తెలంగాణలో ఎన్నికల హీట్ ను తలపిస్తున్న రాజకీయ రణం

Publish Date:Nov 13, 2024

Advertisement

తెలంగాణ రాష్ట్ర రాజ‌కీయాలు ఎన్నిక‌ల వాతావ‌ర‌ణాన్ని త‌ల‌పిస్తున్నాయి. అధికార‌, ప్ర‌తిప‌క్ష పార్టీల నేత‌ల మ‌ధ్య మాట‌ల యుద్ధం తార స్థాయిలో కొన‌సాగుతోంది. అధికార కాంగ్రెస్ తో బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు ఢీ అంటే ఢీ అంటున్నాయి. కాగా త్వ‌ర‌లో మాజీ మంత్రి, బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్ అరెస్ట్ ఖాయ‌మ‌ని కాంగ్రెస్ నేత‌లు చెబుతున్నారు. గ‌త కొద్దిరోజులుగా ఈ మేర‌కు  మీడియాలో విస్తృత ప్ర‌చారం జ‌రుగుతున్నది. ఇదే స‌మ‌యంలో రేవంత్ స‌ర్కార్ ను ఇరుకున పెట్టేందుకు బీఆర్ఎస్ స‌రికొత్త వ్యూహంతో ముందుకెళ్తున్నది. కాంగ్రెస్ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన ప‌ద‌కొండు నెల‌ల కాలంలో పెద్ద ఎత్తున అవినీతి అక్ర‌మాల‌కు పాల్ప‌డిందంటూ బీఆర్ఎస్ నేత‌లు ఆరోపిస్తున్నారు. తాజాగా కేటీఆర్ ఢిల్లీ వెళ్లి కేంద్ర ప్ర‌భుత్వానికి రాష్ట్ర ప్ర‌భుత్వ  అవినీతిపై పాల్ప‌డిందంటూ ఫిర్యాదులు చేశారు. మ‌రోవైపు బీజేపీ నేత‌లు ప్ర‌జ‌ల్లోకి వెళ్లేందుకు స‌మాయ‌త్తం అవుతున్నారు. కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీల అమ‌లులో విఫ‌ల‌మైంద‌న్న విష‌యాన్ని ప్ర‌జ‌ల్లోకి బ‌లంగా తీసుకెళ్లి క్షేత్ర స్థాయిలో పార్టీని బ‌లోపేతం చేసేలా బీజేపీ నేత‌లు వ్యూహాత్మ‌కంగా అడుగులు వేస్తున్నారు. ఈ క్ర‌మంలో కాంగ్రెస్ ప్ర‌భుత్వం నిజంగానే కేటీఆర్ ను అరెస్టు చేస్తుందా..?  బీఆర్ఎస్ వ్యూహం రేవంత్ స‌ర్కార్ ను ఇరుకు పెడుతుందా..? అనే అంశాల‌పై తెలంగాణ రాజ‌కీయాల్లో ఆస‌క్తిక‌ర చ‌ర్చ జ‌రుగుతున్నది.

మాజీ మంత్రి కేటీఆర్ నిధుల దుర్వినియోగం కేసులో అరెస్ట్ అయ్యే అవకాశం ఉందని తెలంగాణ రాజ‌కీయాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నది. బీఆర్ఎస్ ప్ర‌భుత్వ హ‌యాంలో 2023 ఫిబ్రవరిలో హైద‌రాబాద్‌లో ఫార్ములా ఈ రేసింగ్ జ‌రిగింది. ఈ రేసింగ్ లో భారీగా  ప్ర‌భుత్వ సొమ్ము దుర్వినియోగం అయిన‌ట్లు ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. రేవంత్ స‌ర్కార్ ఈ అంశంపై విచార‌ణ చేప‌ట్టి ఆధారాలు సేకరించింది. ఐఏఎస్ అరవింద్ కుమార్ ఇచ్చిన  వాంగ్మూలం ప్రకారం రూ.55 కోట్ల నిధులను కేటీఆర్   ఆదేశాల మేరకే నిర్వహణ సంస్థకు బదిలీ చేసినట్లు చెప్పారు. ఈ క్ర‌మంలో అవినీతి నిరోధక చట్టం 17ఏ క్రింద కేటీఆర్ అరెస్టుకు కాంగ్రెస్ ప్ర‌భుత్వం రంగం సిద్ధం చేస్తున్న‌ట్లు తెలుస్తోంది. మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి గత నెలలో సియోల్ పర్యటనలో ఉన్నప్పుడే కేటీఆర్ అరెస్ట్ కావచ్చు అని సూచనప్రాయంగా తెలిపారు. దీపావళి తర్వాత పొలిటికల్ బాంబు పేలనున్నట్లు పేర్కొన్నారు. కేటీఆర్ అరెస్ట్ అయితే అల్లర్లు జరుగుతాయన్న అనుమానంతో ముందుస్తుగా నెల రోజులు హైదరాబాద్ లో పోలీస్‌శాఖ 144 సెక్షన్ విధించింది. నిధుల దుర్వినియోగం కేసులో ఏసీబీ ఫైల్ ఇప్ప‌టికే సిద్దం చేసింద‌ని, మ‌రికొద్ది రోజుల్లోనే కేటీఆర్ అరెస్టు కావ‌డం ఖాయ‌మ‌ని కాంగ్రెస్ నేత‌లు పేర్కొంటున్నారు. అయితే, కేటీఆర్ మాత్రం.. తాను ఎలాంటి త‌ప్పు చేయ‌లేద‌ని చెబుతూనే.. అరెస్టుకైనా   సిద్ధ‌మేన‌ని చెప్పారు.

