పెట్రో మంటలపై పెదవి విప్పిన మోడీ.. అంతా మీవల్లనే.. భగ్గుమన్న విపక్షాలు

Publish Date:Apr 27, 2022

Advertisement

ఇంచుమించుగా, ఇంకా స్పష్టంగా చెప్పాలంటే, ఉత్తర ప్రదేశ్ సహా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు, వచ్చి యూపీ సహా నాలుగు రాష్ట్రాలలో బీజేపీ మళ్ళీ అధికారంలోకి వచ్చిన పది రోజుల మొదలు పెట్రోల్. డీజిల్ ధరలు, ఇంచుమించుగా ప్రతి రోజూ ఎంతోకొంత పెరుగుతూనే ఉన్నాయి. ఎన్నికల బ్రేక్’ కు ముందు వందలోపున  ఉన్న లీటర్ పెట్రోల్, డీజిల్ ధరలు ఇప్పుడు సెంచరీ మార్క్ దాటి, 120 నాట్ అవుట్’ దశకు చేరుకున్నాయి. పెట్రోల్ డిజిల్ ధరలతో పాటుగా, నిత్యావసర సరకులు, కూరగాయలు, ఒకటనేమిటి మందులు సహా అన్నిటి ధరలు చుక్కలు చూస్తున్నాయి. సామాన్యులు, అల్పాదాయ, మధ్య తరగతి ప్రజలు, దిక్కులు చూస్తున్నారు. పడరాని పాట్లు పడుతున్నారు. అయితే, పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదల విషయంగా ఇంతవరకు పెదవి విప్పని ప్రధాని, ఈరోజు ( బుధవారం) పెదవి విప్పారు. అంతే కాదు, ఏపీ, తెలంగాణ సహా ప్రతిపక్ష పాలిత రాష్ట్ర ప్రభుత్వాల పై ఫైర్ అయ్యారు. కేంద్ర ప్రభుత్వం గతేడాది నవంబర్ నెలలో ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించినా.. కొన్ని రాష్ట్రాలు చమురుపై వ్యాట్‌ను తగ్గించలేదన్నారు.అలా చేయడం ద్వారా కేంద్రం అందించిన ప్రయోజనాలు క్షేతస్థాయిలోని ప్రజల వరకు వెళ్లడం లేదన్నారు. 

దేశవ్యాప్తంగా కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రులతో ప్రధాని మోడీ  సమావేశమయ్యారు. ఈ సందర్భంగా దేశంలో కరోనా పరిస్థితులు, ఉక్రెయిన్-రష్యా యుద్ధం కారణంగా తలెత్తుతున్న ఇబ్బందులను ఆయన ప్రస్తావించారు.ఉక్రెయిన్-రష్యా యుద్ధం కారణంగా ఎగుమతులు, దిగుమతులపై తీవ్ర ప్రభావం పడిందన్నారు మోదీ. ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయం అవసరం అన్నారు. పెట్రోలు, డీజిల్పై వ్యాట్ తగ్గించకపోవడం వల్ల ప్రజలకు అన్యాయం జరుగుతుందన్నారు మోదీ. ఇలా చేయడం మంచిది కాదన్నారు. ఒక రాష్ట్రం ధరలు తగ్గించకపోవడం వల్ల, ఆ ప్రభావం పొరుగు రాష్ట్రాలపై కూడా పడుతుందన్నారు. "మహారాష్ట్ర, బంగాల్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కేరళ, ఝార్ఖండ్, తమిళనాడు రాష్ట్రాలు.. కొన్ని కారణాల వల్ల.. ఈ విషయంలో కేంద్రం మాట వినడం లేదు. అలా చేయడం వల్ల ప్రజల పై భారం పడుతోంది. నవంబర్‌లోనే  ఈ రాష్ట్రాలు వ్యాట్ తగ్గించావాల్సింది , కానీ తగ్గించ లేదు. ఇప్పటికైనా, వ్యాట్ తగ్గించి ప్రజలపై భారం పడకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు. 

