ఉత్తరాంధ్ర టేకాఫ్‌కు సిద్దం.. ప్రధాని రాక కోసం ఎదురుచూస్తున్నాం : సీఎం చంద్రబాబు

Publish Date:Jul 31, 2026

Advertisement

 

ఉత్తరాంధ్ర అభివృద్ధిలో కీలక మైలురాయిగా నిలవనున్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సర్వం సిద్ధం చేసింది. అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానా శ్రయాన్ని రేపు ప్రారంభించనున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ‘ఎక్స్‌’ వేదికగా ప్రకటించారు. ఈ విమానాశ్రయం రాష్ట్రంలో మౌలిక వసతుల అభివృద్ధికి మరింత ఊతమిస్తుందని ప్రధాని పేర్కొన్నారు. ప్రధాని మోదీ చేసిన పోస్టుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు. మోదీ రాక కోసం ఆంధ్రప్రదేశ్‌ ఎదురు చూస్తోందని, ఆయనకు స్వాగతం పలికేందుకు రాష్ట్రం సిద్ధంగా ఉందని ‘ఎక్స్‌’ వేదికగా రీ-పోస్ట్‌ చేశారు. ‘ఉత్తరాంధ్ర టేకాఫ్‌కు సిద్ధం.. మీ రాక కోసం ఎదురుచూస్తున్నాం మోదీ జీ’ అంటూ సీఎం చంద్రబాబు తన ఎక్స్ వేదిక ద్వారా పేర్కొన్నారు.

భోగాపురం విమానాశ్రయం అందుబాటులోకి రావడంతో ఉత్తరాంధ్ర ప్రాంతానికి విమాన కనెక్టివిటీ మరింత మెరుగుపడనుంది. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలతో పాటు ఉత్తరాంధ్రలోని ఇతర ప్రాంతాల అభివృద్ధికి ఈ విమానాశ్రయం కీలకంగా మారనుంది. అంతర్జాతీయ విమాన సర్వీసులు అందుబాటు లోకి రావడంతో విదేశీ ప్రయాణాలకు కూడా ఈ ప్రాంత ప్రజలకు మరింత సౌకర్యం కలగనుంది. విమానాశ్రయం కారణంగా ఉత్తరాంధ్రలో పర్యాటక రంగానికి కొత్త ఊపు వస్తుందని ప్రభుత్వం ఆశిస్తోంది. 

అరకు, బొర్రా గుహలు, విశాఖ తీర ప్రాంతం, విజయనగరం, శ్రీకాకుళం తదితర ప్రాంతాలకు దేశ, విదేశాల నుంచి పర్యాటకుల రాక పెరిగే అవకాశం ఉంది. అదే సమయంలో పారిశ్రామిక పెట్టుబడులు, వాణిజ్య కార్యకలాపాలు, ఉపాధి అవకాశాలు పెరగడానికి విమానాశ్ర యం దోహదపడుతుందని ప్రభుత్వం భావిస్తోంది. భోగాపురం ఎయిర్‌పోర్టు తో ఉత్తరాంధ్ర అభివృద్ధి వేగం పుంజుకుంటుందని సీఎం చంద్రబాబు తన పోస్టులో స్పష్టం చేశారు. మౌలిక వసతుల పరంగా ఈ విమానాశ్రయం కీలక మైన అడుగుగా నిలవ నుందని పేర్కొన్నారు. ప్రధాని మోదీ పర్యటన, విమానాశ్రయం ప్రారంభో త్సవం నేపథ్యంలో ఉత్తరాంధ్రలో సందడి నెలకొంది.

భోగాపురం విమానాశ్రయం అందుబాటులోకి రావడం వల్ల ఉత్తరాంధ్ర ఆర్థిక, పర్యాటక రంగాలు సరికొత్త పుంతలు తొక్కనున్నాయి. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు చెందిన ప్రయాణికులకు సరసమైన సమయాల్లో, విస్తృతమైన విమాన సర్వీసులు లభించనుండటం శుభపరిణామం.

