Publish Date:Jun 22, 2025
ట్యాపింగ్ వ్యవహారం కేసీఆర్ అండ్ కోని మరింతగా వెంటాడేలా తెలుస్తోంది. రీసెంట్ గా ప్రణీత్ రావును విచారించింది సిట్. ఆరు వందల మంది ప్రొఫైల్స్ ఎలా తయారు చేశారు. వారి ఫోన్లు విని ఏం చేశారు? ఆ సమాచారం ఎక్కడికి చేరవేసేవారు?లాంటి ప్రశ్నలతో పలు వివరాలను సేకరించారు. అయితే వీటితో సోమవారం ప్రభాకర్ రావును మరింతగా విచారించనున్నారు. ప్రభాకర్ రావు నుంచి ఎలాంటి ప్రశ్నలకు సమాధానం రాబట్టాల్సి ఉందో వాటికి అవసరమైన ప్రశ్నలు వేసి ప్రణీత్ నుంచి సమాధానాలు రాబట్టారు అధికారులు. మావోయిస్టులతో సంబంధం లేక పోయిన వారిని కూడా ఈ కోవలోకి ఎలా తెచ్చారు? అందుకు మీరు పాటించిన ప్రమాణికాలేంటని కూడా ప్రశ్నించారు. మొత్తానికి ఐదవ సారి సిట్ అధికారుల ముందు హాజరైన ప్రణీత్ రావును ఐదు గంటల మేర ప్రశ్నించారు.
ప్రణీత్ ఇచ్చిన సమాధానాలను అనుసరించి ప్రభాకర్ రావును సోమవంరం ప్రశ్నించనున్నారు. రివ్యూ కమిటీ ఆమోదం, తనపై ఉన్న ఇతర ఉన్నతాధికారుల సూచనల మేరకే తాను పని చేశానని అన్నారు ప్రభాకరరావు, దీంతో నాటి రివ్యూ కమిటీ అధికారుల వివరాలు కూడా బయటకు లాగి తద్వారా వారిని కూడా విచారించనుంది సిట్. ఇప్పటికే 15 మంది బాధితులను విచారించిన సిట్.. ఆపై వారి నుంచి తీసుకున్న వివరాలతోనూ ప్రభాకర్ రావును విచారించనుంది. గత పాలకుల ఆదేశాల మేరకే ప్రభాకర్ రావు ఇదంతా చేసినట్టు చెబుతున్నా.. కేసీఆర్ కి ఇంకా నోటీసులు ఎందుకివ్వలేదో చెప్పాలని అడిగారు కేంద్ర మంత్రి బండి సంజయ్, కాంగ్రెస్ బీఆర్ఎస్ కుమ్మక్కయ్యిందని ఇక్కడే మీకు అర్ధం కావడం లేదా? అని ప్రశ్నించారాయన. మొదట ప్రభాకర్ రావుకు ఇచ్చే ఆ రాచమర్యాదలను తగ్గించాలని కూడా డిమాండ్ చేశారాయన.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/phone-tapping-case-39-200434.html
ఆన్లైన్ బెట్టింగ్ యాప్ల ప్రచారానికి పాల్పడిన పలువురు నటులు, సామాజిక మాధ్యమ ఇన్ ఫ్లుయెన్సర్లపై ఈడీ కేసుల కొరడా ఝుళిపించింది.
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతున్నది. గురువారం (జులై 10) ఉదయం శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో 29 కంపార్ట్ మెంట్లు నిండి ఉన్నాయి.
నటుడు ఫిష్ వెంకట్ చికిత్సకు అయ్యే మొత్తం వ్యయాన్ని తెలంగాణ ప్రభుత్వం భరించేందుకు ముందుకు వచ్చింది. గత కొంత కాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ ఆస్పత్రిలో వెంటిలేటర్ పై ఉన్న ఫిష్ వెంకట్ చికిత్సకు అయ్యే వ్యయాన్ని తెలంగాణ ప్రభుత్వం భరిస్తుందని మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు.
తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఒక జర్నలిస్టు బలవన్మరణానికి పాల్పడ్డారు.
గత తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కె. చంద్రశేఖర్ రావు, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మధ్య ఉన్న అనుబంధం కారణంగా తెలంగాణకు పూడ్చలేని నష్టం జరిగిందని సీఎం రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శించారు.
ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ నాయకత్వ బాధ్యతల్లో కీలక మార్పులు చేసింది. చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ జెఫ్ విలియమ్స్ కంపెనీని వీడనుండటంతో.. సీఈవో టిమ్కు కుక్కు అదనపు బాధ్యతలను అప్పగించింది.
గుజరాత్ రాష్ట్రంలో ఘోర ప్రమాదం జరిగింది. గుజరాత్ వడోదరాలోని మహిసాగన్ నదిపై ఉన్న గంభీర బ్రిడ్జి ఒక్కసారిగా కూలింది.
గుంటూరు జిల్లా తెనాలిలోని శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి వారి వైకుంఠపురం దేవస్థానంలో బుధవారం జరిగిన హుండీల లెక్కింపులో రద్దైన పాత రూ.1000, రూ.500 నోట్లు ప్రత్యక్షమయ్యాయి.
గుంటూరు జిల్లా తెనాలి మండలం కొలకలూరు గ్రామం గల గంగా పార్వతి సమేత అగస్తేశ్వర స్వామి ఆలయంలో మంగళవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు దొంగతనానికి పాల్పడినట్లు ఆలయ అర్చకులు తెలిపారు.
తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఎరువుల కొరత లేకుండా రాష్ట్రానికి సహకరిస్తామని తెలిపింది. యూరియా కోటా పెంచాలంటూ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కేంద్రానికి ఇటీవల విజ్ఞప్తి చేశారు.
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ జగన్మోహన్ రావును సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారు. ఐపీఎల్ టికెట్ల వివాదంలో విజిలెన్స్ నివేదికతో చర్యలు ప్రారంభించారు.
సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ భేటీలో ప్రభుత్వం రైతాంగానికి తీపి కబురు చెప్పింది. బుధవారం (జులై 9) వెలగపూడిలోని సచివాలయంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో ధాన్యం పాత బకాయిలు రూ.1000 కోట్లలో రూ. 672 కోట్ల నిధులు విడుదల చేయాలని నిర్ణయించింది.
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం వేగంగా సాగుతోంది. తొలి అడుగుగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల క్వార్టర్ల నిర్మాణం తుది దశకు వచ్చింది. నియోజకవర్గాల పునర్విభజనను దృష్టిలో ఉంచుకుని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల నివాస సముదాయాలను వినూత్నంగా అభివృద్ధి చేస్తున్నారు.