Publish Date:Aug 11, 2022
బీహార్ పరిణామాల నేపథ్యంలో తాజాగా మళ్లీ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ మళ్లీ తెరపైకి వచ్చారు. ఎన్నికల వ్యూహకర్తగా ఓ వెలుగు వెలిగిన పీకే.. రాజకీయ నేతగా మాత్రం ఎవరికీ పట్టకుండా పోయారు. ఇప్పుడు ఇటు ఎన్నికల వ్యూహాలూ పారక.. అటు రాజకీయంగానూ గుర్తింపు లేక రెంటికీ చెడ్డ రేవడగా మిగిలిపోయారు. బీహార్ లో ఎన్డీయే ప్రభుత్వం కుప్ప కూలి మహాఘట్ బంధన్ సర్కార్ కొలువుదీరిన పరిణామాలలో ప్రశాంత్ కిశోర్ ప్రమేయమే లేకుండా పోయింది.
నితీష్ వ్యూహాలను పసిగట్టడంలో పీకే టోటల్ గా జీరో అయ్యారు. బీహార్ పరిణామాలు 2024 సార్వత్రిక ఎన్నికలలో బీజేపీయేతర పక్షాల ఐక్యతకు నాందిగా పరిశీలకులు విశ్లేషిస్తున్న వేళ ఎవరూ అడగకుండానే.. నితీష్ కు అంత సీన్ లేదంటూ ప్రశాంత్ కిషోర్ చేసిన వ్యాఖ్యలపై సామాజిక మాధ్యమంలో నెటిజెన్లు పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తున్నారు. బీహార్ లో బీజేపీకి షాకిస్తూ.. కొత్త మిత్రులతో చేరి బిహార్ లో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన నితీశ్ కుమార్ వ్యూహ చతురతపై దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున విశ్లేషణలు వస్తున్నాయి. దాదాపు అన్ని విశ్లేషణలూ ఈ పరిణామం వచ్చే సార్వత్రిక ఎన్నికలలో మోడీకి చేదు అనుబవాన్ని మిగిల్చే అవకాశాలు మెండుగా ఉన్నాయనే చెప్పాయి.
బీజేపీకి మిత్రపక్షాలన్నీ దూరం కావడం వచ్చే సార్వత్రిక ఎన్నికలు మోడీ హ్యాట్రిక్ ఆశలకు గండి కొడతాయనే విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అయితే ప్రశాంత్ కిశోర్ మాత్రం ఈ విశ్లేషణలను కొట్టి పారేస్తూ.. నితీష్ కు అంత సీన్ లేదని వ్యాఖ్యనించారు. బీహార్ పరిణామాలు జాతీయ స్థాయిలో రాజకీయాలను ఇసుమంతైనా ప్రభావితం చేయవని తేల్చేశారు. కేవలం నితీష్ స్వార్థం వల్లనే బీహార్ పరిణామాలు సంభవించాయని సూత్రీకరించారు. అంతే కాకుండా నితీష్ వ్యూహాలపై, వ్యవహార శైలిపై విమర్శలు చేశారు.
గత పదేళ్లుగా ఆయన బీహార్ లో చేస్తున్న రాజకీయ ప్రయోగాలన్నీ కుప్పిగంతులేనని ప్రశాంత్ కిషోర్ అభివర్ణించారు. గత పదేళ్లుగా తాను ముఖ్యమంత్రిగా కొనసాగడమే లక్ష్యంగా ఇలాంటి రాజకీయ జంపిగ్ లను ఆయన గతంలో ఐదు సార్లు చేశానపీ, ఇది ఆరోసారనీ విమర్శించారు. కేవలం సీఎంగా కొనసాగడమే లక్ష్యంగా ఆయన తీరు ఉందనీ, ఆయన వల్ల బీహార్ కు జరిగిన మేలేమీ లేదని విమర్శించారు. ఏ విషయంలోనూ సైద్ధాంతిక సారూప్యత లేని జేడీయూ, ఆర్జీడీలు కలిసి బీహార్ ను ఏం చేస్తారోనని భయంగా ఉందని పీకే వ్యాఖ్యానించారు. అయితే పీకే వ్యాఖ్యలను పరిశీలకులు కొట్టి పారేస్తున్నారు. నితీష్ పై ఉన్న వ్యక్తిగత వైరానికి తోడు తెలంగాణ ముఖ్యమంత్రిపై ఉన్న వ్యక్తిగత ప్రేమ కూడా పీకే వ్యాఖ్యలకు కారణమని విశ్లేషిస్తున్నారు.
