Publish Date:Jun 22, 2025
ట్యాపింగ్ వ్యవహారం కేసీఆర్ అండ్ కోని మరింతగా వెంటాడేలా తెలుస్తోంది. రీసెంట్ గా ప్రణీత్ రావును విచారించింది సిట్. ఆరు వందల మంది ప్రొఫైల్స్ ఎలా తయారు చేశారు. వారి ఫోన్లు విని ఏం చేశారు? ఆ సమాచారం ఎక్కడికి చేరవేసేవారు?లాంటి ప్రశ్నలతో పలు వివరాలను సేకరించారు. అయితే వీటితో సోమవారం ప్రభాకర్ రావును మరింతగా విచారించనున్నారు. ప్రభాకర్ రావు నుంచి ఎలాంటి ప్రశ్నలకు సమాధానం రాబట్టాల్సి ఉందో వాటికి అవసరమైన ప్రశ్నలు వేసి ప్రణీత్ నుంచి సమాధానాలు రాబట్టారు అధికారులు. మావోయిస్టులతో సంబంధం లేక పోయిన వారిని కూడా ఈ కోవలోకి ఎలా తెచ్చారు? అందుకు మీరు పాటించిన ప్రమాణికాలేంటని కూడా ప్రశ్నించారు. మొత్తానికి ఐదవ సారి సిట్ అధికారుల ముందు హాజరైన ప్రణీత్ రావును ఐదు గంటల మేర ప్రశ్నించారు.
ప్రణీత్ ఇచ్చిన సమాధానాలను అనుసరించి ప్రభాకర్ రావును సోమవంరం ప్రశ్నించనున్నారు. రివ్యూ కమిటీ ఆమోదం, తనపై ఉన్న ఇతర ఉన్నతాధికారుల సూచనల మేరకే తాను పని చేశానని అన్నారు ప్రభాకరరావు, దీంతో నాటి రివ్యూ కమిటీ అధికారుల వివరాలు కూడా బయటకు లాగి తద్వారా వారిని కూడా విచారించనుంది సిట్. ఇప్పటికే 15 మంది బాధితులను విచారించిన సిట్.. ఆపై వారి నుంచి తీసుకున్న వివరాలతోనూ ప్రభాకర్ రావును విచారించనుంది. గత పాలకుల ఆదేశాల మేరకే ప్రభాకర్ రావు ఇదంతా చేసినట్టు చెబుతున్నా.. కేసీఆర్ కి ఇంకా నోటీసులు ఎందుకివ్వలేదో చెప్పాలని అడిగారు కేంద్ర మంత్రి బండి సంజయ్, కాంగ్రెస్ బీఆర్ఎస్ కుమ్మక్కయ్యిందని ఇక్కడే మీకు అర్ధం కావడం లేదా? అని ప్రశ్నించారాయన. మొదట ప్రభాకర్ రావుకు ఇచ్చే ఆ రాచమర్యాదలను తగ్గించాలని కూడా డిమాండ్ చేశారాయన.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/phone-tapping-case-39-200434.html
క్రీడా రంగ ప్రముఖుడు, 1983 వరల్డ్ కప్ విజేతగా నిలిచిన భారత జట్టు కెప్టెన్ కపిల్ దేవ్ కూడా ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో సోమవారం (జులై 7) భేటీ అయ్యారు. ఈ సందర్భంగా హైదరాబాద్ లో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన స్పోర్ట్స్ వర్సిటీ ఏర్పాటుపై ఆయన సీఎంతో చర్చించారు.
తెలంగాణలో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో కూడిన ఫిల్మ్ స్టూడియో ఏర్పాటుకు అవకాశం కల్పించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రముఖ సినీ నటుడు అజయ్ దేవగణ్ విజ్ఞప్తి చేశారు. ఢిల్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆయన అధికారిక నివాసంలో అజయ్ దేవగణ్ సోమవారం (జులై7) కలిశారు.
తమిళనాడులో ఘోర ప్రమాదం జరిగింది. పట్టాలు దాటుతున్న ఓ స్కూలు బస్సును రైలు ఢీ కొంది. ఈ దుర్ఘటనలో ముగ్గురు విద్యార్థులు సంఘటనా స్థలంలోనే మరణించారు.
వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి నివాసంపై సోమవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. ఇంట్లో ఫర్నీచర్ ధ్వంసం చేశారు.
రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఒకే రోజు ఇద్దరు సినీ క్రీడా సెలబ్రిటీలను కలిశారు. వారిలో ఒకరు 1983 వరల్డ్ కప్ విజేత లెజండరీ క్రికెటర్ కపిల్ దేవ్ కాగా. మరొకరు నటుడు, నిర్మాత అజయ్ దేవ్ గన్.
ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది. కీరవాణి తండ్రి శివశక్తిదత్తా సోమవారం (జులై 7) రాత్రి కన్నుమూశారు. ఆయన వయస్సు 93 సంవత్సరాలు.
శ్రీశైలం జలాశయం పూర్తి స్థాయి నీటిమట్టానికి చేరువలో ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మంగళవారం (జులై 6) శ్రీశైలం డ్యామ్ గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేయనున్నారు.
ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ నెల్లూరులోని బారా షాహీద్ దర్గాను సందర్శించి ప్ర్తత్యేక ప్రార్ధనలో పాల్గొన్నారు. అదే విధంగా రొట్టెల పండుగ కార్యక్రమంలో కూడా పాల్గొన్నారు.
అమెరికాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకే కుుటుంబానికి చెందిన నలుగురు హైదరాబాదీయులు మృతి చెందారు.
గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కు పార్టీ తలుపులు శాశ్వతంగా మూసుకు పోతున్నాయా? పార్టీకి రాజీనామా చేసి.. మీకో దండం, మీ పార్టీకో దండం అంటూ శ్యామాప్రసాద్ ముఖర్జీ భవన్ (బీజేపీ స్టేట్ ఆఫీస్) మెట్లు దిగివచ్చిన రాజాసింగ్ మళ్ళీ ఆ మెట్లు ఎక్కను అంటూ చేసిన ప్రతిజ్ఞను పార్టీ సీరియస్ గా తీసుకుందా?
మంత్రి నారా లోకేష్ సోమవారం (జులై 7) నెల్లూరులో వీఆర్ హై స్కూల్ను ప్రారంభించారు. ఆ తరువాత స్కూలులోని అన్ని క్లాస్ రూమ్ లను సందర్శించి ప్రతి క్లాసులోనూ విద్యార్థులతో ఇంటరాక్ట్ అయ్యారు.
తిరుపతిలో దారుణం చోటు చేసుకుంది. అలిపిరి సమీపంలోని కపిలతీర్ధం రోడ్డులో ఒక సైకో వీరంగం కలకలం సృష్టించింది. చేతిలో కత్తి, కర్రతో ఆ సైకో దారిన వచ్చీపోయేవారిపై ఇష్టారీతిగా దాడులకు పాల్పడింది.
డోనాల్డ్ ట్రంప్ మరోసారి సుంకాలు విధిస్తామంటూ హెచ్చరిక జారీ చేశారు. ఈ సారి ఆయన బిక్స్ దేశాలకు ఈ హెచ్చరిక చేశారు. అమెరికా విధానాలను వ్యతిరేకించే, లేదా అమెరికా వ్యతిరేక విధానాలు అవలంబించే దేశాలపై పది శాతనం సుంకాలు పెంచుతాని ట్రంప్ హెచ్చరించారు.