వర్మపై పిఠాపురం జనసేన క్యాడర్ గుర్రు.. కారణమేంటంటే?

Publish Date:Jan 20, 2025

Advertisement

పవన్ కల్యాణ్ నియోజకవర్గం పిఠాపురంలో కూటమి పార్టీల మధ్య విభేదాలు రచ్చకెక్కాయా? అంటే పరిశీలకుల నుంచి ఔననే సమాధానమే వస్తోంది. ఈ విభేదాలకు కారణం తెలుగుదేశం నాయకుడు, నియోజకవర్గ టీడీపీ ఇన్ చార్జ్ ఎస్పీఎస్ఎస్ వర్మ వ్యాఖ్యలే కారణమా అంటే జనసైనికులు ఔనని అంటున్నారు. అదే సమయంలో వర్మ వ్యాఖ్యలలో తప్పేముందని తెలుగుదేశం శ్రేణులు అంటున్నాయి. ఇంతకీ వర్మ ఏమన్నారంటే.. తెలుగుదేశం నాయకులు, క్యాడర్ నారా లోకేష్ ఉప ముఖ్యమంత్రిగా చేయాలని గట్టిగా కోరుకుంటే అదే జరుగుతుంది? అందులో తప్పేముందని అన్నారు. 

అసలు లోకేష్ ను ఉప ముఖ్యమంత్రిని చేయాలని తెలుగుదేశం క్యాడరే కాదు సీనియర్ నేతలు కూడా బాహాటంగానే కోరుతున్నారు. ఆయన ఇప్పటికే పార్టీలో, ప్రభుత్వంలో అత్యంత కీలకంగా వ్యవహరిస్తున్నారనీ, ఆయనకు ప్రమోషన్ ఇవ్వడం వల్ల పార్టీ కూడా బలోపేతమౌతుందని గట్టిగా చెబుతున్నారు. 

ఇటీవ‌ల మైదుకూరు స‌భ‌లో ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు ఆశీనులైన స‌భావేదిక‌పై నుంచే తెలుగుదేశం పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీ‌నివాస్ రెడ్డి లోకేశ్ ను డిప్యూటీ సీఎంను చేయాలంటూ చంద్ర‌బాబుకు విజ్ఞ‌ప్తి చేశారు. అక్కడితో ఆగకుండా ఇది తన ఒక్క‌డి అభిప్రాయమే కాదనీ,  టీడీపీ క్యాడ‌ర్  అభిప్రాయమనీ విస్పష్టంగా చెప్పారు. ఆ తరువాత ఒక్కరొక్కరుగా నాయకులు కూడా అదే విషయాన్నిబాహాటంగా వ్యక్తం చేశారు. అలా వ్యక్తం చేసిన వారిలో ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్    ర‌ఘురామ కృష్ణంరాజు, పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎన్ వర్మ,  సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తదితరులు ఉన్నారు. ఇక పార్టీ కార్యకర్తలైతే లోకేష్ కు ప్రమోషన్ ఇవ్వాలన్న డిమాండ్ ను చాలా చాలా గట్టిగా వినిపిస్తున్నారు. లోకేశ్ సార‌థ్యంలో టీడీపీకి బంగారు భ‌విష్య‌త్ ఉంటుంద‌ని తెలుగుదేశం క్యాడర్ చాలా చాలా బలంగా నమ్ముతోంది.  

ఇందుకు కారణం లేకపోలేదు. లోకేష్ చొరవతోనే తెలుగుదేశం కార్యకర్తల సంక్షేమ నిధి ఏర్పాటైంద. కార్యకర్తల సంక్షేమం కోసం లోకేష్ అరహరం పాటుపడుతున్నారు. కోటి మందికి పైగా ఉన్న తెలుగుదేశం సైన్యంలో అత్యధికులను లోకేష్ పేరుపెట్టి పిలవగలరంటే.. క్యాడర్ తో ఆయన ఎంతగా మమేకమయ్యారో అర్ధం చేసుకోవచ్చు. అన్నిటికీ మించి ఐదేళ్ల జగన్ హయాంలో కేసులకు, వేధింపులకు భయపడి.. మౌనంగా ఉండిపోయి, ఇళ్లకే పరిమితమైన పార్టీ నేతలను బయటకు తీసుకువచ్చింది లోకేష్ యువగళం పాదయాత్రే అనడంలో సందేహం లేదు. ఆయన దూకుడు, ఆయన సాహసమే జగన్ అరాచకపాలన పతనానికి బీజం వేసిందని చెప్పడంలో ఇసుమంతైనా అతిశయోక్తి లేదు. 

