తెలంగాణ రాజకీయాలలో ఇప్పుడు ఎన్నికలకు మించిన హీట్ పుట్టిస్తున్న విషయం ఏదైనా ఉందా అంటే అది ఫోన్ ట్యాపింగ్ కేసు మాత్రమే. ఈ కేసు దర్యాప్తు రోజురోజుకూ కీలక మలుపులు తిరుగుతోంది. రోజు కొకరు చొప్పున తామూ ఫోన్ ట్యాపింగ్ బాధితులమే అంటూ తెరమీదకు వస్తున్నారు. బీఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఇప్పటికే తన ఫోన్ కూడా ట్యాప్ అయ్యిందని ఆరోపించగా, తాజాగా బీజేపీ మల్కాజ్ గిరి లోక్ సభ నియోజకవర్గ అభ్యర్థి ఈటల రాజేందర్ బీఆర్ఎస్ హయాంలో ఫోన్ ట్యాపింగ్ బాధితుల్లో మొదటి వాడిని తానేనని చెప్పారు.
ఇక ఈ కేసు దర్యాప్తులో పోలీసులు దూకుడు పెంచడంతో రోజు రోజుకూ ఈ కేసులో అరెస్టుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా ఇద్దరు పోలీసులు అరెస్టయ్యారు. ఇక ఈ కేసులో అరెస్టయిన వారి నుంచి రాబట్టిన సమాచారంతో కొత్త కొత్త పేర్లు తెరమీదకు వస్తున్నాయి. దర్యాప్తులో భాగంగా పోలీసులు తీగలాగుతుంటే డొంక కదులుతోంది.
తాజాగా పోలీసులు సోమవారం ( ఏప్రిల్ 8) జూబ్లీ హిల్స్ లోని ఓ గెస్టు హౌస్ లో సోదాలు చేపట్టారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టయిన వారి నుంచి రాబట్టిన సమాచారం ఆధారంగానే ఈ సోదాలు నిర్వహించినట్లు తెలుస్తోంది. పోలీసులు సోదాలు చేపట్టిన గెస్ట్ హౌస్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డ నివాసానికి సమీపంలో ఉంది. అప్పట్లో అంటే బీఆర్ఎస్ హయాంలో ఫోన్ ట్యాపింగ్ కోసం ఈ గెస్ట్ హౌస్ లోనే వార్ రూమ్ ఏర్పాటు చేసినట్లు అనుమానిస్తున్నారు. కాగా విశ్వసనీయ సమాచారం మేరకు ఈ గెస్ట్ హౌస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేదని తెలుస్తోంది. త్వరలోనే ఆ ఎమ్మెల్సీని కూడా పోలీసులు విచారించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/phone-tapping-case-police-raid-brs-mlc-guest-house-25-173442.html
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించడంలో సువేందు కీ రోల్ పోషించారు. ఆ పార్టీ 206 స్థానాల్లో గెలిచి బెంగాల్లో తొలిసారిగా అధికారం చేపట్టబోతోంది. బీజేపీ తరఫున రెండు స్ధానాల నుంచి బరిలోకి దిగిన సువేందు అధికారి.. మరోసారి మమతా బెనర్జీని ఓడించారు. భవానిపూర్లో దీదీపై గెలిచిన ఆయన.. తన సొంత నియోజకవర్గమైన నందిగ్రామ్లోనూ గెలిచి పట్టు నిలుపుకున్నారు.
ముఖ్యంగా అస్సాం, పశ్చిమబెంగాల్ లో బీజేపీ ఎన్నికల సంఘం సహకారంతో ఫలితాలను చోరీ చేసిందన్నారు.
పశ్చిమబెంగాల్లో మూడున్నర దశాబ్దాల ఏళ్ల సీపీఎం పాలనకు బ్రేక్ వేసి 2011లో అధికార పగ్గాలు చేపట్టిన తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్టీ.. 2026 వరకు వరుస విజయాలతో ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఆమె 15 ఏళ్ల ఆధిపత్యానికి ఎన్డీఏ తెర దించింది. మమతా సైతం కాంగ్రెస్లో కేంద్రమంత్రిగా, పలు కీలక పదవులు నిర్వహించి, తర్వాత సొంత కుంపటి పెట్టుకున్న నాయకురాలే కావడం గమనార్హం.