అయితే, మోడీ ఆరోపణను కాంగ్రెస్ పార్టీ తిప్పికొట్టింది. వ్యాట్ విషయం జోలికి వెళ్ళకుండా, కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్ సింగ్ సుర్జీవాలా, కేంద్ర ప్రభుత్వం గడచిన ఎనిమిదేళ్ళలో పెంచిన ఎక్సైజ్ డ్యూటీని తగ్గించాలని డిమాండ్ చేశారు. యూపీఎ ప్రభుత్వ హయాంలో పెట్రోల్ మీద లీటరుకు రూ.9.48, డీజిల్ పై రూ.3.56 ఉన్న ఎక్సైజ్ డ్యూటీ మోడీ ప్రభుత్వం ఏకంగా పెట్రోల్ పై లీటరుకు రూ. 27.90, డీజిల్ పై రూ.21.80 కు చేర్చిందని సుర్జీవాలా చెప్పు కొచ్చారు. ప్రభుత్వానికి ప్రజలను ఆదుకునే ఉద్దేశం ఉంటే ఎక్సైజ్ డ్యూటీని తగ్గించాలని అయన సూచించారు. 

అదలా ఉంటే, కేంద్ర ప్రభుత్వం వసూలు చేసే ఎక్సైజ్ డ్యూటీ లోంచి 41 శాతం తిరిగి రాష్ట్రాలకే వస్తుందని, అదే విధంగా రాష్ట్రాలు విదిస్తున్న వ్యాట్ వలన ఏపీ, తెలంగాణ సహా అనేక రాష్ట్రాలలో లీటరుకు రూ.30 వరకు రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకే చేరుతుందని, ఆర్థిక నిపుణులు పేర్కొంటున్నారు. అదే విధంగా, కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ డ్యూటీ తగ్గిస్తే, ఆ మేరకు రాష్ట్రాలకు వచ్చే ఆదాయం కూడా తగ్గుతుందని, మరో వంక కేంద్ర ప్రభుత్వం ఫ్రీ వాక్సిన్, ఫ్రీ రేషన్ అందిస్తున్న నేపధ్యంలో కేంద్ర ప్రభుత్వం, ఎక్సైజ్ డ్యూటీని తగ్గించే పరిస్థితి లేదని అంటున్నారు. అదే సమయంలో కొవిడ్, యుద్ధం (రష్యా-ఉక్రెయిన్) యుద్ధం కారణంగా ప్రపంచ దేశాలన్నీ కూడా ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కుంటున్నా వాస్తవాన్ని, రాజకీయ పార్టీలు విస్మరించరాదని అంటున్నారు.
 

