Publish Date:Jul 29, 2016
కబాలి హడావుడి ముగిసింది. కానీ పోకేమాన్ మాత్రం దూసుకునిపోతున్నాడు. ప్రపంచానికంతా ఇప్పుడు పోకెమాన్ జాడ్యమే పట్టేసింది. ఇలాంటి ఆటలు ఆడుతూ, లేని జంతువులను ఊహించుకుంటూ రోడ్ల మీద తిరగడం వల్ల రకరకాల సమస్యలు వస్తాయన్న వార్తలు పుంఖానుపుంఖాలుగా వినిపిస్తూనే ఉన్నాయి. ఇన్ని విమర్శల మధ్య కొన్ని సానుకూలమైన మాటలు కూడా వినిపిస్తున్నాయో. అవేంటంటే...
విటమిన్ డి లభ్యం- పొద్దస్తమానం, అయితే ఇంట్లోనూ లేకపోతే కారులోనూ గడిపేసే పాశ్చత్యులని ఆరుబయలకు తీసుకువచ్చిన ఘనత పోకెమాన్దే. ఇందులో ఎలాంటి అనుమానమూ లేదు! ఇలా రోజూ కాసేపు ఎండపట్టున తిరగడం వల్ల ఇంతవరకూ దూరంగా ఉన్న విటమిన్ డి ఇప్పుడు పుష్కలంగా లభిస్తోందంటున్నారు పోకెమాన్ ప్రియులు. కీళ్ల నొప్పుల నుంచి చర్మవ్యాధుల వరకూ విటమిన్ డి ఎంత అవసరమో చెప్పేదేముంది. జీవనశైలిలో మార్పు- ఆధునిక జీవనశైలి అంటే, నిరంతరం ఏదో ఒక చోట కూర్చుని ఉండటమే! దానికి తోడు ఇప్పటి వరకూ ప్రచారంలో ఉన్న వీడియో గేమ్స్ అన్నీ కూడా కూర్చుని అడేవే. పోకెమాన్తో ఇలాంటి పరిస్థితి నుంచి మార్పు వచ్చిందంటున్నారు. పోకెమాన్తో ఇంతవరకూ కుర్చీలోంచి కదలని వారంతా లేచి నాలుగు అడుగులు వేస్తున్నారట.
వేగం.. వేగం- పోకెమాన్గోని పట్టుకోవాలంటే అలా ఓ నాలుగడుగులు వేస్తే సరిపోదు. కాస్త వేగంగా నడవాలి. కాస్త చురుగ్గా పోకెమాన్ల కోసం వెతకాలి. దీని వల్ల కావల్సినంత వ్యాయామం అవుతోందంటున్నారు కొందరు. ఈ ఆట ఆడుతున్న దగ్గర్నుంచీ రోజుకి కనీసం గంట తక్కువ కాకుండా నడుస్తున్నాం అనేవారి సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది. పని ఒత్తిడి నుంచి విశ్రాంతి- ఈ రోజుల్లో ఉద్యోగాలు ఎంత ఒత్తిడితో కూడుకుని ఉంటాయో చెప్పేదేముంది! రోజుకి పది పన్నెండు గంటలు పనిచేసినా కూడా ఇంకా మెదడు మీద ఆ ఉద్యోగభారం ఉంటూనే ఉంటుంది. పోకెమాన్గోతో అలాంటి ఒత్తిడి నుంచి సులువుగా దూరం కావచ్చునంటున్నారు. ఒత్తిడి నుంచి ఉపశమనం పొందేందుకు సిగిరెట్టు, మద్యపానాల జోలికి పోకుండా, పోకెమాన్తో ఆడుకోవడం మంచిదే కదా అని దబాయిస్తున్నారు.
డోపమైన్
పోకెమాన్గో ఆడుతున్నప్పుడు శరీరంలో డోపమైన్ అనే రసాయనం విడుదల అవుతుందనీ, ఇది ఒకరకమైన సంతృప్తిని కలిగిస్తుందనీ చెబుతున్నారు. నిరంతరం ఈ సంతృప్తిని కోరుకోవడం కోసమే పోకెమాన్గో అంటే పడి చస్తున్నారు జనం. సరే! పోకెమాన్గోతో ఇలాంటి ఉపయోగాలు కొన్ని ఉంటే ఉండవచ్చుగాక! కానీ ఎక్కడ నడుస్తున్నామో చూసుకోకుండా, ఏ హద్దులు దాటుతున్నామో గమనించుకోకుండా... గంటల తరబడి జీవితాలను వెచ్చించే ఈ పోకెమాన్గో ఏ వ్యసనానికీ తీసిపోదంటున్నారు పెద్దలు. ఇలా ఎవరి వాదనని వారు వినిపించేశారు. ఇక నిర్ణయించుకోవల్సింది మనమే!
- నిర్జర.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/pokemon-go-help-health-25-64402.html
హైదరాబాద్ నుయూటీ చేసే కుట్ర జరుగుతున్నదని,దాన్ని తిప్పి కోట్టాలని బీఆర్ఎస్ అందుకున్న కొత్త పల్లవి కేవలం తెలంగాణ సెంటిమెంట్ ను రెచ్చగొట్టి లోక్ సభ ఎన్నికలలో లబ్ధి పొందే ఎత్తుగడేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. హైదరాబాద్ నగరాన్ని యూటీ చేయాలని బీజేపీ కుట్ర చేస్తున్నదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ ఇటీవల ఆరోపించారు.
