ర‌హ‌స్య జీవోలపై ర‌విశంక‌ర్ పోరాటం.. హైకోర్టు పిల్‌తో ఏపీ స‌ర్కారు షేక్‌..

Publish Date:Jan 31, 2022

Advertisement

అధికారం చేతిలో ఉంది. అడిగేవారు లేర‌నుకున్నారు. అంతా ఇష్టారాజ్యం. అడ్డ‌గోలు జీవోల గోల్‌మాల్‌. జీవోలంటే అధికారికంగా ప్ర‌భుత్వ వెబ్‌సైట్‌లో ఉంచాలి. అందులో దేశ ర‌హ‌స్యాలో, ప్ర‌భుత్వ ర‌హ‌స్యాలో.. దాచుంచేటంత సీక్ర‌సీ ఏముంటుంది? జ‌గ‌న్ ప్ర‌భుత్వం ఆరు నెల‌ల్లో సుమారు 8వేల జీవోలు ఇస్తే.. అందులో దాదాపు 7వేల‌కు పైగా జీవోలు ర‌హ‌స్యంగా ఉంచడం మామూలు విష‌యం కానేకాదు. జీవోలు పాల‌న పార‌ద‌ర్శ‌క‌త‌కు వీలుగా ఉండాలి కానీ.. జీవో వివ‌రాల‌ను చీక‌ట్లో దాచుంచ‌డం ఏంటి? ఇది ప్ర‌జాస్వామ్య పాల‌నా? నియంతృత్వ‌మా? అందుకే, ఈ నిరంకుశ పాల‌న‌ను ప్ర‌శ్నించేందుకు.. డొంక‌తిరుగు జీవోల‌పై ప్ర‌భుత్వాన్ని నిగ్గ‌దీసేందుకు.. ప్ర‌ముఖ పారిశ్రామిక‌, సామాజిక వేత్త కంఠంనేని ర‌విశంక‌ర్ ఏపీ హైకోర్టులో గ‌తంలోనే పిల్ వేశారు. ఆ ప్ర‌జా ప్ర‌యోజ‌న వ్యాజ్యంపై హైకోర్టు వేగంగా విచార‌ణ జ‌రుపుతోంది. ఆ సంద‌ర్భంగా ప‌లు ఆస‌క్తిక‌ర కామెంట్లు చేసింది. ఇక‌, తాజా విచార‌ణ‌లో స‌ర్కారు సైతం కౌంట‌ర్ ఫైల్ దాఖ‌లు చేయ‌గా.. ప్ర‌భుత్వ లెక్క‌ల ప్ర‌కార‌మే ర‌హ‌స్య‌ జీవోల లెక్క భారీగా ఉంద‌ని తేలిపోయింది. 

ఆగష్టు 15 నుంచి జనవరి 15 వరకు ప్రభుత్వం ఇచ్చిన మొత్తం GO ల సంఖ్య 8,457. అందులో కేవలం 620 GOలు మాత్రమే ఈ-గెజిట్‌.. జీవోఐఆర్‌టీ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేశారు. మిగిలిన 7,837 GO ల‌ను ర‌హ‌స్యం జీవోలంటూ top secret/secret/ confidential /miscellaneous పేరుతో ఎవ‌రికీ తెలీకుండా, ఆ వివ‌రాలేవీ ప‌బ్లిక్ డొమైన్‌లో అందుబాటులో ఉంచ‌కుండా.. జారీ చేశార‌ని ప్ర‌భుత్వం ఫైల్ చేసిన కౌంట‌ర్‌లోనే చెప్ప‌డంతో ఆ ర‌హ‌స్య జీవోల డొంక భారీగా ఉన్న‌ట్టు తెలుస్తోంది. 

