Top Stories

dummy

political-news-img

సెహ్వాగ్ సెటైర్.. అశ్విన్ కౌంటర్.. నవ్వులు పూయించిన మాజీ క్రికెటర్లు

ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన క్రికెట్ లీగ్ ఏదైనా ఉందంటే అది ఐపీఎల్ మాత్రమే. అత్యంత ఆదరణతో సాగుతున్న ఈ లీగ్ ఇప్పటికే 18 సీజన్ లు పూర్తి చేసుకుని 19వ సీజన్ లోకి ప్రవేశించింది. సీజన్ సీజన్ కూ ఐపీఎల్ కు ఆదరణ పెరుగుతోనే ఉంది. మైదానంలో ఆటగాళ్ల ప్రదర్శన మాత్రమే కాదు.. మైక్ పట్టుకుని ఆటకు కామెంటరీ చెప్పే కామెంటేటర్ల జోవియల్ టెండెన్సీ కూడా క్రికెట్ అభిమానులకు కావలసినంత ఆనందాన్ని, ఎంటర్ టైన్ మెంట్ నూ అందిస్తోంది. తాజాగా ఈ 19వ సీజన్ లో భాగంగాతొలి మ్యాచ్ (మార్చి 28) బెంగళూరు వేదికగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ), సన్ రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్ హెచ్) మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ ఫలితం అందరికీ తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ ద్వారా టీమ్ ఇండియా మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ హిందీ కామెంటేటర్ గా తన కొత్త ఇన్నింగ్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా సీనియర్ కామెంటేటర్ వీరేంద్ర సెహ్వాగ్ తనదైన శైలిలో అశ్విన్‌ను పలకరిస్తూ ఈ రోజు మనం లాజిక్‌లు, లెక్కలతో సంబంధం లేకుండా కేవలం మనసుతో మాట్లాడదాం అంటూ వ్యాఖ్యానించాడు. సెహ్వాగ్ వ్యాఖ్యలకు అశ్విన్ తనదైన శైలిలో దీటైన బదులిచ్చాడు. ఏదైనా మాట్లాడే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించి మాట్లాడాలని, విజ్ఞతతో మెలగాలని మా తల్లిదండ్రులు నాకు నేర్పించారు. కానీ మీరు మాత్రం దానికి భిన్నంగా ఆలోచించకుండా మాట్లాడమంటున్నారేమిటి? అంటూ కౌంటర్ ఇచ్చారు. అశ్విన్ ఇచ్చిన ఈ స్మార్ట్ రిప్లై విన్న సెహ్వాగ్, అశ్విన్‌కు సొంతంగా యూట్యూబ్ ఛానెల్ ఉన్న విషయాన్ని గుర్తు చేస్తూ కొందరు ఉద్దేశపూర్వకంగా అతిగా ఆలోచించి మాట్లాడతారని, ఒకవేళ ఏదైనా ప్లేయర్ గురించి ప్రతికూలంగా మాట్లాడితే తమ ఫాలోవర్లు తగ్గిపోతారనే భయం ఉంటుందని సెటైర్ వేశాడు. ఇద్దరు క్రికెట్ దిగ్గజాలు ఒకరిపై ఒకరు సెటైర్లు వేసుకుంటూ చమత్కారంగా చేసిన వ్యాఖ్యలు నెట్టింట తెగ వైరల్ అయ్యాయి. ఇలా కామేంటేటర్ల సమయస్ఫూర్తి, సెటైర్లు, చమత్కార సంభాషణలు కూడా ఐపీఎల్ ను రక్తకట్టిస్తున్నాయని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

Publish Date: Mar 31, 2026 3:34PM

political-news-img

అడ్డంగా దొరికిపోయిన సర్పరాజ్!

