తెలంగాణలో ఎన్నికల హీట్ ను తలపిస్తున్న రాజకీయ రణం

Publish Date:Nov 13, 2024

Advertisement

తెలంగాణ రాష్ట్ర రాజ‌కీయాలు ఎన్నిక‌ల వాతావ‌ర‌ణాన్ని త‌ల‌పిస్తున్నాయి. అధికార‌, ప్ర‌తిప‌క్ష పార్టీల నేత‌ల మ‌ధ్య మాట‌ల యుద్ధం తార స్థాయిలో కొన‌సాగుతోంది. అధికార కాంగ్రెస్ తో బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు ఢీ అంటే ఢీ అంటున్నాయి. కాగా త్వ‌ర‌లో మాజీ మంత్రి, బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్ అరెస్ట్ ఖాయ‌మ‌ని కాంగ్రెస్ నేత‌లు చెబుతున్నారు. గ‌త కొద్దిరోజులుగా ఈ మేర‌కు  మీడియాలో విస్తృత ప్ర‌చారం జ‌రుగుతున్నది. ఇదే స‌మ‌యంలో రేవంత్ స‌ర్కార్ ను ఇరుకున పెట్టేందుకు బీఆర్ఎస్ స‌రికొత్త వ్యూహంతో ముందుకెళ్తున్నది. కాంగ్రెస్ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన ప‌ద‌కొండు నెల‌ల కాలంలో పెద్ద ఎత్తున అవినీతి అక్ర‌మాల‌కు పాల్ప‌డిందంటూ బీఆర్ఎస్ నేత‌లు ఆరోపిస్తున్నారు. తాజాగా కేటీఆర్ ఢిల్లీ వెళ్లి కేంద్ర ప్ర‌భుత్వానికి రాష్ట్ర ప్ర‌భుత్వ  అవినీతిపై పాల్ప‌డిందంటూ ఫిర్యాదులు చేశారు. మ‌రోవైపు బీజేపీ నేత‌లు ప్ర‌జ‌ల్లోకి వెళ్లేందుకు స‌మాయ‌త్తం అవుతున్నారు. కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీల అమ‌లులో విఫ‌ల‌మైంద‌న్న విష‌యాన్ని ప్ర‌జ‌ల్లోకి బ‌లంగా తీసుకెళ్లి క్షేత్ర స్థాయిలో పార్టీని బ‌లోపేతం చేసేలా బీజేపీ నేత‌లు వ్యూహాత్మ‌కంగా అడుగులు వేస్తున్నారు. ఈ క్ర‌మంలో కాంగ్రెస్ ప్ర‌భుత్వం నిజంగానే కేటీఆర్ ను అరెస్టు చేస్తుందా..?  బీఆర్ఎస్ వ్యూహం రేవంత్ స‌ర్కార్ ను ఇరుకు పెడుతుందా..? అనే అంశాల‌పై తెలంగాణ రాజ‌కీయాల్లో ఆస‌క్తిక‌ర చ‌ర్చ జ‌రుగుతున్నది.

మాజీ మంత్రి కేటీఆర్ నిధుల దుర్వినియోగం కేసులో అరెస్ట్ అయ్యే అవకాశం ఉందని తెలంగాణ రాజ‌కీయాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నది. బీఆర్ఎస్ ప్ర‌భుత్వ హ‌యాంలో 2023 ఫిబ్రవరిలో హైద‌రాబాద్‌లో ఫార్ములా ఈ రేసింగ్ జ‌రిగింది. ఈ రేసింగ్ లో భారీగా  ప్ర‌భుత్వ సొమ్ము దుర్వినియోగం అయిన‌ట్లు ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. రేవంత్ స‌ర్కార్ ఈ అంశంపై విచార‌ణ చేప‌ట్టి ఆధారాలు సేకరించింది. ఐఏఎస్ అరవింద్ కుమార్ ఇచ్చిన  వాంగ్మూలం ప్రకారం రూ.55 కోట్ల నిధులను కేటీఆర్   ఆదేశాల మేరకే నిర్వహణ సంస్థకు బదిలీ చేసినట్లు చెప్పారు. ఈ క్ర‌మంలో అవినీతి నిరోధక చట్టం 17ఏ క్రింద కేటీఆర్ అరెస్టుకు కాంగ్రెస్ ప్ర‌భుత్వం రంగం సిద్ధం చేస్తున్న‌ట్లు తెలుస్తోంది. మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి గత నెలలో సియోల్ పర్యటనలో ఉన్నప్పుడే కేటీఆర్ అరెస్ట్ కావచ్చు అని సూచనప్రాయంగా తెలిపారు. దీపావళి తర్వాత పొలిటికల్ బాంబు పేలనున్నట్లు పేర్కొన్నారు. కేటీఆర్ అరెస్ట్ అయితే అల్లర్లు జరుగుతాయన్న అనుమానంతో ముందుస్తుగా నెల రోజులు హైదరాబాద్ లో పోలీస్‌శాఖ 144 సెక్షన్ విధించింది. నిధుల దుర్వినియోగం కేసులో ఏసీబీ ఫైల్ ఇప్ప‌టికే సిద్దం చేసింద‌ని, మ‌రికొద్ది రోజుల్లోనే కేటీఆర్ అరెస్టు కావ‌డం ఖాయ‌మ‌ని కాంగ్రెస్ నేత‌లు పేర్కొంటున్నారు. అయితే, కేటీఆర్ మాత్రం.. తాను ఎలాంటి త‌ప్పు చేయ‌లేద‌ని చెబుతూనే.. అరెస్టుకైనా   సిద్ధ‌మేన‌ని చెప్పారు.