కేటీఆర్ అరెస్టు ఖాయ‌మ‌ని కాంగ్రెస్ నేత‌లు ప‌దేప‌దే ప్ర‌స్తావిస్తున్న నేప‌థ్యంలో.. రేవంత్ స‌ర్కార్ కు కేటీఆర్ బిగ్ షాక్ ఇచ్చేందుకు సిద్ధ‌మ‌య్యారు. తెలంగాణ‌లో కాంగ్రెస్ ప్ర‌భుత్వం అవినీతికి పాల్ప‌డుతోంద‌ని విమ‌ర్శించిన కేటీఆర్‌.. ఢిల్లీ వెళ్లి కేంద్ర మంత్రికి ఫిర్యాదు చేశారు. అమృత్ 2.0 టెండ‌ర్ల‌లో ప్ర‌భుత్వం అవినీతిపై త‌మ వ‌ద్ద ఆధారాలు ఉన్నాయ‌ని, అర్హ‌త లేక‌పోయినా శోదా కంపెనీకి టెండ‌ర్ల‌ను క‌ట్ట‌బెట్టార‌ని కేటీఆర్ ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి పూర్తిగా అధికార దుర్వినియోగానికి పాల్ప‌డ్డార‌ని, త‌న బావ‌మ‌రిది సృజ‌న్ రెడ్డికి టెండ‌ర్ల‌ను అప్ప‌గించార‌ని అన్నారు. మొత్తం రూ. 8,888 వేల కోట్ల టెండ‌ర్ల‌పై స‌మ‌గ్ర విచార‌ణ జ‌రిపించి టెండ‌ర్లు ర‌ద్దు చేయాల‌ని కేంద్ర మంత్రి మ‌నోహ‌ర్ లాల్ ఖ‌ట్ట‌ర్ ను కేటీఆర్‌, బీఆర్ఎస్ నేత‌లు ఢిల్లీకి వెళ్లి  ఫిర్యాదు చేశారు. మ‌నీ లాండ‌రింగ్ కు పాల్ప‌డిన చాలా మంది ప‌ద‌వులు కోల్పోయార‌ని, త్వ‌ర‌లోనే రేవంత్ రెడ్డి, పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి ప‌ద‌వులు కూడా పోవ‌డం ఖాయ‌మ‌ని కేటీఆర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ తెలంగాణలో జ‌రుగుతున్న అవినీతిపై విచార‌ణ‌కు ఆదేశించి బాధ్యుల‌పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కేటీఆర్,   డిమాండ్ చేస్తున్నారు. ఒక‌వేళ బీజేపీ కేంద్ర పెద్ద‌లు ఈ విష‌యంపై స్పందించ‌కుంటే  తెలంగాణ‌లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఒక‌టేన‌ని బ‌లంగా ప్ర‌చారం చేసేందుకు బీఆర్ఎస్ అధిష్టానం సిద్ధ‌మ‌వుతోంది. 

