ఢిల్లీ పర్యటనలో ఉన్న మంత్రి నారా లోకేష్ తో జనసురాజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిశోర్ భేటీ అయ్యారు. కేంద్ర ఐటీ శాఖ మంతరి అశ్విని వైష్ణవ్ ను కలిసేందుకు ఢిల్తీ వెల్లిన లోకేష్ తో భేటీ అయ్యేందుకు ప్రశాంత్ కిషోర్ వచ్చారు. ఎన్నికల వ్యూహకర్తగా మొదలకై సొంత పార్టీ పెట్టుకుని బీహార్ రాజకీయాలకే పరిమితమైన ప్రశాంత్ కిషోర్ లోకేష్ తో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. వీరిరువురి మధ్యా ఏయే అంశాలపై చర్చ జరిగిందన్నది తెలియరాలేదు.
అయినా పార్టీలకు ఎన్నికల వ్యూహకర్తగా వ్యవహరించడం మానేసి, ఐ ప్యాక్ నుంచి పూర్తిగా వైదొలగిన ప్రశాంత్ కిషోర్ పనిగట్టుకుని మరీ లోకేష్ తో భేటీ అవ్వడంపై పలు విధాలుగా చర్చ జరుగుతోంది. గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి వ్యూహకర్తగా పని చేసిన రాబిన్ శర్మ ప్రశాంత్ కిషోర్ శిష్యుడే. ఆయన ఇప్పటికీ తెలుగుదేశం పార్టీ కోసం పని చేస్తున్నారు. ఇప్పుడు తెలంగాణలో పార్టీ పటిష్టత కోసం రాబిన్ శర్మ పని చేస్తున్నారని అంటున్నారు. దానిపై క్లారిటీ లేదు. ఇప్పుడు లోకేష్ తో ప్రశాంత్ కిషోర్ భేటీ అవ్వడం వెనుక కూడా తెలంగాణలో పార్టీని ముందుకు తీసుకువెళ్లే వ్యూహాలపైనే చర్చ జరిగి ఉండొచ్చని పరిశీలకులు అంటున్నారు.
కాగా ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు బీహార్ లో తన పార్టీ జన జనసురాజ్ ను ఎన్నికలలో గెలిపించుకోవడంపైనే పూర్తిగా దృష్టి పెట్టారు. బీహార్ లో ఉద్యోగ నియామకాల విషయంలో జరిగిన అవకతవకలపై విద్యార్థుల ఆందోళనకు మద్దతుగా ఇటీవల ఆమరణదీక్షచేసి ప్రజల్లో పేరు తెచ్చుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల నాటికి ఆయన బీహార్ లో గేమ్ చేంజర్ గా మారే అవకాశాలున్నాయని పరిశీలకులు అంటున్నారు. ఇక పోతే ప్రశాంత్ కిషోర్ లోకేష్ తో భేటీ, వారి మధ్య ఏయే అంశాలపై చర్చ జరిగిందన్న విషయంపై మాత్రం ఎలాంటి సమాచారం లేదు.
అయితే రాజకీయ వ్యూహాల్లో నిష్ణాతుడిగాదేశ వ్యాప్తంగా గుర్తింపు ఉన్న ఐప్యాక్ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిశోర్ పనిగ్ట్టుకుని మరీ లోకేష్ తో భీటీ అవ్వడంపై మాత్రం రాజకీయవర్గాలలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఢిల్లీలోని ఏపీ సీఎం అధికారిక నివాసంలో బస చేసిన లోకేష్ ను కలిసేందుకే ప్రశాంత్ కిషోర్ అక్కడకు వచ్చారు. వీరిరువురి మధ్యా భేటీ ముందుగా నిర్ణయించిన మేరకే జరిగిందని అర్ధమౌతోంది.
