పొలిటికల్ కామెడీ.. కేఏపాల్ ను మించిపోయిన జగన్!

Publish Date:Apr 30, 2024

Advertisement

పొలిటికల్ హీట్ పీక్స్ కు చేరిన సమయంలో కూడా చల్లటి వినాదాన్ని పంచగల దిట్ట ప్రజా శాంతి పార్టీ అధినేత కేఏపాల్ మాత్రమేనని ఇంత కాలం అందరూ భావిస్తూ వచ్చారు. అయితే ఇప్పుడు  ఏపీ ఎన్నికల ముంగిట అధికార పార్టీ అదినేత వైఎస్ జగన్ పొలిటికల్ కామెడీని పండించడంలో పాల్ ను మించిపోయాడని అంటున్నారు. ఔను వైఎస్ జగన్ ఇటీవలి కాలంలో తన మాటలు, చేతలు, ప్రసంగాలలో కామెడీని బ్రహ్మాండంగా పండిస్తున్నారు.   తన హయాంలో జరిగిన సర్వ తప్పిదాలనూ తెలుగుదేశం అధినేత చంద్రబాబుకు ఆపాదిస్తూ.. ఐదేళ్లలో తన వైఫల్యానికి కారణం చంద్రబాబే అని చెబుతూ నవ్విస్తున్నారు. అధికారంలోకి రాగానే మూడు రాజధానులంటూ హడావుడి చేసి చివరకు ఒక రూపుదాల్చిన రాజధాని అమరావతిని నిర్వీర్యం చేయడమే కాకుండా... రాష్ట్రాన్ని రాజధాని లేని రాష్ట్రంగా తాను మిగల్చిన జగన్.. తన వైఫల్యానికి కూడా చంద్రబాబే కారణమని చెబుతున్నారు. అదెలాగో స్వయంగా ఆయన చెప్పిన మాటలు వింటే దుర్వాసుడైనా పగలబడి నవ్వి తీరతాడు. ఇంతకీ ఆయన ఏమన్నారంటే.. ఉమ్మడి రాజధాని హైదరాబాద్ వదిలి వచ్చేసి చంద్రబాబే రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసేశారట. ఔను ఆయన అలా చేయకుండా ఉండి ఉంటే తాను అమరావతిని నిర్వీర్యం చేసినా, మూడు రాజధానులు కాదు కదా ఒక్క రాజధినికి ఒక్క ఇటుకముక్క కూడా పేర్చలేకపోయినా.. హైదరాబాద్ ఉండేది కదా అంటున్నారు. 

ఔను సోమవారం (ఏప్రిల్ 29) చోడవరంలో  మాట్లాడుతూ  జగన్ హైదరాబాద్ ను ఉమ్మడి రాజధానిగా కాదని చంద్రబాబు రాష్ట్రాన్ని రాజధాని లేని రాష్ట్రంగా మార్చేశారని విమర్శించారు.  అమరావతిలో సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టు వీటన్నిటి గురించి ఆయన మరచిపోవడమే కాకుండా, ప్రజలూ మర్చిపోవాలని అంటున్నారు. అదే సచివాలయంలో తన ప్రభుత్వ కార్యకలాపాలు కొనసాగుతున్నా, అసెంబ్లీ సమావేశాలను చంద్రబాబు నిర్మించిన భవనంలోనే నిర్వహిస్తున్నా. జగన్ ప్రభుత్వ తప్పిదాలకు మొట్టికాయలు వేస్తున్న హైకోర్టు కూడా చంద్రబాబు రాజధాని అమరావతిలో నిర్మించిన భవనంలోనే సాగుతోందని తెలిసినా జగన్ మాత్రం హైదరాబాద్ వదిలేసి చంద్రబాబు తప్పు చేశాడని నిందిస్తుంటే వినేవాళ్లు నవ్వు ఆపుకోలేకపోతున్నారు. 