కేటీఆర్ అరెస్టు ఖాయ‌మ‌ని కాంగ్రెస్ నేత‌లు ప‌దేప‌దే ప్ర‌స్తావిస్తున్న నేప‌థ్యంలో.. రేవంత్ స‌ర్కార్ కు కేటీఆర్ బిగ్ షాక్ ఇచ్చేందుకు సిద్ధ‌మ‌య్యారు. తెలంగాణ‌లో కాంగ్రెస్ ప్ర‌భుత్వం అవినీతికి పాల్ప‌డుతోంద‌ని విమ‌ర్శించిన కేటీఆర్‌.. ఢిల్లీ వెళ్లి కేంద్ర మంత్రికి ఫిర్యాదు చేశారు. అమృత్ 2.0 టెండ‌ర్ల‌లో ప్ర‌భుత్వం అవినీతిపై త‌మ వ‌ద్ద ఆధారాలు ఉన్నాయ‌ని, అర్హ‌త లేక‌పోయినా శోదా కంపెనీకి టెండ‌ర్ల‌ను క‌ట్ట‌బెట్టార‌ని కేటీఆర్ ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి పూర్తిగా అధికార దుర్వినియోగానికి పాల్ప‌డ్డార‌ని, త‌న బావ‌మ‌రిది సృజ‌న్ రెడ్డికి టెండ‌ర్ల‌ను అప్ప‌గించార‌ని అన్నారు. మొత్తం రూ. 8,888 వేల కోట్ల టెండ‌ర్ల‌పై స‌మ‌గ్ర విచార‌ణ జ‌రిపించి టెండ‌ర్లు ర‌ద్దు చేయాల‌ని కేంద్ర మంత్రి మ‌నోహ‌ర్ లాల్ ఖ‌ట్ట‌ర్ ను కేటీఆర్‌, బీఆర్ఎస్ నేత‌లు ఢిల్లీకి వెళ్లి  ఫిర్యాదు చేశారు. మ‌నీ లాండ‌రింగ్ కు పాల్ప‌డిన చాలా మంది ప‌ద‌వులు కోల్పోయార‌ని, త్వ‌ర‌లోనే రేవంత్ రెడ్డి, పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి ప‌ద‌వులు కూడా పోవ‌డం ఖాయ‌మ‌ని కేటీఆర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ తెలంగాణలో జ‌రుగుతున్న అవినీతిపై విచార‌ణ‌కు ఆదేశించి బాధ్యుల‌పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కేటీఆర్,   డిమాండ్ చేస్తున్నారు. ఒక‌వేళ బీజేపీ కేంద్ర పెద్ద‌లు ఈ విష‌యంపై స్పందించ‌కుంటే  తెలంగాణ‌లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఒక‌టేన‌ని బ‌లంగా ప్ర‌చారం చేసేందుకు బీఆర్ఎస్ అధిష్టానం సిద్ధ‌మ‌వుతోంది. 