గత ఏడాది జరిగిన ఎన్నికలలో ఏపీలో తెలుగుదేశం కూటమి ఘన విజయం ఖాయమని బల్లగుద్ది మరీ చెప్పారు ప్రశాంత్ కిశోర్. అయన అంచనా వేసినట్లే ఆ ఎన్నికలలో తెలుగుదేశం కూటమి కనీవినీ ఎరుగని రీతిలో ఘన విజయం సాధించింది. వైసీపీ కనీపం ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా కేవలం 11 అసెంబ్లీ స్థానాలకు పరిమితమై ఘోరాతి ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. వాస్తవానికి అప్పుడు ప్రశాంత్ కిశోర్ ఐప్యాక్ నుంచి బయటకు వచ్చేశారు. ఆయన శిష్యుడు రాబిన్ శర్మ తెలుగుదేశం కోసం పని చేశారు. అయినా అప్పట్లో ప్రశాంత్ కిశోర్ తెలుగుదేశం కూటమి విజయం తథ్యమని చెప్పారు. అప్పటి నుంచీ ప్రశాంత్ కిశోర్ కు లోకేష్, చంద్రబాబుతో మంచి సంబంధాలు ఉన్నాయని అంటున్నారు. ఆ క్రమంలోనే లోకేష్ ఢిల్లీ పర్యటనలో ఉండగా ప్రశాంత్ కిశోర్ ఆయనతో భేటీ అయ్యారని చెబుతున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/praashant-kishore-meet-lokesh-39-192369.html
టీవల బొత్సకు బ్రెయిన్ స్ట్రోక్ తగిలి తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. కోలుకుని ఆయన మండలికి వచ్చారు. అప్పుడు ఆయనకు లోకేష్ సాదరంగా ఆహ్వానించిన తీరు పట్ల లోకేష్ పై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. అదే గతంలో చంద్రబాబు పై జగన్ చేసిన వ్యాఖ్యలపై పార్టీలకు అతీతంగా అందరూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఓడలు బండ్లు అవుతాయి. బండ్లే ఓడలవుతాయి అన్న సామెతకు నేటి జగన్ పరిస్థితి అచ్చుగుద్దినట్లు సరిపోతుందంటున్నారు పరిశీలకులు. ఒక్కోసారి అవసరం తీరిపోయిన తర్వాత విసిరేసిన తెడ్డే.. చివరికి పడవ బోల్తా పడ్డప్పుడు దిక్కవుతుంది. అన్నదానికి జగన్ అపరిపక్వంతో కూడుకున్న రాజకీయ విధానాలే ఉదాహరణంటున్నారు.
కూటమి ఐక్యత ప్రాధాన్యతను జనసేనాని, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అసెంబ్లీ వేదికగా వివరించడం కిరణ్ రాయల్ వంటి నేతలకు చెంపపెట్టుగానే పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. కూటమి ఐక్యత వల్ల ఎంత మేలు జరుగుతుందో పవన్ కల్యాణ్ విడమరచి చెప్పారు.
రెండు స్థానాలు ఖాళీ అయి.. కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫకేషన్ జారీ చేయగానే.. బీఆర్ ఎస్ మైనారిటీ నాయకుడు, మాజీ హోం మంత్రి మహమూద్ అలీని రంగంలోకి దింపుతామన్న సంకేతాలు ఇచ్చింది. అలాగే రేవంత్ రెడ్డి వేంనరేందర్ రెడ్డి అభ్యర్థిత్వం కోసం పట్టుబడుతుండటంతో.. బీఆర్ఎస్ బీసీ నాయకుడిని రంగంలోకి దింపడం ద్వారా, రేవంత్ బీసీలకు ప్రాధాన్యం ఇస్తున్నామని చెప్పుకోవడాన్ని నిలదీసి ఇరుకున పెట్టాలని కూడా భావించినట్లు చెబుతున్నారు.
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆదేశాల మేరకు ఆయన గురువారం విచారణకు హాజరయ్యారు. ఈ నెల 9 వరకూ ప్రతిరోజూ విచారణకు హాజరవ్వాల్సిందే. ఈ నేపథ్యంలోనే సీనియర్ జర్నలిస్టు డీవీ శ్రీనివాసరావు తెలుగువన్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ కేసు పూర్వాపరాలు, పర్యవశానాలపై విశ్లేషించారు.
రేవంత్ ని అంచెలంచెలుగా ఎదిగేలా చేసి ఎంపీగా, ఆ తర్వాత సీఎంగా అవ్వడానికి దారి తీసింది. ఎవరిని ఎమ్మెల్సీ చేయాలని ఆనాడు రేవంత్ భావించారో, అదే వేం నరేందర్ రెడ్డి.. నేడు ఆయన రాజకీయ సలహాదారుగా క్యాబినేట్ ర్యాంకులో ఉంటూనే.. ఇప్పుడు పెద్దల సభలోకి సగర్వంగా అడుగు పెడుతున్నారు.
సీట్ల సర్దుబాటుపై డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్తో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఫోనులో మాట్లాడినట్టు తెలిసింది. తమిళనాడులో 234 అసెంబ్లీ స్థానాలు ఉండగా, డీఎంకేతో కూటిమిలో భాగంగా 30 సీట్లకు తగ్గేది లేదని కాంగ్రెస్ ఇంత వరకూ పట్టుబడుతూ వచ్చింది. దీంతో సీట్ల పంపకాలపై పరిష్కారానికి డీఎంకేతో సంప్రదింపులు జరిపే బాధ్యతను కాంగ్రెస్ సీనియర్ నేత పి.చిదంబరానికి పార్టీ అధిష్ఠానం అప్పగించింది.
హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి పోలీసు కమిషనరేట్ల పునర్వ్యవస్థీకరణతో పాటు కొత్తగా ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ ఏర్పాటు చేసిన విషయాన్నికేంద్ర హోంమంత్రికి వివరించిన సీఎం రేవంత్.. వేగంగా పెరుగుతున్న జనాభా, పట్టణ విస్తరణ, పరిశ్రమల వృద్ధి దృష్ట్యా రాష్ట్రానికి మరిన్ని ఐపీఎస్ అధికారుల అవసరం ఉందని, తెలంగాణ ఐపీఎస్ క్యాడర్ సంఖ్యను పెంచాలని కోరారు.
సంక్రాంతి సంబరాలు నుంచి ఏ కార్యక్రమం చేపట్టినా ఈ రెండు వర్గాల మధ్యా పోటీ కొనసాగుతున్నది. సీతం రాజు సుధాకర్ ఇందిరా ప్రియదర్శిని స్టేడియం వద్ద ముగ్గుల పోటీ నిర్వహిస్తే.. సిట్టింగ్ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ కనకమాలక్ష్మి ఆలయం వద్ద ముగ్గుల పోటీ నిర్వహించారు. ఇది ఒక్కటే కాదు, కార్పొరేషన్ పదవుల విషయంలో కూడా తలో దిక్కు అడుగులు వేస్తున్నారు.
కొద్దికాలం కిందట శరద్ పవార్ తాను రాజ్యసభకు పోటీ చేసే ప్రశక్తే లేదని ప్రకటించారు. అయితే ఇటీవల ఆయన అన్న కొడుకు, ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ మరణించడంతో మనసు మార్చుకున్నట్లు చెబుతున్నారు. మహారాష్ట్ర అసెంబ్లీలో మొత్తం 288 స్థానాలు ఉండగా, ఒక రాజ్యసభ సీటు గెలవాలంటే 37 మంది ఎమ్మెల్యేల ఓట్లు అవసరం.
తెలంగాణలో ఖాళీగా ఉన్న రెండు రాజ్యసభ స్థానాలకు కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థులను అధికారికంగా ప్రకటించింది.
తెలుగువన్ వాస్తవ వేదికలో ప్రస్తుత ప్రపంచ రాజకీయ పరిణామాలపై ఆసక్తికర చర్చ జరిగింది.
ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలం నెమలి వేణుగోపాలస్వామి వారి కళ్యాణోత్సవం సందర్భంగా సోమవారం (మార్చి 2) దేవుడికి సమర్పించే పట్టువస్త్రాలను సమర్పించే విషయంలో కొలికపూడి దురుసుగా వ్యవహరించారు.
నెమలి వేణుగోపాలస్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిర్వహించిన కల్యాణోత్సవానికి ఎంపీ కేశినేని చిన్ని, ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావులు కుటుంబాలతో కలిసి హాజరయ్యారు. ఆలయ మర్యాదల ప్రకారం, ప్రోటోకాల్ అనుసరించి అధికారులు స్వామివారికి సమర్పించే పట్టువస్త్రాలను ఎంపీ కేశినేని చిన్ని చేతికి అందించారు.