ఈ నేపథ్యంలోనే నారా లోకేష్ కు డిప్యూటీ సీఎంగా ప్రమోషన్ అంటూ తెలుగుదేశం నుంచి వచ్చిన డిమాండ్ కు జనసేన నుంచి వ్యతిరేకత వ్యక్తం కాలేదు. అయితే డిప్యూటీ సీఎం ఒక్కరే ఉండాలని ఏముంది? చాలా రాష్ట్రాలలో ఒకరికి మించి డిప్యూటీ సీఎంలు ఉన్నారు. అంతెందుకు జగన్ కేబినెట్ లో ఐదుగురు ఉప ముఖ్యమంత్రులు ఉన్నారు. దీంతో జనసేన వర్గాల నుంచి లోకేష్ డిప్యూటీ సీఎం అన్న ప్రతిపాదనకు ఎటువంటి వ్యతిరేకతా రాలేదు. 
ఒక్క పిఠాపురంలో మాత్రమే జనసైనికులు రుసరుసలాడుతున్నారు. ఇందుకు కారణంగా మాజీ ఎమ్మెల్యే వర్మ  డిప్యూటీ సీఎంగా లోకేష్ కు ప్రమోషన్ అంటూ గట్టిగా గళం వినిపించడమే. ఇందుకు కూడా ప్రత్యేకమైన కారణం ఉంది. గత ఏడాది జరిగిన ఎన్నికలలో పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి   జనసేనాని పవన్ కళ్యాణ్ పోటీ అనగానే వర్మ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆందోళనలూ చేపట్టారు. అయితే చంద్రబాబు జోక్యంతో తన ఆందోళన విరమించి, అసంతృప్తిని మరిచి జనసేనాని విజయం కోసం సర్వశక్తులూ ఒడ్డారు. దీంతో జనసేనా విజయంలో సింహభాగం వర్మ ఖాతాలో పడింది. సహజంగానే ఇది నియోజకవర్గంలోని జనసేన క్యాడర్ కు ఒకింత ఆగ్రహానికి కారణమైంది. దీంతో వర్మతో నియోజకవర్గంలోని జనసేన క్యాడర్ కు గ్యాప్ పెరిగింది. అదే ఇప్పుడు పార్టీలో మెజారిటీ కార్యకర్తలు, నాయకులు నారా లోకేష్ కు ప్రమోషన్ అంటూ డిమాండ్ చేసినా రాని వ్యతిరేకత వర్మ నోట ఆ డిమాండ్ రాగానే పిఠాపురం జనసైనికుల్లో ఆగ్రహం పెల్లుబకడానికి కారణమైంది.  జనసేన క్యాడర్ తో తనకు ఉన్న గ్యాప్ గురించి తెలిసి కూడా డిప్యూటీ సీఎంగా నారా లోకేష్ అన్న మాటను అనాలోచితంగానో, పార్టీలోని సీనియర్లు కూడా చేస్తున్న డిమాండే కదా తాను చేస్తే తప్పేముందన్న భావనతోనో చేసి ఉండచ్చు. అయితే వర్మ చేసిన ఈ ప్రకటన ఇప్పటికే వర్మ పట్ల ఒక విధమైన వ్యతిరేకతను పెంచుకున్న జనసేన క్యాడర్ ను రెచ్చగొట్టింది.  

