సెక్స్ కుంభకోణాల వలయంలో రాజకీయనేతలు
Publish Date:Apr 26, 2012
Advertisement
సెక్స్ కుంభకోణాల వలయంలో చిక్కుకొని రాజకీయనాయకులు విలవిలలాడుతున్నారు. ఈ వలయంలో చిక్కుకొన్న నేతల జాబితాలో తాజాగా సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, పార్లమెంట్ స్థాయి సంఘం చైర్మన్ అభిషేక సింఘ్వీ కూడా చేరారు. ఈయన ఒక మహిళా న్యాయవాదితో శృంతాగంలో వున్నట్టు ఒక మీడియాలో ప్రత్యేక కథనం ప్రసారం కావడంతో ఆయన తాను నిర్వహిస్తున్న అన్ని పదవులకు రాజీనామా చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా నిత్యం విలేకరుల సమావేశం నిర్వహించే సంఘ్వీ ఈ సంఘటన తరువాత కనీసం విలేకరులకు ముఖం చూపించే ధైర్యం కూడా చేయలేకపోతున్నారు. యూట్యూబ్ లో పెట్టిన సిడి, టెలివిజన్ ఛానల్ లో ప్రసారమైన దృశ్యాలన్నీ మార్ఫింగ్ చేసినవని చెబుతున్నప్పటికీ అదే విషయాన్ని విలేకరుల సమావేశంలో స్వయంగా వివరించకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంద్ఫీ. అమెరికా వంటి పాశ్చాత్యదేశాలతో పోల్చుకున్నప్పుడు భారతదేశంలో సెక్స్ కుంభకోణాలు తక్కువే అయినప్పటికీ, ఏ దేశంలో అయినా సెక్స్ కుంభకోణంలో చిక్కుకొన్న నేతలు మాత్రం భారీ మూల్యమే చెల్లించాల్సి వస్తోంది. సెక్స్ కుంభకోణంతో ప్రత్యక్ష సంబంధాలు కలిగిన నేతలు కొందరైతే వాటి కుటుంబ సభ్యుల సెక్స్ కుంభకోణం కారణంగా నష్టపోయిన నాయకులు మరికొంతమంది వున్నారు. భారతదేశ చరిత్రలో దళిత వర్గాల నుంచి బాబూ జగ్జీవన్ రామ్ తొలి ప్రధానమంత్రి పదవి స్వీకరిస్తారని భావిస్తున్న తరుణంలో ఆయన కుమారుడు ఒక మహిళతో శృంగారం జరుపుతున్నట్టు ఒక మాసపత్రికలో వచ్చిన వార్త దేశవ్యాప్తంగా సంచలనం కలిగించింది. జగ్జీవన్ రామ్ ప్రధానమంత్రి కాలేకపోవడానికి ఇతరత్రా రాజకీయ కారణాలతో పాటు కుమారునిపై సెక్స్ పరంగా వచ్చిన ఆరోపణలు కూడా ఒక కారణంగా రాజకీయ పరిశీలకులు విశ్లేషించారు. ఇటీవల కర్ణాటక అసెంబ్లీలో భారతీయ జనతాపార్టీకి చెందిన ఇరువురు శాసన సభ్యులు సెల్ ఫోన్ లో నీలి చిత్రాలు చూస్తూ పట్టుబడిన సంఘటనతో పాటు 2005 లో ఆర్.ఎస్.ఎస్. సీనియర్ నాయకుడు సంజయ్ జోషిపై వచ్చిన సెక్స్ పరమైన వార్తలు ఆర్.ఎస్.ఎస్.తో పాటు బిజెపి పరువు ప్రతిష్టలను కూడా మంటకలిపాయి. 1998లో నాటి ఒరిస్సా ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నాయకులు జె.బి.పట్నాయక్ తమను లైంగికంగా వేధించినట్లు ఇరువురు మహిళా ఉద్యోగినులు చేసిన ఆరోపణలు పట్నాయక్ వ్యక్తిగత జీవితంలో మాయనిమచ్చగా నిలిచింది. ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఎన్.డి.తివారీ (86) 2009లో ఆంధ్రప్రదేశ్ గవర్నర్ గా పనిచేస్తూ రాజ్ భవన లోనే అనైతిక శృంగార కార్యంలో వుండగా తీసిన వీడియో టెలివిజన్ లో ప్రసారం కావడంతో ఆయన పదవికి రాజీనామా చేశారు.
http://www.teluguone.com/news/content/politicians-in-sex-scandala-24-13650.html
సుబ్రతో రాయ్ అరెస్ట్ ...
ఖరారైన రాష్ట్రపతి పాలన ...
రాష్ట్రపతి పాలనకే మొగ్గు ...