కేటీఆర్, బీఆర్ఎస్ నేత‌లు సీఎం రేవంత్ రెడ్డిపై విమ‌ర్శ‌లు చేసిన స‌మ‌యాల్లో కేంద్ర మంత్రి, బీజేపీ ఎంపీ బండి సంజ‌య్ స్ప‌దిస్తూ బీఆర్ఎస్ నేత‌ల‌కు కౌంట‌ర్ ఇస్తుండ‌టం తెలంగాణ రాజ‌కీయాల్లో చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ప్ర‌స్తుతం తెలంగాణ‌లో అమృత్ 2.0 టెండ‌ర్ల‌లో జ‌రిగిన అవినీతిపై కేంద్ర ప్ర‌భుత్వం విచార‌ణ జ‌ర‌ప‌కుంటే క్షేత్ర స్థాయిలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీ క‌లిసి బీఆర్ఎస్ పార్టీని లేకుండా చేయాల‌ని చూస్తున్నాయ‌ని ప్ర‌జ‌ల్లో సానుభూతి పొందేలా బీఆర్ఎస్ నేత‌లు ప్లాన్ చేస్తున్న‌ట్లు తెలుస్తోంది. ఇదిలాఉంటే బీజేపీ మాత్రం రాష్ట్రంలో క్షేత్ర స్థాయిలో బ‌లోపేతం అయ్యేలా దృష్టిసారించింది. డిసెంబ‌ర్ 1 నుంచి అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల వారీగా బీజేపీ పాద‌యాత్ర‌లు చేప‌ట్ట‌నుంది. వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు అమ‌లు చేస్తామ‌ని చెప్పిన కాంగ్రెస్ పార్టీ ఆ హామీ అమలు చేయ‌క‌పోవ‌డాన్ని నిర‌సిస్తూ ఆ పార్టీ నేత‌లు పాద‌యాత్ర‌ల ద్వారా ప్ర‌జ‌ల్లోకి వెళ్లేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు. అయితే, ఈ రాజ‌కీయ చంద‌రంగంలో బీఆర్ఎస్ వ్యూహం ఏమేర‌కు ఫ‌లిస్తుంది. కాంగ్రెస్ ప్ర‌భుత్వాన్ని ఇరుకున పెట్ట‌గ‌ల‌దా అనే అంశంపై తెలంగాణ రాజ‌కీయాల్లో చ‌ర్చ జ‌రుగుతుంది.