చెన్నై సూపర్ కింగ్స్ ప్లేయర్ సర్పరాజ్ రాజస్థాన్ తో మ్యాచ్ లో అంపైర్లకు అడ్డంగా దొరికిపోయాడు. ఐపీఎల్ ప్రస్తుత సీజన్ లో సర్పరాజ్ చెన్నై సూపర్ కింగ్స్ జట్టుతో తన ప్రస్తానాన్ని ప్రారంభించాడు. అరంగేట్రం మ్యాచ్ లోనే సర్పరాజ్ నిబంధనలను ఉల్లంఘించి ఇబ్బందులను ఎదుర్కొన్నాడు. బ్యాటింగ్ చేయడానికి క్రీజ్ లోకి వచ్చిన సర్పరాజ్ బ్యాట్ నిబంధనలకు విరుద్ధంగా ఉందంటూ అంపైర్లు ఆ బ్యాట్ తో ఆడడానికి వీల్లేదని కుండబద్దలు కొట్టారు. బ్యాట్ కొలతలు, వెడల్పు, మందంపై ఐసీసీ స్పష్టమైన నిబంధనలు విధించింది. సర్పరాజ్ తీసుకువచ్చిన బ్యాట్ ఆ నిబంధనలకు అనుగుణంగా లేదు. దీంతో అతను క్రీజులోకి రాగానే అంపైర్లు అడ్డుకుని ఆ బ్యాట్ తో ఆడడానికి వీల్లేదని కుండబద్దలు కొట్టారు. దీంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో సర్పరాజ్ డ్రెస్సింగ్ రూం నుంచి మరో బ్యాట్ తెప్పించుకుని ఆట కొనసాగించాడు. ఆ బ్యాట్ ను కూడా తనిఖీ చేసిన తరువాతే సర్పరాజ్ ను ఆడేందకు అనుమతించారు అంపైర్లు. ఈ సంఘటన సామాజిక మాధ్యమంలో తెగ వైరల్ అయ్యింది.

Publish Date: Mar 31, 2026 3:13PM

political-news-img

శంషాబాద్ విమానాశ్రయంలో భారీగా డ్రగ్స్ పట్టివేత.. ఇద్దరి అరెస్టు

డ్రగ్స్ స్మగ్లింగ్ కు శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం అడ్డాగా మారిందా అంటే ఔననాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ఈ విమానాశ్రయంలో తరచూ గంజాయి సహా మాదక ద్రవ్యాలు తరచూ పట్టుబడటంతో సర్వత్రా ఈ అభిప్రాయం వ్యక్తం అవుతోంది. తాజాగా మంగళవారం శంషాబాద్ విమానాశ్రయంలో దాదాపు పాతిక కోట్ల రూపాయల విలువైన మాదక ద్రవ్యాలను కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. బ్యాంకాక్ నుంచి వచ్చిన ఇద్దరు ప్రయాణీకుల కదలికలు అనుమానాస్పదంగా ఉండటంతో వారిని, వారి లగేజీని క్షుణ్ణంగా తనిఖీ చేయడంతో వారు డ్రగ్స్ తీసుకువస్తున్నట్లు వెలుగులోనికి వచ్చింది. వారి నుంచి స్వాధీనం చేసుకున్న డ్రగ్స్ విలువ దాదాపు పాతిక కోట్ల రూపాయలుగా అంచనా వేశారు. ఆ ఇద్దరినీ అదుపులోనికి తీసుకుని విచారిస్తున్నారు.

Publish Date: Mar 31, 2026 1:59PM

political-news-img

ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో మంటలు.. ప్రయాణీకులు సురక్షితం