విఫలమైన 'టి' కాంగ్రెస్
చంద్రబాబు పాదయాత్ర ఈ నెల 31న పునఃప్రారంభ౦ కానుంది. ఫిబ్రవరి నాల్గోతేదీ వరకు విజయవాడలో కోనసాగనుంది. ఆరోగ్య కారణాల రీత్యా చంద్రబాబు 29, 30లలో కూడా విశ్రాంతి తీసుకోనున్నారని తెలుగుదేశం నాయకులు ప్రకటించారు.
తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు కేకే నివాసంలో భేటి అయ్యారు. తెలంగాణపై పార్టీ అధిష్టానం వైఖరిని వ్యతిరేకిస్తూ పార్టీ సభ్యత్వానికి, పదవులకు కూడా రాజీనామా చేసి అధిష్టానం పై ఒత్తిడి పెంచేందుకు రంగం సిద్దం చేస్తున్నారు. రాజీనామా లేఖలను పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధి పంపించనున్నారు. భేటి అనంతరం లేఖలను మీడియాకు విడుదల చేయనున్నారు.
తెలుగు సినీ ప్రియులను తన అందచందాలతో, అసమానమయిన నటనతో ఒక ఊపుఊపిన అందాల తార జయప్రద, ఆ తరువాత బాలీవుడ్ లోను ఒక వెలుగు వెలిగింది. తెలుగుదేశంపార్టీలో జేరి రాష్ట్ర రాజకీయాలలో పాల్గొన్నపటికీ, చంద్రబాబుతో పొసగక ఏకంగా డిల్లీ రైలెక్కి ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో వాలిపోయింది.
జానారెడ్డికి బుద్ది ,జ్ఞానం ఉందా? తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు మీద కాంగ్రెస్ ప్రకటన కోసం ఇంకా వేచిచూద్దాం అంటాడా. కాంగ్రెస్ ప్రకటనలో ఇంకా నిజాయితీ ఉందన్న జానారెడ్డి మాటలను తెలంగాణ ప్రజలు విశ్వసించరు. ముఖ్యమంత్రి పదవికోసం జానారెడ్డి గోతికాడ నక్కలా ఎదురు చూస్తున్నాడు.
వైయస్సార్ కాంగ్రెస్ చేపట్టిన కోటి సంతకాల సేకరణపై తెలుగుదేశం పార్టీ తీవ్ర విమర్శలు గుప్పించిన ఆరు నెలలకి ఇప్పుడు తాపీగా ఆ పార్టీ నేతలు స్పందించడం చూస్తుంటే ఆ పార్టీ నాయకత్వలోపం మరోసారి బయట పడుతోంది.
చంద్రబాబు తెలంగాణా జిల్లలో పాదయాత్ర చేస్తునంత కాలం తన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని, తన నాయకుడు జగన్ మోహన్ రెడ్డిని అయన ఎంత తీవ్రంగా విమర్శించినా స్పందించని కొడాలి నాని, చంద్రబాబు ఇప్పుడు తన కృష్ణా జిల్లాలో పాదయాత్ర చేస్తూ అదే విధంగా విమర్శలు చేసినప్పుడు మాత్రం వెంటనే స్పందించారు.
రాష్ట్ర రాజధానిలోఇందిరా పార్క్ వద్ద నేటి నుండి 36గంటల సమరదీక్షను నిర్వహించాలన్న పట్టుదలతో ఉన్న తెలంగాణా జేయేసీ నేతలు, పోలీసు ఆదేశాలను
నిర్విరామంగా సాగుతూ 117వ రోజుకు జేరుకొన్నచంద్రబాబు పాదయాత్ర ఈరోజు కృష్ణా జిల్లాలో పరిటాలకు చేరుకొంది. ముందు అనుకొన్న ప్రకారం అయితే ఈ రోజుతో ఆయన పాదయాత్ర ముగించాల్సి ఉంది. అయన కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు మరియు వైద్యులు కూడా పాదయాత్ర ముగించమని కోరినప్పటికీ చంద్రబాబు తన పాదయాత్రను కొనసాగించడానికే నిశ్చయించుకొన్నారు.
తెలంగాణా జేయేసీ అద్వర్యంలో సికిందరాబాద్ లో ఇందిరా పార్క్ వద్ద 36గంటల సమరదీక్షకు అనుమతి కోరుతూ జేయేసీ నేతలు హోంమంత్రి సబితా ఇంద్రరెడ్డికి వినతిపత్రం సమర్పించగా, కొద్దిసేపటిలోనే వారికి అనుమతి నిరాకరిస్తున్నట్లు పోలీసుల నుండి వెంటనే లేఖ అందడంతో తెలంగాణావాదులు కిరణ్ కుమార్ రెడ్డి మీద, పోలీసుల మీద మండిపడ్డారు.





