అప్పుడు కోతలే.... ఇప్పుడూ కోతలే...!
Publish Date:Oct 2, 2012
Advertisement
ఏమిటో...! అధికారంలోకి వచ్చే వరకు కొన్ని కోతలు.. వచ్చిన తర్వాత ఇంకో కోతలు. కోతలు మాత్రం రాజకీయనాయకుల జన్మహక్కుగా మారిపోయింది. ఎన్నికల్లో అదిచేస్తాం... ఇదిచేస్తాం... అని చెబుతారు. గెలిచిన తర్వాత గత ప్రభుత్వం ఖజానాలో ఏం మిగల్చలేదు.. కాబట్టి చేయలేకపోతున్నాం... అంటారు. అటువంటప్పుడు ఆ కోతలు దేనికి? జనాన్ని పిచ్చివాళ్ళక్రింద జమకట్టేస్తున్నారు! వర్షాలు పడినా కరెంట్ కోతలే.. పడకపోతే మరిన్ని కోతలు.. ప్రస్తుతం కొన్ని చోట్ల మూడుగంటలు, మరికొన్ని చోట్ల ఆరుగంటలు, ఎనిమిది గంటలు సాగుతున్న కరెంట్కోతలు ఇంచుమించుగా గంట, రెండుగంటలు అదనంగా కోతలు ప్రారంభమయ్యాయి! రోజుకు 24 గంటలు అయితే కరెంట్ కోతలు సుమారుగా అందులో సగం! విద్యుత్ వాడకం పెరిగిపోతోంది.. అనుకున్నంతగా సరఫరా కావడంలేదు.. అందుకే ఈ కోతలు.. అని మంత్రులనుండి అధికారుల వరకు అందరూ కోతలే...! ఒక్కసారి అధికారులు కాని మంత్రులు రహదారులపైకి వచ్చి వీధిలైట్లవైపు చూస్తే తెలుస్తుంది. మిట్టమధ్యాహ్నం 12గంటలు అయినా కూడా కొన్నిరోజులు లైట్లు వెలుగుతూనే ఉంటాయి. సూరీడు వెలుతురుకు ప్రజలకు కనిపిస్తున్నా.. పాపం ఆయా అధికారులకు కనిపించకపోవడం కడు శోచనీయం.! నెలలో కనీసం వారంరోజుల పాటు ఇలా లైట్లను పట్టపగలే వెలిగిస్తే కొరత రాక ఏమవుతుంది! దీనికి తోడు పలు అడ్వర్ట్టైజ్మెంట్ల హోర్డింగులు కూడా అర్ధరాత్రులు సైతం అతి ఖరీదైన విద్యుద్దీపాలతో వెలిగిపోతుంటాయి. ఇటువంటి వాటి నుండి ఎలా వసూలు చేస్తున్నారో... ఎవరికి తెలియదు! వీటికి కూడా కోతలు ఇవ్వడం, అధికంగా వసూలు చేసి గృహ అవసరాలకు వసూలు చేసే ఛార్జీలను తగ్గించడం చేస్తే బావుంటుంది. ఈ హోర్డింగుల వల్ల ఆయా కంపెనీలకు వచ్చే లాభాలలో ప్రభుత్వానికి ఏమి ఇవ్వదు కదా! అందుచేత ఖచ్చితంగా ఏ హోర్డింగులకైనా సరే... తప్పనిసరిగా అత్యధిక మొత్తంలో వసూలు చేయడం లేదా దానికి ఆయా కంపెనీల వారికి ఇతరత్రా వనరులను ఉపయోగించుకోమనడం ఉత్తమం! లేదంటే 24 గంటల్లో కనీసం 10 గంటలు కూడా విద్యుత్ సరఫరా చేస్తారో లేదో కూడా అనుమానమే! వేసిన కొద్ది సమయానికే ఛార్జీలు మాత్రం పెరిగిపోతాయి! ఇక్కడ సరఫరా అయ్యే విద్యుత్ను, గ్యాస్ను ఇతర రాష్ట్రాలకు ఇవ్వడం.. వారినుండి అత్యధిక ధరకు కొనుక్కోవడం... పాలకులకు అలవాటుగా మారింది.. పెరటి చెట్టు వైద్యానికి పనికిరాదని మన విద్యుత్ను, గ్యాస్ను మనకు సమృద్ధిగా ఇవ్వన్నప్పుడు ఈ ప్రభుత్వాలు ఓట్లు వేయడం దేనికి? అని ఆలోచిస్తున్నారు సామాన్యులు!
http://www.teluguone.com/news/content/power-cuts-24-17818.html
సుబ్రతో రాయ్ అరెస్ట్ ...
ఖరారైన రాష్ట్రపతి పాలన ...
రాష్ట్రపతి పాలనకే మొగ్గు ...
