త్వరలో పెట్రోల్, డీజిల్ ధరలకు రెక్కలు..?

Publish Date:Apr 21, 2026

Advertisement

 

త్వరలోనే పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెరగనున్నాయన్న చర్చతో వినియోగదారుల్లో గుబులు రేగుతోంది. గ్యాస్ ధరలపై స్పష్టత లేకపోయినా.. పెట్రోల్, డీజిల్ ధరల పెంపు మాత్రం తప్పదన్న టాక్ వినిపిస్తోంది. నిజానికి ఇప్పటికే ధరలు పెరగాల్సి ఉన్నా.. ఐదు రాష్ట్రాల ఎన్నికల కారణంగా ఆ భారాన్ని ప్రభుత్వం, ఆయిల్ కంపెనీలు భరిస్తూ వస్తున్నాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఎన్నికలు పూర్తయ్యగానే ధరల పెంపు ఖాయమనే ప్రచారం జోరుగా సాగుతోంది. అమెరికా–ఇరాన్ ఉద్రిక్తతలు, పరస్పర దాడులు, కాల్పుల విరమణ ప్రయత్నాలు, హర్మూజ్ జలసంధి మూసివేత–తెరవడం వంటి పరిణామాల ప్రభావంతో అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు తీవ్రంగా మార్పులకు లోనవుతున్నాయి. 

ఒక దశలో బ్యారెల్ చమురు ధర 120 డాలర్లకు చేరగా.. ఆ తర్వాత 80 డాలర్లకు పడిపోయింది. ప్రస్తుతం 90 నుంచి 100 డాలర్ల మధ్య ఊగిసలాడుతోంది. భారత్ దాదాపు 85 శాతం చమురును దిగుమతి చేసుకుంటుండటంతో ఈ ధరల మార్పులు నేరుగా ప్రభావం చూపుతున్నాయి. ఓపెన్ మార్కెట్‌లో ధరలు పెరుగుతుండటంతో ఆయిల్ కంపెనీలపై భారం పెరుగుతోంది. ప్రజలపై ఈ భారం మోపకుండా ప్రభుత్వం కొంతవరకు ట్యాక్స్‌లు తగ్గించి ఉపశమనం కలిగించినప్పటికీ.. కంపెనీల నష్టాలు కొనసాగుతున్నాయి.

ఈ భారం తగ్గించేందుకు ఇప్పటికే స్పీడ్, పవర్ పెట్రోల్‌పై లీటరుకు 2 రూపాయలు పెంచిన ఆయిల్ కంపెనీలు.. సాధారణ పెట్రోల్, డీజిల్ ధరలను మాత్రం అలాగే ఉంచాయి. అయితే ప్రస్తుతం ఉన్న అనిశ్చిత పరిస్థితుల్లో ధరల పెంపు తప్పదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ఇప్పటికే మూడు రాష్ట్రాల్లో పోలింగ్ పూర్తయ్యింది. తమిళనాడు, పశ్చిమ బెంగాల్ ఎన్నికలు ముగిసిన వెంటనే ధరల పెంపు నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని అంచనా.

ఎంత మేర పెరుగుతాయన్నది ఇప్పుడు కీలక ప్రశ్నగా మారింది. నిపుణుల అంచనా ప్రకారం బ్యారెల్ చమురు ధర 95 డాలర్ల వద్ద ఉంటే పెట్రోల్, డీజిల్ ధరలు 8 నుంచి 15 రూపాయల వరకు పెరగొచ్చు. అదే ధర 85 నుంచి 90 డాలర్ల మధ్య ఉంటే 3 నుంచి 7 రూపాయల వరకు పెరుగుదల ఉండొచ్చని చెబుతున్నారు. ఇక ఎల్పీజీ ధరలు కూడా భారీగా పెరిగే అవకాశం ఉందని అంచనా. మన దేశంలో దాదాపు 70 శాతం సరుకు రవాణా రోడ్డు మార్గంలోనే జరుగుతోంది. ట్రక్కులపై ఆధారపడే ఈ వ్యవస్థలో డీజిల్ ధరలు పెరిగితే.. నిత్యావసర వస్తువుల ధరలపై నేరుగా ప్రభావం పడే అవకాశం ఉంది.

ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో ట్రక్కులకు డీజిల్ సరఫరాపై అనధికారిక పరిమితులు విధిస్తున్నట్లు సమాచారం. సప్లై తగ్గిందన్న కారణంతో ఒక్కో ట్రక్‌కు పరిమిత పరిమాణంలోనే డీజిల్ ఇస్తున్నట్లు తెలుస్తోంది. అయితే అధికారికంగా మాత్రం ఎలాంటి కొరత లేదని ప్రభుత్వం చెబుతోంది.ఇక ధరల పెంపు ప్రచారంపై ట్రక్ యజమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. డీజిల్ ధరలు లీటరుకు 15 రూపాయల వరకు పెరిగితే రవాణా ఛార్జీలు భారీగా పెరిగే అవకాశం ఉందని, 30 శాతం వరకు ట్రక్కులు నిలిపివేయాల్సి వచ్చే పరిస్థితి తలెత్తవచ్చని హెచ్చరిస్తున్నారు.

గత దశాబ్దాన్ని పరిశీలిస్తే.. 2013లో లీటర్ పెట్రోల్ ధర 72 రూపాయలు ఉండగా.. 2015-16 మధ్య 60 నుంచి 66 రూపాయలకు తగ్గింది. ఆ తర్వాత మళ్లీ క్రమంగా పెరుగుతూ 2020 నాటికి 80 నుంచి 95 రూపాయలకు చేరింది. 2022-24 మధ్య 97 రూపాయల వరకు పెరిగిన ధరలు.. ప్రస్తుతం 100 రూపాయల దాటాయి. ఇప్పుడు అంతర్జాతీయ పరిస్థితులు మరింత క్లిష్టంగా మారితే.. పెట్రోల్, డీజిల్ ధరలు మరోసారి ఎక్కడికి చేరతాయన్నది వినియోగదారులకు ఆందోళన కలిగిస్తోంది.


 

