ప్రజాపాలన, ప్రత్యర్థులకు మన్నన.. సీఎం రేవంత్ పై ప్రశంసలు

Publish Date:Dec 29, 2023

Advertisement

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరి, రేవంత్ రెడ్డి సీఎంగా పదవీ బాధ్యతలు తీసుకుని నిండా నెలరోజులు కాలేదు. అయినా అప్పుడే ఆయనపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. సీఎం కాన్వాయ్ కారణంగా సాధారణ ప్రయాణీకులకు ఇబ్బంది కలగకూడాదన్న ఆదేశాలు ఇవ్వడం ఆయన నిరాడంబరతను తేటతెల్లం చేస్తోంది. ఇక తెలంగాణ రాష్ట్రంలో దాదాపు తొమ్మిదేళ్ల తరువాత ఇప్పుడు ప్రజాస్వామ్య పోకడలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. రాజకీయ విలువలకు రేవంత్ సర్కార్ మళ్లీ వలువలు తొడిగిందన్న అభిప్రాయం ప్రజాస్వామ్య వాదులలో వ్యక్తం అవుతోంది. సీఎంగా రేవంత్ ప్రమాణ స్వీకారం చేసిన క్షణం నుంచే తమది ప్రజా ప్రభుత్వం అని రుజువు చేసేందుకు కంకణం కట్టుకున్నారా అన్నట్లుగా ఆయన అడుగులు ఉన్నాయి. ప్రగతి భవన్ ముందు ఇనుప కంచెలు తొలగించడం నుంచీ, సచివాలయంలోని ప్రవేశంపై ఉన్న ఆంక్షలను ఎత్తివేయడం ద్వారా రేవంత్ ప్రజల మన్ననలు పొందే విధంగా వ్యవహరించారు.  అదే సమయంలో ఎన్నికల ముందు ఇచ్చిన ఆరు గ్యాంరటీల వాగ్దానం అమలు దిశగా వేగంగా కదులుతున్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, బీమా పదిలక్షలకు పెంపు వంటి హామీలను అధికారపగ్గాలు అందుకున్న వెంటనే అమలు చేయడంతో పాటు మిగిలిన ఆరు హామీల అమలు దిశగా వేగంగా చర్యలు తీసుకుంటున్నారు. అలాగే పాలనపైనే కాకుండా పార్టీపైన కూడా రేవంత్ పూర్తి స్థాయి పట్టు సాధించినట్లే కనిపిస్తున్నది. తెలంగాణ ముఖ్యమంత్రి పీఠం కోసం రేవంత్ తో చివరి క్షణం వరకూ పోటీ పడిన మల్లు భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, అదే విధంగా తనకు కాంగ్రెస్ అధిష్ఠానం టీపీసీసీ పగ్గాలు అప్పగించిన క్షణం నుంచి ఆ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ, రేవంత్ కు వ్యతిరేకంగా పని చేయడమే ఎజెండాగా వ్యవహరించిన కోమటిరెడ్డి వెంకటరెడ్డిలను కేబినెట్ లోకి తీసుకోవడమే కాకుండా ప్రధానమైన శాఖలను అప్పగించి.. వారిలో తన పట్ల వ్యతిరేకతను తగ్గించుకున్నారు.

అదే  విధంగా ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తనను కనీసం అభినందించని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గాయపడి ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతుంటే రేవంత్ మర్యాదపూర్వకంగా ఆస్పత్రికి వెళ్లి పరామర్శించారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మెరుగైన వైద్య చికిత్స అందించాలని వైద్యులకు సూచించారు.  రాష్ట్ర పర్యటనకు వచ్చిన ప్రధానిని కనీసం కలుసుకోవడానికి కూడా ఇష్టపడని, ప్రొటోకాల్ ను, మర్యాదనూ కూడా పక్కన పెట్టేసిన ముఖ్యమంత్రిని చూసిన తెలంగాణ ప్రజ.. గెలిచిన తరువాత హస్తిన వెళ్లి మరీ ప్రధానిని మర్యాదపూర్వకంగా కలిసి, రాష్ట్రానికి రావలసిన నిధులు అందించి రాష్ట్రాన్ని ఆర్థికంగా ఆదుకోవాలని కోరిన సీఎం రేవంత్ ను అభినందిస్తున్నారు. రాష్ట్రం, కేంద్రం మధ్య సంబంధాలు మెరుగుపడితేనే అభివృద్ధి పరుగులు పెడుతుందని అంటున్నారు. 