విఫలమైన 'టి' కాంగ్రెస్
చంద్రబాబు పాదయాత్ర ఈ నెల 31న పునఃప్రారంభ౦ కానుంది. ఫిబ్రవరి నాల్గోతేదీ వరకు విజయవాడలో కోనసాగనుంది. ఆరోగ్య కారణాల రీత్యా చంద్రబాబు 29, 30లలో కూడా విశ్రాంతి తీసుకోనున్నారని తెలుగుదేశం నాయకులు ప్రకటించారు.
తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు కేకే నివాసంలో భేటి అయ్యారు. తెలంగాణపై పార్టీ అధిష్టానం వైఖరిని వ్యతిరేకిస్తూ పార్టీ సభ్యత్వానికి, పదవులకు కూడా రాజీనామా చేసి అధిష్టానం పై ఒత్తిడి పెంచేందుకు రంగం సిద్దం చేస్తున్నారు. రాజీనామా లేఖలను పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధి పంపించనున్నారు. భేటి అనంతరం లేఖలను మీడియాకు విడుదల చేయనున్నారు.
తెలుగు సినీ ప్రియులను తన అందచందాలతో, అసమానమయిన నటనతో ఒక ఊపుఊపిన అందాల తార జయప్రద, ఆ తరువాత బాలీవుడ్ లోను ఒక వెలుగు వెలిగింది. తెలుగుదేశంపార్టీలో జేరి రాష్ట్ర రాజకీయాలలో పాల్గొన్నపటికీ, చంద్రబాబుతో పొసగక ఏకంగా డిల్లీ రైలెక్కి ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో వాలిపోయింది.
జానారెడ్డికి బుద్ది ,జ్ఞానం ఉందా? తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు మీద కాంగ్రెస్ ప్రకటన కోసం ఇంకా వేచిచూద్దాం అంటాడా. కాంగ్రెస్ ప్రకటనలో ఇంకా నిజాయితీ ఉందన్న జానారెడ్డి మాటలను తెలంగాణ ప్రజలు విశ్వసించరు. ముఖ్యమంత్రి పదవికోసం జానారెడ్డి గోతికాడ నక్కలా ఎదురు చూస్తున్నాడు.
వైయస్సార్ కాంగ్రెస్ చేపట్టిన కోటి సంతకాల సేకరణపై తెలుగుదేశం పార్టీ తీవ్ర విమర్శలు గుప్పించిన ఆరు నెలలకి ఇప్పుడు తాపీగా ఆ పార్టీ నేతలు స్పందించడం చూస్తుంటే ఆ పార్టీ నాయకత్వలోపం మరోసారి బయట పడుతోంది.
చంద్రబాబు తెలంగాణా జిల్లలో పాదయాత్ర చేస్తునంత కాలం తన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని, తన నాయకుడు జగన్ మోహన్ రెడ్డిని అయన ఎంత తీవ్రంగా విమర్శించినా స్పందించని కొడాలి నాని, చంద్రబాబు ఇప్పుడు తన కృష్ణా జిల్లాలో పాదయాత్ర చేస్తూ అదే విధంగా విమర్శలు చేసినప్పుడు మాత్రం వెంటనే స్పందించారు.
రాష్ట్ర రాజధానిలోఇందిరా పార్క్ వద్ద నేటి నుండి 36గంటల సమరదీక్షను నిర్వహించాలన్న పట్టుదలతో ఉన్న తెలంగాణా జేయేసీ నేతలు, పోలీసు ఆదేశాలను
నిర్విరామంగా సాగుతూ 117వ రోజుకు జేరుకొన్నచంద్రబాబు పాదయాత్ర ఈరోజు కృష్ణా జిల్లాలో పరిటాలకు చేరుకొంది. ముందు అనుకొన్న ప్రకారం అయితే ఈ రోజుతో ఆయన పాదయాత్ర ముగించాల్సి ఉంది. అయన కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు మరియు వైద్యులు కూడా పాదయాత్ర ముగించమని కోరినప్పటికీ చంద్రబాబు తన పాదయాత్రను కొనసాగించడానికే నిశ్చయించుకొన్నారు.
తెలంగాణా జేయేసీ అద్వర్యంలో సికిందరాబాద్ లో ఇందిరా పార్క్ వద్ద 36గంటల సమరదీక్షకు అనుమతి కోరుతూ జేయేసీ నేతలు హోంమంత్రి సబితా ఇంద్రరెడ్డికి వినతిపత్రం సమర్పించగా, కొద్దిసేపటిలోనే వారికి అనుమతి నిరాకరిస్తున్నట్లు పోలీసుల నుండి వెంటనే లేఖ అందడంతో తెలంగాణావాదులు కిరణ్ కుమార్ రెడ్డి మీద, పోలీసుల మీద మండిపడ్డారు.





