ఈవీఎంల భద్రతపై ప్రణబ్‌ ముఖర్జీ ఆందోళన

Publish Date:May 21, 2019

Advertisement

 

సార్వత్రిక ఎన్నికలు బాగా నిర్వహించారని, ఎన్నికల సంఘం పనితీరు భేష్‌ అంటూ ప్రశంసించిన ఒక్కరోజులోనే మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ ఈవీఎంల భద్రతపై వస్తున్న వార్తలపై ఆందోళన వ్యక్తం చేశారు. ఈవీఎంల ద్వారా ప్రజలు ఇచ్చిన తీర్పు చాలా పవిత్రమైందని, అయితే ఈవీఎంల భద్రతపై ఎటువంటి అనుమానాలు లేకుండా చేయాల్సిన బాధ్యత ఈసీపై ఉందని ఆయన పేర్కొన్నారు.  

‘‘ఓటర్ల తీర్పును ట్యాంపరింగ్‌ చేస్తున్నారంటూ వస్తున్న ఆరోపణలపై నేను ఆందోళన చెందాను. ఈవీఎంల రక్షణ, భద్రత బాధ్యత ఎన్నికల సంఘానిదే. ప్రజాస్వామ్య మూలాలను సవాలు చేసేలా ఊహాగానాలు రావడం సరికాదు. ప్రజల తీర్పు చాలా ఉన్నతమైనది. మన వ్యవస్థలపై దృఢమైన విశ్వాసం ఉన్న వ్యక్తిగా నా అభిప్రాయాన్ని చెబుతున్నాను. మన వ్యవస్థల సమగ్రత బాధ్యత ఎన్నికల సంఘంపై ఆధారపడి ఉంది. ఎటువంటి అనుమానాలు లేకుండా చేయాల్సి ఉంది’ అని ప్రణబ్‌ ముఖర్జీ పేర్కొన్నారు.

ఈ ఎన్నికల్లో ఈసీ పనితీరుపై ముందు నుంచి విపక్షాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. ఎన్నికల కమిషన్ మోదీ కమిషన్ లాగా మారిపోయిందని విమర్శించాయి. కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ కూడా మోదీకి ఎన్నికల సంఘం లొంగిపోయిందని ఆరోపించారు. అయితే ప్రణబ్‌ముఖర్జీ మాత్రం ఈసీ పనితీరు బాగుంది అంటూ పరోక్షంగా విపక్షాలను తప్పుపట్టారు. కాగా.. ఉత్తర్‌ప్రదేశ్‌, బీహార్, పంజాబ్‌, హర్యానాలోని పలు ప్రాంతాల్లో ఈవీఎంల ట్యాంపరింగ్‌పై వస్తున్న వార్తలు కలకలం రేపుతున్న నేపథ్యంలో.. ప్రణబ్‌ముఖర్జీ తాను ఆందోళన చెందుతున్నట్లు వ్యాఖ్యలు చేశారు.