భోగాపురం ఎయిర్‌పోర్టు నుంచి ఆగస్టు 17 నుంచి విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ఎయిరిండియా  అక్టోబర్‌ 24 వరకు అమల్లో ఉండే విమానాల షెడ్యూల్‌ను ప్రకటించింది.హైదరాబాద్‌–భోగాపురం మధ్య ప్రతిరోజూ ఐదు విమాన సర్వీసులు నడపనున్నట్లు తెలిపింది. అలాగే బెంగళూరు–భోగాపురం మార్గంలో రోజుకు రెండు సర్వీసులతో పాటు, ఆదివారం మరియు శుక్రవారం మినహా మిగిలిన ఐదు రోజుల్లో అదనంగా మరో సర్వీసు అందుబాటులో ఉంటుందని వెల్లడించింది. ఇక విజయవాడ–భోగాపురం మధ్య ప్రతిరోజూ నాలుగు విమాన సర్వీసులు నిర్వహించనున్నట్లు ఎయిరిండియా ప్రకటించింది

PM Narendra Modi, Bhogapuram Airport Inauguration, Alluri Sitarama Raju International Airport, 
AP Development Projects, Visakhapatnam Semiconductor Plant, PM Modi AP Visit Schedule, CM Chandrababau


 

By
en-us Political News

  
ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన నేపథ్యంలో భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం పరిసరాల్లో భారీ భద్రతా ఏర్పాట్లు చేపట్టారు.
మైలవరం రాజకీయాలు, వీటీపీఎస్ ఫ్లై యాష్ రవాణా వివాదం, పార్టీ అంతర్గత అంశాలపై మైలవరం టీడీపీ ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ కీలక వ్యాఖ్యలు చేశారు
తెలంగాణరాష్ట్రంలోని ఓటర్లకు కేంద్ర ఎన్నికల సంఘం మరో మంచి అవకాశాన్ని కల్పించింది.
గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ ఎంతోమంది మహిళలు నాలుగు గోడల మధ్యే తమ జీవితాలను పరిమితం చేసుకుంటున్నారు.
దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపిన 2020 ఈశాన్య ఢిల్లీ మత ఘర్షణల కేసులో న్యాయస్థానం అత్యంత సంచలనాత్మక తుది తీర్పును వెలువరించింది.
సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర సందర్భంగా హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు భారీగా ట్రాఫిక్ ఆంక్షలు
కోర్టు ఆదేశాలను ఉద్దేశపూ ర్వకంగా ఉల్లంఘించిన వ్యవహారంలో తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.
భారతదేశ ఇంధన భద్రత, వ్యవసాయ రంగం, క్రీడలు మరియు మౌలిక సదుపాయాల అభివృద్ధిలో ఒక కొత్త అధ్యాయానికి తెరలేస్తూ ప్రధాని
ఇన్‌ఛార్జ్‌ డైరెక్టర్‌గా డా. నరేంద్రకుమార్‌ నియామకం..!
తెలంగాణలోని ఆహార భద్రతా కార్డు లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.
దక్షిణ భారతదేశంలో దశాబ్దాలుగా నలుగుతున్న కావేరీ నదీ జలాల వివాదం మరోసారి తీవ్ర రూపం దాల్చింది.
చనిపోయిందని వైద్యులు తేల్చేస్తే.. రోడ్డు గుంత ప్రాణం పోసింది..!
ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు కోసంరి లయన్స్.లక్ష కోట్లు ఇన్వెస్ట్ చేయడానికి సిద్ధమైంది. కేంద్ర ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన ఈ వేలంలో ఏలూరు జిల్లా పరిధిలోని బొగ్గు గనుల బ్లాకులను రిలయన్స్ దక్కించుకోవడంతో ఇంకే మాత్రం జాగు లేకుండా ఈ బిగ్ ప్రాజెక్టు పట్టాలెక్కనుంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.