కేటీఆర్, బీఆర్ఎస్ నేత‌లు సీఎం రేవంత్ రెడ్డిపై విమ‌ర్శ‌లు చేసిన స‌మ‌యాల్లో కేంద్ర మంత్రి, బీజేపీ ఎంపీ బండి సంజ‌య్ స్ప‌దిస్తూ బీఆర్ఎస్ నేత‌ల‌కు కౌంట‌ర్ ఇస్తుండ‌టం తెలంగాణ రాజ‌కీయాల్లో చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ప్ర‌స్తుతం తెలంగాణ‌లో అమృత్ 2.0 టెండ‌ర్ల‌లో జ‌రిగిన అవినీతిపై కేంద్ర ప్ర‌భుత్వం విచార‌ణ జ‌ర‌ప‌కుంటే క్షేత్ర స్థాయిలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీ క‌లిసి బీఆర్ఎస్ పార్టీని లేకుండా చేయాల‌ని చూస్తున్నాయ‌ని ప్ర‌జ‌ల్లో సానుభూతి పొందేలా బీఆర్ఎస్ నేత‌లు ప్లాన్ చేస్తున్న‌ట్లు తెలుస్తోంది. ఇదిలాఉంటే బీజేపీ మాత్రం రాష్ట్రంలో క్షేత్ర స్థాయిలో బ‌లోపేతం అయ్యేలా దృష్టిసారించింది. డిసెంబ‌ర్ 1 నుంచి అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల వారీగా బీజేపీ పాద‌యాత్ర‌లు చేప‌ట్ట‌నుంది. వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు అమ‌లు చేస్తామ‌ని చెప్పిన కాంగ్రెస్ పార్టీ ఆ హామీ అమలు చేయ‌క‌పోవ‌డాన్ని నిర‌సిస్తూ ఆ పార్టీ నేత‌లు పాద‌యాత్ర‌ల ద్వారా ప్ర‌జ‌ల్లోకి వెళ్లేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు. అయితే, ఈ రాజ‌కీయ చంద‌రంగంలో బీఆర్ఎస్ వ్యూహం ఏమేర‌కు ఫ‌లిస్తుంది. కాంగ్రెస్ ప్ర‌భుత్వాన్ని ఇరుకున పెట్ట‌గ‌ల‌దా అనే అంశంపై తెలంగాణ రాజ‌కీయాల్లో చ‌ర్చ జ‌రుగుతుంది.