స‌ర్కారు చెప్పిందాని ప్ర‌కారం.. ఆగష్టు 15 నుండి జనవరి 15 వరకు.. 5 నెలల కాలంలో ప్రభుత్వం విడుదల చేసిన మొత్తం GO లలో.. కేవలం 7.33 శాతం GO లు మాత్రమే వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేసిన‌ట్టు తేలిపోయింది. ఇది స‌మాచార హ‌క్కు చ‌ట్టానికి పూర్తి విరుద్ధం. అంటే, ఆ దాచిన‌ జీవోల‌న్నీ చీక‌టి జీవోల‌న్న‌ట్టేనా? అందులో ప్ర‌జా ప్ర‌యోజ‌నాల‌కు విఘాతం క‌లిగించే అంశాలు దాగున్న‌ట్టేనా? అని అనుమానిస్తున్నారు. 

ఇలాంటి ర‌హ‌స్య జీవోల‌పై గ‌తంలోనూ హైకోర్టు ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. జీవోల‌ను ర‌హ‌స్యం, అతి ర‌హ‌స్యం అని ఎలా నిర్ణ‌యిస్తార‌ని ప్ర‌భుత్వాన్ని ప్ర‌శ్నించింది. అన్ని జీవోల వివ‌రాల‌ను ఇవ్వాల‌ని సూచించింది. ర‌హ‌స్య జీవోల స‌మాచారం ఇవ్వాల‌ని ఆదేశించ‌గా.. తాజాగా ప్ర‌భుత్వం కౌంట‌ర్ ఫైల్ చేసింది.  

ప్రభుత్వ ఉత్తర్వులు జీవోఎంఎస్‌, జీవోఆర్‌టీ, పి... అనే మూడు కేటగిరీలలో జారీ చేస్తోంది. ఇందులో జీవోఆర్‌టీ, జీవోఎంఎ్‌సల వివరాల గురించే ఆ ఆఫిడవిట్‌లో పేర్కొంది. ఎన్ని జీవోలపై ‘గోప్యత’ ముసుగు వేశారో చెప్పలేదు. ఆస‌క్తిక‌ర విష‌యం ఏంటంటే.. ప్రజలందరికీ తెలియాల్సిన అనేక విధాన పరమైన నిర్ణయాల జీవోలను కూడా ప్రజల దృష్టికి తేవడం లేదు. అందులో కొన్ని...

--కరోనా సమయంలో రాత్రి కర్ఫ్యూలను అమలు చేస్తున్నారు. ఫలానా తేదీ నుంచి, ఫలానా సమయాల్లో కర్ఫ్యూ అమలులో ఉండాలని... ప్రజలందరికీ తెలియాలి కదా! ఈ జీవోలను కూడా గెజిట్‌లో అప్‌లోడ్‌ చేయడంలేదు.

--వైద్య, ఆరోగ్యశాఖలో ఉద్యోగుల బదిలీలకు జనవరి 29న జీవో 40ని జారీ చేశారు. లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులను ప్రభావితం  చేసే అంశమిది. నేటి వరకు ఈ జీవోను గెజిట్‌లో పొందుపరచలేదు.  

--రాష్ట్రంలో పలుచోట్ల పేదలు ప్రభుత్వ భూములను ఆక్రమించుకొని ఇళ్లు కట్టుకొని నివసిస్తున్నారు. అభ్యంతరం లేని ప్రభుత్వ భూములను క్రమబద్దీకరిస్తామని ప్రభుత్వం గత ఏడాది ఆగస్టు 23న జీవో 225 జారీ చేసింది. అందులో ఉచిత క్రమబద్దీకరణ పరిమితి 100 గజాల నుంచి 75 గజాలకు కుదించారు. దీనిపై ప్రజావ్యతిరేకత వస్తుందని అసలు విషయాన్ని సీక్రెట్‌గా పెట్టి జీవో 225 ప్రకారం క్రమబద్ధీకరిస్తామని ప్రచారం చేసుకుంటున్నారు. కానీ ఆ జీవోలో ఏముందో ఈ రోజుకూ ప్రజలకు తెలియదు. 

