  డీజీపీని ప్రతివాదులుగా చేర్చారు.

మరోవైపు, ఈ వ్యవహారంపై జాతీయ మానవ హక్కుల కమిషన్కు కూడా ఫిర్యాదులు అందాయి. వరుస అరెస్టుల పేరిట పోలీసులు  నిబంధనలను ఉల్లంఘిస్తున్నారంటూ మానవ హక్కుల ప్రతినిధులు కమిషన్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ ఫిర్యాదును స్వీకరించిన ఎన్‌హెచ్‌ఆర్‌సీ కేసును పరిశీలనలోకి తీసుకుంది. ప్రస్తుతం నిందితుడు గన్నవరం పోలీసుల పరిధిలో ఉపా చట్టం కింద విచారణ ఎదుర్కొంటుండటంతో, న్యాయస్థానాలు ఈ కేసును ఏ విధంగా పరిగణిస్తాయనేది ఆసక్తికరంగా మారింది. ఉపా చట్టం కింద కేసు నమోదైనందున నిందితుడికి అంత సులభంగా బెయిల్ లభించే అవకాశం లేదని న్యాయ నిపుణులు విశ్లేషిస్తున్నారు.అదలా ఉంటే.. ప్రశ్న రావణ్ సెల్ ఫోన్ లోఅశ్లీల వీడియోలు వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది. ఈనెల ఒకటి న ప్రశ్న రావణ్ అరెస్ట్ అయ్యారు. ఆ సమయంలో ఫోన్  డేటాను  విశ్లేషించిన పోలీసులు అందులో కీలక సమాచారం ఉన్నట్లు తెలుసుకున్నారు. అయితే అప్పటికే రావణ్  తన ఫోన్లోని వీడియోలను డిలీట్ చేసినట్లు తెలుస్తోంది. అలా డిలీట్ చేసిన డేటా కోసం పోలీసులు ఫోన్ ను ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించారు. ఆ ల్యాబ్ నుంచి వచ్చిన నివేదికలో షాకింగ్ అంశాలు వెలుగులోకి వచ్చాయి.   రావణ్ అమాయక యువతులను టార్గెట్ గా చేసుకుని వారితో అసభ్యకరంగా ప్రవర్తించడం.. ఏకాంతంగా ఉన్న సమయంలో ఫోటోలు, వీడియోలు తీసి బ్లాక్ మెయిల్ చేసినట్లు  ఫోరెన్సీక్ ల్యాబ్ నివేదికలో వెల్లడైనట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది. దీంతో పోలీసులు ఈ కేసులో ఇప్పుడు   రావణ్ బారిన పడిన బాధితులు ఎంతమంది ఉన్నారన్న కోణంలో అధికారులు చేపట్టి దాదాపు పదిమంది బాధితులను గుర్తించినట్లు తెలుస్తోంది. దీంతో మరింత కఠినమైన కేసులు జోసెఫ్ రావణ్ పై మోపే అవకాశం ఉంది.

Joseph Ravan Case, Prasna Ravan Arrested, UAPA Act Andhra Pradesh, Joseph Ravan Maoist Links