స్త్రీ, పురుషుల వైవాహిక స్థితి ఎలా వున్నప్పటికీ, పరస్పర అంగీకారంతో ఇద్దరు స్త్రీ పురుషులు శారీరక సంబంధం కలిగి వుంటే దాన్ని నేరం
రాజకీయ నాయకులంటే జనం చెవుల్లో పూలు పెట్టకపోతే కుదరదు. తెలంగాణ ప్రజల చెవుల్లో ఇప్పటి వరకు బీఆర్ఎస్ నాయకులు
40 ఏళ్లుగా హైద్రాబాద్ నియోజకవర్గం నుంచి గెలుపొందుతూ వస్తున్న మజ్లిస్ పార్టీకి ఈ లోకసభ ఎన్నికల్లో ఓటమి భయం పట్టుకుందా? తండ్రి సుల్తాన్ సల్లావుద్దీన్ ఓవైసీ ( సాలార్) తర్వాత హైదరాబాద్ పార్లమెంటు నియోజకవర్గం నుంచి అసదుద్దీన్ ఓవైసీ వరుసగా గెలుపొందుతూ వస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిలో ఇప్పుడు కాగడా పెట్టి వెతికినా గెలుపు ధీమా కనిపించడం లేదు. కొద్ది నెలల క్రితం వరకూ ఇంకా స్పష్టంగా చెప్పాలంటే గడపగడపకూ అంటూ తన ఎమ్మెల్యేలు, మంత్రులను ప్రజలలోకి పంపిన సమయంలోనే ప్రజా వ్యతిరేకత స్పష్టంగా కనిపించినా జగన్ మాత్రం వైనాట్ 175 అన్న మాటను వదలలేదు.
ఏపీలో జగన్ ఖేల్ ఖతమ్ అయిపోయింది. ఇక తట్టా బుట్టా సర్దుకుని జైలుకు వెళ్ళే ఏర్పాట్లు చేసుకోవడమే
ఏపీలో ఎన్నికల వేళ నగరి నియోజకవర్గం సిట్టింగ్ ఎమ్మెల్యే, వైసీపీ అభ్యర్థి రోజాకు సొంత పార్టీ నేతల నుంచే ఎదురౌతున్న వ్యతిరేకత, నిరసనలు హాట్ టాపిక్ గా మారాయి. రెండు సార్లు వరుసగా విజయం సాధించిన ఆమె.. మూడోసారి విజయంతో హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేయాలని ఆశపడుతున్నారు.
హెల్త్ ఇన్స్యూరెన్స్ పేరుతో ప్రీమియం లు వసూళ్ళకే పరిమితం అవుతూ క్లెయిమ్ ల విషయాలకు వచ్చేసరికి ఇలా వేధింపులకు గురి చేసి ఎగొట్టడమే ధ్యేయంగా పనిచేస్తున్న TATA AIG GENERAL INSURANCE కంపెనీ వంటి సంస్థలపై, వాటి ఆగడాలకు చెక్ పెట్టేదెవరు
కాపు సామాజిక వర్గంపై బలమైన ‘ముద్ర’ గడ సొంతం. అయితే అది ఇప్పుడు కాదు. ఒకప్పుడు. సొంత సామాజికవర్గంపై తన ఆధిపత్యం పోతుందా అన్న సందేహం ఇసుమంతైనా ఆయనలో కనిపించని రోజుల్లో కాపుజాతి కోసం అంటూ ఆయన ఉద్యమాలు చేశారు. కాపు రిజర్వేషన్ అంశాన్ని రాజకీయ పార్టీలు పట్టించుకోక తప్పని పరిస్థితి కల్పించారు. అయితే ఇదంతా గతం.
ఎపిలో సార్వత్రిక ఎన్నికలకు ఇంకా తొమ్మిది రోజులు మాత్రమే గడువు ఉంది. రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీలు స్పీడ్ పెంచాయి. కూటమి అభ్యర్థుల తరపున ప్రధాని నరేంద్ర మోడీ ప్రచారం చేయాలని నిర్ణయించారు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రచారం ఊపందుకుంటోంది.. పోలింగ్కు సమయం దగ్గరపడుతుండటంతో ప్రధాన పార్టీలు దూకుడు పెంచాయి.
నగరిలో రోజా ఓటమే ధ్యేయంగా వైసీపీ స్థానిక నేతలు పని చేస్తున్నారా? వారికి మంత్రి పెద్దిరెడ్డి మద్దతు ఫుల్ గా ఉందా? అన్న అనుమానాలు చాలా కాలంగా ఉన్నాయి. ఆమెపై సొంత పార్టీ నేతలు గతంలో చేసిన అవినీతి ఆరోపణలు ఇందుకు నిదర్శనం.
యథారాజా తథా ప్రజా అన్నది నానుడి. కానీ వైసీపీ విషయంలో మాత్రం యథా అధినేత, తథా ఆ పార్టీ నాయకులు అని మార్చుకోవాల్సి ఉంటుంది. ఎన్నికల వేళ వైసీపీ అరాచకాలు రోజు రోజుకూ పెచ్చరిల్లుతున్నాయి.
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో 2016లో ఆత్మహత్య చేసుకున్నవిద్యార్థి రోహిత్ వేముల దళితుడు కాదని,