--ఆర్థిక వనరులను సమకూర్చుకునేందుకు ప్రభుత్వ భూములను వేలం వేయకూడదన్న జీవోను సవరిస్తూ... గత ఏడాది సెప్టెంబరు 13న సవరించి గుట్టుగా జీవో 243ని జారీ చేసింది. దీనినీ చీకట్లోనే ఉంచారు.

--గత ఐదున్నర నెలల కాలంలో ఐఏఎస్‌ల బదిలీలపై జారీ చేసిన జీవోల్లో చాలా వరకు గెజిట్‌లో అప్‌లోడ్‌చేయలేదు. తమ కలెక్టరు ఎవరు? తమ సంక్షేమం చూసే అధికారి ఎవరో తెలుసుకునే హక్కు ప్రజలకు లేదా?

గ‌తేడాది ఆగ‌స్ట్ 15 నుంచి ఆన్‌లైన్లో కాకుండా మాన్యువ‌ల్ రిజిస్ట‌ర్స్‌లో ర‌హ‌స్య జీవోల‌ను రికార్డు చేస్తున్నందున‌.. ఆ మేర‌కు మొత్తం 99 రిజిస్ట‌ర్స్‌ను కోర్టు ముందుకు తీసుకువ‌స్తేగానీ అస‌లు వాస్త‌వాలు బ‌య‌ట‌కు రావ‌ని అంటున్నారు. ర‌హ‌స్య జీవోల గుట్టు ర‌ట్టు చేస్తున్న పిటిష‌న‌ర్ కంఠంనేని ర‌విశంక‌ర్‌ను, ఆయ‌న తర‌ఫున బ‌ల‌మైన వాద‌న‌లు వినిపిస్తున్న ప్ర‌ముఖ లాయ‌ర్ ఉమేశ్‌చంద్ర‌ను అంతా అభినందిస్తున్నారు. 
 