By
en-us Political News

  
ఉత్తర్ ప్రదేశ్ రాజకీయం మళ్లీ ఒక్కసారిగా తీవ్రస్థాయిలో వేడెక్కింది.
టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్‌లో యూనిట్ ఇంఛార్జ్‌లకు నిర్వహించిన శిక్షణా తరగతులకు ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరయ్యారు
2024 ఎన్నికల్లో రాష్ట్రంలో వైసీపీ ఘోర పరాజయాన్ని మూటగట్టుకుని కనీసం ప్రతిపక్ష హోదాకు కూడా నోచుకోకుండా కేవలం 11 స్థానాలకే పరిమితమైన సంగతి తెలిసిందే. అయితే ఇదే విషయంలో తాజాగా తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడిన అంబటి రాంబాబు ఆ ఎన్నికల్లో వైసీపీ 11 స్థానాలకు మాత్రమే పరిమితమైనా 40 శాతం ఓటు షేర్ దక్కించుకుందని చెప్పారు.
దశాబ్దాలుగా పార్టీని నమ్ముకుని ఉన్న సీనియర్ నాయకులను పక్కనపెట్టి, కొత్తగా వచ్చిన వారికి ప్రాధాన్యం ఇవ్వడంపై తమ్ముళ్లలో అసంతృప్తి జ్వాలలు రేగుతున్నాయి. ఈ పరిణామాలు నారా లోకేష్ నాయకత్వ తీరుపై, కూటమి ప్రభుత్వ నిర్ణయాలపై పార్టీలోనే అసంతృప్తి వ్యక్తమౌతోంది.
ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీని అడ్డుకునేందుకు వైసీపీ నేతలు హైకోర్టులో ఏకంగా 300 కోర్టు కేసులు వేయించారని, అయితే ధర్మాసనం వారికి తీవ్రంగా మొట్టికాయలు వేసి బుద్ధి చెప్పిందని గుర్తుచేశారు. నిరుద్యోగుల జీవితాలతో ఆడుకోవడమే వైకాపా నైజమని మండిపడ్డారు.
మ్మెల్సీ రామసుబ్బారెడ్డి తన సతీమణి ఇందిరమ్మతో కలిసి దీక్షా శిబిరానికి చేరుకున్నారు. అయితే పోలీసులు అనుమతి లేదంటూ వారిని అడ్డుకున్నారు. ఈ దశలో వైపీపీ శ్రేణులు, పోలీసుల మధ్య వాగ్వాదం జరిగింది. పరిస్థితి అదుపుతప్పుతుండటంతో పోలీసులు ఎమ్మెల్సీ దంపతులను, పలువురు కార్యకర్తలను అదుపులోనికి తీసుకుని అక్కడ నుంచి తరలించారు.
విజయ్ రాజకీయ ప్రత్యర్థుల విమర్శలకు స్పందించలేదు. తన భార్యపై గానీ, కోర్టులో ఉన్న విడాకుల ప్రక్రియపై గానీ విజయ్ పన్నెత్తు మాట మాట్లాడలేదు. వ్యక్తిగత విషయాలకూ, రాజకీయాలకూ సంబంధం లేదని ఒక్క ముక్కలో తేల్చేశారు.
తెలంగాణలో త్వరలో జరగనున్న  స్థానిక  ఎన్నికల్లో  బీజేపీకి  ఏ పార్టీతోనూ  పొత్తులు పెట్టుకునే ఆలోచన  లేదని స్పష్టం చేశారు. జనసేన పార్టీతో తమకు ఉన్న మిత్రబంధం కేవలం కేంద్ర స్థాయికి , ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మాత్రమే పరిమితమని, తెలంగాణలో ఆ పొత్తును పొడిగించే ప్రసక్తే లేదని కుండబద్దలు కొట్టేశారు.
వైసీపీ అధినేత జగన్ మాత్రం బాధితుల వేదనను, కష్టాలను ఇసుమంతైనా పట్టించుకోకుండా, అక్రమాలకు పాల్పడిన నిందితుల వద్దకు వెళ్లి వారిని పరామర్శిస్తూ, ఓదార్చడం వింతగా విడ్డూరంగా ఉందన్నారు. అక్రమాలకు పాల్పడండి అండగా ఉంటానంటూ జగన్ నిందితులకు భరోసా ఇస్తున్నట్లుగా ఆయన తీరు ఉందన్నారు.
దశాబ్దాలుగా తెలుగుదేశం పార్టీలో క్రియాశీలంగా పనిచేస్తున్న సీనియర్ నేత చలసానికి సొంత పార్టీ నుంచే ఈ స్థాయి ఒత్తిడి రావడం వెనుక కృష్ణా జిల్లా పార్టీలో ఉన్న అంతర్గత విభేదాలే కారణమని పరిశీలకులు అంటున్నారు. ఎన్టీఆర్ తెచ్చిన మాక్స్ చట్టం కింద స్వతంత్రంగా నడుస్తున్న ఈ డెయిరీలో ప్రభుత్వ జోక్యానికి తావు లేకపోయినా. . చలసానిపై ఈ స్థాయిలో రాజీనామాకు ఒత్తడి రావడం పట్ల పాడి రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
వైసీపీలోని కాపు సామాజికవర్గానికి చెందిన నేతలు అంబటి రాంబాబు, పేర్ని నాని మీడియా ముందుకొచ్చి బోండా ఉమా మద్దతుగా గళమెత్తారు. అయితే.. తాజాగా వైసీపీ నిరసనలను ప్రశ్నిస్తూ ఆ పార్టీ నేతలను బోండా ఉమా గట్టిగా నిలదీయడంతో వైసీపీ ఆశలు నీరుగారిపోయాయి.
న్నికల ఖర్చుల విషయానికి వస్తే వైసీపీ దేశంలోనే అత్యధికంగా వ్యయం చేసిన ప్రాంతీయ పార్టీగా నిలిచింది. ఆ ఆర్థిక సంవత్సరంలో వైసీపీ ఆదాయం 140.4 కోట్ల రూపాయలు కాగా, చేసిన వ్యయం 340.2 కోట్ల రూపాయలు. తమ వార్షిక రాబడి కంటే 142 శాతం అదనంగా, అంటే దాదాపు 199.8 కోట్ల మేర ఎక్కువ వ్యయం చేసింది.
దేశవ్యాప్తంగా విద్యా వ్యవస్థను వేధిస్తున్న ప్రశ్నాపత్రాల లీకేజీలు, నిరుద్యోగం, యువత భవిష్యత్తుపై రాహుల్ గాంధీ ప్రత్యక్షంగా విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించేందుకు ఉద్దేశించిన ఈ సదస్సు ఈనెల 8న. ప్రయాగ్‌రాజ్‌లోని ప్రసిద్ధ కేపీ కాలేజీ మైదానంలో నిర్వహించేందుకు కాంగ్రెస్ భారీ ఏర్పాట్లు చేసింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.