బస్సు ప్రయాణమంటేనే జనం భయపడేలా తరచుగా ప్రమాదాలు సంభవిస్తున్నాయి. ముఖ్యంగా ప్రైవేటు ట్రావెల్స్ బస్సుల్లో మంటలు వ్యాపిస్తున్న సంఘటనలు ఇటీవల సర్వసాధారణమయ్యాయి. తాజాగా విజయవాడ బస్టాండ్ వద్ద ఓ ప్రైవేటు బస్సులో మంటలు చెలరేగాయి. డ్రైవర్ అప్రమత్తత కారణంగా ప్రాణనష్టం సంభవించలేదు. వివరాల్లోకి వెడితే.. రావుల పాలెం నుంచి హైదరాబాద్ వెడుతున్న ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో విజయవాడ బస్టాండ్ సమీపంలో ఇంజన్ నుంచి పొగలు వచ్చాయి. ప్రమాదాన్ని గమనించిన డ్రైవర్ వెంటనే బస్సు నిలిపివేసి ప్రయాణీకులను కిందకు దించేశాడు. ప్రయాణీకులు కిందకు దిగిన నిముషాల వ్యవధిలోనే బస్సులో మంటలు వ్యాపించాయి. ఘటన జరిగిన సమయంలో బస్సులో 35 మంది ప్రయాణీకులు ఉన్నారు. డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించడంతో వారంతా సురక్షితంగా బయటపడ్డారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు.

Publish Date: Mar 31, 2026 1:50PM

political-news-img

భార్యాభర్తల బంధంలో దూరం పెరగడానికి గొడవలే కాదు.. ఇవి కూడా కారణాలే!

భార్యాభర్తల బంధం చాలా ప్రత్యేకమైనది. నేటికాలంలో భార్యాభర్తల బంధం పెళుసుగా మారిందని చెప్పవచ్చు. బార్యాభర్తలు గొడవ పడటం అనేది చాలా కామన్ గా మారింది. అయితే కొన్నిసార్లు గొడవలు కాస్తా బంధాన్ని విచ్చిన్నం చేసే దిశగా కూడా సాగుతాయి. చాలామంది భార్యాభర్తలు గొడవలు జరిగిన తర్వాత ఇద్దరి మధ్య దూరం పెరిగిందని చెబుతూ ఉంటారు. కానీ నిజానికి గొడవలే కాదు.. భార్యాభర్తల మధ్య దూరం పెరగడానికి ఇతర కారణాలు కూడా ఉన్నాయి. కొన్ని అలవాట్లు భార్యాభర్తల మధ్య బంధాన్ని విచ్చిన్నం చేస్తాయని అంటున్నారు రిలేషన్షిప్ నిపుణులు. బంధాన్ని నాశనం చేసే అలవాట్లు ఏమిటో తెలుసుకుంటే.. తప్పులు వెతకడం.. భార్యాభర్తల బందం ముడిపడింది అనగానే పూర్తీగా ఒకరి చేతిలో బంధం కంట్రోల్ లో ఉండాలని అనుకుంటారు కొందరు. మరీ ముఖ్యంగా భర్తలు ఇలా ఎక్కువ చేస్తారు. వారు నిలబడే తీరు, ధరించే దుస్తులు, చేసే పనులు ఇలా.. ప్రతి విషయంలో తప్పులు వెతకడం చేస్తుంటారు. అలా తప్పులు చూపించడం తమ గొప్ప అని వారు అనుకుంటారు. కానీ ఇలా చేయడం వల్ల లైఫ్ పార్ట్నర్ చాలా ఇబ్బంది పడతారు. ఇదే విధంగా ఎక్కువ కాలం సాగితే.. మా ఇద్దరికి సెట్ కావడం లేదు అనే ఫీలింగ్ వచ్చేస్తుంది. ఇది కాస్తా బంధం పెళుసుబారడానికి దారితీస్తుంది. మౌనం.. భార్య లేదా భర్త ఇద్దరిలో ఎవరైనా సరే.. ఏదైనా తమకు నచ్చని పని జరిగినప్పుడు లేదా తమకు ఏ విషయంలో అయినా అసంతృప్తి ఏర్పడినప్పుడు దాని గురించి మాట్లాడటం కంటే.. మౌనంగా ఉండి భాగస్వామిని సాధిస్తూ ఉంటారు. ఈ పద్ధతి చాలా హానికరమైనది. భాగస్వామిని పట్టించుకోకుండా మానసిక హింసకు గురి చేయడం లాంటిది ఇది. ఆరోగ్యకరమైన సంబంధానికి, మనసు విప్పి ఓపెన్ గా మాట్లాడటం చాలా అవసరం. మౌనంగా ఉండటం వల్ల భాగస్వామి అభద్రతా భావానికి లోనయ్యే అవకాశం ఎక్కువ, అంతేకాదు.. ఇలాంటి ప్రవర్తన వల్ల బంధంలో దూరం పెరుగుతుంది. పాత విషయాలు.. గొడవల సమయంలో బార్యాభర్తలలో చాలామంది పాత విషయాలను బయటకు లాగి వాటిని తమకు అనుగుణంగా ఉండేలా చేసుకుంటారు. భాగస్వామి చేసిన తప్పును ఒకసారి క్షమించేశాక.. తరువాత వాదన జరిగిన ప్రతిసారీ ఆ విషయాన్ని తిరిగి ప్రస్తావించకూడదు. ఇలా చేయడం వల్ల భాగస్వామి నమ్మకం దెబ్బతింటుంది, ఇంకా పాత విషయాలను మనసులో పెట్టుకున్నారని, బంధంలో అర్థం చేసుకునే తత్వం లేదని అనుకుంటారు. ఆధిపత్యం.. ప్రేమ అంటే భాగస్వామి ఫోన్‌ను నిరంతరం రహస్యంగా చూడటం, వారు స్నేహితులతో ఎలా ఉంటున్నారు, ఏం మాట్లాడుతున్నారు గమనించడం, గూఢచర్యం చేసినట్టు బిహేవ్ చేయడం, ఇవన్నీ కాదు.. చాలామంది ఇవన్నీ చేస్తూ ఆధిపత్యం ప్రదర్శిస్తూ దాన్ని ప్రేమ అని అనుకుంటారు. కానీ ఇలా ప్రవర్తిస్తే అది వ్యక్తి స్వేచ్ఛను హరించినట్టే.. ఇలా చేయడం వల్ల ఎదుటి వ్యక్తికి బంధంలో నమ్మకం పోతుంది. పోలిక.. లైఫ్ పార్ట్నర్ ను ఇతరులతో పోల్చడం మంచిది కాదు. భాగస్వామిని స్నేహితులు, వారి భాగస్వాములు, అక్క చెళ్లేళ్లు, అన్నదమ్ములు ఇలా అందరితో పోల్చడం మంచిది కాదు. ప్రతి వ్యక్తికి బలాలు, బలహీనతలు ఉంటాయి. పోలికల వల్ల భాగస్వామి బాధపడవచ్చు. బంధంలో ఎప్పటికీ వ్యక్తిని ఉన్నది ఉన్నట్టుగా యాక్సెప్ట్ చేయగలగాలి.అప్పుడే బంధం బాగుంటుంది. లేదంటే బంధం విచ్చిన్నమవుతుంది. *రూపశ్రీ

