Publish Date:Jun 22, 2025
ట్యాపింగ్ వ్యవహారం కేసీఆర్ అండ్ కోని మరింతగా వెంటాడేలా తెలుస్తోంది. రీసెంట్ గా ప్రణీత్ రావును విచారించింది సిట్. ఆరు వందల మంది ప్రొఫైల్స్ ఎలా తయారు చేశారు. వారి ఫోన్లు విని ఏం చేశారు? ఆ సమాచారం ఎక్కడికి చేరవేసేవారు?లాంటి ప్రశ్నలతో పలు వివరాలను సేకరించారు. అయితే వీటితో సోమవారం ప్రభాకర్ రావును మరింతగా విచారించనున్నారు. ప్రభాకర్ రావు నుంచి ఎలాంటి ప్రశ్నలకు సమాధానం రాబట్టాల్సి ఉందో వాటికి అవసరమైన ప్రశ్నలు వేసి ప్రణీత్ నుంచి సమాధానాలు రాబట్టారు అధికారులు. మావోయిస్టులతో సంబంధం లేక పోయిన వారిని కూడా ఈ కోవలోకి ఎలా తెచ్చారు? అందుకు మీరు పాటించిన ప్రమాణికాలేంటని కూడా ప్రశ్నించారు. మొత్తానికి ఐదవ సారి సిట్ అధికారుల ముందు హాజరైన ప్రణీత్ రావును ఐదు గంటల మేర ప్రశ్నించారు.
ప్రణీత్ ఇచ్చిన సమాధానాలను అనుసరించి ప్రభాకర్ రావును సోమవంరం ప్రశ్నించనున్నారు. రివ్యూ కమిటీ ఆమోదం, తనపై ఉన్న ఇతర ఉన్నతాధికారుల సూచనల మేరకే తాను పని చేశానని అన్నారు ప్రభాకరరావు, దీంతో నాటి రివ్యూ కమిటీ అధికారుల వివరాలు కూడా బయటకు లాగి తద్వారా వారిని కూడా విచారించనుంది సిట్. ఇప్పటికే 15 మంది బాధితులను విచారించిన సిట్.. ఆపై వారి నుంచి తీసుకున్న వివరాలతోనూ ప్రభాకర్ రావును విచారించనుంది. గత పాలకుల ఆదేశాల మేరకే ప్రభాకర్ రావు ఇదంతా చేసినట్టు చెబుతున్నా.. కేసీఆర్ కి ఇంకా నోటీసులు ఎందుకివ్వలేదో చెప్పాలని అడిగారు కేంద్ర మంత్రి బండి సంజయ్, కాంగ్రెస్ బీఆర్ఎస్ కుమ్మక్కయ్యిందని ఇక్కడే మీకు అర్ధం కావడం లేదా? అని ప్రశ్నించారాయన. మొదట ప్రభాకర్ రావుకు ఇచ్చే ఆ రాచమర్యాదలను తగ్గించాలని కూడా డిమాండ్ చేశారాయన.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/phone-tapping-case-39-200434.html
అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టరేట్ ఫైళ్ల దగ్ధం కేసులో మాజీ ఆర్డిఓ మురళిని మంగళవారం తిరుపతి లో సిఐడి అధికారులు అరెస్టు చేశారు.
తిరుమల ఎంప్లాయిస్ గదుల కౌంటర్ వద్ద ఘర్షణ చోటుచేసుకుంది. గదులు కోసం గంటల గంటలు నిరీక్షించిన భక్తులు సమయమనం కోల్పోయి నేరుగా గదులు పొందుతున్న ఉద్యోగులపై రాళ్లదాడి చేశారు.
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఢిల్లీ పర్యటన రెండో రోజు కొనసాగుతుంది. తాజాగా ఇవాళ సీఎం కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ మంత్రి జేపీ నడ్డాతో భేటీ అయ్యారు. తెలంగాణ రాష్ట్ర అవసరాలకు కేటాయించిన యూరియాను సకాలంలో సరఫరా చేయాలని కోరారు.