పీకే వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి తెలంగాణ సీఎంను జాతీయ నేతగా నిలబెట్టే పనిని అంగీకరించారనీ, ఆ దిశగా ఆయన టీమ్ తెలంగాణలో పని చేస్తున్నదనీ, ఈ పరిస్థితుల్లో మోడీకి వ్యతిరేకంగా బీజేపీయేతర పార్టీలను ఏకం చేసే బలమైన నేతగా నితీష్ ఆవిర్బవిస్తే తెలంగాణ తనకు ఇచ్చిన ఉద్యోగం కోల్పోతుందన్న భయంతోనే బీహార్ పరిణామాలు జాతీయస్థాయిలో చూపే ప్రభావం ఏమీ ఉండదంటూ విశ్లేషణలు చేస్తున్నారని విమర్శకులు అంటున్నారు. అదీ కాక మోడీ వ్యతిరేకతను పూర్తిగా తగ్గించుకుని మరీ పీకే మాట్లాడటంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమౌతున్నాయి.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/pk-analysis-on-bihar-developements-attrats-criticism-from-all-fronts-39-141738.html
ఆ రోజు సభలో ఓ మంత్రి తనపై చెయ్యి చేసుకున్నారని పేర్కొన్నారు. మరో మంత్రి ఏకవచనంతో తిట్టిపోశారు, కులం పేరుతో దూషిస్తూ తన పుట్టుకను నిందించారన్నారు. శాసనమండలిలో తన సిబ్బందినీ దగ్గరికి రాకుండా వైసీపీ సభ్యులు అడ్డుపడ్డారని, తన చుట్టూ చేరి బెదిరింపులు, ప్రలోభాలతో రకరకాలుగా ఇబ్బంది పెట్టారన్నారు.
ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలకు 5 కోట్ల మంది ప్రజల తరఫున కృతజ్ణతలు తెలిపారు. దేశం మొత్తానిది ఒక దారైతే... తమదో దారి అన్నట్లు వైసీపీ వ్యవహరించిందని దుయ్యబట్టారు. రాష్ట్రం, దేశం నాశనమైనా పర్వాలేదు.. మాకు స్వార్థ రాజకీయమే ముఖ్యమన్నట్లుగా వైసీపీ వ్యవహరించిందని విమర్శించారు.
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో డ్రగ్స్ సంస్కృతి ఒక పెను సవాలుగా మారింది. ఇటీవలి కాలంలో రాజకీయ నాయకులు, ప్రముఖుల పేర్లు డ్రగ్స్ కేసుల్లో వినిపిస్తుండటం సమాజంలో తీవ్రసంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. వాస్తవ వేదిక చర్చలో డోలేంద్ర ప్రసాద్, కంఠంనేని రవిశంకర్ లు ఇది కేవలం శాంతిభద్రతల సమస్య మాత్రమే కాదనీ, సమాజ భవిష్యత్తుకు పెనుముప్పుగా పరిణమించిన ఒక సామాజిక రుగ్మత అని పేర్కొన్నారు.
ప్రస్తుతం ఎన్నికల ప్రచారంలో విజయ్ రాష్ట్రంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఈ క్రమంలోనే జననాయగన్ సినీమా విడుదలపై నెలకొన్న అనిశ్చితిని ఆయన ప్రజల ముందు ఉంచారు. అలాగే.. కరూర్ ప్రాంతంలో చోటుచేసుకున్న విషాద ఘటనను ప్రస్తావిస్తూ.. అది యాధృచ్ఛికంగా జరిగింది కాదని, దాని వెనుక కూడా లోతైన కుట్ర దాగి ఉందన్న అనుమానాలున్నాయన్నారు.