Publish Date: Mar 31, 2026 1:46PM

political-news-img

పసుపు పాలు తాగితే ఆరోగ్యానికి లాభాలే కాదు.. నష్టాలు కూడా ఉన్నాయ్..!

భారతీయులు చాలామంది రాత్రి పడుకునే ముందు పసుపు కలిపిన పాలు తాగుతూ ఉంటారు. ఆయుర్వేదపరంగా పసుపు పాలు ఎంతో ఆరోగ్యకరమైనవి. పసుపు పాలలో ఉన్న ప్రయోజనాల కారణంగా వీటిని గోల్డెన్ మిల్క్ అని పిలుస్తారు. అంటే.. బంగారం అంత మన్నికైనవని అర్థం. చాలామంది చలికాలంలో పసుపు పాలు తాగుతారు. అనారోగ్యాల నివారణకు పసుపు పాలు ప్రసిద్ధి చెందాయి. పసుపు పాలు రోగనిరోధక శక్తిని పెంచుతాయి, వాపును తగ్గిస్తాయి, నిద్రను ప్రోత్సహిస్తుంది. అయితే పసుపు పాలు తాగడం అందరికీ సురక్షితం కాదని అంటున్నారు. కొంతమందికి పసుపు పాలు తాగడం వల్ల నష్టాలు కూడా ఎదురవుతాయి. ఇంతకీ పసుపు పాలు తాగడం వల్ల కలిగే నష్టాలేంటి? పసుపు పాలు ఎవరు తాగకూడదు? తెలుసుకుంటే.. పసుపు పాలు ప్రయోజనాలు.. రోగనిరోధకశక్తి.. పసుపులో లభించే కర్కుమిన్ ఒక శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్, యాంటీ బాక్టీరియల్ పదార్థం. ఇది శరీరానికి ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి సహాయపడి, రోగనిరోధక వ్యవస్థను బలపరుస్తుంది. వాతావరణం మారినప్పుడు జలుబు, దగ్గు రాకుండా నివారించడంలో ఇది ప్రత్యేకంగా ప్రయోజనకరంగా ఉంటుంది. జలుబు, దగ్గు.. పసుపు పాలు గొంతు నొప్పి, దగ్గు, జలుబు నుండి ఉపశమనం కలిగిస్తాయి. దీని వేడి చేసే గుణం శ్లేష్మాన్ని వదులు చేసి, గొంతుకు ఉపశమనం కలిగిస్తుంది. వాపులు.. పసుపులో ఉండే శోథ నిరోధక గుణాలు శరీరంలో వాపు, కీళ్ల నొప్పులు, కండరాల బిగువును తగ్గించడంలో సహాయపడతాయి. గాయం లేదా వ్యాయామం తర్వాత పసుపు పాలు తీసుకోవడం వల్ల వేగంగా కోలుకుంటారు. పసుపు పాలు ఎవరు తాగకూడదు? జీర్ణసమస్యలు ఉన్నవారు.. తరచుగా గ్యాస్, ఎసిడిటీ, అజీర్ణం లేదా విరేచనాలతో బాధపడుతుంటే, పసుపు పాలు సమస్యను మరింత పెంచే అవకాశం ఉంటుంది. పసుపు యొక్క వేడి స్వభావం, పాల యొక్క బరువైన స్వభావం జీర్ణక్రియను ప్రభావితం చేస్తాయి. రక్త సంబంధ వ్యాధుల మందులు.. పసుపు రక్తాన్ని పలుచగా చేయడానికి పనిచేస్తుంది. ఇప్పటికే రక్తాన్ని పలుచబరిచే మందులు వాడుతున్నట్లయితే, పసుపు పాలు తాగడం వల్ల రక్తస్రావ ప్రమాదం పెరగవచ్చు. మధుమేహ రోగులు.. పసుపు రక్తంలో చక్కెర స్థాయిని తగ్గించగలదు. మధుమేహం రోగులు ఇప్పటికే మందులు తీసుకుంటున్నట్లయితే, వాటి ప్రభావం అధికంగా ఉండి, చక్కెర స్థాయి చాలా తక్కువగా పడిపోవచ్చు. మూత్రపిండాలలో రాళ్లు ఉన్న రోగులు.. మూత్రపిండాల్లో రాళ్ల సమస్య ఉన్నవారు పసుపును ఎక్కువగా తీసుకోవడం మానుకోవాలి. ఎందుకంటే దీనిలో ఆక్సలేట్ ఉంటుంది, ఇది రాళ్లు ఏర్పడే ప్రమాదాన్ని పెంచుతుంది. గర్భిణీ స్త్రీలు.. గర్భధారణ సమయంలో పసుపును అధిక మోతాదులో తీసుకోవడం సురక్షితం కాదు. దీనివల్ల హార్మోన్ల మార్పులు కలగవచ్చు, కాబట్టి డాక్టర్ సలహా లేకుండా గర్భిణి స్త్రీలు పసుపు పాలు తీసుకోకూడదు. *రూపశ్రీ.

Publish Date: Mar 31, 2026 1:41PM

MOVIE NEWS

movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img