పోలవరం మరో అమరావతేనా?.. ప్రాజెక్టు కథ ముగిసినట్లేనా?

Publish Date:Apr 24, 2022

Advertisement

ఆంధ్రప్రదేశ్ కు జీవనాడి లాంటి పోలవరం కథ ఇంక ముగిసిందా? ఆ ప్రాజెక్టు పూర్తి చేయాలన్న ఉద్దేశానికి జగన్ సర్కార్ తిలోదలాకిచ్చేసిందా? అన్న ప్రశ్నకు ఏపీ కొత్త జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు విలేకరుల సమావేశంలో మాట్లాడిన మాటలను బట్టి ఔననే సమాధానమని అనుకోవలసి వస్తుంది. 
పోలవరం ప్రాజెక్టు ఎప్పుడు పూర్తవుతుందన్న విషయాన్ని తాను చెప్పలేనని కుండ బద్దలు కొట్టేశారు. గత ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల వల్ల పోలవరం డయాఫ్రం వాల్ దెబ్బతిందనీ, అది ఏ స్థాయిలో దెబ్బతింది, దానిని ఎలా మరమ్మతు చేయాలి, ఎంత వ్యయం అవుతుంది ఇత్యాది విషయాలన్నీ పరిశీలించిన తరువాతే పోలవరం పురోగతిపై ఒక నిర్ణయానికి రాగలమని అంబటి చెప్పారు. 
మూడేళ్లుగా పోలవరాన్ని మూలనపడేసి ఇఫ్పుడు గత ప్రభుత్వ అనాలోచిత చర్యల వల్లే పోలవరం పరిస్థితి ఇలా తయారైందని అన్నారు.  ఈ విషయంలో పోలవరం నిర్మాణంలో భుజకీర్తుల కోసం చంద్రబాబు పడిన తాపత్రయమే ఈ పరిస్థితికి కారణమని ప్రకటించారు. ఈ విషయంలో కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ, కేంద్ర జలవనరుల శాఖ అనుమతులతోనే పనులు జరిగాయి కదా అన్న విలేకరుల ప్రశ్నలకు అసహనం వ్యక్తం చేశారు. మీ ప్రశ్నలకు నేను జవాబివ్వడం కాదు...నేను చెప్పింది మీరు రాసుకోండంటూ  అసహనం వ్యక్తం చేశారు. వాస్తవానికి గత మూడేళ్లుగా జరగాల్సి మట్టి పని నిలిచిపోవడ వల్లనే ప్రస్తుత పరిస్థితికి కారణమని నిపుణులు చెబుతుండగా.. మంత్రి అంబటి రాంబాబు మాత్రం అందుకు భిన్నమైన వాదన వినిపించారు.
డయాఫ్రం వాల్ ఏ స్థాయిలో దెబ్బతిందన్న అంశం తేలాకే పోలవరం ఎప్పటికి పూర్తవుతుందో తేలుతుందని అన్నారు. ప్రధాన డ్యాం నిర్మించాల్సిన స్థలంలో గుంతలు పడ్డాయన్న ఆయన అక్కడి నీటిని తోడేయడానికి రెండు వేలకు పైన వ్యయమౌతుందని విరించారు. ఇంతకీ అసలు సంగతి ఏమిటంటే...