By
en-us Political News

  
వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటన ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాల అపాయింట్‌మెంట్ కోసం సాగిస్తున్న ప్రయత్నాలు
అయితే 2014 ఎన్నికలలో పార్టీ ఘోర పరాజయానికి ఫైర్ బ్రాండ్ నేతల నోటి దురుసు కూడా ఒక ప్రధాన కారణం అయ్యిందని అప్పట్లోనే పరిశీలకులు విశ్లేషించారు. అయితే పరాజయం తరువాత కూడా వైసీపీ తీర మారలేదు. అప్పట్లో నోరున్నది దూషించడానికే అన్నట్లుగా వ్యవహరించిన కొడాలి నాని వంటి వారు ఓటమి తరువాత సైలెంట్ అయిపోయినా.. వారి స్థానంలోకి అంబటి రాంబాబు, పేర్ని నాని వంటి వారు వచ్చి చేరారు.
ఇటీవల కాలంలో ముగ్గురుర వైసీపీ నేతలపై నమోదైన మూడు కేసుల్లో ఆ నేతలు వ్యవహరిస్తున్న తీరు, వారికి పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి మద్దతు విమర్శలకు గురౌతోంది. పూర్తిగా కుటుంబ వివాదాలు, ప్రత్యక్షంగా వారు పాల్పడిన అక్రమాలకు సంబంధించిన ఆధారాలతో నమోదైన కేసులను కూడా రాజకీయ వేధింపులంటూ  వారు మాట్లాడుతున్న మాటలు, చేస్తున్న వ్యాఖ్యలు విస్తుగొలుపుతున్నాయి.
ప్రభుత్వ బాకాలుగా వ్యవహరిస్తున్న మరికొన్ని మీడియా సంస్థల విలేకరులపై కూడా జంతర్ మంతర్ వద్ద నిరసనకారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రదర్శనకారులపై పోలీసుల దాష్టీకాన్నీ, తమ ఆందోళనలపై కేంద్రం అనుసరిస్తున్నఅణచివేతనూ ప్రస్తావించకుండా కేంద్ర ప్రభుత్వ అనుకూలతకే ప్రాధాన్యం ఇవ్వడంతోనే ప్రధాన స్రవంతి మీడియా ప్రజాగ్రహానికి గురౌతోందని చెబుతున్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ విడుదల చేసిన ఈ వీడియో సందేశంపై ప్రముఖ నటుడు, సామాజిక విమర్శకుడు ప్రకాశ్ రాజ్ ప్రధాని ముఖంలో భయం ప్రస్ఫుటంగా కనిపించిందంటూ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
పార్లమెంటు ఉభయ సభలలో ఏదో ఒక సభ లో సభ్యత్వం లేని వ్యక్తి ఆరు నెలల కాల పరిమితి మించి కేంద్ర మంత్రిగా కొనసాగే అవకాశం లేదు. దీంతో మోడీ ఆదేశాల మేరకు రవ్ నీత్ సింగ్ బిట్టూ తన పదవికి రాజీనామా సమర్పించారు.
పరీక్షల్లో పారదర్శకత, విద్యారంగంలో సంస్కరణలు, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా డిమాండ్ తో యువత చేపట్టిన పోరాటానికి మద్దతు ప్రకటించడమే కాకుండా.. జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో సోమవారం జరగనున్న ధర్నాలో స్వయంగా పాల్గొంటానని వెల్లడించారు.
కల్వకుంట్ల తారకరామారావు జన్మదినం జులై 24 ఈ సందర్భాన్ని పురస్కరించుకుని తెలంగాణ ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ కేటీఆర్ కు పాతిక కిలోల సన్నబియ్యాన్ని కానుకగా పంపారు. అదీ తాను స్వయంగా ఆ బర్త్ డే గిఫ్ట్ ను అందించకుండా, ర్యాపిడో బైక్ బుక్ చేసి.. ఆ కానుకను తెలంగాణ భవన్ కు కేటీఆర్ కు పంపించారు.
వాస్తవానికి ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకునే కేబినెట్ భేటీకి డిప్యూటీ సీఎం హాజరు కాకపోవడానికి రాజకీయ కారణాలున్నాయా అన్న అనుమానాలకు ఆస్కారం లేని పరిస్ధితి ఉంది. ఎందుకంటే.. ఇటీవలే ముంబై లోని కోకిలా బెన్ అంబానీ ఆస్పత్రిలో పవన్ కల్యాణ్ భుజానికి శస్త్ర చికిత్స జరిగింది. ఆయనకుపూర్త విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించడం వల్లనే కేబినెట్ భేటీకి రాలేదని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
మత్స్యకారుల నాయకుడిగా, మాజీ మంత్రిగా గుర్తింపు పొందిన సీదిరి అప్పలరాజు ఇటీవల వార్తల్లో నిలిచారు.
జగన్ సొంత కుంపటి పెట్టుకున్న నాటి నుంచీ వెన్నంటి ఉన్న విజయసాయిరెడ్డి, సమీప బంధువు అయిన బాలినేని లకు పార్టీలో దక్కిన మర్యాద తెలిసిందే. ఇప్పుడు తాజాగా నిన్న మొన్నటి వరకూ జగన్ కు అత్యంత సన్నిహితుడిగా, నమ్మిన బంటుగా ఉన్న మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డికి ఇప్పుడు కనీసం తాడేపల్లి ప్యాలెస్ గేటు వద్ద ఎంట్రీ కూడా దొరకడం లేదు.
ఇటీవల నిరుద్యోగ యువతను ఉద్దేశించి సుప్రీంకోర్టు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు నిరసనగా, సామాజిక మాధ్యమాల్లో రాజుకున్న ఆగ్రహం ఇప్పుడు దేశ రాజధాని జంతర్ మంతర్ వద్ద విశ్వరూపంతో నిలిచింది. ప్రశ్నించే హక్కును కోల్పోయిన తరానికి ప్రాతినిధ్యం వహిస్తూ కాక్రోచ్ జనతా పార్టీ రూపంలో విద్యార్థులు, యువత ఉద్యమిస్తున్నారు.
ఏపీలో కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేని వైసీపీ ఈ అంశాన్ని రాజకీయ లబ్ధి కోసం వాడుకోవడానికి విశ్వ ప్రయత్నం చేస్తోంది. జాతీయ స్థాయి నీట్ లీకేజీ వ్యవహారంలోకి ఏపీ మెగా డీఎస్సీ పరీక్షల అంశాన్ని జోడించి లబ్ధి పొందేందుకు ప్రయత్నాలు చేస్తున్నది. రాష్ట్రంలో ఇటీవల నిర్వహించిన డీఎస్సీ పరీక్షల్లో అనేక అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ వైసిపి నాయకత్వం విమర్శిస్తూ, నీట్ తో పాటు డీఎస్సీ అక్రమాలపై కూడా విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తోంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.