ప్రణబ్‌ వ్యూహం అదిరిపోయిందిగా!

Publish Date:Jun 8, 2018

Advertisement

 

ఎప్పుడెప్పుడా అని దేశం అంతా ఎదురుచూస్తున్న ప్రణబ్‌ ముఖర్జీ నాగ్‌పూర్‌ యాత్ర ముగిసింది. అనుకున్నట్లుగానే ప్రణబ్ ముఖర్జీ నొప్పించక తానొవ్వక అన్న రీతిలో ప్రసంగాన్ని లాక్కువచ్చారు. అరెస్సెస్‌ను పొగిడితే కాంగ్రెస్‌కు ఎక్కడ కాలుతుందో అనీ, తిడితే ఎక్కడ బీజేపీ భగ్గుమంటుందో అనీ గాల్లో తాడు మీద నడిచినంత సుతారంగా ప్రసంగాన్ని సాగించారు. అదే సమయంలో పటేల్‌ను పొగిడి ఆరెస్సెస్‌, పరమత సహనం గురించి మాట్లాడి కాంగ్రెస్‌ చంకలు గుద్దుకునేలా చేశారు.

ప్రణబ్‌ ఎంత జాగ్రత్తగా వ్యవహరించినా... ఆయన సమావేశానికి హాజరు కావడం వల్ల ఆరెస్సెస్‌ వైపే లాభం మొగ్గు చూపుతోంది. నిన్న మొన్నటి వరకూ కాంగ్రెస్‌వాదులు వెలివేసీ, వెక్కిరించిన ఆరెస్సెస్‌ ప్రాంగణంలో అడుగుపెట్టడం అంటేనే ఆ సంస్థ ప్రాముఖ్యతని ఆయన గుర్తించినట్లు. పైగా హెగ్డేవార్‌ని భారతదేశపు ముద్దుబిడ్డగా అభివర్ణించడంతో, ఆరెస్సెస్‌ సంబరానికి అవధులు లేకుండా పోయింది. ఇప్పటివరకూ కాంగ్రెస్, గాంధీని చంపిన సంస్థగా ఆరెస్సెస్‌ను దుమనమాడేది. అలాంటి సంస్థనీ, దాని వ్యవస్థాపకుడినీ పొగిడిన ప్రణబ్‌ చర్య మింగుడుపడటం కష్టమే!

ప్రణబ్‌ ఎంత జాగ్రత్తగా మాట్లాడినా, ఆయన మాటల్ని అంతా మర్చిపోతారనీ... ఆయన ప్రసగించిన దృశ్యాలని మాత్రం ఆరెస్సెస్, బీజేపీ అవాస్తవాలని జోడించి తమకు అనుకూలంగా మార్చేసుకుంటాయని సాక్షాత్తు ఆయన కూతురు శర్మిష్ఠ హెచ్చరించారు. నిజంగానే సమావేశం ముగిసిన తర్వాత హిందుత్వవాదులు, తమకు అనుకూలమైన వార్తల్ని ప్రచారం చేయడం మొదలుపెట్టారు. ప్రణబ్‌ తల మీద ఆరెస్సెస్‌ టోపీ పెట్టుకొని, వారి తరహాలోనే అభివాదం చేస్తున్నట్లు మార్ఫ్ చేసిన ఫొటోలను వదిలారు.

ఇదంతా పక్కన పెడితే... అసలింతకీ ప్రణబ్‌ దా తగుదునమ్మా అంటూ ఆరెస్సెస్ సమావేశానికి ఎందుకు వెళ్లినట్లు. పెద్ద మనిషిగా నాలుగు మంచి మాటలు చెప్పడానికా అంటే కాదు, పాత వైరాలన్నీ మర్చిపోయి కలిసిపోవడానికా అంటే అదీ కాదు... మరెందుకు! ప్రణబ్ పైకి కాంగ్రెస్‌కు వీరవిధేయుడిలాగానే కనిపిస్తారు. ఆయనను రాష్ట్రపతిని చేయడం ద్వారా కాంగ్రెస్ అందుకు తగిన గుర్తింపుని కూడా అందించింది. కానీ ప్రణబ్‌ మనసులో ఇంకా ఏదో లోటు ఉన్నట్లు కనిపిస్తుంది.

పైకి చెప్పుకోకపోయినా మొదటి నుంచీ ప్రణబ్‌కు ప్రధాని పీఠం మీద ఆసక్తి ఉంది. ఇందిరాగాంధీ మరణం తర్వాత తనకు తప్పకుండా ఆ పీఠం దక్కుతుందని ఆశించారు ప్రణబ్‌. కానీ రాజీవ్‌ రంగప్రవేశంతో హతాశుడయ్యాడు. అందుకే కొన్నాళ్లపాటు కాంగ్రెస్‌ నుంచి దూరమై సొంత కుంపటి పెట్టుకున్నారు. రాజీవ్ మరణం తర్వాత పీ.వీ నరసింహరావు, ఆ తర్వాత మన్మోహన్‌ సింగ్‌లు ప్రధాని పదవిని సాధించారు కానీ ప్రణబ్‌కు మాత్రం మొండిచెయ్యే మిగిలింది. తనకి హిందీ రాకపోవడం వల్లే ప్రధానిని కాలేకపోయానని సరదాగా అన్నా, తనతటి మేధావికి ప్రధాని పదవి దక్కకపోవడాన్ని ఆయన జీర్ణించుకోలేకపోయారని అంటారు.

ఇంతకీ అసలు విషయానికి వస్తే... ఈమధ్యకాలంలో మోదీ-షాల ప్రభ కొడిగడుతున్నట్లు కనిపిస్తోంది. అటు కాంగ్రెస్‌ను చూస్తేనేమో పూర్తిస్థాయి మెజారటీ దక్కించుకునేట్లు లేదు. ఒకవేళ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినా... రాహుల్‌గాంధీనే వారి ప్రధానమంత్రి అభ్యర్థిగా నిలుస్తాడు. అదే ప్రతిపక్షాలన్నింటికీ దగ్గరగా ఉండి మూడోకూటమిని గెలిపించుకుంటే! కాంగ్రెస్ లేదా బీజేపీల మద్దతుతో అధికారంలోకి వస్తే! ఇదంతా జరగాలంటే మూడో కూటమికి ఓ పెద్దమనిషి ప్రధాని అభ్యర్థిగా ఉండాలి. అతను అటు కాంగ్రెస్‌కు, ఇటు బీజేపీకి కూడా ఆమోదయోగ్యం అయి ఉండాలి. ప్రస్తుత వాతావరణంలో అలాంటి వ్యక్తి ఎవరా అని పరిశీలిస్తే... బహుశా ప్రణబ్‌ పేరే ముందు వినిపిస్తుందేమో! ప్రణబ్‌ ఆలోచన కూడా ఇదే అయితే... ఆయన వ్యూహం అదిరిపోయిందిగా!!!

By
en-us Political News

  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు.
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్ రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది. 80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది. ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది.
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు...
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది...
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో  తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది. 
​సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది...
జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు.
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు...
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి...
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  
నాలుగు రాష్టాలు అస్సాం, పశ్చిమ బెంగాల్ తమిళనాడు,కేరళ, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి శాసన సభలకు  మరో రెండు నెలల్లో ఎన్నికలు జరుగుతాయి. ఇది అందరికీ తెలిసిన విషయం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.