ఇప్పటి వరకూ డయాఫ్రం వాల్ ఎంత మేర దెబ్బతింది అన్న విషయంపై నిపుణుల కమిటీ నివేదికే ఇవ్వలేదు. ఇక నీటిని తోడేయడానికి ఎంత వ్యయం అవుతుందన్న విషయంపై రాష్ట్ర జల  వనరుల శాఖ అధికారులు చెబుతున్న అంకెకు, అంబటి చెప్పిన అంకెకూ పొంతనే లేదు. అసలు రాష్ట్ర జల వనరుల శాఖ అధికారులకు పోలవరం ప్రాజెక్టుతో సంబంధమే లేదన్నట్లుగా అంబటి వ్యవహార శైలి ఉందన్న విమర్శలు వస్తున్నాయి. ఇంతకీ పోలవరం అధ్యయనానికి రాష్ట్ర ప్రభుత్వం నియమించిన కమిటీ పోలవరం సందర్శన అయితే పూర్తయ్యింది కానీ ఇంకా నివేదిక ఇవ్వలేదు. నివేదికకు ముందే నష్టం ఇంత, ఖర్చు ఇంత అంటూ అంబటి విలేకరుల సమావేశంలో ప్రకటించడాన్ని బట్టి నివేదిక కేవలం నామమాత్రమేననీ, భారీ వ్యయం బూచి చూపి పొలవరం ఎత్తు తగ్గించి చాపచట్టేయడమో లేదా మూడు రాజధానుల పేరు చెప్పి అమరావతిని నిర్వీర్యం చేసిన చందంగా పోలవరం పనులకు ఫుల్ స్టాప్ పెట్టేయడమో రాష్ట్ర ప్రభుత్వ ఉద్దేశంగా కనిపిస్తున్నదని పరిశీలకులు అంటున్నారు. 
ఇక జల రంగ నిపుణులైతే...నీటిని తోడడానికి అంత భారీ వ్యయం అవసరం లేదనీ, డయాఫ్రం గోడలను కొద్ది పక్కకు జరిపితే నీరు దానంతటదే దిగువకు వెళ్లిపోతుందనీ చెబుతున్నారు. 
దేశంలో దాదాపుగా పోలవరమే చివరి బహుళార్థక ప్రాజెక్టు. ఇటువంటి ప్రాజెక్టు విషయంలో రాజకీయం చేస్తూ వైఫల్యాలకు ప్రత్యర్థి పార్టీలను నిందిస్తూ ప్రాజెక్టు పనులు ముందుకు సాగకుండా ప్రభుత్వమే ప్రయత్నాలు చేయడం పట్ల జల వనరుల రంగ నిపుణులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.  డయాఫ్రం వాల్ దెబ్బతిన్న విషయాన్ని భూతద్దంలో పెట్టి చూపుతున్న మంత్రి దానికి సరిచేయడానికి మూడేళ్లలో ప్రభుత్వం ఎందుకు ఎటువంటి చర్యలూ తీసుకోలేదనడానికి మాత్రం స్పష్టమైన జవాబు ఇవ్వడం లేదు. 
అమరావతి విషయంలో ఎలా అయితే...అమరావతే రాజధాని అంటూ తొలుత ప్రకటనలు గుప్పించి, ఆ తరువాత దానిని నిర్వీర్యం చేశారు.ఏపీ జీవ ప్రదాయిని అంటూ కొనియాడిన పోలవరం పురోగతిని ఉద్దేశ పూర్వకంగా ఆపేసి జగన్ సర్కార్ చోద్యం చూస్తోందని సాగునీటి రంగ నిపుణులు విమర్శిస్తున్నారు. 