ఇక మనమంతా సిద్ధం బస్సుయాత్రలో భాగంగా విజయవాడలో పర్యటిస్తుండగా జగన్ పై జరిగిన గులకరాయి హత్యాయత్నం గురించి జగన్ చెబుతున్న మాటలు, చేస్తున్న చేష్టల గురించైతే ప్రజలు గుర్తుకు తెచ్చుకుని మరీ పడీపడీ నవ్వుతున్నారు.  దెబ్బ తగిలిన తొలి రోజు చిన్నసైజు ప్లాస్టర్ వేసుకున్న జగన్, ఆ తర్వాత పెద్ద సైజు పట్టీతో దర్శనమిచ్చారు.  అంతే కాదు ఆ పట్టీని ఆయన దాదాపు 13 రోజుల పాటు ధరించి కాదు కాదు భరించారు.  డాక్టర్ చెల్లెమ్మ సునీత   జగనన్నా  గాయంపై రోజుల తరబడి పట్టీ ఉంచుకుంటే సెప్టిక్ ఔతుంది జాగ్రత్త అని హెచ్చిరించడంతో భయపడి తీసేశారు. అయినా గులకరాయి హత్యాయత్నం ఘటనలో గాయపడిన జగన్ కు చికిత్స చేసి కుట్లు వేసి మరీ బ్యాండేజీ వేసిన నిపుణులైన గవర్నమెంట్ వైద్యుల బృందానికి ఆ విషయం తెలియదు పాపం. నిజానికి కార్డియాలజిస్టు, న్యూరాలజిస్టు, ఆంకాలజిస్టు, చివరాఖరకు గైనకాలజిస్టులు కలసి మూడు కుట్లు వేసి మరీ చికిత్స చేసినా పదమూడు రోజుల పాటు ఆయన నుదుటిపై అంతసైజు బ్యాండ్ ఎయిడ్ పట్టీ ఎందుకు ఉంచుకోవాల్సి వచ్చిందో అని జనం ఆందోళన కూడా పడ్డారు. అయితే నెటిజనులు మాత్రం జగన్ స్థాయి వ్యక్తికి గాయం తగిలినప్పుడు ఆ మాత్రం పట్టీ లేకపోతే ఎలా అని సెటైర్లూ వేశారు అది వేరే సంగతి.   గర్భిణులకు సిజేరియన్ చేసి కానుపు చేసిన వైద్యులు కూడా కుట్లను వారంలో తీసేస్తారు.. కానీ జగన్ కు మాత్రం 13 రోజుల పాటు కుట్లు వేసిన గాయానికి పట్టీ వేసి అలాగే ఉంచేశారు. 

సరే 13 రోజుల తరువాత జగన్ నుదుటిపై పట్టీ తీసేశారు. పట్టీ తీసేసిన తరువాత ఆయన ముఖం చూసి జనం ఆశ్చర్యపోయారు.   మెడికల్ హిస్టరీలో ఇంతకు మించి మిరాకిల్ ఎక్కడైనా ఉంటుందా అని సంభ్రమాశ్చర్యాలలో మునిగి తేలారు.  ఎందుకంటే.. 13 రోజులు పట్టీతో ఉన్న జగనన్న నుదుటిపై  గీత కూడా కనిపించకపోవడమే.  మొత్తం మీద జగన్ తన చేష్టలు, చర్యలు, ప్రసంగాలతో భలే కామెడీ పండిస్తున్నారంటూ జనం చర్చించుకుంటున్నారు. 