By
en-us Political News

  
పెళ్లయిన కేవలం రెండు వారాల్లోనే అమెరికాలోని మాసాచుసెట్స్‌లో హైదరాబాద్‌కు చెందిన 27 ఏళ్ల ఇంజనీర్ జాబీర్ హుస్సేన్ నిద్రలోనే కన్నుమూశారు. ఉదయం తల్లితో మాట్లాడిన కొద్ది గంటలకే చోటుచేసుకున్న ఈ విషాద సంఘటన వివరాలు, కుటుంబ సభ్యుల ఆవేదన మరియు పార్థివదేహం రప్పించేందుకు చేస్తున్న ప్రయత్నాలపై పూర్తి కథనం.
నల్లమలలో సోదాలు.. కౌకూర్‌, యాప్రాల్‌, అచ్చంపేటలో ఆయుధాల కోసం గాలింపు..!
హైదరాబాద్ గచ్చిబౌలి అంజయ్యనగర్‌లోని హరిహర మెన్ హాస్టల్‌లో దారుణ హత్య చోటుచేసుకుంది. తోటి పనివాడు ప్రమోద్ జరిపిన కత్తిపోట్లకు కుక్ శశిధర్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలిస్తున్నారు.
ఢిల్లీ ఎర్రకోట బాంబు పేలుడు కేసులో ఎన్ఐఏ సంచలన చార్జ్‌షీట్ దాఖలు చేసింది. 11 మంది ప్రాణాలు తీసిన ఈ ఘటన వెనుక లాల్ మందిర్ దాడి కుట్ర, మూత్రం నుంచి బాంబు తయారీ, 12 సార్లు రెక్కీ నిర్వహించిన విస్తుపోయే వివరాలు వెలుగులోకి వచ్చాయి.
అమెరికాలోని పెన్సిల్వేనియా ల్యాంకాస్టర్ కౌంటీలో ఎఫ్రాతా పోలీసులు చేపట్టిన కీలక అరెస్ట్ వివరాలు. క్రైమ్‌వాచ్ నిఘా మరియు తాజా క్రైమ్ అప్‌డేట్స్ కోసం చదవండి.
ఒడిశా కోరాపుట్ పరిధిలోని బాలిపేట సేవాశ్రమం హాస్టల్‌లో 9వ తరగతి విద్యార్థి సీయారా తాడింగిపై సహవిద్యార్థి తీవ్రంగా దాడి చేశాడు. మత్తు పదార్థాల ప్రభావంతోనే ఈ దాడి జరిగిందని, ర్యాగింగ్ అనుమానాలు ఉన్నాయని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
ఆయుధాలు చోరీ అయ్యాయి అంటూ సీన్ క్రియేట్ చేసిన ఇంటి దొంగలు..!
లండన్ వీసాలు, ఉద్యోగాల పేరిట మోసాల ఆరోపణలతో యూట్యూబర్ నందూస్ వరల్డ్ నందనను విజయవాడ పోలీసులు 4 గంటల పాటు విచారించారు. బిగ్ బాస్ తెలుగు 10 ఎంట్రీ ప్రచారం, రూ. 15 లక్షల ఫిర్యాదు మరియు పోలీసులకు ఆమె ఇచ్చిన షాకింగ్ స్టేట్‌మెంట్ పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
సంగారెడ్డి జిల్లా కంది మండలంలో అక్రమ ఇసుక దందాపై మైనింగ్, రెవెన్యూ, పోలీస్ అధికారులు సంయుక్త దాడులు నిర్వహించారు. ఎర్ధనూర్ సర్వే నెంబర్ 134లోని నక్క వాగు పరివాహక ప్రాంతంలో ఉన్న 6 ఇసుక ఫిల్టర్లను ధ్వంసం చేశారు. వాల్టా చట్టం ఉల్లంఘిస్తే క్రిమినల్ కేసులు పెడతామని అధికారులు హెచ్చరించారు.
లండన్ ఉద్యోగాలు, వీసా రెన్యువల్స్ పేరిట రూ.15 లక్షల మోసానికి పాల్పడిన ఆరోపణలపై నందూస్ వరల్డ్ యూట్యూబర్ నందనను శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఇబ్రహీంపట్నం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు వివరాలు మరియు సీఐ సుబ్రహ్మణ్యం అందించిన పూర్తి సమాచారం ఇక్కడ చదవండి!
ఉత్తరప్రదేశ్ ఝాన్సీలోని పహుజ్ డ్యామ్ వద్ద సోషల్ మీడియా రీల్ కోసం 30 అడుగుల ఎత్తు నుంచి నీటిలోకి దూకిన యువకుడి రెండు కాళ్లు విరిగిపోయాయి. వైరల్ స్టంట్ వికటించిన పూర్తి వివరాలు మరియు వీడియో కథనం ఇక్కడ చదవండి.
సోషల్ మీడియాలో ఓ మహిళా ప్రజాప్రతినిధిని ఉద్దేశించి అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన ఆర్మ్డ్ రిజర్వ్ పోలీస్ కానిస్టేబుల్‌పై సైబరాబాద్ సీపీ డా. ఎం. రమేష్ సస్పెన్షన్ వేటు వేశారు.
కృష్ణాష్టమి 2026 సందర్భంగా భారతదేశంలో తప్పక సందర్శించాల్సిన మథుర, బృందావనం, ద్వారక, గురువాయూర్ మరియు పూరీ జగన్నాథ ఆలయాల విశేషాలు మరియు ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను ఇక్కడ తెలుసుకోండి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.