By
en-us Political News

  
కరీంనగర్ లోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ పై జరిగిన దాడిని నిరసిస్తూ బీఆర్ఎస్ నాయకత్వం బంద్ పిలుపునిచ్చిన నేపథ్యంలో . శనివారం ( మే 9) ఉదయం నుండే నగరంలోని ప్రధాన కూడళ్లలో పోలీసులు భారీగా మోహరించారు. ఎమ్మెల్యే గంగుల కమలాకర్ నిరసనలో పాల్గొనకుండా పోలీసులు ఆయన ఇంటి వద్ద బారికేడ్లు ఏర్పాటు చేసి బయటకు రాకుండా అడ్డుకున్నారు. దీనిపై బీఆర్ఎస్ కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి, పోలీసులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
ముఖ్యంగా పార్టీలో అభిషేక్ బెనర్జీ పెత్తనం పెరగడం వల్లే సువేందు అధికారి వంటి బలమైన నేతలు టీఎంసీని వీడారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. క్షేత్రస్థాయిలో పట్టున్న నాయకులను కాదని, కార్పొరేట్ తరహా రాజకీయాలకు అభిషేక్ బెనర్జీ ప్రాధాన్యత ఇవ్వడం తృణమూల్‌కు ప్రతికూలంగా మారిందంటున్నారు.
ఆంధ్రోళ్లను తిట్టి ఓట్లు దండుకున్న బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ప్రాజెక్టుల పేరుతో దోపిడీకి పాల్పడిందని సంచలన వ్యాఖ్యలు చేశారు.
ప్రస్తుత ఎన్నికల ఫలితాలు కేరళలో పెను మార్పులకు నాంది పలికాయి. యూడీఎఫ్ స్పష్టమైన మెజారిటీ సాధించడంతో.. కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు మొదలయ్యాయి. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపికపై కసరత్తు జరుగుతోంది. కేసీ వేణుగోపాల్ అనుభవం, రాహుల్ గాంధీతో ఉన్న సాన్నిహిత్యం ఆయనకు ప్రధాన బలంగా మారాయి.
టీవీకే అధినేత విజయ్‌కు కాంగ్రెస్ మద్దతు తెలపడంపై ఆగ్రహంగా ఉన్న డీఎంకే.. కాంగ్రెస్‌కు కటీఫ్ చెప్పేసింది. మారిన రాజకీయ పరిస్థితుల దృష్ట్యా, లోక్‌సభలో తమ పార్టీ సభ్యులకు కాంగ్రెస్ ఎంపీలతో కాకుండా విడిగా సీటింగ్ కేటాయించాలని డీఎంకే ఎంపీ కనిమొళి స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు.
తాజా సమాచారం ప్రకారం.. విజయ్ తన పార్టీకి ఉన్న బలానికి తోడుగా మరో మూడు పార్టీల మద్దతును కూడగట్టుకున్నారు. ఆ పార్టీల మద్దతుతో అధికారం చేపట్టడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 118ని ఆయన సాధించారు.
తమిళనాడులో ఇటీవల జరిగిన ఎన్నికల తర్వాత, విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవ్వగా.. మెజారిటీ నిరూపణ విషయంలో రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ కచ్చితమైన నిబంధనలు పాటించాలని పట్టుబడుతున్నారు. విజయ్ కు తన పార్టీ ఎమ్మెల్యేలు 107 మందికి అదనంగా కాంగ్రెస్ నుంచి గెలిచిన ఐదుగురు ఎమ్మెల్యేల మద్దతు కూడా ఉంది.
పదవి నుంచి తొలగించిన అనంతరం ఎస్వీఎస్ఎన్ వర్మ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. పార్టీ తీసుకున్న ఈ నిర్ణయం తనకు ముందే తెలుసని, నాయకత్వం నుంచి సమాచారం అందిందని చెప్పారు. అయితే పార్టీ కోసం ఎన్నో ఏళ్లుగా కష్టపడి.. క్షేత్రస్థాయిలో కేడర్‌ను కాపాడుకుంటూ వచ్చిన తనకు ఈ పరిణామం మనస్తాపానికి గురిచేసిందన్న ఆవేదన కూడా వ్యక్తం చేశారు.
బాబు కూటమిని ఎందుకంత విలువైన‌దిగా భావిస్తున్నారంటే.. కారణం వైసీపీ. ఆ పార్టీ కూట‌మి ఎప్పుడెప్పుడు చీలిపోతుందాని కాచుకుని కూర్చుని ఉంది. ఏ అవ‌కాశం వ‌చ్చినా వారు వ‌దిలిపెట్టినట్టే క‌నిపించ‌దు. మొన్న కోట వినుత ఘ‌ట‌న‌, నిన్న అర‌వ శ్రీధ‌ర్ వ్య‌వ‌హారం, ఇవాళ వ‌ర్మ ఇష్యూ.. ఇలా స‌మ‌యం దొరికిన‌పుడ‌ల్లా ఆయా అంశాల‌ను బాగా హైలెట్ చేసి.. కూట‌మిలో ఏదో ఒక చిచ్చు రాజేయాల‌ని చూస్తోంది వైసీపీ అధినాయ‌క‌త్వం.
అతి కొద్ది మంది నేతలు జగన్ ప్రకటనను సమర్దిస్తూ.. అనుకూల ప్రకటనలు చేస్తుండగా.. మెజారిటీ లీడర్, క్యాడర్ మాత్రం జగన్ నిర్ణయంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
తెలుగువన్ వాస్తవ వేదికలో ప్రస్తుత జాతీయ, ప్రాంతీయ రాజకీయ పరిస్థితులపై విస్తృత చర్చ జరిగింది.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆ రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనాన్ని సృష్టించాయి.
టీవీకే అధినేత విజయ్‌తో భేటీ అనంతరం రాజ్ భవన్ ఒక అధికారిక ప్రెస్ నోట్ విడుదల చేసింది. అసెంబ్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే ఉండాల్సిన సంఖ్యాబలంపై గవర్నర్.. విజయ్‌కు మార్గనిర్దేశం చేశారు. కేవలం అతిపెద్ద పార్టీగా ఉండటమే కాకుండా, సభలో తగినంత మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్నట్లు ఆధారాలు చూపాలని సూచించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.