By
en-us Political News

  
ఏపీలో అల్లర్లపై 13 మంది సభ్యులతో ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. ఈ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్‌కి ఐపీఎస్ అధికారి వినీత్ బ్రిజ్‌లాల్ నేతృత్వం వహిస్తారు.
తెలంగాణ సెంటిమెంట్‌ని రెచ్చగొట్టి, ఆంధ్రులపై వ్యతిరేకతను తిరగదోడి ప్రయోజనం పొందాలని బీఆర్ఎస్ వ్యూహం పన్నుతోంది.
తెలంగాణ లోక్ సభ ఎన్నికల ముందు బీఆర్ఎస్ పార్టీకి వరుస షాకులు తగిలాయి. బిఆర్ఎస్ నేతలు ఇతర పార్టీలలోకి జంప్ అయిన సమయంలో హైకోర్టు తీర్పు ప్రకారం బిఆర్ఎష్ ఎమ్మెల్సీ దండె విఠల్ చెల్లదు. కానీ లోకసభ ఎన్నికల తర్వాత మాత్రం హైకోర్టు తీర్పుపై సుప్రీం కోర్టు స్టే విధించింది. 
శ్రీకాకుళం లోక్ సభ నియోజకవర్గంలో వైసీపీ ఆశలకు కాంగ్రెస్ భారీ గండి కొట్టింది. దీంతో ఈ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం అభ్యర్థి కింజారపు రామ్మోహన్ నాయుడి విజయం నల్లేరు మీద బండి నడకేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
మాచెర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు వెంకట్రామిరెడ్డి అదృశ్యమయ్యారు. వారు కనిపించడం లేదంటూ గన్​మెన్లు ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వడంతో ఈ విషయం వెలుగుచూసింది. అరెస్టు భయంతోనే అదృశ్యమయ్యారనే చర్చ నడుస్తోంది.
ఆనాడు రోమ్ నగరం తగలబడుతుంటే ఫిడేల్ వాయించిన నీరో ఎలాంటివాడో, ఇప్పుడు రాష్ట్రం అట్టుడికిపోతుంటే పట్టించుకోకుండా విహారయాత్రకు వెళ్తున్న జగన్ కూడా అలాంటివాడే.
పర్యాటకరంగం, ఆర్థిక ప్రయోజనాలతో పాటు ఆసియా దేశాల మధ్య స్నేహపూర్వక వాతావరణానికి వారధిగా, సాంస్కృతిక వారధిగా వ్యవహరించాలని మల్లేపల్లి లక్ష్మయ్య అన్నారు.
నైరుతి రుతుపవనాలు ఈ నెలాఖరులో కేరళ తీరం తాకనున్నాయని వెదర్ రిపోర్ట్ వచ్చిన రోజే అంటే గురువారం నుంచి హైదరాబాద్ లో భారీ వర్షాలు ప్రారంభమయ్యాయి. వర్షం దంచి కొట్టడంతో ట్రాపిక్ జామ్ అయ్యింది. నేడు రెండో రోజు కూడా వర్షం నగరాన్ని ముంచెత్తనుంది. 
వివేకా హత్య కేసుపై ఎన్నికలు పూర్తయ్యే వరకూ మాట్లాడవద్దంటూ కడప హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీం కోర్టు స్టే విధించింది. కడప కోర్టు తన ఉత్తర్వులలో డాక్టర్ సునీత , షర్మిల సహా కొందరు విపక్ష నాయకుల పేర్లు ప్రస్తావిస్తూ వారెవరూ ఎన్నికల ప్రచారంలో ఎక్కడా వివేకా హత్య కేసు విషయాన్ని ప్రస్తావించకూడదంటే ఉత్తర్వులు ఇచ్చిన సంగతి తెలిసిందే.
ఇలాంటి సందర్భాల్లో సీపీఆర్ అందించగలిగితే ప్రాణాలు నిలబడతాయి. అందుకే అందరికీ సీపీఆర్ మీద అవగాహన వుండాలి. సీపీఆర్ నేర్చుకోవాలి.
ఆంధ్రప్రదేశ్ లో మహాభారత యుద్ధాన్ని తలపించిన ఎన్నికల రణం ముగిసింది. ఓటరు తీర్పు ఈవీఎంలలో నిక్షిప్తమై ఉంది. ఈ ఎన్నికలలో ప్రధానంగా అధికార వైసీపీ, విపక్ష తెలుగుదేశం కూటమి మధ్యే పోరు జరిగింది. పోలింగ్ పూర్తయిన తరువాత ఆయా పార్టీల నేతల భాష్, బాడీ లాంగ్వేజ్ ని బట్టి గెలుపు ఎవరిది, ఓటమి పాలయ్యేది ఎవరు అన్నది జనాలకు స్పష్టంగా తేలిపోయింది.
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఊచలు లెక్కబెడుతున్న మాజీ ముఖ్యమంత్రి కెసీఆర్ తనయను స్వంత పార్టీ నేతలు, కుటుంబ సభ్యులు కలవడానికి పెద్దగా ఆసక్తికనబరచడం లేదు.
ముఖ్యమంత్రిగానే కాదు, ఆపద్ధమర్మ ముఖ్యమంత్రిగా కూడా జగన్ మోసాలు కొనసాగుతున్నాయి. సరిగ్గా ఎన్నికలకు రెండు రోజుల ముందు గతంలో బటన్ నొక్కేశాను, ఆ డబ్బులు ఇప్పుడు లబ్ధిదారుల ఖాతాలలో అర్జంటుగా జమ చేసేయండి అంటూ తనకు తైనాతీగా వ్యవహరిస్తున్న సీఎస్ ను ఆదేశించారు. దీంతో సీఎస్ జవహరర్ రెడ్డి తక్షణం ఆ పని చేయడానికి అవసరమైన ఏర్పాట్లన్నీచేసేశారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.