ఆయనొక మంత్రి. ఈయనా మంత్రే. ఒకరు దేవాదాయం, మరొకరు మున్సిపల్. VRC నెల్లూరు జిల్లాకే అతి పెద్ద చరిత్ర గలిగిన విద్యా సంస్థలుగా పేరుంది. పెద్ద పెద్ద వాళ్లు ఇక్కడ చదువుకున్న వారే అన్న హిస్టరీ సైతం కలిగి ఉందీ ప్రాంగణం.
దలా ఉంటే సముద్రంలో వృధాగా కలిసే జలాలు వినియోగంలోకి తేవడానికి ప్రాజెక్ట్ కట్టుకుంటామంటే అభ్యంతరాలు వ్యక్తం అవుతుండటం విమర్శల పాలవుతోంది.
ఇక.. ప్రతిపక్ష బీఆర్ఎస్ సైతం చంద్రబాబు కేంద్రంగా విమర్శలు గుప్పిస్తోంది.
మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డిని వైసీపీ నుంచి సస్పెండ్ చేయాలని ఏపీ హోం మంత్రి అనిత డిమాండ్ చేశారు. కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి పై అనుచిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో హోం మంత్రి స్పందించారు.
ఏపీ సీఎం చంద్రబాబు శ్రీశైలం జలాశయం నుంచి గేట్లు ఎత్తి దిగువకు నీరు వదిలారు.. దాంతో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతూ నాగార్జునసాగర్ వైపుకు పరుగులు తీస్తున్నది. ఆనకట్టపై రైతులు, మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి 4 గేట్లను ఎత్తి కృష్ణమ్మ ప్రత్యేక పూజలు చేశారు.
ఐదేళ్లు వైసీపీ పాలనలో జిల్లాలో ప్రతిపక్ష పార్టీలు వాటి నాయకులు పర్యటన చేసే పరిస్థితి లేకుండా చేశారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఏ నాయకుడు రావాలన్నా తీవ్ర అడ్డంకులు సృష్టించారు.
సంగారెడ్డి జిల్లా పాశమైలారం సిగాచీ పార్మా ప్యాక్టరీలో డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ బృందం పరిశీలించింది. పేలుడు గల కారణాలపై బృందం అధ్యయనం చేసింది. దీనిపై నివేదికను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు అందజేయనుంది
వన్ నేషన్.. వన్ ఎలక్షన్ నినాదంలో కేంద్రంలోని మోడీ ప్రభుత్వం దేశంలో జమిలి ఎన్నికలకు సిద్ధమౌతున్నది. ఇందు కోసం మాజీ రాష్ట్రపతి రామనాథ్ కోవింద్ నేతృత్వంలో అత్యున్నత స్థాయి కమిటీని వేసి నివేదిక తీసుకుంది.
భద్రాచలం ఆలయ ఈవో రమాదేవిపై పురుషోత్తపట్నం గ్రామస్థులు దాడికి పాల్పడ్డారు. ఆలయ భూముల ఆక్రమణలను అడ్డుకునేందుకు వెళ్లిన ఈవోపై దాడి చేశారు.
దివంగత మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి కి ఆయన కూతురు వైయస్ షర్మిల, కుమారుడు వైయస్ జగన్ లు వేరు వేరుగా నివాళులర్పించారు. గత మూడేళ్ళకు పైగా వారి వద్ద విభేదాలు మరింత పెరిగాయి.
నల్లపు రెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి- ఆరు సార్లు ఎమ్మెల్యే. అంతే కాదు ఆయన తండ్రి నల్లపరెడ్డి శ్రీనివాసులు రెడ్డి అప్పట్లో అతి పెద్ద పొలిటికల్ సెన్సేషన్. ఆ ఇంటి పేరుకొక బ్రాండ్ ఇమేజ్ ఉంది. ఆ మొత్తం ఇమేజీని బురద కాలవలో కలిపేస్తున్నారు మాజీ ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి. కేవలం కోవూరు మాత్రమే కాదు నెల్లూరోళ్ల పరువు మొత్తం పెన్నలో కలిపేస్తున్నారా? అన్న మాట వినిపిస్తోంది.