By
en-us Political News

  
వైఎస్ షర్మిలా రెడ్డి.. రాజకీయాలలో ఆమె ఒక ఫైర్ బ్రాండ్. వైసీపీ అధినేత జగన్ కు స్వయానా సోదరి. వైఎస్ జగన్ విపక్షంలో ఉన్న సమయంలో షర్మిల అన్న కోసం.. అన్న వదిలిన బాణాన్నంటూ రాష్ట్రమంతా చుట్టేశారు. పార్టీ అధినేత అందుబాటులో లేని లోటు పార్టీకి కనబడకుండా చేశారు. అయితే షర్మిల పుణ్యమా అని అధికారంలోకి వచ్చిన జగన్.. సీఎంగా రాష్ట్రపగ్గాలు అందుకున్నాకా.. తనకు అధికార అందలం అందించడం కోసం రాష్ట్రమంతటా కాళ్లరిగేలా తిరిగిన షర్మిలను దూరం పెట్టేశారు.
 ఎన్నికలకు ఇంకా 11 రోజుల వ్యవధి ఉన్న నేపథ్యంలో రాష్ట్రంలో అధికారపార్టీ నేతల  అరెస్ట్ సంచలనమైంది. 
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారని తెలుగుదేశం పార్టీ ఆరోపించింది. ప్రతిపక్ష అభ్యర్థులపై వ్యక్తిగత జీవితంపై విమర్శలు చేస్తున్నారని టీడీపీ నేత ప్రత్తిపాటి పుల్లారావు మండిపడ్డారు. ఎన్నికల ప్రచారం నిర్వహించకుండా జగన్ పై తక్షణం బ్యాన్ విధించాలని ఎన్నికల సంఘాన్ని డిమాండ్ చేశారు.
కేంద్ర ఎన్నికల సంఘానికి ఒక్క ఆంధ్ర ప్రదేశ్ విషయంలోనే నిబంధనలు గుర్తుకురావా? లేక ఏపీకి సంబంధించి ఎన్నికల సంఘానికి ఏమైనా ప్రత్యేక గైడ్ లైన్స్ ఉన్నాయా? ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో అన్ని పార్టీల విషయంలో సమానంగా వ్యవహరించాల్సిన ఎన్నికల సంఘం ఏపీలో మాత్రం అధికార వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తోందా? విపక్ష కూటమి ఫిర్యాదులను బుట్టదాఖలు చేసి తమాషా చూస్తోందా? అంటే జరుగుతున్న పరిణామాలను గమనిస్తుంటే ఔననే సమాధానమే వస్తున్నది.
‘మా ఇద్దరి మనసులు కలిశాయి.. పంచభూతాల సాక్షిగా, ముక్కోటి దేవతల సాక్షిగా పెళ్ళి చేసుకున్నాం’ అని సినిమా డైలాగులు చెబితే కుదరదని,
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్ట్ అయి తీహార్ జైలులో ఊచలు లెక్కబెడుతున్న బిఆర్ఎస్ అధినేత కెసీఆర్ తనయ కవితకు ఇప్పట్లో బెయిల్ లభించే అవకాశాలు కనిపించడం లేదు. 
‘అధికారం శాశ్వతం కాదు’... దారిన పోతున్న ఏ దానయ్యని ఆపి ‘అధికారం’ అనే పాయింట్ గురించి అడిగితే ఈ సమాధానమే చెబుతాడు
ఏడువిడతల్లో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో ఇప్పటివరకూ జరిగిన రెండు విడతల ఎన్నికల్లో భారతీయ జనతాపార్టీ అనూహ్యంగా వెనుకబడింది. తమ ఎక్స్ పెక్టేషన్స్ కంటే సీట్లు భారీగా తగ్గనున్నాయని బీజేపీ నాయకులే చెబుతున్నారు. తోలి విడతలో 102, రెండో విడతలో 88 లోక్ సభ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. తొలి విడతలో 60 శాతం, రెండో విడతలో 62 శాతం పోలింగ్ నమోదైంది.
ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటిగా విరాజిల్లుతూ.. నల్లమల అభయారణ్యంలో కొండగుట్టల మధ్య శ్రీశైల భ్రమరాంబిక మల్లిఖార్జున స్వామి ఆలయం వెలసి ఉంది.
ఇంతకాలం బిఆర్ఎస్ పార్టీకి ఒకే ఒక్క ఎంపీ స్థానం.. అది కూడా మెదక్ ఎంపీ స్థానం దక్కుతుందన్న అంచనాలు రాజకీయ వర్గాల్లో వున్నాయి.
జనసేన పార్టీ అధికార ప్రతినిధి రాయపాటి అరుణ రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఈ ప్రమాదంలో ఆమెకు గాయాలయ్యాయి.
ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల వేడి ఓ రేంజ్ లో ఉంది. వేసవి వడగాడ్పులు ఎన్నికల హీట్ ముందు శీతల పవనాలుగా మారిపోతున్నాయి. రాష్ట్రం మొత్తం ఒకెత్తైతే గుడివాడ, గన్నవరం నియోజకవర్గాలలో ఎన్నికల పోరు మరో ఎత్తు అన్న భావన నిన్నమొన్నటి దాకా ఉండేది. ఎన్నికలు 11 రోజుల్లో జరగనున్నాయి. ఫలితాలు రావడానికి జూన్ 4 దాకా వేచి చూడాలి.
ఓయులో కరెంట్ , నీటి కటకట ఉందని ఈ కారణంగానే హాస్టల్స్ మూసి వేస్తున్నారని బిఆర్ఎస్ చేస్తున్న ప్రచారాన్ని రేవంత్ సర్కార్ సీరియస్ గా తీసుకుంది. ఓయు చీఫ్ వార్డెన్ ఫిర్యాదు మేరకు పోలీసులు రంగంలో దిగి కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో క్రిషాంక్ ను  చౌటుప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో అరెస్ట్ చేశారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.