నిజానికి తాను రాజకీయ సన్యాసం చేసినట్టు చెబుతూనే ఉన్నా.. ఇప్పటికీ ఆయన తన టీం ద్వారా అకౌంట్ సర్వీసెస్ అందిస్తూనే ఉన్నారు. ఆపై జగన్ కి లోపాయికారిగా సహకరించేందుకే ఈ రాజీనామా డ్రామాలని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. బేసిగ్గా విజయసాయిరెడ్డి కామెంట్ చేయాల్సింది ఏదైనా ఉందంటే.. ఇటీవల జగన్ అర్ధంపర్దం లేకుండా చేసిన మావిగన్ అనే ప్రతిపాదన మీదే. కానీ రేణుక చౌదరి సభలో లేవనెత్తిన కమ్మరావతిని పట్టుకుని.. పోస్టులు పెట్టడం సరికాదంటున్నారు.
రాజ్యసభలో అమరావతి చట్టబద్ధత బిల్లుకు కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ, టీఎంసీ, ఆప్, బీజేడీ, ఆర్జేడీ, బీఆర్ఎస్, జేడీ(యూ), శివసేన మద్దతు ఇచ్చాయి. రాజ్యసభలో అమరావతి చట్టబద్ధతపై జరిగిన చర్చలో 11 పార్టీలు పాల్గొన్నాయి.
గురువారం సాయంత్రం రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు జరుపుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు పిలుపునిచ్చారు. ఇక 2015లో దేశంలోని వివిధ పుణ్యక్షేత్రాల నుంచి తెచ్చిన పవిత్ర జలాలు, మట్టిని ఉంచిన ఉద్దండరాయునిపాలెంలో పర్యటించి, రాజధాని సంకల్పంలో పాల్గొన్నారు.
కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ ఈ బిల్లును రాజ్యసభలో సభలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఏపీ రాజధాని విషయంలో ఉన్న చట్టపరమైన అస్పష్టతను తొలగించేందుకు ఈ సవరణ అత్యవసరమని పేర్కొన్నారు. బిల్లుపై జరిగిన చర్చ అనంతరం, సభాపతి సి.పి. రాధాకృష్ణన్ క్లాజ్ వారీగా ఓటింగ్ నిర్వహించగా సభ్యులు అనుకూలంగా ఓటు వేశారు. దీంతో అమరావతిని రాజధానిగా ఖరారు చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయానికి రాజ్యసభ ఆమోదం లభించింది.
. తాము అమరావతిని వ్యతిరేకించడం లేదనీ, అయితే రాజధాని పేరుతో సాగుతున్న పరిణామాలు, ఆర్థిక భారాలనే ప్రశ్నిస్తున్నామన్నారు. రైతుల నుంచి భూములు సేకరించి ఇన్నాళ్లు గడుస్తున్నా ఆశించిన స్థాయిలో అభివృద్ధి జరగలేదని ఆయన విమర్శించారు.
అమరావతికి చట్టబద్ధత అమరావతి రైతుల నైతిక విజయంగా అభివర్ణించారు. సుదీర్ఘకాలం పాటు మొక్కవోని దీక్షతో రైతులు చేసిన పోరాటం వల్లే ఇది సాధ్యమైందన్నారు.
రాజధాని ఉద్యమ సమయంలో పాలకులు ప్రయోగించిన అణచివేత చర్యలను ఈ సందర్భంగా రేణుకా చౌదరి గుర్తు చేశారు.
సీఎం హోదాలో నాడు అమరావతి శాసన రాజధాని , విశాఖ పరిపాలన రాజధాని , కర్నూలు న్యాయ రాజధాని అంటూ ఓ కొత్త వాదనను తెరమీదకు తీసుకువచ్చారు. ఆ దిశగా ఒక్కటంటే ఒక్క అడుగు పడకపోయినా.. అప్పటి వరకూ పరుగెడుతున్న అమరావతి నిర్మాణ పనులను నిలిపివేశారు.
దేశంలో ఉన్న అన్ని పార్టీలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైపు నిలిపి అమరావతి బిల్లుకు చట్టబద్ధత కల్పించిన ప్రధాని నరేంద్ర మోదీని పార్లమెంటు హాలులో గురువారం ఉదయం కలిసిన లోకేష్ ఆంధ్రప్రదేశ్ ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలియజేశారు.
వైసీపీ నేతలు అవగాహన లేకుండా ప్లాట్లు, ఖర్చులంటూ అవగాహనా రాహిత్యంతో వ్యాఖ్యలు చేస్తూ తమ అజ్ణానాన్ని చాటుకుంటున్నారని ఎద్దేవా చేశారు.