By
en-us Political News

  
సోషల్ మీడియాలో ఓ మహిళా ప్రజాప్రతినిధిని ఉద్దేశించి అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన ఆర్మ్డ్ రిజర్వ్ పోలీస్ కానిస్టేబుల్‌పై సైబరాబాద్ సీపీ డా. ఎం. రమేష్ సస్పెన్షన్ వేటు వేశారు.
కృష్ణాష్టమి 2026 సందర్భంగా భారతదేశంలో తప్పక సందర్శించాల్సిన మథుర, బృందావనం, ద్వారక, గురువాయూర్ మరియు పూరీ జగన్నాథ ఆలయాల విశేషాలు మరియు ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను ఇక్కడ తెలుసుకోండి.
తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు 2026 అక్టోబర్ 12 నుండి 21 వరకు జరగనున్నాయి. గరుడ సేవ, రథోత్సవం, చక్రస్నానం మరియు వాహన సేవల సంపూర్ణ షెడ్యూల్ ఇక్కడ తెలుసుకోండి.
అయోధ్య శ్రీ రామ్ జన్మభూమి మందిర్ సీఈఓ ఎంపిక కోసం ప్రతిపాదించిన ముగ్గురి పేర్ల జాబితాను కమిటీ ఈరోజు ట్రస్ట్‌కు సమర్పించనుంది. తిరుమల తరహాలో ఆలయ నిర్వహణ కోసం తీసుకున్న ఈ కీలక నిర్ణయ వివరాలు ఇక్కడ చదవండి.
పాకిస్థాన్‌లోని నారోవాల్‌లో 125 ఏళ్ల నాటి చారిత్రక హిందూ దేవాలయాన్ని రాత్రికి రాత్రే కూల్చివేశారు. ఈ ఘోరంపై స్థానిక హిందూ సంఘాల ఆగ్రహం, ఆందోళనల వివరాలు ఇక్కడ చదవండి.
టీటీడీ వేదపారాయణదారుల ఎంపిక ప్రక్రియ తీవ్ర వివాదాస్పదంగా మారింది. తెలంగాణ అభ్యర్థులకు స్థానికత అడ్డంకిగా మారడం, అర్హత మార్కులను 85 నుండి 40కి తగ్గించడంపై వేదపండితులు ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఈ నియామకాల వెనుక ఉన్న పూర్తి వివరాలు, వివాద కారణాలు ఇక్కడ చూడండి.
2026 ఆగస్టు 29 రాశి ఫలాలు, టారో కార్డుల విశ్లేషణ మరియు వాస్తు చిట్కాలు ఇక్కడ తెలుసుకోండి. మేషం నుండి మీనం వరకు ద్వాదశ రాశుల ఉద్యోగం, ఆరోగ్యం, ఆర్థిక పరిస్థితి మరియు సరైన వాస్తు నివారణల సమగ్ర వివరాలు!
పశ్చిమ బెంగాల్ దుర్గాపూజ పండళ్ల లోపల మాంసాహారం నిషేధించాలని విశ్వహిందూ పరిషత్ డిమాండ్ చేసింది. 5 రోజుల ఉత్సవాల్లో సనాతన సంప్రదాయాలు పాటించాలని 600 పూజా కమిటీలకు వీహెచ్‌పీ చేసిన ప్రతిపాదనల వివరాలు.
రక్షాబంధన్ రోజున రాఖీ దారం తెగిపోవడం అశుభమా కాదా అనే సందేహాలకు వేద పండితుల సమాధానం తెలుసుకోండి. తెగిపోయిన రాఖీ వల్ల కలిగే ప్రయోజనాలు, పాటించాల్సిన నియమాలు మరియు 2026 రాఖీ శుభ ముహూర్తాల వివరాలు.
తిరుమలలో పౌర్ణమి మరియు గరుడ సేవ సందర్భంగా భక్తులు పోటెత్తారు. శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతుండగా, ఒక్కరోజే 66,437 మంది దర్శించుకోగా రూ. 4.45 కోట్ల హుండీ ఆదాయం లభించింది.
తిరుపతి ఫారెస్ట్ డివిజన్ అధికారులు అత్యంత అరుదైన 3 రోజ్-రింగ్డ్ ప్యారాకీట్స్ (రామచిలుకలను) సమర్థవంతంగా రక్షించారు. ప్రాథమిక చికిత్స అనంతరం వాటిని తిరిగి అడవిలోకి విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. పూర్తి వివరాలు చదవండి.
శ్రావణ పౌర్ణమి నాడు జరుపుకునే హయగ్రీవ జయంతి విశిష్టత, శ్రీమహావిష్ణువు హయగ్రీవ అవతారం ఎత్తడానికి గల ఆధ్యాత్మిక కథ మరియు విద్యార్థులకు జ్ఞానాన్ని ప్రసాదించే హయగ్రీవ పూజా విధానం గురించి వివరంగా తెలుసుకోండి.
చంద్ర గ్రహణ సమయంలో ఆధ్యాత్మిక రక్షణ మరియు మానసిక ప్రశాంతత పొందేందుకు పాటించాల్సిన సూతక కాల నియమాలు, మంత్ర జపం, గర్భవతుల జాగ్రత్తలు మరియు గ్రహణానంతర శుద్ధి, దానాల విశిష్టతలను వివరంగా తెలుసుకోండి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.