 అన్నిటికీ మించి అసెంబ్లీ సమావేశాలంటే విపక్షాలను సభ నుంచి బయటకు పంపేసి.. ప్రజాస్వామ్యం కాదు, ఏక పార్టీ స్వామ్యం అన్నట్లుగా ఇన్నాళ్లుగా నడిచిన తెలంగాణ అసెంబ్లీ సమావేశాలను నిజమైన ప్రజాస్వామ్య స్ఫూర్తికి నిలువెత్తు నిదర్శనం అన్నట్లుగా నిర్వహించారు.  రాష్ట్ర ముఖ్యమంత్రిగా పాలనా వ్యవహారాలలో వ్యక్తిగత, రాజకీయ విభేదాలను తావివ్వని సత్సాంప్రదానికి రేవంత్ తిరిగి ప్రాణ ప్రతిష్ఠ చేశారు.   తమ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడబోదని, గత ప్రభుత్వంలో జరిగిన పొర పాట్లను సరిచేసుకుంటూనే మెరుగైన పాలనను ప్రజలకు చేరువ చేస్తామని ప్రకటించిన విధంగానే కార్యాచరణ అమలుకు చర్యలు చేపట్టారు. 

అదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా వివాదాస్పదం కావడంతో పాటు, అనేక ఇబ్బందులు, ఇక్కట్లకు కారణమైన గత ప్రభుత్వ జిల్లాల పునర్వ్యవస్థీకరణపై దృష్టి సారించి లోటుపాట్లను సవరించి అవసరమైతే జిల్లాల పునర్వ్యవస్థీకరణలో అవసరమైన మార్పులు చేర్పులూ చేయాలని రేవంత్ ప్రభుత్వం నిర్ణయించింది.  కొత్త జిల్లాల ఏర్పాటు హేతురహితంగా, మాజీ ముఖ్యమంత్రి ఇష్టానుసారంగా జరిగిదని రేవంత్ ప్రభుత్వం భావిస్తోంది.  ఈ నేపథ్యంలోనే  జిల్లాల సరిహద్దుల మార్పులు, చేర్పుల విషయంలో అధ్యయనం చేసేందుకు ఓ కమిటీ ఏర్పాటు చేసేందుకు రేవంత్ సర్కార్ సమాయత్తమౌతోందని అధికార వర్గాల సమాచారం.  

ప్రస్తుతం అమల్లో ఉన్న 33 జిల్లాల విషయంలోమార్పులు, చేర్పులన్నీ ప్రజాభిప్రాయం మేరకే జరపాలని ప్రభుత్వం భావిస్తోందనీ, ఇందు కోసం ప్రతిపాదిత మార్పులు, చేర్పులపై ప్రజాభిప్రాయ సేకరణకు రేవంత్ సర్కార్సమాయత్తమౌతోందని తెలుస్తోంది.  ఈ ప్రజాభిప్రాయ సేకరణ కోసం  ఓ కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు చర్చ అధికారవర్గాలు చెబుతున్నాయి.  ప్రజాభిప్రాయం మేరకు జిల్లాల సరిహద్దుల మార్పులూ చేర్పులూ చేపట్టాలని రేవంత్ భావిస్తున్నట్లు చెబుతున్నారు.   