ప్రజా సమస్యలపై స్పష్టమైన అజెండాతో ఎన్నికల బరిలోకి దిగిన విజయ్ను తమిళ ప్రజలు ఆదరించడం శుభపరిణామమన్నారు.
తన పార్టీ స్థాపించిన నాటి నుండి నేటి వరకు ఆయన సాగించిన ప్రయాణం ఒక అద్భుతమైన రాజకీయ థ్రిల్లర్ను తలపిస్తుంది. ఎన్నికల ప్రచార సమయంలో విజయ్ అనేక ఆటంకాలను ఎదుర్కొన్నారు. ప్రత్యర్థి పార్టీల నుండి వచ్చిన తీవ్ర విమర్శలు, అధికార యంత్రాంగం విధించిన ఆంక్షలు ఆయనను ఉక్కిరిబిక్కిరి చేశాయి. వ్యక్తిగత జీవితంపై జరిగిన దుష్ప్రచారం విజయ్ ఇమేజ్ను దెబ్బతీస్తుందని అందరూ భావించారు.
తమిళనాడులో టీవీకే పార్టీ విజయాన్నిస్వాగతిస్తూ.. వైసీపీ సోషల్ మీడియా వేదికగా సంబరాలు మొదలు పెట్టింది. విజయ్ సాధించిన ఈ అద్భుత విజయం వెనుక వైసీపీ అధినేత జగన్ సహకారం ఉందంటూ వైసీపీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా గతంలో ఒక వివాహ వేడుకలో వైఎస్ జగన్, విజయ్ ఇద్దరూ కలిసి దిగిన ఒక ఫోటోను ఇప్పుడు వైసీపీ నెట్టింట వైరల్ చేస్తోంది.
ఈ ఎన్నికల ఫలితాల్లో విజయ్ టవీకే పార్టీ స్పష్టమైన ఆధిక్యత కనబరిచింది. ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు, కూటమి పక్షాల మధ్య సరైన సమన్వయం లేకపోవడం కూడా ఈ ఓటమికి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి.
1982లో తెలుగువారి ఆత్మగౌరవం నినాదంతో తెలుగుదేశం పార్టీని స్థాపించిన ఎన్టీఆర్, కేవలం 9 నెలల కాలంలోనే రాష్ట్రమంతటా పర్యటించి ప్రభంజనం సృష్టించారు. 1983 ఎన్నికల్లో కాంగ్రెస్ వంటి బలమైన పార్టీని మట్టికరిపించి, తొలి ప్రయత్నంలోనే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించి రికార్డ్ సృష్టించారు.
భారత రాజకీయ యవనికపై భారతీయ జనతా పార్టీ తన ఉనికిని మరింత శక్తివంతం చేస్తోంది.
చారిత్రాత్మక విజయం ఖాయమని తేలడంతో.. విజయం అభిమానుల సంబరాలు మిన్నంటాయి. అయితే.. ఈ నేపథ్యంలో సినీ నటి త్రిష పేరు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.
ఈ నియోజకవర్గం నుంచిఎన్డీయూ కూటమి అభ్యర్థి మల్లాడి కృష్ణారావు విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి గొల్లపల్లి అశోక్ పై నాలుగువేల ఐదు వందల ఓట్ల పైచిలుకు మెజారిటీతో గెలుపొందారు.
ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయే కూటమి సాధించిన ఘన విజయంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు.
తట్టంచావడి నియోజకవర్గం నుంచి ఆయన భారీ మెజారిటీతో విజయం సాధించారు. ఆయన పోటీ చేసిన మరో స్థానమైన మంగళంలోనూ భారీ ఆధిక్యంలో కొనసాగుతున్నారు.