Publish Date:Jun 24, 2025
ఫోన్ ట్యాపింగ్ కేసులో మల్కాజిగిరి బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ సిట్ అధికారుల ముందు హాజరయ్యారు. విచారణ అనంతరం ఈటల మీడియాతో మాట్లాడుతు ఫోన్ ట్యాపింగ్ విచారణ ఇంకా ఎంతకాలం చేస్తారని ఎంపీ ప్రశ్నించారు. హుజురాబాద్ బై ఎలక్షన్ సమయంలో తన ఫోన్ అనేక సార్లు ట్యాప్ చేశారని అన్నారు. నేను, నా భార్య మాట్లాడుకునే సంభాషణలు కూడా విన్నారని నాయకుల ఫోన్లను మాత్రమే కాకుండా వారి గన్ మెన్ల ఫోన్లను కూడా ట్యాప్ చేశారన్నారు. 2018లో తాను ప్రభుత్వంలో ఉన్నప్పుడే తనను ఓడించే ప్రయత్నం జరిగిందన్నారు. గత బీఆర్ఎస్ హయాంలో మాజీ సీఎం కేసీఆర్ తనకు అనుకులంగా పనిచేసే వారిని ఉన్నత స్థాయిలో నియమించుకున్నారని తెలిపారు.
ట్యాపింగ్ కేసులో ఎవరు ఉన్న ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని ఈటల డిమాండ్ చేశారు. 2023లో గజ్వెల్లో, హుజురాబాద్లో పోటీ చేసినప్పుడు తమ ఫోన్లు ట్యాప్ చేశారన్నారు. ఎస్ఐబీ చీఫ్గా ప్రభాకర్ రావు నియామకం అక్రమం అని చెప్పారు. గత బీఆర్ఎస్ హయాంలో జరిగిన అక్రమాలపై కమిటీలు వేస్తున్న ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ఈటల రాజేందర్ ప్రశ్నించారు. ఎందుకు నివేధికలను బయటపెట్టడంలేదని అడిగారు. రాజ్యాంగం కల్పించిన స్వేచ్ఛ హక్కును ఆటంకం కలిగించే హక్కు ఎవరికీ లేదని అన్నారు. సంఘవిద్రోహ శక్తులు కాకుండా నాయకులు ఫోన్లు ట్యాపింగ్ చేయడం దారుణమని చెప్పారు. ఎన్నికల్లో గెలిచే దమ్ములేకే ఫోన్ ట్యాపింగ్ చేశారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరంలో విచారణ కమిటీ వేశారు కానీ దర్యాప్తు వేగంగా జరగడం లేదని ఎంపీ ఈటల పేర్కొన్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/phone-tapping-case-39-200569.html
పాతబస్తీలోని సిటీ సివిల్ కోర్టుకు బాంబు బెదరింపు వచ్చింది. కోర్టు మొత్తాన్ని బాంబులతో పేల్చేస్తామన్న బెదరింపుతో భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు.
ఔను.. చాలా మంది అభిప్రాయం ఇదే. వైసీపీ అధినేత జగన్, జనసేనాని పవన్ ప్రసంగాలలో విషయం కంటే అతిశయం ఎక్కువగా ఉంటుందన్న భావన చాలా మందిలో వ్యక్తం అవుతుంటుంది.
దేశవ్యాప్తంగా అందరికీ తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి వైభవాన్ని అర్థమయ్యేలా తెలియజేయాలని తిరుమల తిరుపతి దేవస్థానం నిర్ణయించింది. ఇందు కోసం పుస్తక ప్రచురణకు శ్రీకారం చుట్టింది.
క్రీడా రంగ ప్రముఖుడు, 1983 వరల్డ్ కప్ విజేతగా నిలిచిన భారత జట్టు కెప్టెన్ కపిల్ దేవ్ కూడా ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో సోమవారం (జులై 7) భేటీ అయ్యారు. ఈ సందర్భంగా హైదరాబాద్ లో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన స్పోర్ట్స్ వర్సిటీ ఏర్పాటుపై ఆయన సీఎంతో చర్చించారు.
తెలంగాణలో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో కూడిన ఫిల్మ్ స్టూడియో ఏర్పాటుకు అవకాశం కల్పించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రముఖ సినీ నటుడు అజయ్ దేవగణ్ విజ్ఞప్తి చేశారు. ఢిల్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆయన అధికారిక నివాసంలో అజయ్ దేవగణ్ సోమవారం (జులై7) కలిశారు.
తమిళనాడులో ఘోర ప్రమాదం జరిగింది. పట్టాలు దాటుతున్న ఓ స్కూలు బస్సును రైలు ఢీ కొంది. ఈ దుర్ఘటనలో ముగ్గురు విద్యార్థులు సంఘటనా స్థలంలోనే మరణించారు.
వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి నివాసంపై సోమవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. ఇంట్లో ఫర్నీచర్ ధ్వంసం చేశారు.
రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఒకే రోజు ఇద్దరు సినీ క్రీడా సెలబ్రిటీలను కలిశారు. వారిలో ఒకరు 1983 వరల్డ్ కప్ విజేత లెజండరీ క్రికెటర్ కపిల్ దేవ్ కాగా. మరొకరు నటుడు, నిర్మాత అజయ్ దేవ్ గన్.
ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది. కీరవాణి తండ్రి శివశక్తిదత్తా సోమవారం (జులై 7) రాత్రి కన్నుమూశారు. ఆయన వయస్సు 93 సంవత్సరాలు.
శ్రీశైలం జలాశయం పూర్తి స్థాయి నీటిమట్టానికి చేరువలో ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మంగళవారం (జులై 6) శ్రీశైలం డ్యామ్ గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేయనున్నారు.
ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ నెల్లూరులోని బారా షాహీద్ దర్గాను సందర్శించి ప్ర్తత్యేక ప్రార్ధనలో పాల్గొన్నారు. అదే విధంగా రొట్టెల పండుగ కార్యక్రమంలో కూడా పాల్గొన్నారు.
అమెరికాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకే కుుటుంబానికి చెందిన నలుగురు హైదరాబాదీయులు మృతి చెందారు.
గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కు పార్టీ తలుపులు శాశ్వతంగా మూసుకు పోతున్నాయా? పార్టీకి రాజీనామా చేసి.. మీకో దండం, మీ పార్టీకో దండం అంటూ శ్యామాప్రసాద్ ముఖర్జీ భవన్ (బీజేపీ స్టేట్ ఆఫీస్) మెట్లు దిగివచ్చిన రాజాసింగ్ మళ్ళీ ఆ మెట్లు ఎక్కను అంటూ చేసిన ప్రతిజ్ఞను పార్టీ సీరియస్ గా తీసుకుందా?