By
en-us Political News

  
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వం మారినప్పటికీ, క్షేత్రస్థాయిలో పాలనా పరమైన విధానాలు మరియు లబ్ధిదారుల శైలి మారలేదనే తీవ్ర అసంతృప్తి రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది.
దేశ రాజకీయాల్లో తెరవెనుక జరుగుతున్న పరిణామాలు ఇప్పుడు సర్వత్రా ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్‌లో రాజ్యసభ ఎన్నికలు ఏకగ్రీవంగా పూర్తయ్యాయి.
దిల్లీలో నీట్ పరీక్షల లీకేజీకి సంబంధించి పక్కా ఆధారాలు బయటపడటంతో అక్కడ కేంద్ర ప్రభుత్వంపై యువత తిరగబడింది. కానీ ఏపీలో మెగా డీఎస్సీ పారదర్శకంగా ముగిసి, నియామక పత్రాలు కూడా అభ్యర్థులకు అందజేశారు. ఏపీ విద్యాశాఖ కూడా విపక్షాలు చేసిన ప్రతి ఆరోపణకూ రికార్డులతో సహా పక్కాగా వివరణ ఇచ్చింది.
కవిత పార్టీ పేరుపై బీఆర్ఎస్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. 14 ఏళ్ల తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో టీఆర్ఎస్ అనే పేరు తెలంగాణ ప్రజల భావోద్వేగాలతో ముడిపడి ఉందనీ, ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు బీఆర్ఎస్‌ను టీఆర్ఎస్‌గానే గుర్తిస్తున్నారని పేర్కొంటూ ఆ పేరును ఇతరులకు కేటాయించవద్దని ఈసీఐకి అధికారిక ఫిర్యాదు చేసింది.
ఇటీవలి అసెంబ్లీ ఎన్నికలలో ఓటమి తరువాత టీఎంసీకి వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఎన్నికల ఫలితాల తరువాత పార్టీలో అంతర్గత విభేదాలు ఒక్కసారిగా రచ్చకెక్కాయి. మమతా బెనర్జీని ధిక్కరిస్తూ ఒక్కరొక్కరుగా కీలక నేతలు పార్టీని వీడుతున్నారు.
దేశంలో ప్రజాస్వామ్యాన్ని ప్రమాదంలో పడేసిన మోడీ.. ఇప్పడు పాలనలో రికార్డు అంటూ సంబరాలు చేసుకోవడమేంటని ప్రశ్నించారు. మోడీ పాలనా మైలురాయి కేవలం స్వయం ప్రకటిత అంశం మాత్రమేనన్నారు.
రాబోయే రోజుల్లో ఏ ప్రాంతీయ పార్టీని దగ్గరకు చేర్చుకొనే అవకాశం లేదని ఆయన కుండబద్దలు కొట్టారు. ఎన్డీయే ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి వచ్చి బుధవారంతో 12 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న నేపథ్యంలో మంగళవారం (జూన్ 9) ఢిల్లీలో ఆయన విలేకరులతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ ఈ సోలో ఎజెండా ప్రకటించారు.
మొత్తంగా తెలుగు రాష్ట్రాలలో బీజేపీ వ్యూహం ఏమిటన్న విషయాన్ని అమిత్ షా తేటతెల్లం చేసేశారు. దేశవ్యాప్తంగా కూటమి రాజకీయాలు నడుస్తున్న తరుణంలో.. కేంద్ర హోం మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా తెలంగాణ రాజకీయాలపై చేసిన వ్యాఖ్యలు జనసేనకు ఒకింత ఇబ్బందికలిగేలా ఉన్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
పార్టీ నాయకత్వంపై అసంతృప్తితో ఉన్న కీలక నేతలు ఒక్కొక్కరుగా పార్టీని వీడి బయటకు వచ్చేస్తున్నారు. తాజాగా టీఎంసీకి చెందిన రాజ్యసభ ఎంపీ సుస్మితా దేవ్ తన పదవికి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. వారం రోజుల వ్యవధిలో టీఎంసీకి గుడ్ బై చెప్పిన రెండో రాజ్యసభ సభ్యురాలు సుస్మితాదేవ్.
కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు మీనాక్షి నటరాజన్ నామినేషన్‌ తిరస్కరనకు గురి కావడం దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తోంది. మీనాక్షీ నటరాజన్ రాజ్యసభ నామినేషన్ ను ఎన్నికల సంఘం తిరస్కరించడంపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. మీనాక్షి నటరాజన్‌పై తెలంగాణ రాష్ట్రంలో ఎలాంటి క్రిమినల్ కేసులు లేవని స్పష్టం చేశారు.
పునర్విభజన ప్రక్రియ వల్ల ఏ ఒక్క రాష్ట్రానికి గానీ, ఎవరికీ గానీ ఎలాంటి అన్యాయం జరగదని పునరుద్ఘాటించారు. డీలిమిటేషన్ బిల్లుపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్న విమర్శలను అమిత్ షా కొట్టిపారేశారు. రేవంత్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యల్లో సీరియస్‌నెస్ లేదని, వాటిని పట్టించుకోవలసిన అవసరం లేదనీ అన్నారు.
మోదీ ప్రధాని పీఠంపై విజయవంతంగా 12 ఏళ్ల సుదీర్ఘ పదవీకాలాన్ని పూర్తి చేసుకున్నారు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే 4,399 రోజుల పాటు ఆయన నిరంతరాయంగా ప్రధాని పదవిలో ఉన్నారు. 1952లో భారతదేశంలో మొట్టమొదటి సార్వత్రిక ఎన్నికలు జరిగిన తర్వాత.. జవహర్‌లాల్ నెహ్రూ ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికై 4,398 రోజుల పాటు నిరవధికంగా ప్రధానిగా బాధ్యతలు నిర్వహించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.