By
en-us Political News

  
కింద పడ్డా పై చేయి నాదే అన్న నానుడి వినే ఉంటారు ...అచ్చం అలాగే వ్యవహరిస్తున్నరట మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్. మద్యం కుంభకోణం కేసులో పీకల్లోతు కూరుకుపోయిన జగన్ రేపో మాపో విచారణ ఎదుర్కోక తప్పదని ఓ పక్కన లోకం మొత్తం కోడై కూస్తున్నా.. అబ్బే మనకున్న పరపతి ముందు కేసులు పెద్ద లెక్క కాదు అనేలా బిల్డప్ ఇస్తున్నారా అనిపిస్తుంది ప్రస్తుతం ఆయన వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే.
సృష్టి కేసులో త‌వ్వే కొద్దీ న‌మ్మ‌లేని నిజాలు బ‌య‌ట ప‌డుతున్నాయి. డాక్ట‌ర్ న‌మ్ర‌త జ‌గత్ జంత్రీగా క‌నిపిస్తోంది. ఆమె ఇప్ప‌టి వ‌ర‌కూ హైద‌రాబాద్ లో 30 స‌రోగ‌సీ కేసులు హ్యాండిల్ చేయ‌గా.. ఆమె బేబీ సెంట‌ర్ కి స‌రోగ‌సీ విష‌యంలో క‌నీసం ప‌ర్మిష‌న్లు లేవ‌ని తెలుస్తోంది.
జ‌గ‌న్ ప్రెస్ మీట్లకు.. ఈ మ‌ధ్య రాముడు మంచి బాలుడికి మ‌ల్లే వ‌చ్చేస్తున్నారు. భ‌ల్లే భ‌ల్లే క‌బుర్లు చెబుతున్నారు. అంతా బాగుంది. ఆయ‌న క‌బుర్ల‌న్నీ పేప‌ర్లూ, టీవీల్లో వ‌చ్చేస్తాయి. కాద‌న‌డం లేదు. కానీ ఈ బొట్టు పెట్టుకుని మ‌రీ బుద్ధిమంతుడ్లా క‌నిపించ‌డ‌మేంటా? అన్న‌ది ఒక అనుమానం. ప్ర‌శ్న‌. చ‌ర్చ‌. వ‌గైరా వ‌గైరా.
రష్యాలోని కమ్చట్కా ద్వీపకల్పంలో బుధవారం (జులై 30) 8.8 తీవ్రతతో తీవ్ర భూకంపం సంభవించింది. ఈ విషయాన్ని జపాన్ వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ కారణంగా జపాన్, అమెరికా, గ్వామ్ వంటి పసిఫిక్ తీర ప్రాంతాల్లో సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి.
ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారిన లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో కీలక నిందితుడు వరుణ్‌ను శంషాబాద్ ఎయిర్‌పోర్టులో అదుపులోకి తీసుకున్నారు.
గొర్రెల స్కాం కేసు దర్యాప్తులో ఈడీ దూకుడు పెంచింది. హైదరాబాద్‌లో 10 చోట్ల ఈడీ దాడులు కొనసాగుతుండటం హాట్ టాపిక్‌గా మారింది. సికింద్రాబాద్, బోయిన్ పల్లి, జూబ్లీహిల్స్‌ ప్రాంతాల్లో ఈడీ సోదాలు చేపట్టింది. బీఆర్ఎస్ హయాంలో గొర్రెల పంపిణీలో రూ.700 కోట్ల అవినీతి జరిగిందనే ఆరోపణలపై గతంలో ఏసీబీ కేసు నమోదు చేసింది.
జగన్ హయాంలో ఆంధ్రప్రదేశ్ లో జరిగిన భారీ మద్యం కుంభకోణం కేసులో కీలక వ్యక్తులు వరుసగా అరెస్టౌతున్నారు. ఈ కేసులో సిట్ దర్యాప్తు తాడేపల్లి ప్యాలెస్ పునాదుల వరకూ వెడుతోంది. మిథున్ రెడ్డి అరెస్టు తరువాత జగన్ కు అరెస్టు భయం పెచ్చరిల్లిందని పరిశీలకులు అంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసులో సిట్ దూకుడు పెరిగింది. ఈ కుంభకోణంలో దోచుకున్న కోట్ల రూపాయల సొమ్మును దాచిన ప్రదేశాన్ని గుర్తించిన సిట్.. ఆ మొత్తాన్ని స్వాధీనం చేసుకుంది.
ర‌ష్యాలో భారీ భూకంపం సంభ‌వించింది. రిక్టర్ స్కేలుపై ఈ భూకంప తీవ్రత 8.7గా నమోదైంది. 2011 టోకియో భూకంపం తరువాత ఇదే అతి పెద్ద భూకంపంగా అధికారులు చెబుతున్నారు.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరస్వామి కొలువై ఉన్న తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతున్నది. పవిత్రమైన శ్రావణమాసం కావడంతో భక్తులు శ్రీవారి దర్శనానికి పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు.
యువతీ, యువకులు సెల్ఫీ మోజులో పడి ప్రమాదాల బారిన పడుతున్నారు. ముఖ్యంగా రైల్వే ట్రాక్‌లు, నదులు, కొండలు వంటి ప్రమాదకర ప్రదేశాల్లో సెల్ఫీలు తీసుకుంటూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు.
రుడపంచమి పర్వదినాన్ని పురస్కరించుకొని మంగళవారం తిరుమలలో శ్రీమలయప్పస్వామివారు తమ ఇష్టవాహనమైన గరుడునిపై తిరుమాడ వీధులలో విహరించి భక్తులను కటాక్షించారు.
ఆపరేషన్‌ సిందూర్‌పై లోక్ సభలో విపక్షత నేత రాహుల్‌ గాంధీ కామెంట్స్‌పై ప్రధాని మోదీ కౌంటర్ ఇచ్చారు. పాకిస్థాన్‌ను కాంగ్రెస్ పాకిస్థాన్‌ను వెనుకేసురావటం దౌర్భగ్యమని ప్రధాని అన్నారు. సర్జికల్ స్ట్రైక్ విషయంలోనూ కాంగ్రెస్ నేతలు ఇలాగే మాట్లాడారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.