మామిడి రైతులను దెబ్బతీసిన కార్బైడ్
Publish Date:Apr 26, 2012
Advertisement
రాష్ట్రంలోని మామిడి రైతులు ప్రతియేటా ఏదో రూపంలో నష్టాలకు గురవుతున్నారు. అతివృష్టి, అనావృష్టి, చీడపీడలు, అకాలవర్షాలు, ఈదురుగాలులు వంటి కారణాలు ప్రతియేటా మామిడి రైతును ఇబ్బందులు పెడుతున్నాయి. ఈ ఏడాది జనవరిలో మామిడికి మచ్చతెగులు సోకి పూట మాడిపోయింది. దీంతో మామిడి దిగుబడి 20 నుంచి 30 శాతం వరకూ పడిపోయింది. ఈ అవాంతరాన్ని దాటి మామిడికాయతో మార్కెట్లోకి వెళుతున్న రైతులకు కాల్షియం కార్బైడ్ రూపంలో కొత్త అవాంతరం ఎదురైంది. మన రాష్ట్రంలో పండే మామిడి దాదాపు 75 శాతం ఇతర రాష్ట్రాలకు దిగుమతి అవుతోంది. మామిడికాయలు త్వరగా పక్వానికి రావటానికి మన రైతులు కాల్షియం కార్బైడ్ ను వాడుతున్నారు. ఈ కాల్షియం కార్బైడ్ ను వాడటం వల్ల ప్రజారోగ్యానికి హాని కలుగుతుందన్న ఉద్దేశ్యంతో పలు రాష్ట్రాలు రాష్ట్రంలో పండే మామిడికాయల దిగుమతిని నిషేధించాయి. దీంతో రైతులు మరోసారి తీవ్రంగా నష్టపోతున్నారు. దీన్ని సాకుగా తీసుకుని దళారులు, వ్యాపారులు రైతులను దోచుకుంటున్నారు. గత ఏడాది 35వేల నుంచి 45వేల రూపాయల వరకూ పలికిన టన్ను బంగినపల్లి మామిడి ఈ ఏడాది 25వేలకు పడిపోయింది. కలెక్టర్ కాయ ధర 12వేల నుంచి 6వేలకు తగ్గింది. ధర దారుణంగా తగ్గిపోవటంతో సాగుఖర్చులు కూడా రావటం లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రజారోగ్య పరిరక్షణ కోసం కార్బైడ్ వినియోగాన్ని నిషేధించిన ప్రభుత్వం దానికి ప్రత్యామ్నాయ మార్గాలను రైతులకు సూచించటం లేదు. రాష్ట్రంలో మ్యాంగో వేపర్ ట్రీట్ మెంట్ ప్లాంట్లు నూజివీడు, తిరుపతిల్లో మాత్రమే ఉన్నాయి. పక్వానికి రాని మామిడిని పండించటానికి ఇది ఉపయోగపడుతుంది. అయితే ఈ ప్లాంట్లు కేవలం రెండే ఉండటం, దీనికి అయ్యే ఖర్చు కూడా అధికంగా ఉండటంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు.
http://www.teluguone.com/news/content/mango-farmers-24-13644.html
సుబ్రతో రాయ్ అరెస్ట్ ...
ఖరారైన రాష్ట్రపతి పాలన ...
రాష్ట్రపతి పాలనకే మొగ్గు ...
విఫలమైన 'టి' కాంగ్రెస్
చంద్రబాబు పాదయాత్ర ఈ నెల 31న పునఃప్రారంభ౦ కానుంది. ఫిబ్రవరి నాల్గోతేదీ వరకు విజయవాడలో కోనసాగనుంది. ఆరోగ్య కారణాల రీత్యా చంద్రబాబు 29, 30లలో కూడా విశ్రాంతి తీసుకోనున్నారని తెలుగుదేశం నాయకులు ప్రకటించారు.
తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు కేకే నివాసంలో భేటి అయ్యారు. తెలంగాణపై పార్టీ అధిష్టానం వైఖరిని వ్యతిరేకిస్తూ పార్టీ సభ్యత్వానికి, పదవులకు కూడా రాజీనామా చేసి అధిష్టానం పై ఒత్తిడి పెంచేందుకు రంగం సిద్దం చేస్తున్నారు. రాజీనామా లేఖలను పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధి పంపించనున్నారు. భేటి అనంతరం లేఖలను మీడియాకు విడుదల చేయనున్నారు.
తెలుగు సినీ ప్రియులను తన అందచందాలతో, అసమానమయిన నటనతో ఒక ఊపుఊపిన అందాల తార జయప్రద, ఆ తరువాత బాలీవుడ్ లోను ఒక వెలుగు వెలిగింది. తెలుగుదేశంపార్టీలో జేరి రాష్ట్ర రాజకీయాలలో పాల్గొన్నపటికీ, చంద్రబాబుతో పొసగక ఏకంగా డిల్లీ రైలెక్కి ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో వాలిపోయింది.
జానారెడ్డికి బుద్ది ,జ్ఞానం ఉందా? తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు మీద కాంగ్రెస్ ప్రకటన కోసం ఇంకా వేచిచూద్దాం అంటాడా. కాంగ్రెస్ ప్రకటనలో ఇంకా నిజాయితీ ఉందన్న జానారెడ్డి మాటలను తెలంగాణ ప్రజలు విశ్వసించరు. ముఖ్యమంత్రి పదవికోసం జానారెడ్డి గోతికాడ నక్కలా ఎదురు చూస్తున్నాడు.
వైయస్సార్ కాంగ్రెస్ చేపట్టిన కోటి సంతకాల సేకరణపై తెలుగుదేశం పార్టీ తీవ్ర విమర్శలు గుప్పించిన ఆరు నెలలకి ఇప్పుడు తాపీగా ఆ పార్టీ నేతలు స్పందించడం చూస్తుంటే ఆ పార్టీ నాయకత్వలోపం మరోసారి బయట పడుతోంది.
చంద్రబాబు తెలంగాణా జిల్లలో పాదయాత్ర చేస్తునంత కాలం తన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని, తన నాయకుడు జగన్ మోహన్ రెడ్డిని అయన ఎంత తీవ్రంగా విమర్శించినా స్పందించని కొడాలి నాని, చంద్రబాబు ఇప్పుడు తన కృష్ణా జిల్లాలో పాదయాత్ర చేస్తూ అదే విధంగా విమర్శలు చేసినప్పుడు మాత్రం వెంటనే స్పందించారు.
రాష్ట్ర రాజధానిలోఇందిరా పార్క్ వద్ద నేటి నుండి 36గంటల సమరదీక్షను నిర్వహించాలన్న పట్టుదలతో ఉన్న తెలంగాణా జేయేసీ నేతలు, పోలీసు ఆదేశాలను
నిర్విరామంగా సాగుతూ 117వ రోజుకు జేరుకొన్నచంద్రబాబు పాదయాత్ర ఈరోజు కృష్ణా జిల్లాలో పరిటాలకు చేరుకొంది. ముందు అనుకొన్న ప్రకారం అయితే ఈ రోజుతో ఆయన పాదయాత్ర ముగించాల్సి ఉంది. అయన కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు మరియు వైద్యులు కూడా పాదయాత్ర ముగించమని కోరినప్పటికీ చంద్రబాబు తన పాదయాత్రను కొనసాగించడానికే నిశ్చయించుకొన్నారు.
తెలంగాణా జేయేసీ అద్వర్యంలో సికిందరాబాద్ లో ఇందిరా పార్క్ వద్ద 36గంటల సమరదీక్షకు అనుమతి కోరుతూ జేయేసీ నేతలు హోంమంత్రి సబితా ఇంద్రరెడ్డికి వినతిపత్రం సమర్పించగా, కొద్దిసేపటిలోనే వారికి అనుమతి నిరాకరిస్తున్నట్లు పోలీసుల నుండి వెంటనే లేఖ అందడంతో తెలంగాణావాదులు కిరణ్ కుమార్ రెడ్డి మీద, పోలీసుల మీద మండిపడ్డారు.