By
en-us Political News

  
తెలుగువన్ వాస్తవ వేదికలో ప్రస్తుత జాతీయ, ప్రాంతీయ రాజకీయ పరిస్థితులపై విస్తృత చర్చ జరిగింది.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆ రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనాన్ని సృష్టించాయి.
టీవీకే అధినేత విజయ్‌తో భేటీ అనంతరం రాజ్ భవన్ ఒక అధికారిక ప్రెస్ నోట్ విడుదల చేసింది. అసెంబ్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే ఉండాల్సిన సంఖ్యాబలంపై గవర్నర్.. విజయ్‌కు మార్గనిర్దేశం చేశారు. కేవలం అతిపెద్ద పార్టీగా ఉండటమే కాకుండా, సభలో తగినంత మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్నట్లు ఆధారాలు చూపాలని సూచించారు.
పిఠాపురంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో చంద్ర‌బాబు ఫొటోలేద‌ని ఆరోపిస్తూ.. మాజీ ఎమ్మెల్యే వ‌ర్మ అధికారుల‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఈ క్ర‌మంలో జ‌న‌సేన నేత‌, మాజీ ఎమ్మెల్యే దొర‌బాబు జోక్యం చేసుకోవ‌డంతో వాగ్వాదం చోటు చేసుకుంది. వ‌ర్మ దురుసు వ్యాఖ్య‌ల‌పై పార్టీలో అంత‌ర్గ‌తంగా చ‌ర్చించిన అధిష్టానం.. వ‌ర్మ వ్య‌వ‌హారాన్ని త‌ప్పుబ‌ట్టింది. ఇంతలోనే వర్మను ఇంచార్జ్ పదవి నుంచి తొలగించడం చర్చనీయాంశంగా మారింది.
రాష్ట్రంలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు డీఎంకే ఏ విధంగానూ అడ్డుపడబోదన్నారు. రాష్ట్రంలో మరోసారి ఎన్నికలు రావాలని గానీ, రాజ్యాంగ సంక్షోభం తలెత్తాలనీ కానీ తాము కోరుకోవడం లేదన్నఆయన.. ప్రజాతీర్పునకు అనుగుణంగానే డీఎంకే నడుచుకుంటున్నదన్నారు.
గతంలో విజయ్‌కు ఉన్న ప్రాణహాని హెచ్చరికలు.. ఆయన పాపులారిటీని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం సాయుధ పోలీసులతో కూడిన భద్రతను ఏర్పాటు చేసింది. అయితే.. తాజాగా నిర్వహించిన భద్రతా సమీక్షలో భాగంగా ఆయనకు ఇకపై అదనపు సెక్యూరిటీ అవసరం లేదని అధికారులు భావించినట్లు తెలుస్తోంది.
తాజా ఎన్నికల ఫలితాల్లో నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) 108 స్థానాలతో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించిన సంగతి తెలిసిందే. అయితే.. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 118 మంది ఎమ్మెల్యేల మద్దతు ఆ పార్టీకి ఇంకా లభించలేదు. కాంగ్రెస్‌తో కలిపి విజయ్ బలం ప్రస్తుతం 112కు చేరినప్పటికీ.. మేజిక్ ఫిగర్‌కు ఇంకా ఆరు అడుగుల దూరంలో ఉంది.
తమిళనాడు రాజకీయాల్లో పెను మార్పులు చోటుచేసుకుంటున్న వేళ
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించడంలో సువేందు కీ రోల్ పోషించారు. ఆ పార్టీ 206 స్థానాల్లో గెలిచి బెంగాల్‌లో తొలిసారిగా అధికారం చేపట్టబోతోంది. బీజేపీ తరఫున రెండు స్ధానాల నుంచి బరిలోకి దిగిన సువేందు అధికారి.. మరోసారి మమతా బెనర్జీని ఓడించారు. భవానిపూర్‌లో దీదీపై గెలిచిన ఆయన.. తన సొంత నియోజకవర్గమైన నందిగ్రామ్‌లోనూ గెలిచి పట్టు నిలుపుకున్నారు.
ముఖ్యంగా అస్సాం, పశ్చిమబెంగాల్ లో బీజేపీ ఎన్నికల సంఘం సహకారంతో ఫలితాలను చోరీ చేసిందన్నారు.
పశ్చిమబెంగాల్‌లో మూడున్నర దశాబ్దాల ఏళ్ల సీపీఎం పాలనకు బ్రేక్ వేసి 2011లో అధికార పగ్గాలు చేపట్టిన తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్టీ.. 2026 వరకు వరుస విజయాలతో ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఆమె 15 ఏళ్ల ఆధిపత్యానికి ఎన్డీఏ తెర దించింది. మమతా సైతం కాంగ్రెస్‌లో కేంద్రమంత్రిగా, పలు కీలక పదవులు నిర్వహించి, తర్వాత సొంత కుంపటి పెట్టుకున్న నాయకురాలే కావడం గమనార్హం.
ప్రజా సమస్యలపై స్పష్టమైన అజెండాతో ఎన్నికల బరిలోకి దిగిన విజయ్‌ను తమిళ ప్రజలు ఆదరించడం శుభపరిణామమన్నారు.
తన పార్టీ స్థాపించిన నాటి నుండి నేటి వరకు ఆయన సాగించిన ప్రయాణం ఒక అద్భుతమైన రాజకీయ థ్రిల్లర్‌ను తలపిస్తుంది. ఎన్నికల ప్రచార సమయంలో విజయ్ అనేక ఆటంకాలను ఎదుర్కొన్నారు. ప్రత్యర్థి పార్టీల నుండి వచ్చిన తీవ్ర విమర్శలు, అధికార యంత్రాంగం విధించిన ఆంక్షలు ఆయనను ఉక్కిరిబిక్కిరి చేశాయి. వ్యక్తిగత జీవితంపై జరిగిన దుష్ప్రచారం విజయ్ ఇమేజ్‌ను దెబ్బతీస్తుందని అందరూ భావించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.