By
en-us Political News

  
జాతీయ రాజకీయాల్లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది.
గత ఎన్నికలకు ముందు వైనాట్ 175 అంటూ ధీమా వ్యక్తం చేసిన వైసీపీ అధినేత జగన్.. ఇప్పుడు ఎట్ లీస్ట్ 11 అనాల్సిన పరిస్థితి వచ్చేలా ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలు ప్రజల మధ్యకు రాకపోవడం, ప్రజాసమస్యలను పట్టించుకోకపోవడం, అన్నిటికీ మించి అసెంబ్లీకి గైర్హాజర్ కావడం వంటి అంశాలు పార్టీని జనాలను దూరం చేస్తున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
ఏమాట‌కామాట నాదెండ్ల‌, ల‌క్ష్మీపార్వ‌తి ఎన్టీఆర్ జీవితాన్ని మ‌లుపు తిప్పిన వారే.
కార‌ణం విజ‌య్ టీవీకే పార్టీ పెట్టి ఆ పార్టీని ప్ర‌స్తుతం ఎన్నిక‌ల ప‌రీక్ష‌కు నిల‌ప‌డంతో.. ఇతర న‌టుల పార్టీలు, అవి తొలి సారి ఎన్నిక‌ల్లో పాల్గొన్న‌పుడు సాధించిన ఓట్ల శాతం ఎంత‌? అన్న ఆస‌క్తిక‌ర‌మైన చ‌ర్చ‌కు తెర‌లేచింది.
ప‌సుపు ఒక మ‌హిళ‌కు ఎంత ముఖ్య‌మో తెలిసిందే. ఆపై నీలం అంటే ద‌ళిత సందేశం ఇస్తుంది. ఇక పోతే ఆకుప‌చ్చ అంటే అది భార‌త జెండాలో ఒక భాగం. ముస్లీం మైనార్టీల‌ను ఏకం చేసేది. కాబ‌ట్టి క‌విత జెండా రంగుల్లో ఇవి ప్ర‌ముఖంగా ఉండొచ్చ‌ని తెలుస్తోంది. దీంతో క‌విత ప్ర‌క‌టించ‌బోయే పార్టీ జెండా రంగులు, గుర్తు ఆల్రెడీ సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్నారు.
బెంగాల్ ఎన్నికల చరిత్రను పరిశీలిస్తే, ఓటింగ్ శాతం క్రమంగా పెరుగుతూ వస్తోంది. 1969లో కేవలం 70 శాతంగా ఉన్న ఓటింగ్, 1987 నాటికి 78 శాతానికి చేరింది. ఆ తర్వాత 1996లో 80 శాతం, 2011లో 84 శాతంగా నమోదైంది. గత 2021 ఎన్నికల్లో 82 శాతానికి పరిమితమైన ఓటింగ్.. ఇప్పుడు 2026లో ఏకంగా 92 శాతాన్ని దాటి సరికొత్త రికార్డును సృష్టించింది.
తెలుగువన్ వాస్తవ వేదికలో ప్రస్తుత జాతీయ రాజకీయ పరిస్థితులపై విస్తృత చర్చ జరిగింది.
తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు జగిత్యాల వేదికగా జరిగిన సభ తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
రాజకీయ చరిత్రను పరిశీలిస్తే నాదెండ్ల భాస్కరరావుకు, చంద్రబాబు నాయుడుకు మధ్య సుదీర్ఘమైన రాజకీయ వైరం ఉంది. 1984లో ఎన్టీఆర్ అమెరికా వెళ్లిన సమయంలో జరిగిన రాజకీయ పరిణామాలు, ఆపై నాదెండ్ల ముఖ్యమంత్రి కావడం వంటి సంఘటనలు తెలుగు రాజకీయాల్లో ఒక కీలక మలుపు. ఆ సమయంలో ఎన్టీఆర్‌ను తిరిగి అధికారంలోకి తీసుకురావడంలో చంద్రబాబు కీలక పాత్ర పోషించారు.
న్టీఆర్ అమెరికాలో గుండె ఆపరేషన్ చేయించుకుని తిరిగి వచ్చేలోపు, నాదెండ్ల భాస్కరరావు కాంగ్రెస్ మద్దతుతో ముఖ్యమంత్రి అయ్యారు. ఆ క్లిష్ట సమయంలో తెలుగుదేశం పార్టీ చెల్లాచెదురు కాకుండా, ఎమ్మెల్యేలను ఏకం చేయడంలో చంద్రబాబు కీలక పాత్ర పోషించారు. పార్టీని కాపాడిన రక్షకుడి ఇమేజ్ ఆయనకు అప్పుడే వచ్చింది.
తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్, ఆయన కుమారుడు ఉదయనిథి స్టాలిన్, టీవీకే అధినేత విజయ్, బీజేపీ నాయకురాలు ఖుష్బు, కమల్ హాసన్, రజనీకాంత్ తదితరులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
విజయ్ రాజకీయాల్లోకి రావడాన్ని చంద్రబాబు స్వాగతిస్తూనే.. ప్రజా సేవ చేయాలనే తపనతో రాజకీయాల్లోకి వచ్చే ఎవరినైనా ఆహ్వానించాల్సిందేనన్నారు. అయితే సినిమాల్లో ఉన్న ఇమేజ్ రాజకీయాల్లో రాణించడానికి సరిపోదనీ, రాజకీయాలలో పట్టుదల, సహనం చాలా ముఖ్యమన్న చంద్రబాబు.. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ ప్రస్తావన తీసుకువచ్చారు.
విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో వైసీపీ పరిస్థితిని గమనిస్తే నేతల మధ్య సఖ్యత లేదన్న విషయం ప్రస్ఫుటంగా తెలుస్తుంది. పార్టీలో కీలక నేతలు ఉన్నప్పటికీ, వారంతా సమష్టిగా కాకుండా ఎవరికి వారే యమునా తీరే అన్న చంద్రంగా వ్యవహరిస్తున్నారు. దీంతో పార్టీ కేడర్‌ అయోమయంలో పడింది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర వైసీపీ ఇన్ చార్జ్‌గా కన్నబాబు నియామకం తరువాత స్థానిక నేతల నుంచి ఆయనకు ఏ మాత్రం సహకారం అందడం లేదు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.